ప్రతినిత్యం రహదారులు రక్తంతో ఓలలాడుతున్నాయిఅనేక దుర్ఘటనలలో 4.80మంది ప్రాణాలు కోల్పోయారు 4.62లక్షల మంది గాయాల పాలైనారు.రహదారి భద్రతపై ప్రభుత్వాలు అంతబాధ్యతారాహిత్యంగానే ఉన్నాయి. 4.62లక్షల మందిని గాయాల పాలుఅయ్యారు. 2022 తో పోలిస్తే మృతులు 2.6 క్షతగాత్రులు 4.4 %పెరుగుదల జరిగింది.మధ్యతరగతి వర్గాలకు చెందిన యువత నడివయస్కులే రోడ్లపై రక్త దాహానికి ఎక్కువగా గురవుతున్నారు.దానివలన ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయి.అతివేగానికి తోడు రోడ్ల నిర్మాణంలో లోపాలు లైసెన్సులజారీలో అక్రమాలు వాహన చోదకులబాధ్యతారాహిత్యం భద్రతాప్రమాణాల అమలులో నిర్లక్ష్యం తదితరాలతో రహదారులపై నిత్యం నెత్తుటేల్లుపారుతున్నాయి.
ఈ మధ్యకాలంలో అధునాతన బ్రేకింగ్ వ్యవస్థలుఏయిర్ బెలూన్ వంటిసౌకర్యాలుఅందుబాటులోకి వచ్చాయి.అయినా ప్రమాదాల్లో మృత్యువు పాలు అవుతున్నారు.మనదేశంలో జాతీయ రహదారులు2% అయినామరణాల్లో అధిక వాటా వాటిదే.ఇతర దేశాల్లో సైకిళ్ళుమోటార్ వాహనాలు పాదాచారులకువేరు వేరు మార్గాలున్నాయి.రోడ్ల నిర్మాణంలో మేలిమిప్రమాణాలుపాటించడం ట్రాఫిక్ నిబంధనలుఅక్కడ అమలు చేయడం ఒక కారణం. మన రవాణ చూసినట్టు అయితే పుట్ పాత్ లపైనాద్విచక్ర వాహనాలు నడపడం ట్రాఫిక్ పోలీసులు చలానాల విషయంపైశ్రద్ధ వహించడం బ్లాక్ స్పాట్ల సరి చేతలు. డ్రైవర్లు పని వత్తిడితోమద్యం మత్తులో బండితోలడంతో రక్తం చిందినరహదారులు అవుతున్నాయి.

ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్న వారిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తే బాధితుల ఊపిరి నిలపవచ్చు. 108 పోను చేసి అంబులెన్సులు వచ్చేసరికిఆలస్యమై ఎందరో నిస్సహాయంగా ప్రాణాలు వదులుతున్నారు.రోడ్డు ప్రమాద బాధితుల అపన్న హస్తంఅందించడంపైప్రభుత్వ యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలి.ట్రాఫిక్ ఉల్లంఘనపైతగు చర్యలు తీసుకోని బ్లాక్ స్పాట్లను తక్షణం సరిదిద్దాలి.డ్రైవింగ్ పాఠశాలలువిరివిగా ఏర్పాటు చేయాలి.
మద్యం మత్తులో ద్విచక్ర వాహనాన్నిఢీ కొట్టి కారుపై పడిన మృతదేహంతో 18 కీ.మీ.ప్రయాణించిన వైనంచక్కగా చదువుకొని వృద్ధిలోకి రావలసినచిన్నపిల్లలు సైతం తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం వల్ల వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలు బలిగొంటున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడుతున్నారు.జాతీయ నేరగణాంకసంస్థలెక్కల ప్రకారం 2022 లో మద్యం డ్రగ్స్ మత్తులో వాహనాలు నడిపిన వారి కారణంగా దాదాపు మూడువేల ప్రాణ దీపాలు ఆరిపోయాయి ఆరు వేల మంది క్షతగాత్రులయ్యారు.హైదరాబాద్ లోని డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలో లక్షల మందికి పైగా కేసులునమోదయ్యాయి. వారిని 5 వేల మందికి జైలుకు పంపారు. ఆ దండనకు ఏ మాత్రం వెరవనిచాలా మందిమళ్లీ మళ్లీ తప్పులుచేస్తున్నారు.ఢిల్లీలో ఒక స్వచ్ఛంద సంస్థ ముప్ఫై వేల మందివాహనదారులతో ఒక సర్వే చేస్తే తాగి బండ్లు నడిపినట్లు 81%ఒప్పుకున్నారు. బయటకు వెల్లిన వ్యక్తి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడన్న నమ్మకం లేదు.జాతీయ రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల పరిధిలో లిక్కర్ విక్రయాలను నిషేదించాలన్నసుప్రీం కోర్ట్ రోడ్లపైనరమేధం ఆగాలంటే తాగి బండి నడిపే ప్రతి ఒక్కరికి సరి అయిన శిక్షలు విధించాలి. మధ్యం మత్తులో అనేక మంది అమానుష నేరాలకు పాల్పడుతున్నారు. ఆరోగ్యాలను గుల్ల చేయడం సామాజిక అశాంతికి కారణమవుతున్న మద్యం తాగి వాహనం నడపడమే కారణమవుతుంది.
రహదారిపై మరణమృదంగంజాతి గుండెల విసేలా అనునిత్యం మార్మోగుతుంది.దేశవ్యాప్తంగా ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు 19 మంది మృత్యువాత పడుతున్నారు. క్షతగాత్రుల లెక్కలో 15.3 శాతం పెరుగుదలతో తీవ్రతకళ్ళకు కట్టినట్టుకనబడుతుంది. మృతుల్లో 18-45 ఏళ్ళ మధ్య వారే 69%. వరకు వున్నారు.
ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగమైన రహదారిభద్రతపై దృష్టి పెట్టి 2030 నాటికల్లారోడ్డు ప్రమాదాల్నిమృతుల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా సంకల్పించింది. 2030నాటికి రోడ్ల నిర్మాణం వేగ నియంత్రణ కచ్చితంగా నిబంధనలు అమలుకుప్రాధాన్యం వేగ నియంత్రణణుతగ్గించే ప్రయత్నంలో చైనాఅద్భుత ఫలితాలు సాధించింది.
ప్రపంచ వ్యాప్తంగా రహదారి ప్రమాద మృతుల సంఖ్య అయిదు శాతం దాకతగ్గితే అంతకుమించి భారతదేశంలో పెరిగి నిశ్చేష్ట పరుస్తోంది.వాహన వేగాన్ని 51%తగ్గించగలిగిన ప్రమాద మరణాలు 30% దాక నియంత్రించగల వీలుందని తెలిసినా ఎడెనమిదిసెకండ్లలోనేవందల కిలోమీటర్ల వేగంఅందుకనే శకటాలు రోడ్డు ఎక్కుతున్నాయి. ఎయిర్ బ్యాగ్ ల్ని తప్పక వాడాలి. అమెరికాలో 98% జర్మనీ 89% చైనా 65%భారతదేశంలో 12 నుండి 13 మాత్రం వాడుతున్నారు. రహా దారి భద్రంగాఉండాలంటే వచ్చే పది సంవత్సరాలలో 10,900కోట్ల డాలర్లు ఖర్చు చేయాలని దాని వలన స్థూల దేశీయుత్పత్తి 3.7 %ఆర్థికంగా గిట్టుబాటు అవుతుందని ప్రపంచ బ్యాంక్ సూచిస్తుంది. రహాదారిపై మేట వేసిన నెత్తుటి సంక్షోభాన్నిరూపుమాపినపుడేసంక్షేమ రాజ్యా ప్రాణ ప్రతిష్టల భావన కలుగుతుంది.
2016లో దేశవ్యాప్తంగా రహదారులు రక్తదాహానికి 16 వేలమంది పాదాచారులు 2022లో 32 వేలకు పైగా బలి అయ్యారు. 90% పాదాచారులు గాయాలపాలు అయ్యారు అత్యధికులు పేద మధ్యతరగతి ప్రజలే ఆర్థిక ఇక్కట్లలోకి నెట్టేస్తున్నాయి 9వేల కి.మీ పైగా రహాదారులు విస్తరించి వుంటే 10% బాటలపైనే పుట్ పాత్ లు వున్నాయి. పుట్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు స్కై వాక్ లు ఏర్పాటు చేయాలి భద్రత అవగాహన చేయాలి రోడ్ల నాణ్యతనుమెరుగుపరచాలి