ఉత్తర భారతదేమంతా ఒకే పాలనలో లేదుక్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దoలో. అనేక రాజ్యాలుగా విడిపోయి ఉంది. వాటిలో కొన్ని పెద్దరాజ్యాలైతే మరికొన్ని చిన్న రాజ్యాలుగా వుండేవి. ఈ రాజ్యాలలో కొన్ని రాజుల పాలనలో వుండేవి.
శాక్యులరాజ్యమైన కపిలవస్తు పూర్తిగా ప్రజాస్వామికమైనదా! కొన్ని కుటుంబాలచే పాలించాబడినదా!అనిఖచ్చింతంగానిర్ధారించి చెప్పేందుకు ఆధారాలు లేవు.అయితే కొన్ని పాలక కుటుంబాలుండేవనీ అవి ఒకటి తరువాత ఒకటి పరిపాలన చేసినట్లుగా చెప్పేందుకు మాత్రం కచ్చితమైనఆధారాలున్నాయి. వరుసక్రమం ప్రకారం పరిపాలన చేసేన పెద్దను “రాజు” అనేవారు. రాజులచే పాలింపబడిన రాజ్యాలను జనపదములనీ, రాజరికంలేని రాజ్యాలను సంఘాలనీ,గణాలనీ పిలిచేవారు.కపిలవస్తుశాక్యుల రాజధాని.
సిద్దార్థ గౌతముడు జన్మించేనాటికి తండ్రి శుద్ధోధనుడుకపిలవస్తుకు రాజు.ఇది ఒకప్పుడు స్వతంత్రంగా ఉండినప్పటికిని ఆ తర్వాత ఈ కోసుల రాజుల అధికారం కిందికి వచ్చింది. కోసలరాజుల ఆమోదం లేనిదే శాక్యులు రాజ్యాంగపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలులేదు. ఆ కాలంలో రాజ్యాలఅన్నింటిలోకోసల రాజ్యం చాలా శక్తివంతమైనదిగా ఉండేది. ఆ తర్వాత చెప్పుకోదగ్గరాజ్యంమగధరాజ్యం. కోసల రాజు అయిన ప్రసేనుడు. మగధ రాజైన బింబిసారుడు సిద్ధార్థ గౌతమునికి సమకాలికులే
సిద్ధార్థుని పూర్వీకులు
గొప్ప హేతువాది అయిన కపిలుని పేరుపైనే ఈ నగరం వెలసియుండవచ్చుఅనిచారిత్రకారులుబావిస్తున్నారు.కపిలవస్తు పరిపాలించిన శాక్యులరాజుసినహుడు.జయసేనుని కుమారుడు.కాంచనసినహుడిభార్య. వీరి సంతానం ఏడుగురు సంతానం ఐదుగురు మగ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు1.శుద్ధోధనుడు, 2.దాతోధనుడు,3.శాక్యోధనుడు, 4.సుఖోధనుడు, 5.అమితోదనుడు. అయిదుగురు కుమారులుఇద్దరూకుమార్తెలు1.అమిత.2.పమితసిద్ధార్థ గౌతమునికి తాతసినహుడునాన్నమ్మకాంచన. సిద్ధార్థ గౌతముని తండ్రి శుద్ధోధనుడు, నలుగురు చిన్నాన్నలు ఇద్దరూ అత్తలు.
శుద్ధోధనుడు యుద్ధ విద్యలో ఆరితేరిన వీరుడు. యుద్ద పరీక్షలో అగ్రగణ్యుడుఅందుకుకారణంగా రెండవ భార్యని చేసుకోవడానికి అర్హుతకలవాడు కాబట్టిశుద్ధోధనుడుమహా ప్రజాపతిని కూడా పెళ్లి చేసుకున్నాడు.శుద్ధోధనుడికీ ఇద్దరు భార్యలు మొదటిభార్యమహామాయ రెండోభార్య మహాప్రజాపతి.మహామాయ తోబుట్టువు.మహాప్రజాపతి అక్క
శుద్ధోధనుడు గొప్ప ఆస్తిపరుడు విస్తారమైన వ్యవసాయభూములున్న కారణంగా పనివాళ్లు కూడ ఎక్కవ మంది వుండేవారు.వారి వ్యవసాయభూమిలోవేయిననాగళ్ళుపనిచేసేవట.సిద్ధార్థ గౌతముని అమ్మమ్మా సులక్షణ, తాత అంజనుడుమహామయతల్లిదండ్రులు.కొలియవంశీయుడైన యీఅంజనుడుదేవదాహ అనే గ్రామంలో నివసించేవారు.
సిద్ధార్థునిజన్మకథ
క్రీస్తుపూర్వం 563 వ సంవత్సరము వైశాఖ పౌర్ణమి రోజున మహామాయ సిద్ధార్థునికిజన్మనిచ్చింది.శుద్ధోధనుడు మహామాయలకు వివాహమైన చాలా ఏళ వరకు వారికి సంతానంకలుగలేదు.లేకలేక గలిగిన సంతానం కావడంతో వారి ఆనందానికీవధులేవుఅత్యంత వైభవంగా జన్మదిన మహోత్సవాన్ని జరుపుకొన్నారు. వారితో పాటు శాక్య కుటుంబాలన్నీ ఆ దినాన్ని పర్వదినంగ జరుపుకున్నారు.సిద్ధార్థగౌతమునికిజన్మించేనాటికి శాక్యరాజ్యానికి శుద్దోధనుడే పాలకుడు, ఆ కారణంగా రాజలాంఛనాలతో ఆ శిశువు జన్మదిన వేడుకలు జరిగాయి. తనతండ్రిఅపుడురాజుగనుక పుట్టిన కుమారుడు కూడరాకుమారుడైనాడు.పదవ రోజున బాలునికి నామకరణం జరిపారు ఆ బాలునికిసిద్ధార్థుడని పేరు పెట్టారు. గౌతమ వంశము కారణంగా సిద్ధార్థ గౌతమినిగా పిలువబడ్డాడు.
ఒకవైపునామకరణోత్సవం జరుగుతుండగా మహామాయ ఉన్నట్టుండి అస్వస్థతకులోనైంది.తనకు అంతమ ఘడియలు ఆసమైనట్టుబావించి మహామాయ తనసోదరిమహాప్రజాపతికీసిద్ధార్థున్నిపెంచిపెద్దజేసేబాధ్యతనుఅప్పజెప్పితుదిశ్వాసవిడిచింది.శుద్ధోధనుడుమహాప్రజాపతికన్నీరుమున్నీరై విలపించారు.
సిద్దార్థునికిఅప్పుడు ఏడు రోజులు వయస్సుమాత్రమే. మహాప్రజాపతి కుమారుడు నందుడు సిద్ధార్థ కంటే చిన్నవాడు. ఇద్దరిని పెంచి పెద్దచేసిందిమహాప్రజాపతి.
సిద్ధార్థునకు ఎనిమిదవ ఏటావిద్యబ్యాసం మొదలైంది.శుద్ధోధనుడుసర్వమిత్రుడను సకల శాస్త్ర పారంగతున్ని గురువుగా నియమించాడు. “సర్వమిత్రుడు” భాషాశాస్త్రం,వ్యాకరణశాస్త్రం, వేద వేదంగాది,ఉపనిషత్ శాస్త్రం లో పరిజ్ఞానం కలవాడు.సిద్ధార్థుడు గురు వద్ద ఆనాటి తత్వశాస్త్రాన్నింటినిక్షుణంగా నేర్చుకున్నాడు.ఉద్దిక్షుడుసిద్ధార్థునికి రెండవ గురువు. ఆ తర్వాత కపిలవస్తు ఆశ్రమ వాసి అయిన అలారకాలాముని శిష్యుడు భరద్వజుని వద్ద ఏకాగ్రత ధ్యాననిష్టలను కూడా నేర్చుకున్నాడు.
సిద్ధార్థుడొకనాడు తన సహచరులతో పాటు వ్యవసాయ క్షేత్రమునకు పోయి అక్కడ మండుటెండలో కొందరు వ్యవసాయ కూలీలు ఒంటికిబట్టలేకుండా కొందరు పొలాలను దున్నుతున్నారు. మరికొందరు గట్లు వేస్తున్నారు మరి కొందరు చెట్టు నరుకుతున్నారు వారందరినీ చూశాడు ఆ దృశ్యం సిద్ధార్థుని మనస్సును ఎంతో కలతపరిచింది.. ఒక వ్యక్తిని మరో వ్యక్తి ఆ విధంగా దోచుకోవటం న్యాయం కాదని సిద్ధార్థుడు తన మిత్రులతో చెప్పాడు. శ్రామికుని శ్రమ ఫలితాలను అనుభవించడం న్యాయమెలా అవుతుందని వారిని ప్రశ్నించాడు.అయితే ఆ ప్రశ్నకు ఏలా సమాధానమివ్వాలో తన మిత్రులకు తెలియలేదు. ఎందుకంటే శ్రామికుడు తన యజమాని కొరకై శ్రమించడమే తమ ధర్మమని సనాతన సిద్ధాంతమే వారికి తెలుసు.
మృగాలను వేటాడే కార్యక్రమంలో సిద్ధార్థుడు పాల్గొనే వారు కాదు. అప్పుడు మిత్రులు అడిగేవారు? నీకు పులులుఅంటే భయమా! అని. అప్పుడు తన మిత్రులతో మీరు పులులను ఎందుకు చంపుతున్నారు? అవి మీకు ఇలాంటి హాని చేయడం లేదు కదా! అలాంటప్పుడు చంపడం ఎందుకని ప్రశ్నించాడుసిద్ధార్థుడు. తన మిత్రులనుండి ఎలాంటి సమాధానం రాలేదు.
నువ్వు వేటాడకపోయినప్పటికిని గురి పెట్టి బాణం ప్రయోగించడంలో మా నేర్పును చూసేందుకైనా మన వెంట రావచ్చు కదా!అని మిత్రులు అడిగేవారు. అందుకు సమాధానంగా సిద్ధార్థుడు మీరు అమాయక జీవులని చంపడం చూసి నేను భరించలేను అందుకు మీ వెంట రావటం నాకు ఇష్టం లేదు అని సమాధానం ఇచ్చేవారు.
సిద్ధార్థుని ప్రవర్తన పట్ల పెద్దమ్మ ఎంతో బాధపడేది.నువ్వు క్షత్రియుడవు యుద్ధం చేయటం నీ విద్యుక్త ధర్మం అని నీకు తెలుసు కదా? యుద్ధ విద్యలలోప్రావీణ్యం కోసం నువ్వు వేటకు వెళ్లాలి అనిచెప్పేది. సిద్ధార్థుని ప్రవర్తన తీరు పట్ల పెద్దమ్మ ఎంతో బాధపడుతుండేది.
అది సరేనమ్మా! అసలు క్షత్రియుడు ఎందుకు యుద్ధం చేయాలి?అనిసిద్ధార్థుడుప్రశ్నించాడు. అందుకు యుద్ధం నీ ధర్మం నాయనాఅని తన పెద్దమ్మ జవాబుచ్చేది.ఆ సమాధానానికి సిద్ధార్థునిమనసు అంగీకరించలేదు. ఒక మనిషిని మరో మనిషి చంపడం ధర్మము ఎలా అవుతుందని ఆమెను ప్రశ్నించాడుసిద్ధార్థుడు.
యుద్ధం చేయకపోవడం సన్యాసులకై చెల్లుతుంది కానీ నీవు క్షత్రియుడవు కదా! నీవు యుద్ధం చేయకపోతే
నీ రాజ్యాన్ని ఎవరు కాపాడతారు? అని ఆమె ప్రశ్నించింది.
అది సరేనమ్మా! ఈ క్షత్రియులు ఒకరినొకరు ప్రేమించుకోగలిగితే ఒకరినొకరు చంపకోనక్కరలేకుండా వారి రాజ్యాలను వారు కాపాడుకోవచ్చు కదా అని ఎదురు ప్రశ్న వేసేవాడు సిద్ధార్థుడు.
ఆ ప్రశ్నలకు సమాధానం లేక వదిలేసింది పెద్దమ్మ.
సిద్ధార్థుడికి పదహారేళ్లు నిండియుడడంతో వివాహం కోసం ఆరాట పడుతున్నారు అమ్మానాన్నలు.శాక్యవంశీయుడైన“దండపాణి” పుత్రిక యశోధర. ఆమె సౌందర్యవతి శీలవతి కూడదండపాణి తన పరిసర ప్రాంతాల రాకుమారులందరిని తన కుమార్తెస్వయంవరంలోపాల్గొనవలసిందిగ ఆహ్వానాలు పంపాడు.యశోధరకు ఏర్పాటైన స్వయంవరంలో తప్పక పాల్గొనవలసిందిగసిద్ధార్థుణ్ణి తన తల్లిదండ్రులు కోరగఅతనందుకుఅంగీకరించాడు.యువరాజులందరిలోను సిద్ధార్థగౌతమునే యశోధర ఎన్నిక చేసికొన్నది.
అయితే దండపాణిసంతోషించలేకపోయాడు, అసలు వీరి వైవాహిక జీవనం కలకాలం కొనసాగుతుందాఅంటూఅనుమానించాడు.సిద్ధార్థుడుసాధువుల సాన్నిహిత్యాన్ని కోరుతుంటాడుగదా! ఎప్పుడూ ఒంటరిగావుండెందుకు ఇష్టపడుతాడుగదా! అలాంటివాడు సరియైన సంసారిలా కాగలడని దండపాణి ఆలోచించసాగాడు.అయితే యశోధరమాత్రంసిద్ధార్థునితప్ప వేరొకరినిపెళ్లిచేసుకోటానికి ఒప్పుకోలేదు. సాధువుల సాంగత్యం. సన్యాసులతో సమాగమం నేరమెలా అవుతుందో తెల్పమంటు తన తండ్రిని ప్రశ్నించేది. ఆమెతల్లి అమితశుద్ధోధనుడిచెల్లెలుపెళ్లిఖాయపరచవలసిందిగ దండపాణిని కోరింది. దండపాణి అందుకంగీకరించాడు.
అయితే స్వయంవరంలో పాల్గొన యువ రాజులు నిరాశ చెందడమేగాకతామని అవమానించినట్లు భావించి.ఏదో ఒక పోటీ నిర్వహించ వలసిందిగదా! అలా ఎందుకుజేయలేదని వారు ప్రశ్నించారు.ఆరాకుమారులంతా ఏకమై విలువిద్యలో ఎవరునెగ్గితే వారినే ఆమె పరిణయమాడవలసిందిగ దండపాణిపై ఒత్తిడితెచ్చారు. దండపాణి అందుకంగీకరించకతప్పలేదుమొదట సిద్ధార్థుడలాంటి పరీక్షలో పాల్గొన దలచలేదు. కాని తన రథసారధియైన చెన్నుడుసిద్ధార్థుడు బాణ ప్రయోగపరీక్షలోపాల్గొనవలసిందిగాను,అలాచేయనట్లయితే తన తండ్రియైనశుద్దోదనుని కుటుంబానికే కాక తనను వరించిన యశోధరకు సైతం అవమానంకాగలదని చెప్పాడు.తన రథసారధి యొక్క మాటలకు ముగ్ధుడైన సిద్ధార్థుడుబాణప్రయోగ పరీక్షకు సమాయత్తమయ్యాడు.పోటీ మొదలైంది. ప్రతి ఒక్కరు తమ విలువిద్యా నైపుణ్యాన్ని చూపెట్టారు.చిట్టచివరిగ గౌతముడు విల్లుబూనిబాణప్రయోగంజేశాడు. గురిజూసి సరిగ్గా గుర్తుపైనే బాణం గృచ్చుకొనేలా కొట్టడంలో సిద్ధార్థుడేసిద్ధహస్తుడనినిరూపించుకొన్నాడు.పరీక్ష ముగిసింది.శుద్ధోదనుడుదండపాణి ఎంతో సంతోషించారు. ఇక యశోధర, మహాప్రజాపతియిత్యాదులఆనందానికవధులులేవు.
యశోదతో వివాహం జరిపించారు. సంసార జీవనము ఆనందంగా గడుపుతున్నాడు. కొడుకు కోసం శుద్ధోధనుడు మూడు గొప్ప విలాస మందిరాలు ఏర్పాటు చేయించాడు. వేసవి కాలంలో ఒక భవనము. చలికాలంలో ఒక భవనము. వర్షాకాలలోఒక భవనము. సమస్త సదుపాయాలు ఆ భవనాల్లో ఏర్పాటు చేశాడు.
శుద్దోధనుడు సిద్ధార్థుని చుట్టూ శృంగార విద్యలలో చేరిన ఆరితేరిన ఆలలను ఎల్లప్పుడూ చుట్టూ ముట్టి ఉండేటట్లు చేశాడు. సిద్ధార్థుని దృష్టి ఎల్లప్పుడూ విలాసాల పైనేఉండేటట్లు చూశాడు.అయినప్పటికీ అజ్ఞానపురితమైనమత్తుగొలిపే ప్రోత్సాహంతో తమ కామ కలాపాలలు యువరాజును ఏమి చేయలేమని వారు భావించారు.రాజకుమారుడు ఆవనిత పట్ల ఏమాత్రం ఆసక్తి చూపించలేదు.
ఇరవై ఏళ్ల వయసు పైబడ్డ వారందరూ శాక్యసంఘంలో సభ్యత్వం స్వీకరించాలని నియమం ఉండేది.సిద్ధార్థునికీ ఇరవై ఏళ్ల వయసు వచ్చింది. సిద్ధార్థునికిశాక్య సంఘంలో సభ్యత్వమివ్వబడింది.శాక్యసంఘపురోహితుడు నీ బాధ్యత లేమిటోచెప్తాను విను అన్నాడు.
1 నీ శరీరాన్ని మనసును నీ ధనాన్ని అర్పించిన సరే నీవు శాక్యుల ప్రయోజనాలను కాపాడాలి.
2.శాక్యు సంఘ సమావేశపు తప్పకుండా హాజరు కావాలి.
3.ఏ శాక్యుని లో ఏలాంటి లోపాలు కనిపించిన. నిష్పక్షపతంగా నిర్భయంగా సంఘం దృష్టికి తీసుకురావాలి.
4నీపైనేరారోపణలు చేసినప్పుడు నీవు కోపించరాదు నీవు తప్పు చేసినట్టు ఉంటే ఒప్పుకోవాలి నీలో ఏ దోషము లేదని నిరూపించాలి.
ఇక ఏ ఏ పరిస్థితుల్లో నువ్వు సంఘ సభ్యత్వాన్ని కోల్పోతావో వివరిస్తాను అంటూ పురోహితుడు వివరించసాగాడు.
1 మానభంగానికి పాల్పడినట్లు రుజువైతే
2 నీ ఎవరినైనా హత్య గావించినట్లు రుజువైతే
3 నువ్వు దొంగిలించినట్లు రుజువైతే ఈ సంఘంలో ఉండడానికి నువ్వు అనర్హుడవుఅని పురోహితుడు వివరించాడు.
శాక్య సంఘ నియమాలను బాధ్యతలను క్షుణంగావిరించినందుకు మీకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అనిసిద్ధార్థుడు తెలిపాడు. ఎనిమిదేళ్లు గడిచాయి.శాక్య సంఘముతో సిద్ధార్థుడు ఎంతో అంకితభావంతో పని చేసేవాడు. సంఘ సభ్యునిగా ఉంటున్న ఎనిమిదవ వేట ఏర్పడిన ఓ సంఘటన శుద్ధోదనునికి భరించలేని బాధ అయింది.సిద్ధార్థుతుని జీవితంలో గొప్ప మార్పుకు దారితీసింది. శాక్యుల రాజ్యానికి పక్కనే కొలియుల రాజ్యం ఉండేది. ఈ రెండు రాజ్యాలను రోహిణి నది విడదీస్తుంది. ఆ రెండు రాజ్యాల వారు వ్యవసాయానికి ఈ రోహిణి నది జనాలనే వాడుకునేవారు.వ్యవసాయ కాలములు ఈ నది జలాలు ఎవరు ముందుగా వాడుకోవాలి ఎవరు ఎంత నీరు వాడుకోవాలి అనే విషయంపై ఈ రెండు రాజ్యాలు ప్రతి ఏటా వివాదం ఏర్పడేది. ఈ వివాదం అప్పుడప్పుడు ఘర్షణ సైతం దారితీసిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. అది తీవ్ర స్థాయికి చేరుకుంది. సిద్ధార్థుతుని28వ ఏట ఏర్పడిన నది జలాల వివాదం చివరకు ఈ రెండు రాజ్యాల మధ్య పోరాటంగా మారి ఇరుపక్షాలకు చెందిన వ్యవసాయ కూలీలకు కొట్టుకోవడం వరకి వెళ్ళాయి.
ఈ వివాదం యుద్ధం ద్వారానే శాశ్వతంగా పరిష్కారం కావాలంటూ అటు శాక్యులు ఇటు కొలియులు అనుకున్నారు.కొలియుల పై యుద్ధాన్ని ప్రకటించేందుకు నిర్ణయం తీసుకునేందుకు సేనాపతి శాక్య సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు.
సేనాపతి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మన వారిపై కొలియులు. దాడి చేసిన కారణంగా మనవారు వెనుకకు మళ్ళీ రావడం జరిగింది. మన వారిపై కొలియులు ఈ విధంగా దాడి చేయడం ఇది మొదటిసారి కాదు అయినప్పటికీ ఇన్నాళ్లుగా వాళ్ళ ఆగడాలు సహించాము. ఇక పై సహించవద్దు. ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించబడాలంటే యుద్ధ ప్రకటన చేయాల్సిందిఅని కోరుతున్నాను అన్నాడు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించే వాళ్ళు ఉన్నట్లయితే మాట్లాడవచ్చు అన్నాడు.
సిద్ధార్థ గౌతముడు తన స్థానం నుండి లేచి ఈ ప్రతిపాదనను నేను వ్యతిరేకిస్తున్నాను. యుద్ధం చేసినంత మాత్రాన వివాదం పరిష్కారం కాదు కదా! ఈ యుద్ధం మరో యుద్ధానికి కారణంఅవుతుంది. చంపిన వాడిని చంపేందుకు మరొకరు తయారవుతారు.జయించినవాడు జయించేందుకు ప్రయత్నం చేస్తాడు. దోచినవాడు తిరిగి దోచుకోబడతాడు.తొందరపాటుగా మన సంఘం కొలియుల పై యుద్ధం ప్రకటించడం సమంజసం కాదని నేను భావిస్తున్నాను.
అసలు వివాదములు తప్పు ఎవ్వరిదో చాలా స్పృశితంగా పరిశీలన చేయాలి మన వారు సేతంకొలియుల పై దాడి చేసి గాయపరచరనివిన్నాను. అది వాస్తవం అయితే ఇద్దరూదోషులే కదా!.ఇద్దరు మధ్యవర్తులను ఎన్నుకోమని అడుగుదాం ఈ నలుగురు కలిపి మరో మధ్యవర్తి ఎన్నుకుంటారు. వారు సమావేశమై వివాదాన్ని చర్చించి సమస్యను శాశ్వత పరిష్కారం మార్గాన్ని కోరుదాంఅనిసిద్ధార్థుడు తను ఉపన్యాసంలో అన్నాడు. ఈ ప్రతిపాదను మరో సభ్యుడు బరపరిచాడు.
సేనాపతి లేచి కొలియులుమనపై సాధించే దాడులు వారిని కఠినంగా శిక్షించినప్పుడు మాత్రమే అరికట్టబడగలవుఅని తెలిపారు.సేనాపతి ప్రతిపాదనకు సిద్ధార్థుడు సవరణను ప్రవేశపట్టగా అది అధిక సంఖ్యలో వ్యతిరేకించడంతో వీగిపోయింది. సిద్ధార్థుడు ఈ ప్రతిపాదనను బలపరుచ వద్దని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు. శాక్యులు కోలియులు ఇద్దరూ బంధువులే అలాంటప్పుడు ఒకరిని ఒకరు నాశనం చేసుకోవడం ఎందుకు అన్నాడు.వెంటనే సేనాపతి సిద్ధార్థున్ని వ్యతిరేకిస్తూ యుద్ధం అంటూ ఏర్పడితే క్షత్రియులు బంధువులాపరాయివారా అన్న తేడా లేదని రాజ్య రక్షణకై కడకుతోబుట్టును సైతం పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పాడు.
యజ్ఞయగాదులు చేయటం బ్రాహ్మణుల కర్తవ్యం అలాగే యుద్ధం చేయటం క్షత్రియుల కర్తవ్యం. వ్యాపారం చేయటం వైశ్యుల కర్తవ్యం. పై కులాల వారందరికీ సేవ చేయటం శూద్రుల కర్తవ్యం మన శాస్త్రాలను ఘోషిస్తున్నాయిసేనాపతి చెప్పాడు.
వెంటనే సిద్ధార్థుడు సమాధానం ఇచ్చాడు. ధర్మ శాస్త్రాన్ని నేను అర్థం చేసుకోగలను శత్రుత్వాన్ని శత్రుత్వంతో శాంతింప చేయలేమని నేను భావిస్తున్నాను అనిఅన్నాడు. సహనం కోల్పోయిన సేనాపతి ఈ సమస్యను సంఘ సభ్యులతో మాట్లాడి తేల్చుకోమన్నాడు. అందరూ సేనాపతి బలపరిచారు.సిద్ధార్థుడు నిరాశ చెందాడు. యుద్ధం వద్దు అంటే అందరూ యుద్ధం చేయాలి అని కంకణం కట్టుకున్నారు అని అన్నాడు.
తరువాయి భాగం వచ్చేనెల
