Home వ్యాసాలు మేఘాలలో విహరింపజేసిన మేఘాలయ

మేఘాలలో విహరింపజేసిన మేఘాలయ

by Rangaraju Shyamsundar

          మా మేఘాలయ ప్రయాణం అస్సాంలోని గౌహతి నుండి ప్రారంభమైంది షిల్లాంగ్కు.  దీన్ని స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ గా కూడా వ్యవహరిస్తారు. మేఘాలయ వెళ్లేదారిలో డివైడర్ ఎడమవైపు అంతా అస్సాం రాష్ట్రపరిధి అయితే రోడ్డుకు కుడివైపుఅంతా మేఘాలయ పరిధి. ఈ ప్రాంతంలో ఇరువైపులా ఉన్నపచ్చనిచెట్లనుండిస్వచ్ఛమైన  గాలి వీస్తుంటేరెండున్నర గంటలమా ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా సాగింది.

                   షిల్లాంగ్కి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ పర్యాటక స్థలమైనలైట్లం క్యానన్ కి వెళ్ళాం.(PHOTO 1) పచ్చని లోతైన లోయలు,నిటారుగా ఉండే కొండలు,అంతులేని ఆకాశంఈ ప్రాంతం చూస్తుంటేఅమెరికాలోనిప్రసిద్ధి చెందినప్రపంచ పర్యాటక కేంద్రమైన గ్రాండ్కెన్యాన్ గుర్తుకొస్తుంది. ప్రకృతిలో మమేకమై అందమైన ప్రాంతాల్లో జీవిస్తున్న వీళ్ళు ఎంత అదృష్టవంతులు కదా అనిపించింది. ఈ ప్రాంతం ఎప్పుడూ పొగ మంచుతో, మబ్బులతో కప్పబడి ఉండి ఆహ్లాదకరంగా ఉంటుంది.  ఎక్కువగా సినిమా చిత్రీకరణ ఈ ప్రాంతంలో జరుగుతుందని స్థానికులు చెప్పారు. ఈ ప్రాంతంలో సూర్యోదయ, సూర్యాస్తమయాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఎంతో అందంగా ఉన్న ఈ ప్రదేశాన్ని చూస్తూ అలానే ఉండి పోవాలని అనిపించేంతగా గొప్ప అనుభూతి కలిగింది.

                    ఈ ప్రాంతం నుండి షిల్లాంగ్  పట్టణం చేరుకొని డాన్ బోస్కో మ్యూజియం సందర్శించాం.ఈశాన్య భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయ దుస్తులు మరియు వివిధ ప్రాంతాల జీవనశైలి, వివిధ ప్రాంత ప్రజలు వాడుతున్న,  వాడిన పూర్వకాలపు పనిముట్లు వారి ఆచార వ్యవహారాలను కళ్ళకుకట్టినట్టుగా తీర్చిదిద్దిన ఐదుఅంతస్తులమ్యూజియం ఎంతో అద్భుతంగా ఉంది. వాటితోపాటు ఇరుగుపొరుగు దేశాలైన భూటాన్, మయన్మార్మరియు నేపాల్ ప్రజల జీవనశైలి ప్రతిబింభించేలా వివిధ చిత్రాలు ఎంతో అద్భుతంగా అలంకరించబడి ఉన్నాయి.

          తదుపరి గోతిక్ నిర్మాణశైలిలో 1913లోజర్మనీ రోమన్ క్యాథలిక్లచేనిర్మించబడినమేరీ కేథడ్రల్చర్చిని దర్శించుకున్నాం. ఇది 3 లక్షల మంది క్యాథలిక్ లప్రధాన ప్రార్థనా స్థలం. ఆ తదుపరి ఆ రోజుకి చివరగాఆసియాలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు అయినా ఉమియం సరస్సు చేరుకున్నాం. ఇది చుట్టూ కొండల మధ్య ఉంటుంది. 1960లో ఉమియం నదికి అడ్డుకట్ట వేసినిర్మించిన ఈ సరస్సు పరివాహక ప్రాంతం దాదాపు 225 చదరపు కిలోమీటర్లుగాఉండి,8.4 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన జలవిద్యుత్ ప్రాజెక్టు ఇది. దీని ముఖ్య ఆకర్షణ నీటిపై తేలియాడే ఆటలు, సాహస కృత్యాలకు ప్రసిద్ధి చెందింది. సాయంత్రం ఉమియం సరస్సులో సూర్యాస్తమయ దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంది. సూర్యాస్తమయం తదుపరి ప్రముఖ వ్యాపార కూడలి అయిన పోలీస్ బజార్ కు వెళ్లి మేఘాలయ సాంప్రదాయ ఆహారం రుచి చూసి వసతి గృహానికి వెళ్ళాం.

          ఆ మరుసటి రోజు ఉదయం ఉపాహారం తీసుకుని ముందుగా షిల్లాంగ్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏనుగు ఆకారంలో ఉన్న జలపాతం చూడ్డానికి వెళ్ళాం. ముందుగా మేంషిల్లాంగ్ లోని తూర్పు ఖాశీ హిల్స్ లోని సాంప్రదాయ స్త్రీ పురుష దుస్తులు ధరించి ఫోటోలు దిగి అక్కడి నుండి 25 మెట్లు దిగి కొంచెం దూరంలో ఉన్న జలపాతంవైపు వెళ్ళాం.ఆశ్చర్యకరంగా ఒక గుట్టపై ఏనుగు ఆకారంలో అతి ఎత్తు నుండి జల దారులు పడటం, అది కూడా అచ్చం ఏనుగు ఆకారంలో ఉండటంతో దీనికి ఈ పేరు స్థిరపడింది.మరోవైపు ఉన్న రెండు జలపాతాలు కూడా చూసి ప్రయాణం కొనసాగించాం.

            తదుపరి ప్రముఖ ప్రపంచ పర్యాటక స్థలమైన చిరపుంజికి బయలుదేరాం. 65 కిలోమీటర్ల దూరంలో 5 వేలఅడుగుల ఎత్తుపైన గల ఈ ప్రాంతానికి దాదాపు రెండు గంటలు ప్రయాణించి చేరాం. ఇది తూర్పు ఖాశీ హిల్స్ జిల్లాలోని ఒక పట్టణం. ఇది భూమిమీద అతి తేమగా ఉండే ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం దీనికి సమీపంలో ఉండే మాసిన్రామ్ లో అత్యధికంగా 26 వేల మిల్లి మీటర్ల వర్షపాతం పడుతున్న ప్రాంతంగా ప్రసిద్ధి చెంది1985లో గిన్నిస్ ప్రపంచ రికార్డు లోకి ఎక్కింది.

            ఈ ప్రాంతంలో విహరిస్తుంటే మనం పూర్తిగా మేఘాలలో విహరించినట్టుగా ఉంటుంది. విమానంలో ప్రయాణంచేసేప్పుడు ఎలా అయితే మేఘాల మధ్య మన విమానం ప్రయాణిస్తుందో అలానే మనం ఈ ప్రాంతంలో ప్రయాణించినప్పుడు మేఘాలు మనని తాకుతూ ప్రయాణించడం చూసి గొప్ప అనుభూతిని మిగులుచుకున్నాం.

          ఇక్కడి నుండి సమీపంలోని నోహ్కలికైజలపాతం వెళ్ళాం. ఇది భారతదేశంలోనే అతి ఎత్తైన జలపాతం దాదాపు 1115 అడుగుల పై నుండి జాలు వారుతున్న ఈ జలపాతం చూస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపించింది. దీన్ని చూడాలంటే వర్షాకాలం మరియు శీతాకాలంలో మాత్రమే వీలవుతుంది. వేసవి కాలంలో మాత్రం నీటి ఉధృతి చాలా తక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతం నుండి సెవెన్ సిస్టర్స్ జలపాతంగా ప్రసిద్ధి చెందిననోస్నగిలింగ్ జలపాతం కి వెళ్ళాము ఇది షిల్లాంగ్ నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 1033 అడుగుల ఎత్తు నుండి జాలు వారుతున్న ఈ జలపాతం వీక్షించడానికి మేము చాలా సమయం నిరీక్షించాల్సి వచ్చింది.ఆ ప్రాంతమంతా పొగ మంచుతో నిండి పర్వత శిఖరాలు లోయలు పూర్తిగా అదృశ్యమై పూర్తిగా మేఘాలు ఆవరించాయి. పొగ మంచు విడిపోయాక పేరుకు తగ్గట్టే అక్కా చెల్లెళ్ల వయసు వ్యత్యాసంఎలా ఉంటుందో ఆ ఏడు జలపాతాలు కూడా పెద్దగా,మధ్యస్థంగా,చిన్నగా ఉండి ఆ జలపాతాలకు ఆ పేరు స్థిరపడినట్లుగాఉంటుంది.

           పక్షుల కిలకిలా రావాలు మరియు కీటకాల వింతవింతధ్వనులతో ఉండే దట్టమైన చెట్ల గుండాప్రయాణిస్తూ తదుపరి యాత్రా ప్రదేశమైనా మాస్మాయ్ గుహలు  వీక్షించడానికి వెళ్ళాం (PHOTO 2). 250 మీటర్ల పొడవు పది మీటర్ల ఎత్తు ఉన్న ఈ గుహల్లో కేవలం 150 మీటర్ల వరకు మాత్రమే యాత్రికులను అనుమతిస్తారు. ఇది తూర్పుఖాశీ కొండల్లో చిరపుంజి కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలోనే అతి పెద్ద గుహగా పరిగణిస్తారు.

           భూగర్భంలో నీటి ప్రవాహ ఒత్తిడికి కోతకు గురై వివిధ ఆకృతుల్లో ఎంతో అద్భుతంగా ఉన్న ఈ గుహల్లోకి వెళ్లడం మాకు ఒక సాహస కృత్యం గానే అనిపించింది. చిమ్మ చీకటిలో చరవాణి కాంతి సహాయంతో అడుగులో అడుగు వేసుకుంటూ కొన్నిసార్లు పాకుతూ, కొన్నిసార్లు పూర్తిగా కింద కూర్చొని జారుతూ వెళ్లే అనుభూతి, భయం, గగుర్పాటు కలిగిస్తుంది. ఏ మాత్రం గాలి లేకుండా ఉన్న ఈ గుహల్లో మాత్రం ప్రతి భాగం నుండి నీటి చుక్కలు తుంపర్లుగా పడుతూకోతకుగురైన సున్నపురాయి వివిధ ఆకృతుల్లో చూస్తుంటే ఒక అనిర్వచనీయమైన మధురానుభూతి కలుగజేసింది.

           ఆ రోజు చివరి పర్యాటక ప్రాంతమైన గార్డెన్ ఆఫ్ కేవ్స్( PHOTO 3) కి వెళ్ళాం. దాదాపు నాలుగు కిలోమీటర్లు పరిధిలో ఉన్న ఈ ప్రాంతానికి ప్రవేశ రుసుము రూ100.  ఈ గార్డెన్ ఆఫ్ కేవ్స్ ఒక ప్యాకేజీ రూపంలో అందిస్తుంది. ఇందులో జలపాతాలు,గుహలు, వెదురు బొంగులతో నిర్మించిన వంతెనలు,స్వత:సిద్ధంగా నీటి ఒత్తిడితో తయారై వివిధ ఆకృతులతో అందంగా కనిపిస్తూచిత్రకారుడుచిత్రించినచిత్రాల్లాగా ఉన్న గుహలు.
గుట్టల పైనుండిపడుతున్ననీటిదారలు,వెదురు బొంగులతో మళ్లించిన నీటి దారలు చూడటానికి ఎంతో అద్భుతంగా ఉన్నాయి. స్వాతంత్రానికి పూర్వం ప్రభుత్వ వ్యతిరేక స్వాతంత్ర సమరయోధులుతమను తాము రక్షించుకోవడానికి ఈ ప్రాంతంలోని గుహలనుఆశ్రయించి ఇందులో ఆశ్రయం పొందే వారని స్థానికుల కథనం. దాదాపు 16 గుహలు ఇందులో ఉన్నాయి. మెట్లు ఎక్కడం దిగడం ఈ గుహల్లో విహరించడం అంటే కొంచెం శ్రమతో కూడిన పని. చేతి కర్ర సహాయంతో మాత్రమే ఈ గుహలో మనం తిరుగగలుగుతాం.

          అతిరద్దీగావుండేరోడ్లద్వారాప్రయాణించిమావసతిగృహానికిచేరుకునివిశ్రాంతితీసుకున్నాము.

రోడ్లపై విపరీతమైన రద్దీ గమనించి మరుసటి రోజు ఏడు గంటలకు ఉపాహారం ముగించుకొని ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ లోని డాకినది లోవిహారానికి బయలుదేరాం( PHOTO 4). ఇది షిల్లాంగ్ నుండి 81 కిలోమీటర్లదూరంలో ఉంటుంది. ఈ దారిలో సగభాగం పెద్ద పెద్ద గుంటలతో నిండి ఉండి ప్రయాణానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ దారి గుండా ప్రతిరోజు కొన్ని వందల లారీలు నిర్మాణ సామాగ్రితో బంగ్లాదేశ్ ప్రాంతానికి వెళ్లడం రావడం వల్ల రోడ్డు అంతా పాడై గతుకులతో ప్రయాణానికి తీవ్ర అసౌకర్యం కలగచేసింది. మూడు గంటల ప్రయాణం పూర్తి చేసుకొని డాకి నది చేరుకున్నాం.  దీన్నే ఉంగాట్నదిగా కూడా పిలుస్తారు. ఈ నదిలో నాటు పడవల్లో మనం విహరించవచ్చు ఇద్దరికీ రూ800 రుసుముగా ఉంటుంది. బంగ్లాదేశ్ బోర్డర్ వరకు తీసుకువెళ్లి బోర్డర్ చూపించి తీసుకువస్తారు పది నుండి 15 మీటర్ల లోతు ఉండే ఈ నదిలోని అడుగు భాగాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు ఇది ఈ నది ప్రత్యేకత.
డాకీ నది నుండి కొంత దూరంలో ఉన్న ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ (PHOTO 5) వరకు వెళ్లి బోర్డర్ పాయింట్లలో ఫోటోలు దిగి ఆ తదుపరి వీక్షించాల్సిన ప్రఖ్యాతమైనలివింగ్రూట్బ్రిడ్జిని చూడ్డానికి ప్రయాణం మొదలుపెట్టాం. స్థానికులు చిన్నచిన్న వాగులు, ఉపనదులు దాటడానికి వీటిని నిర్మించివిరివిగా ఉపయోగిస్తున్నారు.

                   రంగ్థిల్లియాంగ్లోని మావ్కిర్‌ నాట్‌అనే ప్రాంతంలోని 53 మీటర్ల పొడవు ఉన్నలివింగ్రూట్బ్రిడ్జిప్రపంచంలోనే అతి పెద్దది. వంతెన కావలసిన ఉపనదికి ఇరువైపులా రబ్బర్ వృక్షాలను పెంచుతూ వాటి వేర్లనుఒకదానితో ఒకటి జతపరుస్తూఇదే ప్రక్రియ కొనసాగిస్తారు. ఈ ప్రాంతంలో దాదాపు 500 నుండి 600సంవత్సరాలుగా ఈ విధంగా ప్రకృతి సహజంగా నిర్మించబడ్డ అనేక చిన్న, పెద్ద వంతెనలు స్థానిక అవసరాల దృష్ట్యా ప్రవాహ వేగం పరిధిని బట్టి కొన్నిచోట్ల రెండు అంచెల వంతెనలు నిర్మిస్తే చాలా ప్రాంతాల్లో చిరు వంతెనలతో నిర్మించారు. రెండు అంచెలవంతెనలు చూడటానికి పూర్తిగా ఒకరోజు వెచ్చించాలి.దాదాపు 3500 మెట్లు క్రిందకు దిగి మళ్లీ పైకి రావాల్సి ఉంటుంది. మేం మాత్రం సమయాభావం వల్ల మావిల్లాంగ్ సమీపంలోనినోవెట్‌ నదిపై నిర్మించిన సింగల్ లివింగ్ రూట్ బ్రిడ్జిచూడటానికి ఎంచుకున్నాం. ఇది కూడా 150 మెట్లు దిగి వెళ్ళాం. ప్రకృతిలోసహజీవనంమరియుసహజసిద్ధమైనజలపాతాలుచూడ్డం ధ్యేయంగా ఈ ప్రాంతాలకు యాత్రికులు విరివిగా వస్తుంటారు.మేంకూడాప్రకృతి వనరులతో సహజంగా నిర్మించబడ్డలివింగ్రూట్బ్రిడ్జి( PHOTO 6) పైన విహరించిఅనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యాం. నదీ ప్రాంతంలో కాసేపు విశ్రమించి ఆ రోజుకు చివరి యాత్రా స్థలమైన మావిల్లాంగ్ గ్రామానికి చేరుకున్నాం. ఈ గ్రామం ఆసియాలోనే శుభ్రమైన గ్రామంగా పేరుగాంచింది. ఈ గ్రామానికి దేవతల సొంత ఉద్యానవనం అనే పేరు కూడా ఉంది పూర్తిగా మహిళల చే నిర్వహించబడ్డ కూడలి సందర్శించి వారు వెదురుతో స్థానిక వనరులతో తయారుచేసిన కొన్నిసాంప్రదాయ వస్తువులను కొనుగోలు చేసి తిరుగు ప్రయాణం కొనసాగించాం. ఈ ప్రాంతం పూర్తిగా చూడాలంటే కనీసం 8 నుండి 10 రోజుల ప్రయాణం అవసరం.

You may also like

Leave a Comment