సంపాదకులు:

డా॥ కొండపల్లి నీహారిణి
mayuukhathemagazine@gmail.com
సలహా మండలి:
డా॥ కె.వి . రమణ, రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు.
కొండపల్లి వేణుగోపాల్ రావు , రిటైర్డ్ ఛీఫ్ ఇంజనీర్, నీటిపారుదల శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
డా॥ వెలుదండ నిత్యానందరావు, ప్రొఫెసర్, తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం.
డా॥ సంగనభట్ల నర్సయ్య, విశ్రాంత ప్రధానాచార్యులు, శ్రీ లక్ష్మీ నరసింహ
సంస్కృతాంధ్ర కళాశాల, ధర్మపురి,జగిత్యాల.
గురిజాల రామశేషయ్య, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్,తెలుగు, హైదరాబాద్ -44
సనాతనమంటే?
మయూఖ 2026 జనవరి పత్రిక సంపాదకీయం
మీరు స్మార్ట్ ఫోన్ తో ఉన్నారా? మీరు స్మార్ట్ టీవీ దగ్గర ఉండి మాట్లాడుతున్నారా? అయితే ఒకింత జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలనే కాదు మీ మనస్సు నూ పసిగట్టే శక్తి మిమ్మల్ని లోబరుచుకునే టెక్నాలజీ మీ చుట్టూ తిరుగుతుంది అని తెలుకోవాలి. రోజులు ఎంత మారిపోయాయి! కోవిడ్ వచ్చిపోయినప్పటినుండి అంతులేని వింతలే అన్నింటా!!
ఈ గడ్డు కాలం లో ఆత్మవిమర్శ ఎంతో అవసరం. ఆత్మావలోకనం ఎంతో అవసరం. కొత్త సంవత్సరం 2026 లోకి అడుగుపెట్టాం. క్యాలెండర్ మన జీవితాలను శాసిస్తోంది. తప్పదు. ఈ జీవన సమరం లో తేదీలు అస్త్ర శస్త్రాలయ్యాయి. పర్వాలేదు. కానీ ప్రపంచంలో ఏ దేశ వాసులైనా వాళ్ళ వాళ్ళ సంప్రదాయాలు, ఆచారాలు, అలవాట్లు పాటిస్తున్నారు. మనలాగే! తప్పులేదు. అయితే మనమేమో తెలుగు వాళ్లం , కొత్త సంవత్సరాన్ని వసంత ఋతువు, చైత్రమాసం లో కొత్త చిగురులెత్తే ప్రకృతి లా నవ వసంతోత్సవం చేసుకుంటుంటాం. నిత్య వ్యవహారంలో ఇంగ్లీష్ తప్పదు. వాళ్ళ పద్ధతులూ తప్పవు. మంచిదే .. నడిపిద్దాం… కానీ మనదైన సనాతన ధర్మాన్ని అనుసరించి ఆచార వ్యవహారాలు మానుకోకుండా ఆచరించాలి. మరి జనవరి నెలతో నూతన సంవత్సర ప్రారంభం. తెలుగు వాళ్ళు ముక్కోటి ఏకాదశి తో పండుగలు ఇంగ్లీష్ కొత్త ఏడాదిలో వచ్చిందనీ , తర్వాత వెనువెంటనే సంక్రాంతి పండగ వస్తుందనీ సంబరపడుతూనే మార్చ్ నెలలో వచ్చే ఉగాది పండుగ కోసం ఎదురు చూస్తుంటారు . ఇక అది మొదలు నక్షత్రాలు, తిథులను అనుసరించి ఎన్నో పండుగలు చేసుకుంటుంటాం. వాటి సంపూర్ణ వివరణ లోకి పోకుండా కొన్ని ముఖ్యమైన విషయాలు స్పృశించుంచుకుందాం.
ప్రతి సంవత్సరం కూడా రెండు ఆయనలుగా విభజించి ఆ రెంటిని కలిపే జీవన స్రవంతి సంక్రాంతి . ప్రముఖంగా ఈ సంక్రాంతి ఉత్సవాన్ని జరుపుకోవడానికి కారణమేమిటంటే, సకల జీవరాశులకి ఆధారభూతుడైన సూర్యుడు తన దిశను ఈరోజు మార్చుకోవడమే ప్రధాన
కారణం. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించడం తన దిశని పూర్వముఖుడై సకల జీవనానికి సకల జీవరాశులకు చైతన్య స్ఫూర్తిని కలిగించడమే … దక్షిణాయనంలో అంటే దాదాపు జులై 7 నుంచి జనవరి 14 వరకు కొంతవరకు వీటికి దగ్గరగా ఉంటుంది.ఇది ఉత్తరాయణం ప్రారంభంలోనే ఉంటుంది . అది చైతన్య స్థితిని పొందుతుంది. అందుకే ఈ తేదీ లు కూడా మారకుండా సూర్యుని పయనాన్ని అంటే రోజులుగా విభజించే పరిస్థితిని మార్చకుండా ఉంటుంది. దీనికి మన సనాతనంలో చెప్పింది ఏంటంటే ఒక పండుగ జరుపుకోవడం కన్నా ఒక చైతన్యాన్ని ముఖ్యంగా ఒక నూతనమైన ప్రణాళికతో మనిషి ముందుకు సాగాలని దీన్ని పచ్చ పచ్చని పండుగ గా, ఒక మైలురాయిగా మార్చారు. అందుకే పంటలు రావడం .. కొత్త పంట రావడం తర్వాత శీతాకాలం ఉండడంవల్ల రెండు ముఖ్యమైన పంటలను వేసుకోవాలి, పండించినవి మనం తీసుకోవాలని చెప్పారు.
ఒకటి నువ్వుల పంట. నువ్వు లు మన శరీర ఉష్ణోగ్రతకు దోహదపడేది. ఇంకొకటి బెల్లం అంటే మధురం. తీయదనం కోరుకోవడం, గళం విప్పారేందుకు సాయపడ్తుంది. మనిషి తన నూతన ఆవిష్కరణలకు ఇలా రెండు విధాలుగా ఉపయోగపడే పదార్థాలు తినాలి. ఒకటి వాతావరణానికి అనుకూలమైనవి అవి నువ్వులు ఇంకొకటి మనం మాట్లాడే మాట మధురమైనదిగా అందరిని అలరించే విధంగా ఉండాలని సంకల్పంతో నువ్వులు బెల్లంతో కలిపిన పదార్థాలను ఈరోజు తినాలని నియమించారు.
ఈ పండుగ పూర్తిగా సూర్యుని భ్రమణం ఆధారంగానే ఉంటుంది.అయితే ఏ మతంలోనైనా సూర్యుని తప్పనిసరిగా మన జీవనానికి ప్రకృతికి కేంద్ర బిందువుగా భావిస్తారు. సాధనకోసం సనాతనంలో అయితే సూర్యదేవుడు సూర్యారాధన జరుపుతారు. సూర్యుడు ఆరోగ్యం ఇవ్వడం అనేది ఒక కర్మకాండ కాదు అది ఒక చేతనత్వానికి మనం ఇచ్చే గౌరవం. అందుకే ఆరోగ్యం స్నానం చేసి సూర్యారాధన చేయడం మతాలకతీతం ఎందుకంటే సూర్యుడే మనందరికీ అవసరమైన శక్తినిచ్చే కారకుడు. నిజంగా, చెప్పాలంటే ప్రకృతి మూల దేవత అందులో సూర్యుడు ఆది దేవత అదే ఈ పండగ ప్రత్యేకత.
ఈ పండుగ కోసం కొన్ని నియమాలను పెట్టారు.
శయనం ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉన్న కాలాన్ని చాతుర్మాస దీక్ష ను చేయమన్నారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి ని శయన ఏకాదశి అంటారు. భగవంతుడు యోగ నిద్రలోఉంటాడని నమ్ముతారు. ఇలాంటివి మరిన్ని…
త్రికాల సంధ్యలలో సంధ్యవార్చుకోమని ఎందుకు పెట్టారు అంటే
ఈ పండుగని ప్రకృతితో అన్వయించడంలో మన రుతు సంక్రమణం, రుతుభేదాలు కూడా అన్వయించారని చెప్పవచ్చు. కారణం
శ్రావణమాసం తో వర్షాలు తర్వాత శరత్ కాలంలో ఉండే వాతావరణం ప్రతి మనిషి ఎక్కువగా బయట తిరిగేందుకు అనుకూలంగా ఉండవు కాబట్టి ఈ కాలంలో నాలుగు మాసాలు పూర్తిగా ఒక దీక్షతో ఉండాలని పెద్దలు చెబుతారు దాన్నే చాతుర్మాస్య దీక్షగా గుర్తించారు. అంటే ప్రతివారు చేసుకునే నిత్య కర్మలు అంటే సంధ్యావందనము అనేది సూర్యుణ్ణి కొలిచే ఒక ప్రక్రియ దానికి నియమం త్రికాల సంధ్యా అని అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేసుకోవాలన్నారు. కారణం ఉదయించే సూర్యుడిని చూడడం మధ్యాహ్నపు సూర్యుణ్ణి ఆరాధించడం అస్తమించే సూర్యుడిని ప్రార్థించడం తిరిగి ఉదయించమని అంటే మనిషి తన చేతనాస్థితిని ఈ రకంగా ప్రకృతికి అన్వయించుకోవడం ఇది పూర్తిగా దక్షిణాయంలోనే ఉంటుంది అంటే భగవంతుడు యోగనిద్రలో ఉన్నప్పుడు ఈ విధులను తప్పనిసరిగా ఒకే ప్రదేశంలో ఉండి, అంటే ఇంట్లో ఉండి లేక ఒక ప్రదేశాన్ని నియమించుకొని అక్కడ ఉండి చేసుకోవాలి. అయితే ఉత్తరాయణంలో ఈ నియమం లేదు.అంటే చెప్పబడలేదు. కారణం ఇటువంటి ప్రకృతి సంబంధమైన ఇబ్బందులు ఉత్తరాయణంలో ఉండవు. కాబట్టి అయితే చేతనాస్థితిని పొందడం ముఖ్యంగా కొత్త ఆలోచనలతో ప్రణాళికలతో మనిషి ఈరోజు ప్రారంభించేసుకోవడం అనేది సూచించబడింది దీన్నే ఇయర్ ప్లాన్ అని న్యూ ఇయర్ ప్లాన్ అని కొత్త సంవత్సరంలో కొత్త ప్రణాళికలు వేసుకోవాలని చెబుతుంటారు.
మన పల్లెటూర్లలో దీన్ని కొత్త లు తినడం కొత్తలు పెట్టుకోవడం అని కూడా ఒక సంప్రదాయంగా చేస్తారు.ముఖ్యంగా కొత్తగా పండిన పంట ఈరోజు తప్పనిసరిగా అంటే కొత్త బియ్యం తో వండుకోవడం అనేది ఆచారం.
మనం అనాదిగా జరుపుకునే పండుగలు ఉగాది, సంక్రాంతి ఇవి విశ్వవ్యాప్తంగా జరుపుకునే పండుగలను చెప్పవచ్చు. కారణం ఇవి రెండూ ప్రకృతి పండుగ లు. సంక్రాంతి సంక్రమణం ఆధారంగా అంటే మకర రాశిలో సూర్యుని ప్రవేశాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు. అందుకే ప్రతి సంవత్సరం కూడా జనవరి 14 రోజు మాత్రమే వస్తుంది దాని ఈ పండుగని మనం ఏ నక్షత్రం ఆధారంగా చేసుకో ము అలాగే ఏ తిథి కూడా చూడాల్సిన అవసరం లేదు. ఇదేవిధంగా ఉగాది కూడా ఏ దేవతను ఆరాధించే నియమాన్ని సనాతనంగా చెప్పలేదు. ఈ పండుగకు కేంద్ర బిందువు కాలుడు మాత్రమే. కాలుడు అంటే కలకాలం అని అర్థం. చైత్రమాసం, వసంత ఋతు ప్రాముఖ్యత . దీన్నే విశ్వవ్యాప్తంగా కూడా వాడుకలో వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో పండగ జరుపుకుంటున్నారు.
మనం మాసాలను తీసుకున్నా,ఋతువులను తీసుకున్నా అయనాలను తీసుకున్నా ఇదే ప్రకారమైన ఆధారమని చెప్పుకోవచ్చు.మనిషి మనుగడకు ప్రకృతి అనుసంధానం చేసేవే పండుగ లు. వీటిని ఆచారం గా చెప్తూ alert చేయడం, జ్ఞానం కలిగించడం, పద్ధతైన బ్రతుకును అనుభవించడానికే నియమాలు ఏర్పాటు చేసారు. మంచి అలవాట్లు అలవర్చడం వంటి ఉద్దేశ్యాలున్నాయి. పూర్వీకులు నిర్ణయించిన సూర్య చంద్ర గమనాల లెక్కల్లో మార్పు లేదు. ఇప్పటివరకు తేడా రాలేదు. వీటి లక్షణాల ఆధారంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని నేర్పారు.ఇదే సనాతన ధర్మం.
ఏ దేశానికి ఆ దేశ కాలమాన పరిస్థితులకు తగినట్టుగా, భౌగోళిక ప్రాధాన్యత తో ఎండా వాన చలి తీవ్రత లకు తగినట్టుగా, నేల తీరు కూ, పండే పంటలకూ అనుకూలంగా చెప్పారు. చలికాలం తెల్లవారుజామున లేచి స్నానం చేయడం మంచిది. ఆ సమయంలో బావినీళ్లు వెచ్చగా ఉంటాయి . స్నానం వల్ల బద్ధకం పోతుంది, చురుకుగా ఉంటారు. చైతన్య వంతంగా ఆలోచిస్తారు ఇదే భావి జీవితానికి చక్కని మార్గం సుగమం చేస్తుంది.బుద్ధి వికసిస్తుంది . ఇలాంటివి చాలా పండుగ ల ఉద్దేశ్యం.ఈ చలనశీలత కోసమైనా ఎవరైనా వాళ్ళ పెద్దలు చెప్పే సనాతన సంప్రదాయం పాటించి ధర్మనిరతితో ఉంటారు. వీటివల్ల అంతా మంచే! చెడు లేదు!!
_____****____
సూచనలు:
• మయూఖ అంతర్జాల పత్రికకు తమ రచనలు పంపించేవారు యూనికోడ్ (UNICODE) లో టైప్ చేసి mayuukhathemagazine@gmail.com కు మాత్రమే పంపించగలరు అని మనవి.
- • రచయితలు తమ ఫోటోను, విద్య, ఉద్యోగ వివరాలను, చిరునామా, ఫోన్ నెంబర్ తో సహా పంపగలరు.
- •తమ తమ రచనలకు హామీపత్రం జత చేయగలరు. మా మ్యాగజైన్ లో వచ్చిన తరువాతనే బ్లాగ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ మా మ్యాగజైన్ కి రెఫెర్ చేస్తూ పెట్టగలరు.
- •ఎటు వంటి వివాదాస్పదమైన విషయాలకు చోటులేదు.
- •ఎవరిని కించపరిచే విధంగా వ్రాయకూడదు.
- •సభ్యతా సంస్కారాలు గల రచనలు మాత్రమే పంపించగలరు.
- •రచనలలోని విషయాలకు, భావాలకు రచయిత(త్రులు)లే బాధ్యులు. సంపాదకుల బాధ్యత కాదు.
- •ప్రచురణ విషయములో సంపాదకులదే తుది నిర్ణయం.
