6
మనస్సు శాంతపరుచుకోవడానికి మంజరికి ఒకే ఒక మార్గం మిగిలింది. అది వివిధ శిల్ప సుందర దృశ్యాలను చూసి సమ్మోహనంగా నర్తించటం. ఆ రోజు ఉదయమే మంజరి భూగర్భ ప్రసన్నవిరూపాక్ష దేవాలయానికి బయలుదేరింది.
దేవాలయప్రాంగణం చేరి నిరంతరం నీటిలో నిమగ్నమై ఉండే విరూపాక్షుని సందర్శించింది. ఈ స్వామిని కొలిచినవారి మనస్సు పరమ ప్రసన్నమౌతుందిట. మంజరికీనాడు స్వామి దర్శనం పరమానందాన్ని కల్గించింది.
భూగర్భ ప్రసన్న విరూపాక్ష మందిరం కృష్ణరాయలు పట్టాభిషిక్తుడైన సందర్భంగా పునరుద్ధరణకు నోచుకున్నది. భూమట్టానికి దిగువగా ఉన్న ఈ దేవాలయం తూర్పు అభిముఖంగా రెండు పెద్ద గోపురాలతో గంభీరతను ప్రసాదిస్తోంది.ధ్వజస్తంభం,మహామండపం, గగన దీపస్తంభం, పలుమండపాలతో శోభాయమానంగా అలరారుతున్న ప్రసన్న విరూపాక్ష దేవాలయానికి ఉత్తర దక్షిణ దిక్కుల్లో చతురస్రాకారపు బలమైన స్తంభాలతో విశాలమైన మండపాలనేక మున్నాయి. మహామండపం నుంచి అర్థమండపం, షట్కోణాకారంతో ఉన్న మండపం నీటిలోనే ఉంది.
తీక్షణకుంభంగల పెద్ద విగ్రహం. కళ్యాణమండపాలను దాటింది మంజరి. ఆ దేవాలయ శిల్పకళా వైభవం ఆమెలో పరమ భక్తిభావాన్ని మేల్కొలిపింది. ప్రసన్న విరూపాక్షుని ఎదుట మహామండపంలో ముద్రపట్టి నృత్యరీతిలో శివారాధన చేస్తున్నది మంజరి.
పరమేశ్వరా దేవా జగదీశ్వరా!
దయాగుణశేఖరా, స్వామి పంపాపతీ!
నిను మనసార కొలిచేను మహేశ్వరా
మమ్ము కృప జూపి కాపాడు శివశంకరా!
ఆడేనురా పాట పాడేనురా!
ఎన్ని జన్మలకైనా పూజింతురా
నీచరణాలె శరణంటి నటధీవరా
మమ్ము కృప జూపి కాపాడు శివశంకరా!
గిరజావరా స్వామి వరసుందరా
భవములు బాపేటి ముల్లోక దీనబంధుడా!
మూడు కన్నుల కాచేటి మునివంద్యుడా
మమ్ముకృప జూపి కాపాడు శివశంకరా!
ఆమె పరవశంతో భక్తిభావంతో నర్తిస్తున్నది. శివకైంకర్యమైన ఆ నృత్య సమారాధనకు పరమశివుడు కూడా పరమానందంతో నర్తిస్తుంటే స్వామి జటాజూటం నుంచి గంగ తొణికిసలాడిరదేమోనన్నట్లు చిరుజల్లు ప్రారంభమైంది. గుడిప్రాంగణంలో జల్లుల స్వర విన్యాసంతోబాటు వీరేంద్రుని అట్టహాసానికి ఆమె ఒళ్లు జలదరించింది. చుట్టూ పరికించి చూసింది.
సిల్కుధోవతి, ఆపైన జరీ అంగరఖా, పట్టుకండువా, ముత్యాలపేర్లు ధరించి కన్నుల్లో కుటిలత్వం నింపుకున్న వీరేంద్రుడు ఆమె ఎదుట నిలిచాడు.
‘‘అమ్మాయీ… బాగు బాగు’’ మరోసారి విచిత్రంగా నవ్వాడు.
‘‘మీరా’’ ఆమె భయాందోళనతో ఒకడుగు వెనక్కి వేసింది.
‘‘జగన్నాథ! అంత భయమెందుకు? నీ నృత్యకౌశలం గురించి విన్నామేగానీ చూసింది లేదు. చిన్నాదేవి నృత్యంలో శృంగారం పాలు ఎక్కువట గదా! ఆమె నృత్యాన్ని చూసే అవకాశాన్ని రాయలు మాకివ్వలేదు. ప్చ్! ఏం చేద్దాం! జగన్నాథ!’’
‘‘ఏమిటీ మాటలు? వారిప్పుడు దేవేరులు. అలా మాట్లాడరాదు.’’
‘‘హు! ఏం దేవేరి? ఒక దేవదాసి ఎన్నటికీ దేవేరి కాలేదు. ఆ దాసీపుత్రుడు కృష్ణదేవరాయలకు ఆమె తగిన దేవేరియే! దేవేరి అంటే మా గజపతులపుత్రి అన్నపూర్ణాదేవే!’’
‘‘విూరిట్లా మాట్లాడటం తగదు. రాయలవారి తల్లిగారు వీరనరసింహ రాయలవారికి చాలాకాలంగా పుత్రసంతతి లేదు. నరసప్ప నాయకుని ముగ్గురు భార్యలలో నాగలాంబిక కుమారుడు రాయలవారు. అందరికీ తెల్సిన విషయమే గదా!’’ మంజరి వీరేంద్రుని అపోహను ఖండిరచింది.
అతడు వికటంగా నవ్వాడు.
‘‘ఇదంతా మీరనుకుంటున్నది. కానీ అది నిజం కాదు. మీలాంటి వారిని మభ్యపెట్టడానికి. అసలు సంగతి చెబుతాను విను జగన్నాథ!
రాయలు సత్కుల సంజాతుడు కానేకాదు. రాయల తండ్రి నరసనాయకుని చేతిలోని నీటిపాత్రలో ఓ సాయంత్రం ప్రకాశవంతమైన చుక్క రాలింది. ఆయన ఆ పాత్రమూసి మంత్రిగారికి ఈ విషయం కబురు చేశాడు. మంత్రిగారు ఆ నీటిని తాగమని రాజుకు వర్తమానం పంపాడు. రాజు నీటిని తాగి ఆ రాత్రి పట్టపుదేవి అంతఃపురానికి వెళ్ళాడు. కానీ ఆమెను కలవలేని సందర్భంలో ఆమె పరిచారికతో కలిశాడు. కృష్ణరాయని జన్మ ఆమెవల్ల జరిగింది’’ వీరేంద్రుడు గొప్ప రహస్యం కనిపెట్టినవాడిలా నవ్వాడు.
‘‘అంటే మీ వుద్దేశం రాయలవారి తల్లి కులీన కాదనేగా’’
‘‘జగన్నాథ! అందుకే ఆయన బుద్ధి కూడా అలాగే పెడతోవబట్టింది. భోగకాంతయిన చిన్నాదేవిని చేరదీశాడు కదా!’’
‘‘ఛీ! మీకీ విషం ఎవరు పెట్టారు? మీరు కులీన స్త్రీకి జనించలేదా?’’ మంజరి బుసకొట్టింది.
ఆ క్షణంలో ఆమె పరమశివుని కంఠాభరణమైన నాగినిలా ఉంది.
‘‘ఏం కూశావ్! మా గజపతుల వీరపరాక్రమం గురించి నీకు తెలీదు! కొన్నాళ్ళు ఆగు. నువ్వూ, నీ రాయలు ఈ విజయనగరం మట్టిలో కలవకపోతే నా పేరు వీరేంద్రుడు కాదు’’ హుంకరించాడు.
మంజరి వెంటనే తేరుకుంది. యుక్తివంతంగా వ్యవహరించాలనుకుంది.
‘‘మీరన్నదే నిజమైతే ఇంతటి దాసీపుత్రునికి అన్నపూర్ణాదేవినిచ్చి ఎలా వివాహం చేశారు’’ ఆరా తీసింది.
‘‘అదా! గ్రహచారం జగన్నాథా! ఇస్తే ఇల్లలకగానే పండగయిందా? గజపతుల కృష్ణసర్పం పడగనీడలో రాయలున్నాడని మర్చిపోతున్నాడు. చూస్తావుగా ఇకనించి అంతా మా కాళ్ళకింద మట్టిగానే మిగుల్తుంది’’ వీరేంద్రుడు కాలితో నేలను తన్ని విసవిసా వెళ్ళిపోయాడు.
అతని నిజస్వరూపం తెలుసుకున్న మంజరి తుఫాను ఎదుర్కొనే ఆకులా అల్లాడిపోయింది. అతనితో మాట్లాడటం మేలుకే అయింది. ఇతగాడి విషబుద్ధి మహామంత్రికి సెలవీయాలి. విజయనగర సామ్రాజ్య పరిరక్షణ కోసం తన ఆఖరిశ్వాస దాకా అంకితమౌతుంది.
తిమ్మరుసువారికీ విషకీటకం బుసలు విన్పించకుండా ఉంటాయా! చంద్రప్ప రాగానే చర్చించాక అసలు విషయం బయటపెట్టాలి. పాపం అన్నపూర్ణాదేవి మహాసాధ్వి. గంధపుచెట్టును సర్పాలు చుట్టుకున్నట్లు ఇటువంటి నాగులెన్ని కదిలినా రాయలవారి ఖడ్గానికి బలికాక తప్పదు. ఏది ఏమైనా వీరేంద్రుని కదలికలని కొంత కనిపెట్టి ఉండాల్సిన అవసరమేర్పడుతున్నది.
ఆముక్త మాల్యదలో ప్రభువు రాసిన పద్యం గుర్తొస్తున్నది.
రాష్ట్రమెరియంపకొనుము దుర్గములు తదవ
రోధ మగవడ్డ బుట్టించి రూఢ నడపు
పరుషములు తద్రిపుల రాయబారు లెదుట
బలుకకుము సంధి యొకవేళ వలసియుండు (4)
శత్రుదేశాన్ని తగులబెట్టు. శత్రురాజుల కోటలను ఆక్రమించు. కానీ బందీలుగా ఉన్న శత్రువుల స్త్రీలను పుట్టింటి తోబుట్టువులుగా భావించి మర్యాదతో ప్రవర్తించు. రాయబారులతో పరుషవాక్యాలు మాట్లాడకూడదు. ఎందుకంటే సంధి చేసుకోవాల్సి రావచ్చు.
ఇటువంటి ఉన్నతాశయాలు కలవాడు కనుకనే రాయల సంస్కారం అదే తీరులో ఉంది. కానీ తమ ఇంటి ఆడబడుచు బంధువుగా వచ్చిన వీరేంద్రుడు ఇలా ప్రవర్తించటం అతని నీచత్వానికి నిదర్శనం. ప్రతాపరుద్ర గజపతిని ఓడిరచిన తర్వాత అతని కొడుకైన వీరభద్ర గజపతికి రాయలవారు ప్రాణభిక్ష పెట్టకపోతే గజపతులకు వారసుడెవరుంటారు? మరుక్షణంలోనే అన్నపూర్ణాదేవి కుమారుడు తిరుమలరాయలు స్ఫురణకొచ్చాడు. అంతకుముందు రాయల వారికి పుత్రులు పుట్టినా దక్కలేదు. తిరుమలరాయడే భావి విజయనగర సామ్రాజ్యాధినేత గదా! అని మంజరి తనలో తాను వితర్కించుకుంటూ మరోమారు ప్రసన్న విరూపాక్షునికి నమస్కరించి బయలుదేరింది. మెట్లెక్కి ప్రాకారం దాటి బయటికి రాగానే వెనుకనే రామేశ్వర శాస్త్రి బయటికి రావడం గమనించిన మంజరి ఆశ్చర్యచకితురాలయింది.
బ్రహ్మతేజస్సుతో అలరారే ముఖవర్చస్సు, స్ఫురద్రూపం, కాలికి కడియం, నుదుట విభూతిరేఖలు, దీటైన వస్త్రధారణతో పాతికేళ్ళ ఆ యువకుడు మంజరి కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆమెపట్ల అతని ఆరాధనభావమంతా ఆ కన్నులలో తొణికిసలాడిరది.మంజరికి ఈ యువకుని గురించి పూర్తిగా తెలియదు. చాలాసార్లు ఇతనిని శిల్పారామంలో చూసింది. యువశిల్పిగా భావించింది. కానీ శాస్త్రి మంజరి సౌందర్యాన్ని ఆమె నృత్యశోభను ఆరాధిస్తున్నాడని ఆమెకు తెలిసే అవకాశం లేదు.
తనకీ వీరేంద్రునికి మధ్య జరిగిన సంవాదానికి సాక్షి పరమేశ్వరశాస్త్రి అనే విషయం మంజరికి అర్థమయింది. ఆమె అతనికేదో చెప్పాలనుకొంది.
అతను మాత్రం ఆమెకా అవకాశం ఈయకుండానే మరోదోవలో చకచకా ముందుకు సాగిపోయాడు. వెళ్తున్న అతనికేసి చూస్తూండిపోయింది మంజరి.
పరమేశ్వరశాస్త్రి పరమ శివభక్తుడు. ప్రశాంతంగా ఉండే భూగర్భ ప్రసన్న విరూపాక్ష మందిరంలో రోజూ కొన్నిగంటలు యోగసాధన చేస్తుంటాడు. అతనెవ్వరివాడో ఎక్కడివాడో ఏ వివరాలు ఎవరికీ పూర్తిగా తెలియవు.
పరమేశ్వరశాస్త్రి తిమ్మరుసు స్నేహితుని కుమారుడని మాత్రం అంతా చెప్పుకుంటారు. కళగల మొహంతో అందంగా బలంగా కన్పించే శాస్త్రి అప్పుడప్పుడు రాతిరథం దగ్గర కూచుని ఎలుగెత్తి శ్రావ్యమైన స్వరంతో పాటలు పాడుతుంటాడని అందరికీ తెలుసు.
ఆరోజు కూడా విరూపాక్ష దేవాలయం నుంచి శాస్త్రి నేరుగా రాతిరథం దగ్గరికి వచ్చాడు. రెండు చక్రాల మధ్యస్థలంలో బాసీపట్టి వేసుకుని కూచున్నాడు. శివయోగం సాధన చేశాడు. మనసుకు శాంతి లభించటం లేదు. మంజరిని చూసినప్పుడల్లా తెలియని అశాంతికి లోనవుతున్నాడు.
నిలువ నీడలేని తనకు ఆశ్రయమిచ్చి సర్వశాస్త్రాలలోముఖ్యంగా శిల్పశాస్త్రంలో మెళకువలు అవగతం చేసిన గురువును స్మరించాడు. తనలోని సంగీతతృష్ణని పెంచి గంధర్వగానాన్ని నేర్పిన రెండవ గురువు అమ్మకి నమస్కరించాడు.
శిల్పాచార్యులవారి దగ్గరికి వెళ్ళి శిల్పిగా ఉద్యోగం అర్థిస్తే పాటలుపాడే శిల్పి మా కక్కర్లేదన్నాడు.
సంగీతాచార్యుడుగా మారుదామంటే రాళ్ళమధ్య బతికేవాడు సంగీతానికి పనికిరాడన్నారు.
ఎందుకిలా? ఎన్నాళ్ళిలా? నేనెవరిని? నా జీవితం ఎందుకిలా…. నా జీవితమే ఎందుకిలా? స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఇంత బలమైనదా!
విజయనగర సామ్రాజ్యంలో స్త్రీలకి ఎంత మర్యాద ఈయాలో తెలుసు. అందుకే మంజరితో ఏనాడూ పల్లెత్తి మాట్లాడలేకపోయాడు. కన్నెత్తి పూర్తిగా చూడలేకపోయాడు. ఆమె అప్పుడప్పుడు ఆ చంద్రప్పతో కల్సి కనిపిస్తుంటుంది. అతడు సంగీతకారుడే కాదు రాజుగారి వేగు అని అనుమానం. వారిద్దరూ అనురాగబద్ధులైతే…
అతని మనసు చిగురుటాకులా కంపించింది.
‘‘ఎవరు నాయనా నీవు? ఏమిటీ ధ్యానం?’’
ఎవరో కాషాయాంబరధారి అపరశివునిలా ఎదుట నిలిచి ప్రశ్నిస్తున్నాడు.
‘‘నేనెవర్ని స్వామి? నా మనసులో ఈ అశాంతి ఏమిటి?’’ శాస్త్రి ప్రశ్నించాడు.
స్వాములవారు శ్రద్ధగా అతన్ని చూశారు. దగ్గరకు రమ్మని పిలిచి తనతో మఠానికి తీసుకువెళ్ళారు. శాస్త్రి నమస్కరించి స్వాముల వారి ఎదుట కూర్చున్నాడు.
స్వాములవారి సైగతో శిష్యులొక రుద్రాక్షమాలనూ, శాలువాను స్వాములవారికి అందించారు. స్వాములవారు స్వయంగా శాలువాను శాస్త్రికి కప్పి, మెడలో రుద్రాక్షమాల వేశారు. తలపైన అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
‘‘నాయనా! నీది సన్యసించే జాతకం కాదు. అందుకే కాషాయ వస్త్రాలందించలేదు. కానీ నీకు ఎటువంటి భవబంధాలు వద్దు. నీకు మరుజన్మ లేదు. అంటే పూర్వజన్మ పరిహారం చేసుకో. నువ్వు కావాలనుకుంటున్న వ్యక్తి నిన్ను కోరుకోదు. నీమీద గౌరవం మాత్రమే ఉంది.’’
‘‘నామీద ఎవ్వరికీ ప్రేమ ఉండదా’’ రామేశ్వరిశాస్త్రి గొంతులో బాధ ధ్వనించింది.
‘‘నిస్సంగుల్ని లోకం గౌరవిస్తుంది. పూజిస్తుంది. కానీ ప్రేమించదు. నీ విషయంలో కూడా అదే జరుగుతుంది. నిన్ను గౌరవించినవాళ్ళు ప్రేమించాలని కోరుకుంటే మిగిలేది దుఃఖమే గదా’’ స్వాములవారు అంతరార్థం చెప్పారు.
రామేశ్వరశాస్త్రి మనసు తేలికపడిరది. అతని దుఃఖం దూరమైంది. మనస్సులో చిత్రించుకున్న మంజరి బొమ్మను మనస్సే చెరిపేసుకుంది. ఇప్పుడు అపరిమితమైన ఆనందమంటే ఏమిటో తెలుస్తున్నది.
‘‘స్వామీ! నా జీవిత పరమార్థం ఏమిటి? ఇలా గమ్యంలేని ప్రయాణం ఎటు వెళ్తుంది?’’ అడిగాడు.
స్వాములవారు అతని శిరస్సున హస్తముంచారు. రెండు నిమిషాలు
కళ్ళు మూసుకుని తీవ్రంగా ధ్యానం చేశారు.
‘‘నీకు విముక్తి మార్గం లభిస్తుంది నాయన! అశాశ్వతమైన బంధాల నుంచి శాశ్వతమైనదానిని సాధించు. నీలోని శక్తిని మేల్కొలుపు. నీవు చేసిన సృష్టి శాశ్వతంగా ఉంటుంది. ముందుతరాలవారు నిన్ను చిరయశస్విగా గుర్తిస్తారు. నీకు ఆత్మసంతృప్త్తి కూడా అందులోనే కలుగుతుంది. నువ్వు చిన్నతనంలో దీక్ష పొందిన మంత్రం గుర్తుందా కుమారా!’’ ప్రశ్నించారు స్వాములవారు.
రామేశ్వరశాస్త్రికి వెంటనే స్ఫురించలేదు. రెండు క్షణాలు ఆలోచించాక ఓ మెరుపు మెరిసింది. చిన్నతనంలో తండ్రి వెంట ఓ యోగిని దర్శించినపుడు ‘‘రూపధ్యాన గానావళీ’’మంత్రాన్ని ఉపదేశం పొందాడు. కానీ దానిని ఇంతదాకా ఉపాసన చేయలేదు.
‘‘అవును స్వామి. ఓ మంత్రం నాతో ఉంది’’ వినయంగా చెప్పాడు.
‘‘ఆ రూపధ్యాన గానావళీ మంత్రాన్ని సాధన చేయి. అది నిన్ను కటాక్షిస్తుంది. నువ్వు శిల్పగాయకుడివి. నువ్వు చెక్కిన దేవతామూర్తుల్ని చూస్తుంటే ఆ మూర్తులే మైమరిచిపోయేంతగా గానం విన్పిస్తుంది. నువ్వు ఆలపించే గానంతో దేవతామూర్తుల దివ్యరూపం కనిపిస్తుంది. ఇలా శిల్పంలో గానాన్ని, గానంలో శిల్పాన్ని సృష్టించు నాయనా!’’ స్వాములవారు ఆదేశించారు.
‘‘నేను విశ్వకర్మని కాను సాధారణ మానవుణ్ణి. స్వామీ! నాకిది సాధ్యమవుతుందా?’’
‘‘నీ శక్తి తెలీక అలా మాట్లాడుతున్నావు. నువ్వు మామూలు మనిషివి కావు.’’
‘‘అయితే నేను ఎవరిని స్వామీ?’’
‘‘తత్త్వమసి’’ అన్నారు స్వాములవారు నీలిగగనంలోకి చూస్తూ చేతులు జోడిస్తూ.
ఇపుడు రామేశ్వరశాస్త్రి మనసులో ఎటువంటి అనుమానాలు, భయాలు లేవు. అతని హృదయంలో వేయిరాగాలు వీణ మీటుతున్నాయి. కళ్ళముందు అనేక శిల్పకళామూర్తులు, కళారూపాలు ప్రత్యక్షమౌతున్నాయి.
అప్పటిదాకా ఈ సంఘటనకు ప్రత్యక్షసాక్షిగా ఉన్న ప్రధాన శిల్పాచార్యుడు ముందుకు వచ్చి స్వాములవారికి నమస్కరించాడు. రామేశ్వరశాస్త్రి చేయి పట్టుకున్నాడు.
‘‘పద నాయనా! విజయవిఠల దేవాలయ సప్తస్వర మండప వైభవం కోసమే నువ్వు పుట్టావు. ఎంత ప్రయత్నిస్తున్నా ఆ శిల్ప స్వర స్థానాలు పూర్తి స్థాయిలో కుదరటంలేదు. నాతో రా! నీ వల్ల నా జన్మ కూడా తరిస్తుంది’’ ప్రేమగా అన్నాడు ప్రధాన శిల్పాచార్యుడు.
‘‘సెలవు స్వామీ’’ రామేశ్వరశాస్త్రి సంతోషంగా స్వాములవారికి నమస్కరించి సెలవు తీసుకున్నాడు.
ప్రధాన శిల్పాచార్యులతో బాటు వెళ్తున్న రామేశ్వరశాస్త్రిని చూసి స్వాములవారి గుబురుమీసాల మాటున తెల్లని చిరునవ్వు తొణికిసలాడిరది. విఠల మండపం తుదిరూపురేఖలు పూర్తవుతాయనే విశ్వాసం కలిగింది. పైనుండి దేవతలు కూడా ‘తధాస్తు’ అని ఉంటారు. అందుకే రాయల విజయయాత్ర విహారం తర్వాత విజయనగరంలో శిల్పకళాశక్తి ఆత్మశక్తితో రూపుదిద్దుకున్నది.
విజయ నగరమునన్ విఠ్ఠలాలయమున
బ్రథిత శిల్పము జక్కపరుప జేసె
మాన్య హజారు రామస్వామి కోవెలన్
దగు చెక్కడమ్ముల తావు జేసె
దివ్య పంపావతీ దేవాలయమునకు
స్థాపించె శిల్పాల గోపురమ్ము
ధీరోగ్ర నరసింహదేవు విగ్రహమును
బ్రౌఢ శిల్పంబు తావలయుజేసె
మంజులారామముల సభామంటపముల
హర్మ్యారాజీ విరాజి రత్నాపణముల
జాల దీర్పించి శిల్పకళాలయముగ
రాయలలరించె దన దివ్యరాజధాని
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
‘‘శ్రీవేంకటేశ్వర పాదపద్మావేశిత సదయహృదయ! తిరుమల దేవీవల్లభా! రాజకంఠీరవా! ఈశ్వర నరసింహ భూఫురంధర! చిన్నమదేవీ జీవిత నాయకా! కవితా సామ్రాజ్య ఫణీశ! శ్రీకృష్ణదేవరాయ బహుపరాక్! బహుపరాక్!’’ వందిమాగధుల కైవారాలు మిన్నుముట్టాయి.
శ్రీకృష్ణదేవరాయలు, అప్పాజీ వచ్చారు. సభలోని కవిగాయక సేనానులు, పండితులు అందరూలేచి అభివాదం చేశారు. రాయలు అప్పాజీకి, అందరికీ అభివాదం జేసి సింహాసనం అధిష్టించాడు. రాయల దేవేరులు కూడా
ఉచితాసనాన్ని అలంకరించారు.
పెద్దనామాత్యుడు రాయల కీర్తిని నుతిస్తూ…
‘‘ఉదయాచలేంద్రంబు మొదల నెవ్వని కుమా
రతకు గ్రౌంచాచల రాజమయ్యె
నావాడ పతి శకంధర సింధురాధ్యక్షు
లరికాపుల నెవ్వాని ఖరత రాసి
కాపంచగౌడ ధాత్రీ పధంబెటవ్వాని
కసివాడగ నేగునట్టి బయలు
సకల యాచక జనాపూర్తి కెవ్వాని
ఘన భుజాదండంబు కల్పశాఖి
ప్రబల రాజాధిరాజ వీర ప్రతాప
రాజ పరమేశ బిరుద విభ్రాజి యెవ్వ
డట్టి శ్రీకృష్ణదేవరాయాగ్రగణ్యు’’
అని ఆశీర్వదించాడు. రాయలు చిరునవ్వుతో నమస్కరించాడు. నందితిమ్మనగారు రాయలను వినుతిస్తూ…
‘‘ఉదయావేగత్యుయద్ధతి సాధించె
వినుకొండ మాటమాత్రాన హరించె
గూటము ల్సెదరంగ కొండవీడగవించె
బెల్లమకొండ యచ్చల్లజెరిచె
దేవరకొండ యుద్వృత్తి భంగముసేసె
జల్లిపల్లె సమగ్రశక్తిడులిచె
గినుకవిూర ననంతిగిరి క్రిందపడజేసె
గంబంబు మెట్టు గ్రక్కున గదల్చె
బలనికాయము కాలిమట్టులక నెక్కునయడచు
గటకమును నింక ననుచు నుత్కలమహీశు
డనుదినమ్మున వెరచు నెవ్వనికి నతడు
రాజమాత్రుండె శ్రీకృష్ణరాయవిభుడు’’
రాయలు అంజలిఘటించి కృతజ్ఞతలు తెలిపాడు. సంగీత సాహిత్య కోవిదులున్న ఆ సభలో ఒకే ఒక వ్యక్తి రాయలకేసి కార్పణ్య దృష్టితో చూస్తున్నాడు. వీరేంద్రునికీ వైభోగం ఆనందం కల్గించటం లేదు.
విజయయాత్రలకు కారకులైన సేనానాయకులందరినీ ప్రభువు ఘనంగా సత్కరించాడు. అప్పాజీ సభనుద్దేశించి ప్రసగించారు.
‘‘దక్షిణాన విలసిల్లుతున్న ఈ సువిశాల హైందవ స్రామాజ్యం విద్యారణ్యుల వారి ఆశీఃబలంతో ఏర్పడిరది. మనవారి అనైక్యత, ఈర్ష్యాసూయలు, స్వార్థంవల్ల ఇంకా పరదేశీయులను ఆపలేకున్నాము. రాయలవారి గురించి నా కలలు నెరవేరాయి. ప్రభువు పరాక్రమశౌర్యులు, వినయశీలురు, ఆదర్శనీయులు, యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు, వికలాంగులైనవారికి తగిన పరిహారం, పారితోషికాలు ఇస్తున్నాం. నిద్రాహారాలుమాని విజయనగరం కోసం శ్రమిస్తున్న మన వీరులందరికీ అభినందనలు. విజయనగర కేతనం చిరకాలం వినువీధిలో రెపరెపలాడాలని అభిలషిస్తున్నాం’’ అని ముగించారు.
‘‘నా జీవనదాత, రాజ్యానికి మూలశక్తి, మాకిన్ని విజయాల నందించి మమ్మల్నీ సింహాసనంపైన నిలిపిన మా అప్పాజీవారిని ఎలా గౌరవించినా తక్కువే అవుతుంది. అందుకే వారిని మా గౌరవప్రదమైన అభిమాన కౌగిలిలో బంధింప దలిచాము’’ రాయల గంభీరవచనాలతో అప్పాజీని మనసార కౌగిలించుకున్నారు.
శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీల మధ్య అతులితమైన ఆ ప్రేమానుబంధాన్ని చూసి సభ పులకించింది. కాని ఆ దృశ్యాన్ని చూసి కళ్ళనిప్పులు రాలుస్తున్నది వీరేంద్రుడొక్కడే.
‘ఈ మైత్రి ఇంకెన్నాళ్ళులే’ అనుకున్నాడు. అప్పటికే అతని మనసులో ఒక విషపన్నాగం రూపుదిద్దుకుంది. రాజు అంగరక్షకుడిగా వీరేంద్రుని ముఖకవళికలు చురుగ్గా గమనిస్తున్నాడు చంద్రప్ప.
నాటి సభ కవిపండిత సత్కారంతో ముగిసింది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
తిమ్మరుసు మహామంత్రి ఆస్థాన జ్యోతిష్యులతో సమావేశమయ్యారు.
‘‘ఈ పరిస్థితుల్లో రాయలవారి జన్మకుండలి విశేషాలు సెలవీయండి జ్యోతిష్యవర్యా’’ తిమ్మరుసు గూఢంగా అడిగారు.
‘‘చిత్తం మహామంత్రీ’’ జ్యోతిష్యవేత్త తాళపత్రాలు చూసి రాయల జాతకం గణన చేసి నిట్టూర్చాడు.
‘‘ఏమయింది? రాయలవారి గ్రహస్థానాలు ఎలా ఉన్నాయి?’’ ఆందోళనగా అడిగాడు తిమ్మరుసు. ఆ వృద్ధుని వదనంలో రాయలపైన ప్రేమ పొంగి పొర్లుతోంది. రాజ్యభద్రత గురించిన బాధ్యత ప్రస్ఫుటంగా కన్పిస్తున్నది. జ్యోతిష్యవేత్త మంద్రస్వరంతో చెప్తున్నాడు.
‘‘చక్రవర్తి జన్మకుండలి ప్రకారం శని, సూర్య, మంగళ గ్రహాల కలయికవల్ల హాని జరిగే సూచనలున్నాయి.’’
‘‘దీనికి శాంతి లేదా?’’
మనసులోని ఆందోళన బయటపడనీయని ధీరుడు తిమ్మరుసు మంత్రి.
‘‘ఉంది మంత్రివర్యా! రాయలవారి రాజయోగానికి విఘాతం కలుగుతుంది. కాబట్టి ఆ దోషం తొలిగేదాకా సింహాసనంపై కూర్చోరాదు’’
‘‘సరే. మీరు వెళ్ళొచ్చు’’ జ్యోతిష్యవేత్తను పంపివేసి తిమ్మరుసు ఆలోచనలో పడ్డారు. కాస్సేపట్లోనే ‘‘రాయవారి మందిరానికి పల్లకీ సిద్ధంచేయండి’’ సేవకుల్ని ఆజ్ఞాపించారు.
తిమ్మరుసు అనుకోకుండా తమ మందిరానికి రావటం రాయలకు ఆశ్చర్యం కలిగించింది. అప్పాజీ వివిరించిన విషయాలు సావధానంగా విన్నారు రాయలు. ఇద్దరూ గురుదేవులయిన వ్యాసరాయలవారి కుటీరానికి ప్రయాణమయ్యారు.
వ్యాసరాయలవారి కుటీర ప్రాంగణం మునివాటికలా ప్రశాంతంగా ఉంది. ఎత్తైన వృక్షాలు, పూలచెట్లు, లేళ్లు, నెమళ్ళు, ఆ ఆశ్రమ వాతావరణంలోకి అడుగుపెడితేనే ఎవరికైనా వేదనలు, బాధలు తీరిపోతాయి. ఆవరణంతా
శుభ్రంగా అలికి ముగ్గులు తీర్చి ఉంది.
విజయనగర మహాసామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరుసు మహామంత్రితో వచ్చి వ్యాసరాయల ముంగిట యాచకుడై నిలిచారు.
గురుదేవులైన వ్యాసరాయలు పరమ ఆదరంతో రాయలకు ఎదురేగి లోపలికి తోడితెచ్చాడు. భద్రాసనాలను అలంకరింపజేశారు.
‘‘రాయా! ఏమిటీ ఆకస్మికాగమనం?’’ వ్యాసరాయలి ప్రశ్నకు రాయలు తిమ్మరుసువైపు అర్థవంతంగా చూశారు.
‘‘గురువర్యా! కృష్ణరాయలి జన్మకుండలిరీత్యా యోగభంగం వుంది’’ తిమ్మరుసులవారు వ్యాసరాయలితో చెప్పారు. వ్యాసరాయలు కలవరంగా చూశారు.
‘‘దీనికి ఎన్ని జపహోమాలు చేయించినా ఉపశాంతి లేదన్నారు’’ తిమ్మరుసు తానే మళ్ళీ చెప్పారు.
‘‘అయితే?’’ వ్యాసరాయలు ఆలోచనగా అన్నాడు.
‘‘అందుకే అర్థులమై వచ్చాము. కృష్ణరాయలకీ యోగభంగం కొద్దిరోజులు మాత్రమే ఉంది. మీరీ దోషకాలం రాయల సింహాసనం అధిష్టిస్తే ఆ దోష నివారణ జరుగుతుంది’’ అభ్యర్థనలోనే అధికారాన్ని మేళవించారు తిమ్మరుసు.
‘‘కానీ…’’ వ్యాసరాయలు సంకోచం వెలిబుచ్చారు.
‘‘కాదనకండి గురుదేవా! మీరు తప్ప దోషహరణం చేయగల సమర్థులు మరొకరు లేరు. నా ప్రార్థన మన్నించి విజయనగర సింహాసనంపై చక్రవర్తిగా కొన్నిదినాలు రాజ్యపాలన చేయండి. మేమంతా మీవెంట దోయిలొగ్గి ఉండగలం’’ కృష్ణరాయలు అంజలి ఘటించారు.
విశాలమైన కనుదోయి. నిలువునామం. రాచఠీవి, జ్ఞానతేజస్సుతో, భుకపరాక్రమంతో వెలుగొందే కృష్ణరాయలు తన ఎదుట అలా కైమోడ్చి ప్రార్థిస్తుంటే వ్యాసరాయల మనసు శిష్యవాత్సల్యంతో కరిగిపోయింది.
‘‘రాయా! నీవు నామీద ఉంచిన నమ్మకానికి నీ గురుభక్తికి నాకెంతో ఆనందంగా ఉంది. నా మఠదైవం గోపాలకృష్ణునికి అంకితంగా నేనీ బాధ్యత స్వీకరిస్తున్నాను’’ అన్నారు వ్యాసరాయలు.
కృష్ణరాయలు, తిమ్మరుసుమంత్రి, వ్యాసరాయలకు ధన్యవాదాలు తెలిపారు.
మరునాడు సభలో ఈ విషయం ప్రకటించబడిరది. మొదలు సామంత దండనాథులకేమీ అర్థం కాలేదు. ఇది ఏ విపరీతానికి దారితీస్తుందోనని వాళ్ళు భయపడ్డారు. తిమ్మరుసు మంత్రి కృష్ణరాయని జన్మకుండలిలోని దోషం గురించి ఇతర వివరాలను సభాసదులకు తెలియజేశారు.సభ ఆమోదం పొందింది.
ఒక శుభదినాన నిండుసభలో మంత్రయుక్తంగా శ్రీకృష్ణదేవరాయలు తమ భుజబల సముపార్జితం, తిమ్మరుసు ధీశక్తితో విలసితం అయిన విజయనగర మహాసామ్రాజ్యాన్ని వ్యాసరాయ గురుదేవులకు అప్పగించారు.
వ్యాసరాయలవారిని భద్రాసనంపై సగౌరవంగా కూర్చుండబెట్టి నవరత్నాలతో అభిషేకించారు. వినమిత శిరస్కుడై రాయలు నమస్కరించారు.
వ్యాసరాయలు శిష్యునికి తనపట్ల గౌరవాభిమానాలకు చాలా సంతోషించాడు. ప్రేమార శిష్యుని కౌగలించుకున్నాడు.
‘‘నాయనా! యీ రాజ్యప్రేమ, నిర్మలహృదయం వల్ల నీ కీర్తి ఆచంద్ర తారార్కం నిలువగలదు’’ అని ఆశీర్వదించాడు.
తనను అభిషేకించిన నవరత్నాలను కులమతభేదం లేకుండా బీదలకు పంచిపెట్టాడు వ్యాసరాయలు.
జన్మకుండలిలోని దోషకాలం పూర్తయ్యేవరకు సింహాసనాన్ని వ్యాసరాయలవారే అధిష్టించారు. అది తొలగిపోగానే మరలా శాస్త్రోక్తంగా రాయలు సింహాసనాన్ని అధిష్టించారు. ఇపుడు రాయలు మబ్బువిడిచిన సూర్యుడిలా మరింత వీరప్రతాపాలతో వెలుగొందుతున్నారు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
రామేశ్వరశాస్త్రి అన్నం తిని మూడుదినాలయింది. నిరంతరం విఠలమందిరంలోనే ఉంటున్నాడు. తాను తీర్చిదిద్దిన సంగీత స్తంభాలను స్పర్శించి ఆ స్వరమాధురుని ఆనందిస్తూ కొసమెరుగులు దిద్దుతున్నాడు.
ఏదో లోకంలో ఉన్నట్లున్నాడు. గడ్డం పెరిగి మాసిన వస్త్రాలతో మారువేషంలో ఉన్న విశ్వకర్మలా ఉన్నాడు శాస్త్రి.
మంజరి రోజూ భోజనం తనే తీసుకువస్తున్నది. కానీ అతను దానికేసి చూడటం కూడా లేదు. ఆమెనా పనికి ఎవరూ నియోగించలేదు. ఆమె కళాసక్తి అలాంటిది.
ఆ రోజుకూడా మంజరి భోజనం తెచ్చింది. కాని ఎప్పటిలా అక్కడ వుంచి వెళ్ళలేదు.
‘‘అయ్యా!’’ పిలిచింది. అతను ఆమెకేసి చూడలేదు. ‘నవమోహిని’ విగ్రహాన్ని తదేకంగా చూస్తూ తుదిమెరుగులు గురించి ఆలోచిస్తున్నాడు.
‘‘అయ్యా! నేను మంజరిని.’’
అతను ఆమెకేసి చూశాడు. అతని కళ్ళలో లిప్తపాటు మెరుపు. మళ్ళీ అంతలోనే ప్రశాంత కాంతి.
‘‘అక్కడ వుంచివెళ్ళు మంజరీ’’
‘‘లేదు స్వామి! మూడురోజులుగా మీరు తినటం లేదు. నేనుండగానే తినండి.’’
‘‘ఫర్వాలేదు. అక్కడ ఉంచి వెళ్ళు’’ అతని చూపులు మాత్రం ఆ శిల్పం మీదే! ఏదో లోకంలోంచి మాట్లాడుతున్నట్లు కన్పిస్తున్నాడు.
‘‘స్వామీ! మీరు ఇంతలా శ్రమపడితే ఆరోగ్యం పాడయిపోతుంది. కొంచెం విశ్రాంతి కూడా అవసరం’’ మంజరి మెల్లగా చెప్పి భోజనపాత్ర అక్కడ
ఉంచింది.
రెండు ఘడియల పాటు తదేకంగా అతను చెక్కే ‘నవమోహిని’ విగ్రహాన్ని చూసింది. ఆ విగ్రహంలో కుదురుకున్న స్త్రీమూర్తిని ఎక్కడో చూసినట్లుంది. ఎక్కడ? ఎక్కడ? తటాలున విద్యుల్లతలాంటి స్ఫురణ! అది అద్దంలో తన ప్రతిబింబమే! అంటే తనలాంటి విగ్రహాన్ని ఈ రామేశ్వరశాస్త్రి చెక్కడం ఎంత ఆశ్చర్యమో అంతే ఆనందం!
ఆ స్త్రీమూర్తిని మరింతగా చూడాలనిపించింది. నాట్యభంగిమలో వయ్యారంగా నిలబడి ఉంది. సర్వాభరణ భూషితురాలై ప్రేమగా చూస్తున్నది. ఆ చూపులో పారవశ్యం, తాదాత్మ్యం మమేకమైనాయి. ఆమె శిరస్సుపై నుండి ఇరుపక్కలకి జాలువారుతున్న పుష్పతోరణం మరింత అందాన్ని ప్రసాదిస్తున్నది. స్త్రీమూర్తి విగ్రహం కొలత దాదాపు మానవ సహజమైన ఎత్తుతో నల్లశిలలో ఉంది. రామేశ్వరశాస్త్రి చేతిలో ‘నల్లనిరాయి వెన్న, మైనంలా’ మారిందా అనిపిస్తుంది. వంపుసొంపులు, ఇంపులు, వస్త్రాలు, నగలు నఖశిఖ పర్యంతం ప్రతి అంశంలో తెలుగుదనం ఉట్టిపడుతూ చూసేవారికి పవిత్రభావాన్ని ప్రసాదిస్తున్నది. శాస్త్రి ఉలివిన్యాసం, హృదయఔన్నత్యం ఆ శిల్పంలో ప్రతిఫలిస్తున్నది.
మంజరి కళ్ళనిండుగా నీళ్ళు. రామేశ్వరశాస్త్రి ఆరాధన తనకి తెలియంది కాదు. తన నాట్యం ఒక శిల్పికి స్ఫూర్తినీయటం తనకీ ఆనందమే! కానీ తనదైన లోకంలో బతికే ఈ యువశిల్పి భవిష్యత్ ఏం కానున్నది? విజయనగర సామ్రాజ్య కళాజగత్లో ఈతని స్థానం ఏమిటి? దీనిని కాలమే నిర్ణయిస్తుంది. నిట్టూర్చి కర్తవ్య స్ఫురణతో కదిలింది.
రామేశ్వర శాస్త్రి విఠలమండప నిర్మాణంలో సప్తస్వర స్తంభాలను పూర్తి చేయటంలో ప్రధాన పాత్ర వహించాడు. దాని నిర్మాణం పూర్తి అయింది కాబట్టి ప్రధాన శిల్పాచార్యుడు శాస్త్రిని తిరుపతిలో నిర్మిస్తున్న వేయిస్తంభాల మండప నిర్మాణంలోతోడ్పడమని కోరాడు. శాస్త్రి మరునాడే తిరుపతికి ప్రయాణమయ్యాడు. బయలుదేరినప్పుడు శాస్త్రికే తెలియదు తాను మళ్ళీ ఎప్పుడీ కళానగరానికి రాగలడో! ఎప్పుడీ మంజరిని మళ్ళీ చూడగలడో! మంజరికి శాస్త్రి తిరుమల ప్రయాణం గురించిన సమాచారం మర్నాడు అతను వెళ్ళిపోయాక గానీ తెలియలేదు.
ధారావాహిక నవల
5
‘‘మంజరీ! ఏమిటే చాలా ఉల్లాసంగా కనిపిస్తున్నావు?’’
‘‘ఏమీలేదు చిన్నాజీ’’
‘‘ఏదో నాకు చెప్పవే! వేయిచంద్రికలు విరబూస్తున్న నీ మొహంలో ఆనందం చెప్పకనే చెప్తున్నది. చంద్రప్పను కలిశావా?’’
‘‘అవును చిన్నాజీ! ప్రభువు దయవల్ల మనకి మంచిరోజులే!’’
‘‘ఇక కల్యాణయోగమేనేమో!’’ చిన్నాదేవి ఆమెను ఆట పట్టించింది.
‘‘పోండి చిన్నాజీ! ఆ… నేను మా అమ్మని చూసి చాలాకాలమైంది ఇంటికి వెళ్ళివస్తాను.’’
‘‘నా అనుమతి ఎందుకు మంజరీ! నీవు నా చెలికత్తెవు కావు. చిన్ననాటి నేస్తానివి. నీకీ భవనంలో రాకపోకలకు పూర్తి స్వాతంత్రం ఉంది.’’
సంతోషంతో చిన్నాదేవి మందిరం నుండి బయలుదేరింది మంజరి.
విరూపాక్షస్వామి దేవాలయ వాణిజ్య వీధిలోంచి వస్తుండగా ఎవరివో గుసగుసలు చెవినబడ్డాయి.
‘‘ఇస్మాయిల్ ఆదిల్ఖాన్ పంపారు’’
‘‘ఏంటి ఖబర్?’’
ఒకడు పరదేశి అని తెలుస్తోంది. ముఖాలను పూర్తిగా వస్త్రంతో కప్పుకున్నాడు. మరొకడు విజయనగర పౌరుడే!
మంజరి వాళ్ళకి కనబడకుండా అటువైపు తిరిగి వస్త్రాలు, గాజులు కొనుగోలు చేస్తున్నట్లు నటిస్తూ ఆ సంభాషణ వింటున్నది.
‘‘రాయచూర్ ముట్టడికి రాయలు వస్తాడు కదా’’ పరదేశి చెప్తున్నాడు.
‘‘అయితే?’’
‘‘ముట్టడి జరుగుతుండగా రాయల సైన్యం రాయచూర్కి తూర్పువైపు గుడారాలు వేస్తారు’’ పరదేశి వివరిస్తున్నాడు.
‘‘అవును. సరిగ్గానే ఉందీ విషయం.’’
‘‘ఇకవిను. మా ఇస్మాయిల్ ఆదిల్ఖాన్ అశ్వదళాలు పదాతి దళాలతో విజయనగరానికి తొమ్మిదికోసుల దూరాన నిలుస్తాడు. కందకాలు తవ్వి ఫిరంగులను పేలుస్తాడు’’ పరదేశి మాట్లాడాడు.
‘‘ఇక విజయనగరం కోటమట్టిదిబ్బేనంటారా’’ విజయనగర వాసి ప్రశ్నించాడు.
‘‘ష్! జనం వింటారు. ఈ సమాచారం ఎక్కడా పొక్కరాదు. ఆదిల్ఖాన్ కోట ముట్టిడిరచే సమయానికి మీరు కోటలోపల నుంచి సహకరించాలి.’’
‘‘మాకు లాభం’’ ఆశపడ్డాడు విజయనగర ద్రోహి.
‘‘ఎంత కోరితే అంత’’ శత్రువు ఆశ చూపించాడు.
‘‘సువర్ణరాజ్యం ఇది. దీనిని స్వాధీనపరచటమంటే మాటలు కాదు. సరే మీ ఖాన్సాబ్కి చెప్పు. అంతా సవ్యంగా జరుగుతుందని’’ మాట ఇచ్చాడతను.
వాళ్ళిద్దరూ త్వరత్వరగా అక్కడినుంచి వెళ్ళిపోయారు.
మంజరి తమ ఇంటికి పోలేదు. నేరుగా తిమ్మరుసు భవనానికి బయలుదేరింది. విజయనగర ద్రోహి గుర్తించి ఆమెని వెంబడిరచాడు. తన అనుమానం నిజమే. ఆమె విజయనగరంలో వేగు. ఈ వార్త తిమ్మరుసుకు చేరవేస్తుంది. సందేహం లేదు. దారికాచి ఆపాడు.
‘‘ఆగు! నీ గొంతులోంచి మా రహస్యం పొక్కనీయకు’’ బొంగురుగా అన్నాడు.
‘‘ద్రోహి! విజయనగరానికే ఎగ్గు తలపెట్టిన నిన్ను వదిలిపెట్టను’’ సివంగిలా అతని జుట్టుపట్టుకుంది మంజరి.
ఒక సామాజ్య నర్తకి అని భావించిన మంజరిలో ఇంతటి శక్తి అతడూహించలేకపోయాడు. తడబడి కైజారు దూయబోయాడు.
మెరుపులా ఒక అశ్వికుడొచ్చాడు. ఒక్కవుదుటున మంజరిని తన గుర్రంపైన కూర్చుండపెట్టుకొని క్షణంలో మాయమయ్యాడు. మైదానంలోకి వచ్చాక అశ్వం ఆగింది. అతని మొహం చూసి ఆమె నివ్వెరపోయింది. ఆనందించింది కూడా.
‘‘చంద్రా!’’
‘‘మంజూ! సాహసం కూడా అదను కనిపెట్టి చేయాలి. ఈ వార్త నాకూ తెలిసింది. తిమ్మరుసుగారికి చేరింది కూడా! నువ్వు మీ ఇంటికి పో! నేనూ వచ్చి కలుస్తాను. అక్కడ నీ అవసరం ఉంది’’ అంటూ ఆమెను అశ్వంపైన ఎక్కించుకొని కృష్ణసాని ఇంటిదగ్గర దింపి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు చంద్రప్ప.
ఇంటిదగ్గర జనం గుమికూడారు. తలా ఒకటి అనుకుంటున్నారు.
‘‘ఎలా జరిగింది? ఎవరు చేశారో ఈ ఘాతుకాన్ని’’ ఎవరో వ్యాఖ్యానించారు.
‘‘కాలమహిమ’’ మరొకరి బదులిది.
‘‘బతికినన్నాళ్ళు కూతురి వైభోగం కోసమే తపించింది’’ ఒకరు జాలి చూపిస్తున్నారు.
ప్రజల మాటల్ని దాటుకుంటూ తోసుకుంటూ లోపలికి వెళ్ళిన మంజరి ఎదురుగా కన్పిస్తున్న దృశ్యాన్ని చూసి నిట్టనిలువునా కూలిపోయింది.
‘‘అమ్మా!’’ ఆ ఆక్రందన అందరి హృదయాలను పిండేసింది.
రాత్రి ఎవరో ఇంటదూరి విలువైన రత్నాభరణాలను దొంగిలించి కృష్ణసాని గొంతునులిమారట. ఆమె అతనిని చూసి ఉంటుంది. అందుకే ఈ మరణం. మరికాసేపట్లో చిన్నాదేవికీ వార్త అందింది. ఆమె పంపిన రాజోద్యోగుల సాయంతో మంజరి తల్లి అంత్యక్రియలను పూర్తిగా నిర్వర్తించగలిగింది.
ఇక ఈ భవంతిలో ఏముంది? తనను గొప్పస్థానంలో చూడాలని బతికినన్నాళ్ళూ తపించిన తల్లి ఇక లేదు. తాను ప్రేమించిన చంద్రప్ప మారువేషంలో తిరుగుతున్నాడు. ఈ భవనంలో తనకి భద్రత ఏముంది?
మంజరి చిన్నాదేవి భవనానికే చేరింది. ‘‘చిన్నాజీ’’ అని ఏడుస్తున్న మంజరిని కౌగలించుకొని కంటతడిపెట్టింది చిన్నాదేవి. ప్రేమతో మంజరిని ఓదార్చింది.
‘‘నేటినుంచి నువ్వు నా సోదరివి. నా దగ్గరే ఉండు’’ అని పలువిధాల సమాధానపరచింది. మంజరి మనసులో ఆకాశమంత దిగులున్నా తారకల్లాంటి వెలుగు దివ్వెలు దూరాన కన్పిస్తుంటే కొంత ఊరట చెందింది.
* * *
రాయల సైన్యం రాయచూర్ ముట్టడికి బయలుదేరింది. వారి వ్యూహం ప్రకారం రాయచూర్కి తూర్పుదిక్కున రాయలసైన్యం శిబిరాల్లో ఉంది. ముట్టడికి రాయలు సర్వసన్నద్ధంగా తరలి వస్తే ఇస్మాయిల్ అదిల్ఖాన్ అశ్వపదాతి దళాలతో కోటకు తొమ్మిది కోసుల దూరాన నిలిచి కందకాలు, ఫిరంగులతో యుద్ధానికి సన్నద్ధమైనాడు. రాయలు గ్రహించాడు.
కోటముట్టడికి కొంత సైన్యాన్ని అక్కడే ఉంచి మరికొంత సైన్యంతో ఆదిల్ఖాన్ని ఎదిరించటానికి పూనుకొన్నాడు. నిజానికి ఈ యుద్ధం రాయల శక్తికి మించిపోయింది. ఒక దశలో అపజయం సూచనలున్నాయి. చివరికి అవమానం ఒప్పుకోని ధీమంతుడైన రాయలు యుద్ధరంగంలోకి స్వయంగా దిగి, తన సైనికులకు బలాన్నిచ్చాడు. ‘‘విజయమో వీరస్వర్గమో’’ అనే నినాదాలతో సైనికులకు నాయకత్వం వహించి నడిపించాడు. రాయల పౌరుషం శత్రుసైన్యాన్ని చీల్చి చెండాడిరది. అపజయం విజయంగా మారింది. ఆదిల్ఖాన్ పారిపోయాడు. అతని సేనాధిపతి బందీ అయ్యాడు. ఆదిల్ఖాన్ పరాజయాన్ని కళ్ళారా చూసిన అల్లసాని పెద్దన ఆశువుగా ఇలా అన్నాడు.
అలుక న్ఘోటక థట్టికా ఖురపుటీ హల్యన్భురాసాని శ్రపు
చ్చలు వో దున్ని, తలచ్చమూ గజ మదాసార ప్లుతీన్గీర్తిపు
ష్కలసస్యం బిడి యేకధాటి భళిరా కట్టించి తే దృష్టికే
దుల నోగ్రఖాకపాలమర్ధప హరిద్భూజాంగల శ్రేణికిన్ (2)
రాయలు రాయచూర్పై యుద్ధానికి వెళ్ళినప్పుడు సపరివారంగా కవులు, పండితులు వెంట ఉన్నారు. యుద్ధశిబిరం యుద్ధభూమిలా లేదు. రకరకాల ధాన్యాలు, ఆభరణాలు, ముత్యాలు అమ్మకాలు జరిగాయి. ఏదో మహానగరంలా ఉంది. రాయలు పోర్చుగీసు సైనికుల సహాయాన్ని కూడా పొంది రాయచూర్ ముట్టడిని సాధించాడు.
* * *
తల్లి మరణం తర్వాత మంజరి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. చిన్నాదేవి ప్రేమ, చంద్రప్ప స్నేహం ఆమె బాధను మరిపిస్తున్నాయి.
‘‘మంజూ! ఈ రోజు భువనవిజయానికి రావాలి’’ చంద్రప్ప ఆహ్వానించాడు.
‘‘ప్రత్యేకత ఉందా’’ నిరాసక్తంగా అంది.
‘‘ఈ రోజు రాయలవారు అన్ని భాషల కవులకు తమ కవిత్వాలు చదివే అవకాశం ఇస్తున్నారట.’’
‘‘అష్టదిగ్గజ కవుల కవిత్వాలు, ఛలోక్తులు ఎంతో రమణీయాలు కదా! మరి ఈ కవులెవరు? ఏ దేశంవారు?’’ ఆమెకి ఆసక్తి కలిగినట్లుంది.
‘‘మనదేశంలోని అన్ని భాషల కవులు విచ్చేస్తున్నారు. వస్తే నీ మనసు ఆనంద తరంగితమౌతుంది.’’
‘‘మరి నువ్వు రావా?’’
‘‘ఎందుకురాను! కానీ నన్ను అక్కడ నువ్వు గుర్తించలేవు.’’
అతనికి మంజరిని త్వరగా వివాహమాడాలని ఉంది. కానీ తల్లి మరణంతో దిగాలుపడిన ఆమె వద్ద అటువంటి ప్రస్తావన కూడా చేయలేని పరిస్థితి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మంజరి మనసును ఉల్లాసపరచాలని చంద్రప్ప ప్రయత్నం. ఆ విషయం గ్రహించిన మంజరి భువనవిజయానికి హాజరవటానికే నిర్ణయించుకుంది.
* * *
భువనవిజయసభ ఇంద్రసభను తలపిస్తున్నది. శ్రీమన్మహారాజాధిరాజ, రాజపరమేశ్వర, పూర్వపశ్చిమ దక్షిణ సముద్రాధీశ్వర, మూరురాయర గండ, సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీశ్రీశ్రీ శ్రీకృష్ణదేవరాయలకు జయీభవ! విజయీభవ! వందిమాగధుల స్తోత్రాలతో శ్రీకృష్ణదేవరాయలు సింహాసనంపై కొలువుదీరాడు.
కర్ణాటాంధ్ర సామ్రాజ్య రక్షామణి సభావైభోగం కళ్ళార చూడాలేగానీ ఊహింప శక్యము కాదు.
తిమ్మరుసు మంత్రి కనుసన్నలతో సభ ప్రారంభమైంది. మొదటగా తాళ్ళపాక పెదతిరుమలయ్యగారు అన్నమాచార్యుని పదకవితలను భక్తి పురస్సరంగా ఆలపించారు.
తందనానా అహి తందనానా పురె
తందనానా భళా తందనానా ॥
బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే ` పర
బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే
కందువగు హీనాదికము లందులేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ ॥
ఇందులో జంతుకుల మింతా ఒకటే
అందరికి శ్రీహరే అంతరాత్మ ॥
నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే
అండనే బంటునిద్ర అదియునొకటే ॥
మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటే
ఛండాలుడుండేటి సరిభూమియొకటే ॥
కడిగి యేనుగు మీద కాయునెండొకటే
కడు పుణ్యులను పాపకర్ములను సరిగావ
జడియు శ్రీ వేంకటేశ్వర నామమొకటే ॥
విశిష్టాధ్వైతంలోని ఆధ్యాత్మిక తత్వాన్ని సంకీర్తనగా విన్న కృష్ణరాయలు పరవశించారు.
నాడు ఒక ప్రత్యేకాంశం భువన విజయసభలో జరిగింది. తిమ్మనకవి నిలబడ్డాడు.
‘‘ప్రభూ! నాచే విరచితంబైన పారిజాతాపహరణ మహాప్రబంధంలో చాలావరకు విన్పించాను. నేడు విన్పించు రచన ఈ కావ్యానికి చాలా ముఖ్యమైంది. అవధరించండి.
అలకబూని కోపగృహంలో ఉన్న సత్యభామను ప్రసన్నం చేసుకోవటానికి శ్రీకృష్ణుడు అనేక విధాల ఆమెను అనునయించాడు. చివరకు
పాటల గంధిó చిత్తమున బాటిలు కోప భరంబుమాన్ప నె
ప్పాటున బాటు గామి మృదు పల్లవ కోమల తత్పద ద్వయీ
పాటల కాంతి మౌళి మణి పంక్తికి వన్నియ వెట్ట నా జగ
న్నాటక సూత్రధారి యదునందను డర్మిలి మ్రొక్కె మ్రొక్కినన్
జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై తన
ర్చు లతాంతాయుధు కన్నతండ్రి శిరమచ్చో వామపాదంబునం
దొలగం ద్రోచె లతాంగి యట్లయగు నాధుల్నేరముల్జేయ బే
రలుకం జెందిన కాంత లెందు సుచిత వ్యాపారము ల్నేర్తురే!
ఇంత జరిగినా శ్రీకృష్ణ స్వామి ఏమన్నాడో వినండి ప్రభూ!
నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్కబూని తా
చిన యది నాకు మన్ననయ, చెల్వగు నీ పదపల్లవంబు మ
త్తను పులగాగ్ర కంటకవితానము దాకిన నొచ్చునంచు నే
ననియెద, నల్క మానవుగదా! యికనైన నరాళకుంతలా!
అంతా ముక్కున వేలేసుకున్నారు. సాక్షాత్ జగన్నాథుడయిన శ్రీకృష్ణుడు భార్య కాలితో తన్నినా ఓర్పు వహించినాడనే దీని భావం రాయల మనసుని ప్రభావితం చేసింది. దీనికి సంబంధించిన ఓ సంఘటన ఆయన స్మృతిపథంలో ఆ క్షణంలోనే మెదిలింది.
సాధారణంగా చక్రవర్తి వచ్చేదాకా మహారాణి తలగడ మీద తలపెట్టి పడుకోకూడదు. మహారాణి కాళ్ళవైపున తలపెట్టి పడుకున్నది. ఆ రాత్రి రాయలు ఆలస్యంగా అంతఃపురంలోకి వచ్చాడు. మెలకువ రాకపోవడంతో మహారాజు ఆమెకి నిద్రాభంగం కలగకుండా తలగడ మీద తలపెట్టుకుని నిద్రపోయాడు. పొరపాటున మహారాణి కాలు ఆయనకి తగిలింది. ఆలస్యంగా వచ్చాడన్న కోపంతో మహారాణి కావాలనే రాజు తలను కాలితో తన్నిందని భావించి ఆగ్రహించి రాయలు అప్పటికప్పుడు అంతఃపురం వదిలి వెళ్ళాడు. ఆనాటినుంచి మహారాణి అంతఃపురానికి ఆయన పోలేదు.
పారిజాతపుష్పాన్ని తనకివ్వకుండా సవతి రుక్మిణికి శ్రీకృష్ణుడు ఇచ్చాడని ఆగ్రహించిన సత్యభామ ఆయన తలను కాలితో తన్నినా కృష్ణుడు ఆగ్రహించ లేదు. శ్రీకృష్ణదేవరాయలను కృష్ణాంశగా భావిస్తారు గాబట్టి ఆయనకూడా రాణిగారి కాలు తగిలినా ఆగ్రహించరాదని కావ్యబోధ. శ్రీకృష్ణదేవరాయలు మహారాణిని అనుగ్రహించేట్లు చేయడం కావ్యప్రయోజనం. మహారాణి నందితిమ్మనను రాయల మనసును మార్చమని కోరిన కోరికననుసరించే నందితిమ్మన అర్థస్ఫోరకంగా ‘పారిజాతాపహరణం’ రాశాడు. రాయలు ఆలోచిస్తున్నాడంటే కావ్యప్రయోజనం నెరవేరినట్లేనని స్వస్తిపలికాడు తిమ్మనకవి.
మహాకవులు కావ్యాలు వెలయించటమే కాదు, కాపురాలు కూడా నిలబెట్టగలరనటానికి ఇది ఉదాహరణ మాత్రమే!
చింతలపాటి ఎల్లకవి రాధామాధవ కావ్యాన్ని రుచి చూపించాడు. ప్రసిద్ధ కన్నడకవి తిమ్మణ్ణి కుమారవ్యాసుని భారతం నుంచి కావ్యగానం చేశాడు. విద్యానందుడు, గుబ్బిమల్లహ్హణ్ణ, కుమారవాల్మీకి, చాటు విఠలనాథుడు తమ కావ్యాలనుండి కొన్ని భాగాలను విన్పించారు.
నాటి సభకు గురువులైన వ్యాసరాయలు, వాగ్గేయకారులైన పురంధరదాసు కనకదాసులు కూడా విచ్చేశారు. తమిళకవి కుమారసరస్వతి ‘‘రాయల గజపతీ కుమారీ పరిణయం’’ నుండి కవితాగానం చేశాడు. హరిహరదాసుడు ‘‘ఇరుసమయ విళక్కుం గ్రంథం, జైన నిఘంటికుడు మండలపురందర్, జ్ఞానప్రకాశర్ ‘‘మంజరిప్పా’’ గ్రంథం, తిరువారూర్, ‘తత్వప్రకాశర్’ ఆయా కవులచే సభాసదులకు పరిచయం చేయటం జరిగింది.
సంస్కృత కవులు శ్లోకాలు విన్పించారు. రాయలు తాను స్వయంగా సంస్కృతంలో రచించిన ‘‘మదాలసచరితం’’ నుండి కవిత్వం విన్పించారు. కటకవాసి లొల్ల పండితుడు, ఈశ్వర దీక్షితుడు సత్కరించబడ్డారు. తనకు సంగీతం నేర్పిన లక్ష్మీనారాయణను రాయలు వైభవంగా సత్కరించారు. తిమ్మరుసు మహామంత్రి తాను రచించిన ‘అగస్త్య భారతవ్యాఖ్య’లో కొంత సభకు విన్పించారు.
ముగ్గురు దేవేరులు ఈ సభను ఎంతగానో ఆనందించారు. సంస్కృతం అంతగా రాని చిన్నాదేవి, కర్ణాటక తమిళ భాషలు తెలియని అన్నపూర్ణాదేవి మూడు భాషల్లో విదుషి తిరుమలాంబ ఈ మువ్వురూ కవితా సౌరభాలను నిండుమనస్సుతో ఆస్వాదించారు.
భువనవిజయ సభాప్రాంగణంలో శ్రీకృష్ణదేవరాయలు ఒక అపూర్వ ప్రకటన చేశారు. తెలుగుభాష తెలుగుజాతి ఉన్నంత కాలం నిలిచిపోయే ఒక అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించే ఆ సన్నివేశం మరికొన్ని రోజుల్లోనే జరుగనున్నదని తెలిసి అష్టదిగ్గజకవులంతా ఆనందించారు. అటువంటి నిర్ణయానికి అప్పాజీ రాయలను అభినందించారు.అందరూ పెద్దన అదృష్టాన్ని వేనోళ్ళ కొనియాడారు.
మంజరి కళ్ళు మాత్రం చంద్రప్ప కోసం ఆ సభలో నలుమూలలా వెదుకుతూ నిరాశగా వెనక్కి తిరిగి వస్తున్నాయి.
అప్పాజీవారికి చేరువలో కానుకలు అందిస్తున్న పరిచారిక సైనికుడు చంద్రప్ప అని గుర్తించడానికి ఆమెకి చాలా సమయం పట్టింది. దాదాపు సభ ముగిసే సమయానికి గానీ ఆమె అతన్ని గుర్తించలేకపోయింది. ఇది గమనించిన చంద్రప్ప తనలో తాను ముసిముసిగా నవ్వుకుంటూ విధి నిర్వహణ చేస్తున్నాడు.
* * *
‘‘ఫో! నీతో మాట్లాడను’’ మంజరి అలక నటించింది.
‘‘మరి ఈ రాళ్ళతో మాట్లాడటానికి వచ్చావా?’’ చంద్రప్ప ఉడికించాడు.
‘‘అంత సభలో ఎక్కడున్నావని వెదకను’’ రోషంగా అంది.
‘‘ప్రస్తుతం నేను ప్రచ్ఛన్నంగా ఉన్నాను. రాయచూర్ విజయం దక్కింది గదా! ఇంక అజ్ఞాతవాసం తేలినట్లే.’’
‘‘హమ్మయ్య’’
‘‘మంజరీ! సుముహూర్తం నిర్ణయించుకునే వచ్చాను’’
ఆమె ఆనందంగా చూసింది.
‘‘దసరా మహోత్సవాల్లో విజయదశమి శుభదినం. ఆనాడు మనం దంపతులమవుదాం. భువనేశ్వరీదేవి, విరూపాక్షస్వామి కృపవల్ల ఈ విజయనగర సామ్రాజ్యంలో మనమూ నీడల్లానయినా మిగిలిపోతాం.’’
‘‘చంద్రం! నాదో కోరిక’’
‘‘చెప్పు మంజూ’’
‘‘మన వివాహం తిమ్మరుసుల వారి ఆశీస్సులతో జరగాలి. వారు కరుణా సముద్రులు. అడిగితే కాదనరు. నాకు ఎవరున్నారు? తల్లిపోయింది. వారిని నేను పితృదేవులుగా సంభావించాను. తిమ్మరుసు తనయులు కూడా సోదరులుగా ఎల్లవేళలా నాకు రక్షణ ఇస్తున్నారు.’’
‘‘నీవన్నదానిలో అణుమాత్రమయినా అసమంజసం లేదు. రేపు తిమ్మరుసుల వారిని కలిసి నీ కోరిక విన్నవిద్దాం’’ ఒప్పుకున్నాడు చంద్రప్ప.
‘‘మన వివాహం విరూపాక్ష మందిరంలో జరగాలి’’ ఆమె కోరింది.
‘‘ఎంత చక్కని యోచన చేశావు మంజూ! విజయనగర సామ్రాజ్య రక్షకుడా ప్రభువు. అతని కృపతోనే మనం ఒకటవుదాం’’ అతనూ సంతోషించాడు.
‘‘చంద్రా! ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి. ఆహారధాన్యాలకు కొదవలేదు. విజయనగర వీధుల్లో కెంపులు, వజ్రాలు, నీలాలు, పచ్చలు, ముత్యాలు, రత్నాలు అమ్మటం చూసి పరాయి మూకలు ఈ రాజ్యంపై కన్నేస్తున్నారు. ముఖ్యంగా బహమనీలు.’’
‘‘అవును. రాయచూర్ని రాయలవారు జయించాక ముసల్మానులకు కన్నెర్ర అయింది. వర్తకం పేరుతో శత్రు గూఢచారులు విరివిగా విజయనగరంలోకి ప్రవేశిస్తున్నారని సమాచారం.’’
‘‘ఈ వ్యాపకంలో నీ నృత్యసాధన కూడా మర్చిపోతున్నావు’’ ఆమె ధ్యాస మళ్ళించటానికి అన్నా అంతకుముందు మంజరి నోట వెలువడినవి చంద్రప్ప మనసులోని ఆలోచనలే.
‘‘తెలుగుభాషను అందలం ఎక్కించిన రాయలవారు దేవేరుల కోసం మూడు మందిరాలు నిర్మించారు కదా! వాటిని చూశావా మంజూ!’’
‘‘చూశాను! తిరుమలదేవి శివాలయం, చిన్నాదేవి కృష్ణ మందిరం, అన్నపూర్ణాదేవి జగన్నాథమందిరం. ఏమా దేవాలయాల వైభవం! ఎవరెన్ని మందిరాలు ఏర్పాటుచేసుకున్నా వారి హృదయమందిరంలో కొలువైంది శ్రీకృష్ణదేవరాయలవారే గదా!’’
‘‘మరి మా హృదయరాణి మందిరంలో ఎవరో!’’
‘‘ఇంకెవరూ’’ అతనివైపు చూసింది. నాట్యంలాంటి నడకతో నునుసిగ్గుతో అతని చేతిల్లో వాలిపోయింది మంజరి.
అప్పటిదాకా రాజ్యశ్రేయస్సు గురించి గంభీరంగా చర్చించిన మంజరి పెళ్ళిప్రసక్తి రాగానే సిగ్గుపడటం చూసి ‘ఆడవారి మనసు ఆర్ణవం లాంటిది’ నవ్వుకున్నాడు చంద్రప్ప.
* * *
ఆ రోజు విజయనగరం నిజంగానే విద్యానగరమై సరస్వతీ నిలయమైన సత్యలోకంగా భాసిల్లుతున్నది. ప్రభువు మందిరం నుండి ఎదురుగా ఉన్న రాజమార్గం ఇరుపక్కలా మంత్రులూ, రాజోద్యోగులు, సేనానాయకులు, రాజబంధువులు, ప్రజలు, అష్టదిగ్గజ కవులు నిలబడి తిలకిస్తున్నారు. ప్రభువు మందిరంలోంచి అందమైన బంగారుపల్లకీ బయటికి వచ్చింది. పల్లకీలో ఆంధ్రకవితా పితామహుడు అల్లసాని పెద్దన ఆసీనులై ఉన్నారు.
రాజమార్గానికిరువైపులా మామిడి తోరణాలు, మార్గమధ్యంలో రంగవల్లులు అలంకృతమైవున్నాయి.
శ్రీకృష్ణదేవరాయల ప్రభువు సర్వాలంకారభూషితుడై తెల్లని పట్టు వస్త్రాలు ధరించి అప్పాజీతో మందిరం వెలుపలికి వచ్చారు.
పల్లకీ వెనుక కొమ్ము పండితవర్యులు పట్టారు. సాహితీపిపాసి, భువనవిజయాధిపతి, ఆంధ్రభోజుడు, తెలుగులెస్స అని పల్కిన కళావాచస్పతి, హిందూ సామ్రాజ్య నిర్మాణ తేజోవిరాజితుడు, మూరురాయగండడైన శ్రీకృష్ణదేవరాయ ప్రభువు సంస్కృతాంధ్రాలలో సమానంగా కవితామాలిక నల్లినవేళ కాలికి గండపెండేరము తొడిగించుకున్న ఆంధ్ర కవితాపితామహుడు అల్లసాని పెద్దన అధిరోహించిన బంగారు పల్లకీని తన భుజాన మోయటం తెలుగువారి చరిత్రలోనే అపూర్వ సంఘటనగా నిల్చింది. నాడు చూసినవారి కన్నులదే అదృష్టం.
హర్షధ్వానాలతో విజయనగర రాజమార్గం మారుమ్రోగింది. ప్రభువు భాషానురక్తి, కవులపట్ల వారికున్న గౌరవం భావితరాలవారికి ఆదర్శప్రాయమై నిలిచిన శుభవేళ అది.
* * *
ప్రధాన శిల్పాచార్యుడు శిల్పులందర్నీ సమావేశపరిచాడు. హంపీ విజయనగరంలో నిర్మితమవుతున్న దేవాలయాల నిర్మాణానికి ఎందరో శిల్పులను విభిన్న ప్రాంతాల నుండి రప్పించడం జరిగింది. వారందరితో ప్రధాన శిల్పాచార్యుడు ఇలా ప్రస్తావించాడు`
‘‘దక్షిణ భారతదేశంలో అచిరకాలంలో ఏకైక చక్రవర్తిగా కీర్తిగడిరచిన హిందూసామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన ఆంధ్రభోజుడు కృష్ణరాయ ప్రభువుల వారు అటు కదనరంగంలోనూ ఇటు కవనరంగంలోనూ ఎనలేని కీర్తిప్రతిష్టలు సాధించారు. రాయలవారు దైవభక్తి, కళాపోషణ, ప్రజాసేవానురక్తి, దయ, మానవీయత, వీర పరాక్రమం, పెద్దలయందు గౌరవం గల గొప్ప రేడు. మహామంత్రి తిమ్మరుసు ప్రభువుకు మంత్రికావటం వారికేకాదు మనందరి అదృష్టం.
ప్రజలను కంటికి రెప్పలా కాపాడే ప్రభువు, మహామంత్రి, వారికి హృదయా న్నర్పించి సేవచేసే సేనావాహిని, న్యాయాధికారులు, దండనాయకులు, రాజ్యక్షేమం కోరే కవి పండితులున్న రాజ్యం మన విజయనగరం. రాత్రింబవళ్ళు ఆడామగా తేడా లేకుండా నిర్భయంగా తిరగగలిగే పరిపాలన ప్రభువు మనకిచ్చారు. వీధుల్లో రత్నాలు అమ్ముతున్న రాజ్యం ఇది. కొత్తవారొస్తే మర్యాదలు చేసి గౌరవించే పౌరులున్న రాజ్యం మనది. కక్షలు, కార్పణ్యాలు మచ్చుకైనా కానరాని ఈ శాంతి సామ్రాజ్యంలో మనలాంటి కళాకారులు మనస్ఫూర్తిగా కళాసేవలో తరించగల అవకాశం ఉంది.
కళాకారునికి ఎక్కడైతే రాజాశ్రయం దొరుకుతుందో, ఎక్కడైతే కళాకారులు అన్నవస్త్రాలకు కష్టపడక మనశ్శాంతిగా సంపూర్ణంగా కళారాధనలో నిమగ్నమౌతారో ఆ రాజ్యంలో సిరిసంపదలు విలసిల్లుతాయి. శారదాదేవి కొలువు తీరుతుంది. తిరుమలేశుని, విరూపాక్షుని సమానంగా అర్చిస్తూ హరిహరతత్వాన్ని ఆరాధించే రాయలవారు అనేక ఆలయాలు, కళామందిరాల నిర్మాణాలను తలపెట్టటం మనందరికీ తెలుసు.
మనలాంటి శిల్పులందరినీ పోషించి రాళ్ళల్లో రాగాలు పలికింపజేసే ప్రభువాయన. మనందరం ఐక్యభావనతో ఈ హంపీని శిల్పారామంగా తీర్చిదిద్దుద్దాం.
నిన్ననే తిమ్మరుసు మహామంత్రి నిర్మిస్తున్నవి, సంకల్పిస్తున్నవి, మరెన్నో వివరించారు. ఈ ఆలయాల సృష్టికి విశ్వకర్మ అబ్బురపడేట్లు మన ఉలులతో శిలలకు ప్రాణం పోయటానికి కంకణం కట్టుకోవాలి. ఏమంటారు?’’
శిల్పాచార్యుల సుదీర్ఘ గంభీర వాక్కుకు శిల్పులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. వాళ్ళంతా ‘నభూతో న భవిష్యతి’ అన్నట్లు విజయనగర రాజధాని హంపీపట్టణాన్ని నిర్మిస్తున్న మయులా అన్నట్లున్నారు. ప్రతి ఒక్కరి మనసుల్లో సంకల్పదీక్ష, నేత్రాల్లో కళాకాంక్ష ద్యోతకమవుతున్నాయి.
శిల్పాచార్యులు మళ్ళీ కొనసాగించారు.
‘‘రంగమండపం పూర్తయింది. ఇంకా విరూపాక్ష దేవాలయ కళ్యాణమండపం, మహాగోపురం పూర్తికావాలి. కృష్ణస్వామి ఆలయం, హజారా రామాలయం, నాగలాపురంలోని విఠోభా ఆలయానికి కళాకృతుల బాధ్యతను నరహరివర్మకు అతని శిష్యులకు అప్పగిస్తున్నాను.’
నరహరివర్మ లేచి శిల్పాచార్యునికి కృతజ్ఞతగా వందనం చేశాడు.
మహోన్నత శిలపై తలపెట్టిన ఉగ్ర నరసింహమూర్తిని రామప్పే తీర్చిదిద్దాలి.
కాళహస్తిలో నూరుస్తంభాల మండపాన్ని, గోపురాన్ని చిన్నప్పకు అప్పగించాం.
చిదంబరంలో ఉత్తర గోపురాన్ని వరదయ్య పూర్తిచేస్తాడు.
శ్రీకృష్ణదేవరాయల ప్రభువు తిరుమల శ్రీ వేంకటేశుని గుడిముంగిట నిర్మింప తలపెట్టిన వేయిస్తంభాలమండపం, గర్భగుడి, వినాయక రథం, మూలగోపురం, వీటన్నిటి నిర్మాణం పూర్తి కావస్తున్నది. అక్కడ అత్యద్భుత కళాకృతుల పర్యవేక్షణ స్వయంగా మేమే చేస్తున్నాం.
శ్రీశైలంలో మండపం, గోపురం మల్లయ్య చూస్తాడు.
అరుణాచలంలో వేయిస్తంభాల మండపం, పదకొండు అంతస్తుల గోపురాన్ని శివన్న దగ్గరుండి శిల్పీకరిస్తాడు.
శిల్పాచార్యుల వారి వింగడిరపుకు శిల్పులంతా హర్షాతిరేకాన్ని ప్రకటించారు.
‘‘కాలం ప్రవాహం వంటిది. విజయనగర సామ్రాజ్య శిల్పులు చరిత్రలో మహనీయులుగా నిలిచిపోయే సువర్ణవకాశం దక్కింది. ఇదంతా పంపావతి కృప. భావితరాలవాళ్ళు మనం తీర్చిన కళామందిరాలు చూసి పులకాంకితులు కావాలి. ఈ శిల్పారామ సౌందర్యదీప్తుల వల్ల రాయల వారి కీర్తి చిరస్థాయిగా నిలిచిపోవాలి. హంపీలోని విఠలమందిరం, రాతిరథాలకు స్వయంగా మేమే
ఉలిసేవలను అందిస్తున్నాము. ఇంక మీరంతా వెళ్ళి మీమీ పనులలో నిమగ్నం కండి. మీకు కావలసిన ఏర్పాట్లు అన్నీ జరిగాయి’’ అని అందరికీ సెలవిచ్చి పంపాడు శిల్పాచార్యుడు.
అపర విష్ణువు అయిన శ్రీకృష్ణదేవరాయల కీర్తిచంద్రికలను యుగాల పాటు శాశ్వతం చేసే కార్యక్రమానికి ఇది నాంది. రాజ్యం ఎంత సంపన్నవంతమైనా కాలచరిత్రలో ఏది నిలుస్తుందో చెప్పలేం. కానీ హంపీ శిలలు పాడుతున్న ఆ శిల్పరాగం మాత్రం శాశ్వతంగా నిలుస్తుందని శిల్పాచార్యుడికి తెలుసు. దూరంగా ఎవరో బైరాగి ఏకతార మీటుతూ పాడుకుంటున్నాడు.
‘‘రాయి రాయి అంటూ
రాతలే రాసేవు
రాయి రాత తెలియుడయ్యా!
రాయిలోనే ఉంది
రాయల ఘనచరిత ` అది
రాత కందని కావ్యమయ్యా!
రాజ్యమంటూ రగిలి
కోటలన్నీ దాటి
ఏమి సాధించేవు నరుడా
ఎన్ని గెల్చిన గాని
పున్నెమే మిగిలేది
ఏనాటికైనాను నరుడా!’’
తత్వం పాడుకుంటూ బైరాగి వెళ్ళిపోతున్నాడు. అతడు విజయనగర సామ్రాజ్య కీర్తి కావ్యాన్ని లిఖిస్తున్న బ్రహ్మలా కన్పిస్తున్నాడు.
4
శ్రీకృష్ణదేవరాయలవారు చాలాకాలం తర్వాత భువనవిజయ సభా మండపాన్ని అలంకరించబోతున్నారన్న వార్తతోబాటు ఆహ్వానాలు అందుకున్న కవి పండితులంతా ఆనందాతిరేకంతో విచ్చేశారు.
అప్పాజీ అత్యున్నతంగా ఏర్పాట్లు చేయించాడు. కవులతో పాటు సామంతులు, దండనాయకులు, నగర ప్రముఖులు ఆసీనులైనారు. అంతఃపుర స్త్రీలు ఆ ప్రతిష్టాత్మక దృశ్యాన్ని చూడటానికి ఏర్పాట్లు చేశారు.
శ్రీకృష్ణదేవరాయ ప్రభువు అప్పాజీతో కలిసి సభాప్రాంగణానికి విచ్చేశారు. వారిరువురు కృష్ణార్జునుల్లా తేజరిల్లుతున్నారు.
సభయావత్తూ లేచి నిలబడి వారికి స్వాగత వచనాలు, జయజయధ్వానాలు పలికింది.
కృష్ణరాయలు అందరికీ ముకుళితహస్తాలతో వందనమాచరించి సింహాసనమలంకరించారు. రాయలవారి వామపక్షాన కూర్చున్న తిమ్మరుసు మంత్రివర్యులు నిలబడి సభనుద్దేశించారు.
‘‘ఈ విజయనగర సామ్రాజ్యం వైభవోపేతమైన హిందూరాజ్యంగా మీ అందరి ఆదరాభిమానాలను చూరగొని విలసిల్లుతున్నది. పరస్పర కలహాల కారణంగా కల్లోలపడిన హిందూజాతి విద్యారణ్యులవారి ఆశీస్సులతో సామ్రాజ్యరూపంలో స్థిరపడిరది.
శ్రీ కృష్ణదేవరాయలవారి బాహుపరాక్రమంతో అవిచ్ఛిన్నంగా దక్షిణాపథానికి కూడా విస్తరించిన విజయనగర సామ్రాజ్యం నేడు కటకం దాకా ఏలుబడి సాధించింది. గజపతుల కుమార్తె విజయనగర ప్రభువుకు రాణిగా ఆహ్వానించ బడిరది. ఈ శుభసందర్భంగా ప్రభువులు తిరుమల వేంకటేశుని దర్శనానికి వెళ్ళి స్వామిదర్శనం చేసుకుని రాజ్యక్షేమానికి ప్రార్ధించి వచ్చారు. తిరుమలేశుని కృపవలన విజయనగర రాజ్యం సుస్థిరమైంది. అవకాశం కోసం పొంచివున్న శత్రువులెందరున్నా మసి చేయగల శక్తిని సముపార్జించింది.
ఈ సభలో ఆసీనులైన అందరికీ స్వాగతిస్తున్నాను. మన భువన విజయంలో కొలువుదీరిన అష్టదిగ్గజ కవుల గురించి ఎంత చెప్పినా తక్కువే.
‘‘స్తవ్యాంధ్ర కవితాపితామహ బిరుదాంకు
డలసాని వంశ పెద్దన మనీషి
మంజులశయ్యా సమంచిత కవితాభి
వినుతుండు నందితిమ్మన విభుండు
అతులిత మధురవాగ్ వ్యాపార ధీరతా
కలితుండు ధూర్జటి కవివరుండు
నవభావ కల్పన స్తవనీయ పింగళి
సూరనాభిఖ్య యశోధరుండు
అంత మాదయగారి మల్లనయు రామ
రాజభూషణు డయ్యలరాజు రామ
భద్రుడున్ రామకృష్ణ ధీవరుడునైరి
రాయలకు నష్టదిగ్గజ ప్రథితకవులు’’
ఈ సరస్వతీసభలో రాయలవారిని ఆశీర్వదించి ఆనందింపచేస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ ముగించారు తిమ్మరుసు మంత్రి.
‘‘శ్రీ విద్యారణ్యస్వామి ఆశీఃప్రభావంతో తేజరిల్లుతున్న విజయనగర సామ్రాజ్యం ధర్మరక్షణకు, హిందూధర్మ పరిరక్షణకు సాహితీ, సాంస్కృతిక వికాసానికి, సకల కళాభివృద్ధికి కంకణం కట్టుకుంది. మమ్మల్ని పరిరక్షకులుగా ఎంచుకుంది. నిరంతర యుద్ధ వ్యూహాలతో అలసి వేసారిన మాకు నేడీ భువనవిజయ సభ ప్రసన్నతను ప్రసాదించగలదని నమ్ముతున్నాను.’’
సభలోని పండితులు హర్షాన్ని కరతాళధ్వనులతో ప్రకటించారు. మంజరి రసరమ్యంగా నాట్యప్రదర్శన చేసింది. ఆమె ఆలపించిన వీరగీతం రాయలనుత్తేజితుడ్ని చేసింది.
శ్రీ విజయ నగర పరిపాలకా
దివిజన దివ్యార్జిత ఏలికా
శ్రీకృష్ణరాయ నృపా! నరాధిపా
జయీభవ! విజయీభవ!
కుందేళ్ళు శునకాల తరిమికొట్టిన నేల
ఎదురులేని పోతుగడ్డకు ప్రభువా
తెలుగు భాషకు తేనెల్లు పూసి
తెలుగు లెస్సని బల్కు మా తెలుగురాయా!
జయీభవ! విజయీభవ!
పసిడి రూకలు కవులకిచ్చేటి రేడా
భువన విజయాలతో మురిసేటి వాడా
కననమ్మునందైన కదనమ్ములోనైనా
నీకు నీవే సాటి మా దైవరాయా!
జయీభవ! విజయీభవ!
ఆంధ్ర మహావిష్ణువే ఆనతియ్యంగ
ఆముక్తమాల్యద నందించినావూ
బంగారు కాలమని అందరూ మెచ్చంగ
తుంగాతరంగాలు నీ చరితపాడంగ
జయీభవ! విజయీభవ!
శ్రీ విజయనగర పరిపాలకా!
దివిజన దివ్యార్చిత ఏలికా!
జయీభవా! విజయీభవా!
నాట్యం ముగిసింది. అవనతశిరస్కురాలై నమస్కరించింది మంజరి.
ఆమె నాట్యానికి విజయనగర వైభవ ప్రశంసకు ప్రభువు ప్రసన్నుడయ్యారు.
‘‘బాగు బాగు! నర్తకీమణీ! నీ నాట్యం, గానం మమ్మల్ని ముగ్ధుల్ని చేసింది. అందుకో ఈ సత్కారం’’ అంటూ అంగుళీయాన్ని బహుకరిస్తున్న ప్రభువుకేసి కృతజ్ఞతతో చూసింది మంజరి.
తిమ్మరుసు మహామంత్రి సాలోచనగా చూశాడు.
కంటకుడు పళ్ళు నూరుకుంటున్నాడు.
మంజరి వినయంగా ప్రభువుకు నమస్కరించి తిమ్మరుసు మంత్రికేసి ఓసారి అర్థవంతంగా చూసి నిష్క్రమించింది.
శ్రీకృష్ణదేవరాయలు కవులనుద్దేశించి ఇలా ప్రశంసించాడు.
‘‘మా అభ్యుదయం ధ్యేయంగా విజయ నిధులుగా భాసించే కవికదంబం మేము జైత్రయాత్ర సాగించినప్పుడు కూడా మాకు స్ఫూర్తినందించి వెంట నడిచారు’’ అంటూ అప్పాజీ కేసి చిరునవ్వుతో చూశాడు.
సేవకులు బంగారు పళ్ళెంతో గండపెండేరం తెచ్చి సభలో ఉంచారు.
‘‘సంస్కృతాంధ్రాలలో సమానంగా కవిత్వం చెప్పినవారి పాదానికి ఈ గండపెండేరాన్ని స్వయంగా నేనే తొడుగుతాను. వారే దీనికి అర్హులు’’ అన్నాడు రాయలు.
ఎవ్వరూ ముందుకు రాలేదు. రాయలు విచారించాడు.
‘‘ముద్దుగ గండ పెండియరమున్
గొనుడంచు బహుకరింప
నొద్దిక నాకొసంగుమని
యొక్కరు గోరగ లేరు లేరొకో’’ అని ప్రశ్నించారు. ఇంతలో పెద్దన కవీంద్రుడు తన ఆసనముపైనుండి లేచి
‘‘పెద్దన బోలు పండితులు
పృధ్విని లేరని నీ వెరుంగవే
పెద్దన కీదలంచినను పేరిమి
నాకిడు కృష్ణరానృపా’’అన్నాడు... ‘‘ఆంధ్ర కవితాపితామహా! మీరు అంతటి ఘనులే! పూర్వతరాల సంస్కృతాంధ్ర కవుల స్ఫూర్తిని గ్రహించి తెలుగు సంస్కృత సాహితీ మాలికను విన్పించండి కవిశేఖరా’’ కోరారు శ్రీకృష్ణదేవరాయ ప్రభువు. పెద్దన అపర సరస్వతి రూపుదాల్చినట్లు గళం విప్పాడు. ‘‘పూతమెఱుంగులుం బసరు పూపబెడంగులు జూపునట్టి వా కైతలు జగ్గునిగ్గు నెన గావలె గమ్మున గమ్మనన్ వలెన్ రాతిరియుం బవల్ మఱపు రాని హోయల్ చెలి, యార జంపుని ద్దాతరితీపులంబలెను దారసిలన్వలె లో దలంచించిన్ బాతిగ బైకొనన్ వలెను బైదలికుత్తుకలోనిపల్లటీ కూత లనన్వలెన్ సొగసు కోర్కులు రావలె నాలకించినన్ డాతొడ నున్న మిన్నుల మిటారపు ముద్దుల గమ్మకమ్మనౌ వా తెఱదొండ పండువలె వాచవి గావలె పంట నూదినన్ గాతల దమ్మిచూలిదొర కైవసపుం జవరాలి సిబ్బెపు న్మే తెలియబ్బురంపు జిగి నిబ్బరపుబ్బగు గబ్బిగుబ్బపొం బూతల నున్న కాయసరి పోడిమి కిన్నెరమెట్ల బంతి సం గాత పుసన్నతంతిబయ కారపుగన్నడి గౌళపంతు కా సాతతతాన తానలపసందివుటాడెడు గోట మీటుబల్ మ్రోతలునుంబలెన్ హరుపు మొల్లముగావలె నచ్చతెన్గు లీ రీతిగ సంస్కృతంబు పచరించిన పట్టున భారతీవధూ టి తపనీయ గర్భ నికటీభవదాననపర్వ సాహితీ భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మత ప్రభా శీతనగాత్మజాగిరీశ శేఖర శీతమయూఖ రేఖికా పాత సుధాప్రపూర బహుభంగ ఘుమంఘుమఘుంఘుమార్భటీ జాతక తాళ యుగ్మలయ సంచిత చుంచు విపంచికా మృదం గాతతదేహితత్తహిత హాదితదంధణుధాణుదింధిమి వ్రాత నయనానుకూల పద వారకుహూద్వహహారికింకిణీ నూతన ఘల్గలాచరణ నూపుర రaూళరaళీమరంద సం ఘాత వియద్ధునీచకచకచద్వికచోత్పలసారసంగ్రహా యాతకుమారగంధవహ హారి సుగంధవిలాసయుక్తమై చేతము చల్లజేయవలె జిల్లున జల్లవలెన్ మనోహర ద్యోతక గోస్తనీఫలమధుద్రవ గోఘృత పాయస ప్రసా రాతిరస ప్రసార రుచిర ప్రతిమంబుగ సారెసారెకున్’’ భువనవిజయ సభాప్రాంగణం రసహృదయుల కరతాళధ్వనులతో మారు మ్రోగింది. రాయలు పులకాంకితుడయ్యారు. ‘‘సంస్కృతాంధ్ర కవితా విశారదా! మీరు నిజంగా పెద్దనే! ఈ గౌరవాసనం అలంకరించండి. ఇదిగో! ఈ గండపెండేరాన్ని స్వయంగా మేమే మీ పాదానికి అలంకరిస్తాము. నేటినుండి మీరు ‘ఆంధ్ర కవితా పితామహు’లన్న కీర్తిని గడిరచారు’’ అన్నారు రాయలు. ‘‘ఈ గౌరవం సంస్కృతాంధ్ర సరస్వతికి ప్రభూ!’’ పెద్దన కవీంద్రుడు ప్రభువుకు నమస్కరించాడు. ఈ సందర్భంగా ఒక కృతిని రచించి అంకితమిస్తానని పెద్దన సభాముఖంగా రాయలకు వాగ్దానం చేశారు. సింహాసనాసీనులైన రాయలు ఆ విద్వత్సభలో తన సాహిత్యాభిమానాన్ని నిరూపిస్తూ తాను పూనుకున్న కావ్యరచన గురించి ఇలా వెల్లడి చేశారు. ‘‘మేము కళింగ దండయాత్రకు వెడలినప్పుడు కృష్ణాతీరంలో ఇంద్రకీలాద్రిని దర్శించి కానుకలర్పించి ముందుకుసాగాము. కృష్ణాతీరంలోనే శ్రీకాకుళంలో ఆ రాత్రి సైన్యంతో విడిదిచేశాము. ఆనాడు వైకుంఠ ఏకాదశి. మేము నిర్జలోపవాసంలో ఉన్నాము. సమీపంలో ఏదైనా వైష్ణవదేవాలయం ఉందా అని అన్వేషించగా ఆంధ్రనాయకుడైన శ్రీకాకుళాంధ్ర దేవుని ఆలయం ఉందని తెలిసింది. ఆ రాత్రి ఆలయంలో విడిదిచేసి కవిగోష్ఠి జరిపాము. మన ఆస్థానంలోని మహాకవులు తమ కావ్యాల నుండి రసగుళికల వంటి పద్యాలు వినిపించారు. రాత్రి అక్కడే నిద్రించాము. జాగరణరాత్రి నిద్రలో అపూర్వ దివ్యస్వప్నంలో ఆంధ్రనాయకుడు సాక్షాత్కరించాడు’’ రాయల వాక్కు వింటూ సభ ఆశ్చర్యపడిరది. రాయలు ఉద్వేగంగా వెల్లడిస్తున్నాడు. ‘‘ఆ కలలో ఆంధ్రమహావిష్ణువు విష్ణుభక్తుల చరిత్రను తెలుగులో కావ్యంగా రాసి వేంకటేశునికి అంకితమీయమని నన్ను ఆదేశించాడు’’ రాయలు చెప్పాడు. ‘‘సాధు సాధు’’ అని సభ ఆమోదం ప్రకటించింది. ‘‘తెలుగులోనే కావ్యరచన ఎందుకంటే... ‘‘తెలుగదేల యన్న దేశంబు దెలుగేను తెలుగు వల్లభుండ, తెలుగొకండ ఎల్ల నృఫులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు తెలుగు లెస్స’’
అన్న రాయల భావానికి మంత్రముగ్ధులైనారంతా!
‘‘మేము రచిస్తున్న ‘ఆముక్త మాల్యద’ ప్రబంధంనుండి ఒకటి రెండు పద్యాలు విన్పించగలము. అవధరించండి’ విష్ణుచిత్తుని భక్తితత్పరత ఎట్టిదనగా`
‘‘అం దుండుం ద్వయపద్మపద్మవదనుం డద్వంద్వు డశ్రాంతయో
గాందూబద్ధ మధుద్విషద్ద్విరదు డన్వర్ధాభిధానుండురు
చ్ఛందోబృంద తదంతవాగపఠనా సంజాతతజ్జన్యని
ష్బందద్వైత సుసంవిదాలయుడు నిష్ట న్విష్ణుచుత్తుం డనన్’’
రాయల కవితాప్రవాహంలో నాటిసభ సరస్వతీనదిలా ప్రవహించింది.
పెద్దన ఆముక్తమాల్యద కథాంశాన్ని మిగుల శ్లాఘించారు.
అష్టదిగ్గజ కవుల కావ్యాలనుండి రసబంధురమైన కొన్ని పద్యాలనువిని సభ సాహితీ డోలికల్లో ఓలలాడిరది.
భువనవిజయం సాహితీవిజయంగా భాసించింది. అప్పాజీ వదనంలో రాయలపట్ల అవ్యాజ్యమైన ప్రేమ, తృప్తి తొణికిసలాడిరది.
‘‘శ్రీకృష్ణదేవరాయలవారికి జయము జయము’’ అనే హర్వధ్వానాలతో నాటిసభ ముగిసింది.
‘‘ప్రభూ! మేముకూడా మీ వెంట తిరుమలకు వస్తాము. వేంకటేశుని కనులారా దర్శించి తరిస్తాము’’ తిరుమలాంబ మాటలకు రాయలు ఆమోదించాడు. ముచ్చటపడిన రాయలు ముగ్గురు దేవేరుల కోరిక ప్రకారం వారితో కాలినడకన సకలసన్నాహాలతో తిరుమలయాత్ర చేశాడు. పండితులు, కవులు,గురువులతో గోవిందనామ స్మరణతో శ్రీవేంకటాచలం చేరాడు రాయలు.
రాయలు తిరుమలక్షేత్ర మహాత్మ్యమును దేవేరులకు వివరించాడు.
‘‘ఇది మేరుపర్వతభాగం. వేంకట అంటే ‘ఇహపరాలు ఇచ్చేవాడని’ అర్థం. ఏడుకొండల వేంకటనాయకుడు కలియుగంలో భక్తులపాలిట కొంగుబంగారమై వెలిశాడు.’’
సకలతీర్థములున్న స్వామిపుష్కరిణిలో దేవేరులతో స్నానంచేసి వరాహ స్వామిని దర్శించి, శ్రీవేంకటేశుని దర్శించి ఆముక్తమాల్యద అంకిత పద్యాన్ని స్వామికి విన్పించాడు రాయలు. తిరుమల దేవాలయ శిల్పసంపద అందరినీ అబ్బురపరిచింది. రాయలు దేవేరులతో శిల్పరూపంలో వేంకటేశుని ముంగిట కొలువుతీరటం చూసి అందరూ ఆనందపడ్డారు.
విజయనగర సామ్రాజ్య రక్షణ చేయమని స్వామినికోరి రాయలు తిరిగి ప్రయాణమయ్యాడు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
విజయనగరంలోని కారాగార ప్రధాన అధికారికి రాజాంగుళీకాన్ని చూపించింది మంజరి.
‘‘ఏమి ఆజ్ఞ?’’
‘‘చంద్రప్పను చూడాలి’’
భటులు ఆమెను చంద్రప్ప ఉన్న కారాగార విభాగానికి తీసుకెళ్ళారు. ఆమెని చూసి చంద్రప్పకు ఆశ్చర్యం, ఆనందం, భయం కలిగాయి.
‘‘మంజూ! ఎందుకింత దుస్సాహసం? ప్రభువుల ఆగ్రహానికి గురికావలసి వస్తుందని తెలియదా?’’
‘‘ప్రభువులు అనుగ్రహించారు చంద్రా! అందుకే ఇలా రాగలిగాను. దేవేరులతో రాయలవారు శ్రీ వేంకటాచలానికి వెళ్ళారు. ఆ తిరుమలేశ్వరుని దయవలన నీపై వచ్చిన నిందకూడా త్వరలోనే తొలగిపోతుంది. నేను తిమ్మరుసు మహామాత్యునికి అన్నీ విన్నవిస్తాను.’’
‘‘వారు నమ్ముతారా!’’ చంద్రప్ప నిరాశగా అన్నాడు.
‘‘వారు విజ్ఞులు. నువ్వు ధైర్యంగా ఉండు. నాడు ఏంజరిగిందీ చెప్పటానికి సాక్షి ఉన్నాడు.’’
‘‘సాక్షా!’’ ఆశ్చర్యపోయాడు చంద్రప్ప.
‘‘అవును. నేనిక వెళ్ళివస్తాను’’ కన్నీరు దాచుకుంటూ వెళ్ళిపోయింది మంజరి.
మంజరి మర్నాడు తిమ్మరుసును కలిసి చంద్రప్ప తన ఇంటిలో రహస్య పత్రాలను దాచిన విషయం, అవి దొంగిలింపబడిన తీరు వివరించింది. తన కుమారుడే సాక్ష్యం చెప్పటం తిమ్మరుసును ఆశ్చర్యానికి లోను చేసింది.
గండమనాయకుడు విశ్వాసపాత్రుడే! అయితే అతని కుమారుడు కంటకుడు వీరేంద్రుడితో కలిసి రాజ్యానికే ముప్పుతెచ్చే పనిలోఉన్నాడని తిమ్మరుసు గ్రహించాడు. వెంటనే గండమనాయకుని పిలిపించాడు.
‘‘అమాత్యవర్యా! ఏమిటి ఆజ్ఞ!’’ గండమనాయకుడు తిమ్మరుసు ఎదుట వినయంగా నిలిచాడు.
‘‘గండమనాయకా! రాజు కొలువులో విధినిర్వాహణ కత్తిమీద సాము గదా!’’
సేనానాయకుడు ప్రశ్నార్థకంగా చూశాడు.
‘‘నీ స్వామిభక్తి నిరూపించుకొనే సమయం ఆసన్నమైంది’’ తిమ్మరుసు మళ్ళీ అన్నాడు.
‘‘చెప్పండి అమాత్యా! నా శిరస్సు ఒక్క వేటుతో తెగవేసుకోనా?’’
‘‘అంతకంటే కఠినమైన త్యాగం. నీ కుమారుడు కంటకుడు రహస్య రాజపత్రాలను శత్రువుకు చేరవేశాడని మనకి విశ్వసనీయ సమాచారం అందింది. అతను స్త్రీ లోలత్వంతో కాముకుడై మంజరిని చెరపడుతున్నాడని అభియోగాలున్నాయి’’ తీవ్రంగా ఉంది తిమ్మరుసు స్వరం.
గండమనాయకుడు అవమానభారంతో తలదించుకున్నాడు. అతనికి తెలుసు కుమారుని నిర్వాకాలు.
‘‘మన శిక్ష్మాస్మృతి ప్రకారం కంటకుడ్ని ముందు బందీని చేయండి. తర్వాత విచారణ జరిపిద్దాం. చంద్రప్పను విడుదల చేయండి. రాయచూర్ను ఆదిల్ఖాన్ వశం చేసుకొన్నాడు. మనం వెంటనే రాయచూర్ ముట్టడికి సిద్ధంకావాలి.’’
‘‘అలాగే మంత్రివర్యా! కంటకుడు నా కుమారుడని అనుకోవటానికే అవమానంగా ఉంది. అతన్ని బందీ చేయకపోతే విజయనగరానికే చాలా ప్రమాదం. నాకిక సెలవు.’’
గండమనాయకుడి నాయకత్వంలో రాయచూర్ ముట్టడికి ఏర్పాట్లు తీవ్రస్థాయిలో మొదలైనాయి.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
చంద్రప్ప కారాగారం నుండి విముక్తుడైనాడన్న వార్త తెలిసి మంజరి సంతోషంతో ఆంజనేయుని గుడికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పింది. రామాయణ కాలంలో సీతారాముల్ని కలిపిన ఆంజనేయుడే తమని కలిపాడని ఆమె విశ్వాసం. చంద్రప్ప ఆమె చెంత వాలాడు సంతోషంగా.
‘‘మంజూ! నీ తెలివితేటలవల్ల బతికి బయటపడ్డాను’’ ఆమెను హృదయానికి హత్తుకున్నాడు.
‘‘మన అదృష్టంతో బాటు తిమ్మరుసుగారి ఔదార్యం’’ మంజరి ప్రశంసగా అంది.
‘‘ఈరోజు కృష్ణరాయలవారు తిరుమలనుంచి విచ్చేస్తారు. వెంటనే రాయచూర్ ముట్టడికి బయలుదేరుతారట’’ చంద్రప్ప చెప్పాడు.
‘‘నువ్వు కూడానా’’ దిగులుగా అంది.
‘‘రాయచూర్లో ఇస్మాయిల్ ఆదిల్ఖాన్ కార్యకలాపాలు కనిపెట్టి రమ్మని మంత్రివర్యుల ఆజ్ఞ’’
‘‘బాగుంది. ఇక మన పెళ్ళెప్పుడు?’’ మంజరి అలిగినట్లు అంది.
‘‘ఈ యుద్ధం పూర్తికానీ చేసుకొందాం. సరేనా!’’ బతిమాలాడు.
చంద్రప్ప మాటలకు మంజరి మొహం వికసించింది.
ఇద్దరూ యోగనరసింహస్వామికి కూడా వందనాలు సమర్పించి తిమ్మరుసు భవనంవైపు సాగిపోయారు.
అస్తమిస్తున్న సూర్యకిరణాలు తిమ్మరుసు సౌధం మీద రుధిరవర్ణంతో ప్రతిఫలిస్తున్నాయి.
హిందూసామ్రాజ్య శత్రువులపై తిమ్మరుసు ఆగ్రహాన్ని ప్రకటిస్తున్నట్లుందా సౌధం.
‘‘చంద్రప్పా! నువ్వు కారాగారం నుండి బయటికి వచ్చిన వార్త రహస్యం సుమా! మనమధ్యనే ఉండాలి. ఇకపై మారువేషంలో సంచరించి శత్రురాజుల వ్యూహాలను తెలుసుకోవాలి.’’
‘‘అలాగే మంత్రివర్యా!’’
‘‘మంజరీ! ఈ రాయచూర్ ముట్టడి అయ్యేదాకా నువ్వు కూడా జాగ్రత్త. మనం పోగొట్టుకున్న రహస్యపత్రాలు రాయచూర్ వారికి అందాయి. అయినా మరేం భయంలేదు. ఎత్తుకు పైఎత్తు మన దగ్గర సిద్ధంగానే ఉంది. మీరిక వెళ్ళిరండి’’ తిమ్మరుసు అనుజ్ఞ ఇచ్చాడు.
ఇద్దరూ సంతృప్తిగా ఆ భవనం నుండి బయటకు వచ్చారు.
3
తూర్పుదిక్కు సూర్యభగవానునికి స్వాగతం పలుకుతూ వేయిరేకుల వెండి పద్మాలను సమర్పిస్తున్నది. విద్యారణ్యస్వామి ఆశీస్సుల్లా విజయనగరం శిరస్సుపై వేలవేల వెలుగు అక్షింతలు వర్షిస్తున్నాయి. విజయనగరంలోని దేవాలయాల నుండి సుప్రభాత సమయాన జరిపే పూజాదికాల మంత్రోచ్ఛాటనా తరంగాలు పంపానదీ జలాలను తాకి పవిత్రమొనర్చి మరల విరూపాక్షుని చరణాలను అభిషేకిస్తున్నాయి.
విరూపాక్షస్వామి దేవాలయం బయట తుంగభద్ర కృష్ణరాయని కీర్తి వాహినిలా ప్రవహిస్తోంది. విరూపాక్ష ఆలయ గాలిగోపురం శిల్పకళాశోభితమై అనేక స్తంభాలు కిటికీలతో విరాజిల్లుతోంది. ప్రాకారద్వారం నుండి వశిష్టతీర్థమనే తుంగభద్రానదీ భాగం పవిత్రఘట్టంగా విరాజిల్లుతోంది. హంపీ విరూపాక్ష దేవాలయం హేమకూట పర్వతపాదం దగ్గర హంపీ పట్టణం నడిబొడ్డున వుంది. దీనినే ‘పంపావతి దేవాలయం’ అని కూడా అంటారు. హంపీలోని అన్ని దేవాలయాలకన్నా పరమ పవిత్రంగా భావించబడే ఈ దేవాలయం ఏడవ శతాబ్దకాలంనాటిదని చెప్తుంటారు. శివ, పంప, భువనేశ్వరీ ఆరాధన జరిగే ఈ గుడి గర్భగుడి, మూడు అంతర్భాగాలు, స్తంభాల మండపం, శ్రీకృష్ణరాయ నిర్మిత రంగమండపంతో అలరారుతున్నది. ఈ దేవాలయం చుట్టూ అనేక స్తంభాల మండపాలు, ద్వారాలు సమావేశ మందిరాలున్నాయి.
రంగమండపం అనేక శిల్పాకృతులతో ముప్ఫై రాతిస్తంభాలతో నిర్మితమైంది. ప్రతిస్తంభం రెండు నిలువు భాగాలుగా కన్పిస్తుంది. మొదటిది మకర శరీరంతో సింహాకృతిలో కన్పిస్తే రెండవది శైవ సంబంధిóత అంశాలతో అలరారుతున్నది. రంగరాయ మండపం లోపల పైభాగం దూలాలన్నింటిమీద మహాభారతం, రామాయణం, శివపురాణాలు చిత్రీకరించబడినాయి. విరూపాక్ష గుడివద్ద తొమ్మిది అంతస్థులతో అత్యంత ఎత్తులో ఉండే బృహద్గోపురాన్ని అనుసరించి విపణివీధి ఉంది. విరూపాక్షగుడి ప్రధాన గోపురాన్ని ‘బిష్టప్ప గోపురం’ అంటారు. దీనికి మరో చివర మహానంది వుంది.
భువనేశ్వరీ దేవాలయ మహాద్వార కళాత్మకత, రాతిస్తంభాలు, పైకప్పు లోపలిభాగ చిత్రాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.
హంపీ విరూపాక్షస్వామిని దర్శించుకొన్న మంజరి చంద్రప్పలు స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించి కాసేపు దేవాలయం మెట్లమీద కూర్చున్నారు.
‘‘మంజూ! ఈ విజయనగర ప్రజలు ఎంత అదృష్టవంతులో కదా! ఇంతటి మహనీయుడైన ప్రభువు పాలనలో జీవించటానికి అర్హులయ్యారు. విరూపాక్షస్వామి దయవల్ల ఆ తిరుమలేశుని కృపవల్ల కృష్ణరాయ ప్రభువు కీర్తిచంద్రికలు దశదిశలా వ్యాపిస్తున్నాయి.’’
‘‘అవును చంద్రా! రాయలవారు ప్రతి విజయయాత్ర తర్వాత దేవేరులతో తిరుమల సందర్శించి తులలేని కానుకలను సమర్పించడం ప్రభువు భక్తికి నిదర్శనం.’’
‘‘మంజూ! చెప్పటం మరిచాను. తిమ్మరుసులవారు నాకోపని అప్పగించారు.’’
‘‘వారికి నీవు నమ్మినబంటువి కదా! ఏం చెప్పారేంటి?’’
‘‘నిర్మాణం కొనసాగిస్తున్న విఠల మండపం, ఏకశిలారథం నిర్మాణ పర్యవేక్షణ నాకప్పగించారు.’’
‘‘ఇంకేం! ఇక రాత్రింబవళ్ళు ఆ శిల్పకన్యల ధ్యాసే!’’ ఉడుక్కుంది మంజరి.
‘‘ఆ శిల్పాలకి మించిన సజీవ శిల్పమే నాకోసం ఉంది మంజూ! ప్రధాన శిల్పాచార్యుడు ఎంపికచేసిన శిల్ప విన్నాణాలన్నింటిలో నీవే కన్పిస్తున్నావు. ఆయన నిన్ను, నీ నృత్యాన్ని ఎప్పుడైనా చూశారా అని నా అనుమానం.’’
‘‘చాలులే చంద్రా! అతిశయోక్తి వద్దుగానీ వారు నా నాట్యాన్ని రాయలవారి పట్టాభిషేకోత్సవ సందర్భంలో చూశారు అంతే’’ నవ్విందామె చిన్నగా.
‘‘కళాహృదయుల కళాతపస్సుకు కాలమే బందీ అవుతుంది. విఠల మందిరంలో నిర్మితమవుతున్న సప్తస్వర స్తంభాలని మీటుతుంటే వివిధ వాయిద్యాల సందడి. నువ్వయితే పరవశంతో నర్తిస్తావు.
‘‘ఎల్లుండి పున్నమిరాత్రి నన్నక్కడికి తీసుకుపో చంద్రా’’ తమకంగా అడిగింది.
‘‘పరులకు ప్రవేశం నిషిద్ధం. అయినా ఆచార్యుల అనుమతి అడిగి తీసుకెళ్తాను.’’
‘‘పద! చిన్నాదేవిగారి పూజకు వేళకాకముందే నేను మందిరానికి చేరాలి.’’
‘‘ఉండుండు! ఇవ్వాళ విద్యారణ్యస్వామి జయంతి. వారి ఆశీస్సులు ప్రత్యేకంగా తీసుకోవాలి. ఈ గుడి వెనుక వారి ఆలయానికి వెళదాం.’’
మంజరి చంద్రప్ప వెంట విద్యారణ్యుల గుడిలోకి ప్రవేశించింది.
విజయనగర సామ్రాజ్య నిర్మాణానికి ప్రేరణగా నిలిచిన ఆ మహనీయుని మూర్తి చూడగానే చంద్రప్ప పరమ భావుకుడయ్యాడు. అతని కళ్ళు ఆనందంతో చెమర్చాయి.
‘‘మంజూ! స్వామి ఎంతటి శక్తి సంపన్నుడో చూడు! పాడయిన ఓరుగల్లు సౌభాగ్యాన్ని విద్యానగర రాజవీధిలో నిలిపిన ఘనుడీయన. క్షీణిస్తున్న హిందూమత ప్రాభవాన్ని తిరిగి నిలబెట్టిన తపస్వి. రాజకీయ తంత్రజ్ఞుడు. ఇహానికి పరానికి నిలిచిన నిస్సంగి. ఎప్పుడో వశిష్టుని గురించి విన్నాము. ఈ విద్యారణ్యుల దివ్య ఋషిత్వము వారి విగ్రహంలో ఎంతగా ప్రస్ఫుటిస్తున్నదో చూడు.’’
‘‘ఆ కన్ను మూతలో నంతర్విలీల పం
చాలనిలస్తంభ నాత్మార్చి వెలుగు
ఆ బొమ్మ మోడ్పులో నసమాక్షుసెగకన్న
మంట రేగిన సుళ్ళు మాటుమణుగు
ఆ కన్నువిప్పులో నఖిల రాజన్య శి
క్షాదక్షమైన వర్చస్సు మెరయు
ఆ చిరునవ్వులో నాంధ్ర సామ్రాజ్యసు
శ్రీ నవ్య జీవన శీలమిముడు
ఈ శిలావిగ్రహము నందె యింతగొప్ప
కుదురుకొని యుండ ఊహలు గుములుకొనిన
ఎంతవాడవొ నిను స్తుతింప గలమె?
విజయనగరాంధ్ర దేవుడవే నిజంబు’’
అంటున్న చంద్రప్పతో కలిసి ఆ స్వామికి నమస్కరించింది మంజరి.
‘‘దేశబాధ చూసి తపస్సు మాని రాజకీయాలలో ప్రవేశించి హంపీలో తెలుగు రాజ్యాన్ని పునఃప్రతిష్టించి సంస్కర్తjైు మతోద్ధారకుడై ముక్తిపొందిన ఈ విద్యారణ్యస్వామి గుడి తెలుగు ప్రజలందరూ చూసి తరించాల్సినది’’ మంజరి ప్రస్తుతించింది.
మనసులోని భావోద్వేగాలను సమన్వయపరుచుకుంటూ గుడి మెట్లు దిగి వస్తున్న మంజరి చంద్రప్పలను చాటునుంచి చండ్రనిప్పుల్లాంటి రెండు
కళ్ళు ఆగ్రహజ్వాలలతో గమనించడం వారికి తెలియదు. ఆ క్షణం నుంచి ఆ కళ్ళు వారి జీవితాలపై నిప్పుల వర్షం కురిపించబోతున్నాయని తెలిస్తే ఆ జంట అంత ఆనందంగా ఉండగలదా?
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
శ్రీకృష్ణదేవరాయలు ఆలోచనామగ్నుడై మందిరంలో పచార్లు చేస్తున్నారు. వార్తాహరుడొచ్చాడు. తిమ్మరుసు మహామంత్రి రాక గురించిన సమాచారాన్ని నివేదించి నిష్క్రమించాడు. విజయనగర సామ్రాజ్యమే తిమ్మరుసు తయారుచేసిన చిత్రపటం. ఆయనకి ఎక్కడికెళ్ళాలన్నా ఆంక్షలుండవు. ముఖ్యంగా రాయలను కలవాలంటే కూడా కబురు పంపటం అనుమతి పొందటం అవసరం లేదు. అయినా రాచమర్యాదలు తప్పని సంస్కారి ఆయన. తిమ్మరుసు ప్రవేశించగానే కృష్ణదేవరాయలు ఎదురేగి ఆహ్వానించారు.
‘‘రండి అప్పాజీ! మీ కోసమే ఎదురుచూస్తున్నాను.’’
ఇరువురూ ఆసీనులైనారు. అప్పాజీవారు ఎప్పటిలాగే గంభీర ముద్రతో
ఉన్నారు.
‘‘అప్పాజీ! మన సామ్రాజ్యవిస్తరణకు దక్షిణ జైత్రయాత్ర దిగ్విజయంగా సాగింది. ఇక ఉత్తర విజయయాత్ర గురించి ఏమాలోచించారు’’
‘‘రాయా! కృష్ణకు ఉత్తరాన మనకున్న బలమైన శత్రువు గజపతి. గతంలో విజయనగర సామ్రాజ్య ఆధీనంలో ఉదయగిరి కొండవీడులను జయించి తన ఆధీనం చేసుకొన్నాడు. అవి తిరిగి విజయనగర సామ్రాజ్యంలో చేరాలి’’ యుద్ధానికి తిమ్మరుసు అనుమతి లభించినట్లే!
వెంటనే సేనానాయకులకు సమాచారం అందింది. శత్రు దుర్భేద్యమైన
ఉదయగిరికోట ముట్టడి ప్రారంభమైంది. నెలల తరబడి జరిగిన ముట్టడివల్ల
ఉదయగిరి రాయలవశమైంది. ఉదయగిరికి రాయసం కొండమరుసును పాలకుడిగా నియమించి రాయలు తిరుమల శ్రీనివాసుని దర్శనానికి పయనమయ్యారు. తిరుమల వేంకటేశునికి అనేక కానుకలు సమర్పించి మళ్ళీ కొంతకాలానికి కొండవీడుపై దండెత్తారు. దారిలో అద్దంకి, వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ వంటి ఉపదుర్గాలను జయించి కొండవీడును ముట్టడిరచి గజపతి కుమారుడు వీరభద్రగజపతిని ఇతర సామంతులతో బందీలుగా పట్టుకున్నారు. ధరణికోటలోని అమరేశ్వరుడ్ని, శ్రీశైల మల్లన్ననూ దర్శించి భక్తిమీర అర్చించారు రాయలు.
అనంతరం కొండపల్లి, అనంతగిరి, నల్గొండ, కంభంమెట్టు, కనిగిరి కోటలు ఆక్రమించి సింహాచలం చేరారు. విజయస్తంభం నాటారు. కృష్ణరాయని విజయయాత్ర శ్రీకూర్మం, పూరి, కటకందాకా సాగింది. కృష్ణరాయ గజపతుల మధ్య ఎడతెగని యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. తిమ్మరుసు భేదోపాయం, రాయల అసాధారణ ప్రజ్ఞాపాటవాలు విజయనగర విజయానికి దోహదపడ్డాయి. రాయల కీర్తిపతాక నీలిగగనంలో రెపరెపలాడిరది.
నిర్వీర్వుడయిన గజపతి రాయలతో సంధిచేసుకుని అయిష్టంగా అయినా తప్పని పరిస్థితులలో తన కుమార్తె అయిన ఆన్నపూర్ణాదేవిని రాయలకిచ్చి వివాహం చేశాడు.
తనను దాసీపుత్రుడని అవమానించిన గజపతిచే కాళ్ళు కడిగించుకుని కన్యాదానం పొంది సంతృఫ్తుడైన కృష్ణరాయలు కృష్ణకు ఉత్తరాన ఉన్న భూములన్నీ గజపతి ఆధీనం చేసి తన సహృదయతను ప్రకటించారు. అన్నపూర్ణాదేవిని బెదిరించి వారి తొలిరేయి రాయలను హత్య చేయించాలను కున్న గజపతుల కుట్ర ఫలించలేదు. రాయలు అన్నపూర్ణాదేవిని క్షమించి జంటగా విజయనగరానికి చేరారు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
చల్లని వెన్నెల రాత్రి చంద్రికల వెలుగులో మెరిసిపోతున్న మంజరిని తదేకంగా కొన్ని నిమిషాలు చూశాడు చంద్రప్ప. ప్రేమగా ఆమెను కౌగలించాడు. నిర్మాణం దాదాపు పూర్తవుతున్న విఠల మండపంలోకి తీసుకెళ్ళాడు.
మానవుడికి విశ్వకర్మకు జరిగిన పోటీయా అన్నట్లుండే విజయ విఠల దేవాలయం విఠలస్వామి విష్ణువుకు అంకితంగా నిర్మితమవుతోంది. కృష్ణరాయ ప్రభువు ప్రారంభించిన ఈ కట్టడం పూర్తికావటానికి ఎన్నాళ్ళు పడుతుందో మరి! గర్భగుడిలో మూలవిరాట్, ఉత్సవ విగ్రహాలుండాలి. విఠలస్వామిమందిరం మూడువైపులా ద్వారాలతో పెద్దరాతి గోడలమీద నిర్మాణమవుతోంది. బలమైన శిలావేదికను సైనికులు నర్తకీమణులు మోస్తున్నట్లు తీరుస్తున్నారు. మూలలు నిర్మితమౌతున్న నృత్యమందిరాలు, కల్యాణ మండపాలు పూర్తిగా తయారయ్యాక ఎంత సుందరంగా ఉంటాయో!
ఒక్కొక్క శిల్పాన్ని చూస్తూ నడుస్తున్నారు. ఏమి అందమా కళాకృతులది! నాట్యభంగిమలు నాట్యశాస్త్రాన్ని లిఖిస్తున్నాయి. ప్రతిభంగిమ మన్మోహనంగా నృత్యానికి ప్రేరణ ఇస్తోంది. మంజరి పాదాలు లయగా మండపమంతా తిరుగాడుతున్నాయి. చంద్రప్ప మురళీ మాధురులు పున్నమి పరిమళంతో కలసి అల్లనల్లన గాలి తరంగాలుగా వ్యాపిస్తున్నాయి. విఠలస్వామి దేవాలయంలోని శిల్పవిన్యాసం చూస్తుంటే మంజరి మనస్సు ఆనందార్ణవంలో ఉరకలు వేస్తున్నది. అక్కడక్కడ స్తంభాలకు పాక్షికంగా అమర్చిన సంగీతశిలలను స్పృశించాడు చంద్రప్ప.
సరి… గమ… ప… ద… ని…
సప్తస్వరాలు పలుకుతున్న కొన్ని సంగీత స్తంభాలు స్వర సంచారం చేస్తున్నాయి. మీటగల కళాకారునికి, సంగీతజ్ఞునికి ఎదురుగా నిలిచి హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాయి. కొన్ని శిలా స్తంభాలు మృదంగ ధ్వానాన్ని, కొన్ని వీణాస్వనాన్ని, కొన్ని సారంగిని… ఓప్ా… సకల సంగీత ప్రపంచమంతా విఠలస్వామి మందిరంలో కొలువుదీరింది. చేతిలోని వెదురు వేణువును పక్కనబెట్టి శిలావాయిద్యాలతోనే రకరకాల మేళకర్తలు రంగరించి వాద్యాలాపన చేశాడు చంద్రప్ప. శిల్పరాగాలకు పులకించిన మంజరి మరింత తన్మయ సమ్మోహనంగా విఠలమండపంలో నృత్యం చేస్తున్నది.
ఆమె అందెల రవళికి ప్రతిస్పందించిన శిలావాయిద్యాలు చంద్రప్ప అంగుళీస్పర్శతో ప్రాణం పోసుకుని మరింత చైతన్యాన్ని ప్రసారంచేశాయి. ఆ రాత్రి నాదమాధురీ మహిమ ఎంతసేపు పరిసరాలను రసప్లావితం చేశాయో వాళ్ళకే తెలీదు. ఒకరి కౌగిట ఒకరు పరవశించి ఆదమరిచిపోయిన ఆ జంట హృదయాలు తొలికిరణ స్పర్శకు జాగ్రదావస్థకు వచ్చాయి.
విఠలమండపం మెట్లుదిగి తూర్పువైపున తేజరిల్లుతున్న ఏకశిలారథం ఎదుట నిలిచారు.
ఒకే శిలలోంచి శిల్పీకరించినట్లుండే ఈ ఏకశిలారథం పెద్ద రాతివేదికపై చెక్కబడిరది. నాలుగు రాతిచక్రాలు వృత్తాకారంలో రాతిఇరుసులతో పూడ్చబడ్డాయి. ఇవి కదులుతాయని కూడా ప్రతీతి. గుండ్రని రాతిచక్రాలపై ఇరుసు కేంద్రంగా వలయాకారంలో చెక్కడపు రేఖలు తీర్చబడ్డాయి. ఆ రేఖల వలయాల్లో లతలు, కళాకృతులు చూసినవాళ్ళకి కనుల పండుగే! దాదాపు ఎనిమిది అడుగుల ఎత్తైన పీఠంపైన రథం రకరకాల శిల్ప స్తంభాలతో కన్పిస్తున్నది. రథానికి నాల్గువైపులా పీఠాన్ని మోస్తున్నట్లు సింహవాహికలు బలాఢ్యులున్నారు. రథశిఖరంపై రాతితో రథం. ఆపైన గోపురం…. ఇదంతా ఒకే శిలలోంచి మలిచారంటే నమ్మలేనట్లు అన్పిస్తుంది.
రాతిరథాన్ని చూస్తుంటే మంజరికి నోటమాటే రాలేదు.
‘‘మనిషి ఎంత గొప్పవాడు! శక్తిమంతుడు! అలవిగాని గండశిలలను సైతం చిన్నఉలితో లోబరుచుకుని ఇంతటి శాశ్వతత్వాన్ని ప్రసాదించిన ఆ శిల్పుల పేర్లు కూడా తర్వాతి తరాలకు తెలియకపోవచ్చు. అటువంటి ప్రజ్ఞావంతులైన శిల్పకారులను పోషించి తన కీర్తితోబాటు వారి ప్రావీణ్యతకు శాశ్వతత్వాన్ని కల్పించిన కృష్ణరాయప్రభువెంతటి ధన్యుడు! రాజులు, రాజ్యాలు శాశ్వతం కాకపోవచ్చు. కానీ చెదరని ఈ శిల్పనగరం ఎప్పటికీ ప్రభువును చిరంజీవిని చేస్తుంది’’ తనలో తాను అనుకున్నట్లుగా మంజరి మాట్లాడుతుంటే చంద్రప్ప సంతోషభరితుడయ్యాడు.
‘‘మంజూ! నీవింతటి భావుకురాలవని తెల్సు. ఈ స్థలం, ఈ శిల్ప సౌందర్యం నీ రసపిపాసను మరింతగా ఇనుమడిరపచేస్తుందని తెలిసే శిల్పాచార్యుల అనుమతితో నిన్నీనాడు ఇక్కడికి తీసుకువచ్చాను. నా ఆలోచన ఫలించింది. ఈ సంగీత మండపంలో నిత్య నృత్య గాన వినోదాలు జరగాలనే సత్సంకల్పంతోనే ప్రభువీ సరస్వతీ నిలయాన్ని రూపొందింపజేశారు’’ చంద్రప్ప మాటలు శ్రద్ధగా విన్నదామె.
సంగీత మండపంలో బోర్లాపడుకుని అరచేతుల్లో పద్మంలాంటి వదనాన్ని
ఉంచి ప్రేమంతా కుప్పబోసి చంద్రప్పవైపే చుస్తూ పారవశ్యంతో వింటున్న మంజరిని రహస్యంగా వెంటాడుతున్నాయి అవే జత కళ్ళు. ఆ కళ్ళల్లో చంద్రప్ప పట్ల అసూయ, కసి కన్పిస్తున్నాయి.
‘‘మంజూ! నడిరాత్రి దాటింది. ఇక పోదాం. రేపు మరికొన్ని చూద్దాం.’’
చంద్రప్ప మంజరి చేయిపట్టుకొని మెట్లు దిగుతున్నాడు.
‘‘చంద్రా! నీకో మాట చెప్పాలి. మా అమ్మ ఎవరితోనో రహస్యంగా చర్చలు చేస్తున్నది.నేను వెళ్ళగానే ఆపేస్తున్నది. నాకేదో అనుమానంగా ఉంది. మొదట్నుంచీ మన స్నేహం అమ్మకి ఇష్టంలేదు. ఈ మధ్య సేనానాయకుడు గండమనాయకుని కుమారుడు మా యింటికి వచ్చి అమ్మను కలిసి ఏవో మంతనాలు చేస్తున్నట్లు తెలిసింది. ఆ కంటకుని చూపులు, చేష్టలు నాకంతగా రుచించటం లేదు’’ దిగులుగా అంది. చంద్రప్ప మౌనంగా విన్నాడు.
వాళ్ళిద్దరూ విఠలస్వామి దేవాలయ ప్రాంగణం దాటి మెట్లు దిగుతున్నారు. వెన్నెల విరగకాస్తున్నది. ప్రేమైక జీవుల హృదయాల పట్ల వెన్నెలకీ ఆసక్తి ఎక్కువేమో అన్నంత ప్రకాశవంతమైన రాత్రి అది.
‘‘మంజూ! ఇంటిదాకా వస్తాను పద’’ ఆమె చేతిని వదల్లేదు చంద్రప్ప.
‘‘అహ… వద్దు. అమ్మకి తెలిస్తే! ఇంత పొద్దుపోయి రావటానికి కారణాలు చెప్పాలి. ఇంక నీతో చూస్తే?’’
‘‘మరేం చెప్తావు’’
‘‘మా నేస్తం మలయద్వతి ఇంట నృత్యారాధన చేసి వస్తున్నానని’’
‘‘ఎంతటి జాణవు! నీ ఆరాధన నృత్యానికా! నాకా!’’ కొంటెగా నవ్వాడు చంద్రప్ప.
‘‘చంద్రా! నిజం చెప్పనా! నీవు గాయకుడివి. నీ స్వరాలు నా అందెలు చేస్తున్న స్నేహం మనది.’’ అతని చేతిని మృదువుగా నొక్కి ముందుకు కదిలింది. ఆమె కనుమరుగయేంతవరకు చూసి చంద్రప్ప వడివడిగా కదిలాడు.
చంద్రప్ప అటు నాలుగడుగులు వేశాడో లేదో ఇటు తన గృహాన్ని సమీపిస్తున్న మంజరిని వెనుకనించి ఎవరో నోరు మూసేసి రెండు చేతులు వెనక్కి బిగించి పట్టుకున్నారు. ఈ హఠాత్పరిణామానికి ఆమె దిగ్భ్రాంతి చెందింది. కీచుగా అరవబోయింది. కానీ గొంతు భయంతో పెగలలేదు.
ఆమెను పట్టుకున్న వ్యక్తి కొంత నీడలో ఉండటం వల్ల ముసుగేసుకోవటం వల్ల అతనెవరో తెలీటం లేదు.
‘‘ఆ చంద్రప్పను మర్చిపో! లేదంటే’’ బొంగురు గొంతుతో హుంకరించాడు ముసుగుమనిషి.
ఇంతలో మరోవ్యక్తి చెంగున దూకి ముసుగుమనిషిని గట్టిగా మెడమీద కొట్టాడు. ఊహించని దెబ్బకు ముసుగుమనిషి మంజరి నొదిలేశాడు. ఆమె అతనికేసి తీక్షణంగా చూస్తున్నది. ఎవరో తెలీటం లేదు. కొత్తవ్యక్తి వదలకుండా కొడ్తున్న దెబ్బలకు ముసుగుమనిషి తట్టుకోలేకపోయాడు. దూరంగా పరుగులు పెట్టాడు. కొంతసేపట్లో కొత్తవ్యక్తిని తిమ్మరుసు మహామాత్యుని కుమారుడు గోవిందరాయలుగా గుర్తించిన మంజరి అతనికి వినమ్రంగా నమస్కరించింది.
‘‘మంజరీ! ఇంత రాత్రివేళ ఇలా రావటం మంచిదేనా! త్వరగా వెళ్ళిపో!’’ అంటూ గోవిందరాయలు చకచకా కదిలి నీడల్లో కలిసిపోయాడు.
అతని సంస్కారానికి మనసులోనే అంజలి ఘటించిందామె.
శ్రీకృష్ణదేవరాయల రాజ్యం తిమ్మరుసు శక్తిమీదే ఆధారపడిరదనుకున్నా, తిమ్మరుసు కుటుంబీకులంతా రాజు గౌరవాన్ని కాపాడేవారేననిపించింది.
ఆమె నివాసం మొన్నటిదాకా చిన్నాజీ భవనంలోనే! అప్పుడప్పుడు వచ్చే మంజరి కోసం కృష్ణసాని ఎదురుచూడటం జరిగేది కాదు. అందులోనూ మంజరిని రాజభవనానికి చేర్చాక కృష్ణసాని మరింత హాయిగా నిద్రపోతున్నది.
తల్లిగాఢనిద్ర చూసి నిట్టూర్చి తన కక్ష్యలోకి ప్రవేశించిన మంజరి అక్కడి వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి నిర్ఘాంతపోయింది. ఎవరో తన గదిలో దేనికోసమో వెదికారన్న వాస్తవం అర్థం అయింది. తన గదిలోని భద్రపేటికలో తనపైన అతినమ్మకంగా చంద్రప్ప దాచిన రహస్యపత్రాలు మాయమయ్యాయని గుర్తించిన మంజరి వణికిపోయింది. రాజాగ్రహానికి గురికావలసివస్తుందనే భయంతో ఆ రాత్రంతా జాగారమే చేసింది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీతో సమావేశ మందిరంలో దీర్ఘచర్చల్లో మునిగి
ఉన్నారు.
‘‘అప్పాజీ! మీరు చెప్పిన విషయాలకు మా మనసు కల్లోలపడుతున్నది. మనమేం చేయలేమా?’’
‘‘రాయా! రాజ్యక్షేమం రాజు వ్యక్తిగత అంశాలకన్నా ముఖ్యమైంది. అన్నపూర్ణాదేవిగారు సకల సద్గుణశీల. గజపతుల ఇంటి ఆడబడుచుగా తగిన మర్యాదలు కోరటం సహజం.’’
‘‘మనమూ ఏ విషయంలోనూ తీసిపోనివారమే!’’ రాయలు పౌరుషంగా అన్నాడు.
‘‘నిజమే రాయా! కానీ చెప్పుడు మాటలు ఎంతటివారలకైనా చేటు చేస్తాయి. మీరు అన్యథా భావించకపోతే ఆ వీరేంద్రుని… అదే… అన్నపూర్ణాదేవి వెంట ఈ రాజ్యానికి వచ్చిన ఆమె బంధువు. అతనిని ఓ కంట కనిపెట్టడం మంచిది’’ సాలోచనగా అన్నాడు తిమ్మరుసు మంత్రి.
‘‘నిజమే! గజపతులకు మనమీద ప్రేమాభిమానాలుంటాయని ఎప్పటికీ అనుకోలేము. మన సైన్యాధికారులందరినీ అప్రమత్తుల్ని చేయండి అప్పాజీ. చిన్నపామైనా పెద్ద కర్రను ఉపయోగించాల్సిందే.’’
‘‘మంచిది రాయా! నేనిక వెళ్ళివస్తాను.’’
తిమ్మరుసు వెళ్ళిపోయాక కృష్ణరాయలు చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
మంజరి కంగారుగా హజరారామ దేవాలయ ప్రాంగణంలో కదంబం చెట్టు నీడలో ఎదురుచూస్తున్నది చంద్రప్ప కోసం! అతను ఎంతకీ రాలేదు. మనసును సమాధానపరుచుకొని ఆలయానికి ప్రదక్షణం చేస్తున్నది.
హజరారామ దేవాలయం పేరుకు తగ్గట్టు రామాయణ కాలంనాటి కిష్కింధాపురిలో నిర్మించబడినందున ప్రాకారాల గోడమీద లోపలివైపు రామాయణ గాధంతా శిల్పచరిత్రగా లిఖించబడి ఉంది. వెలుపలి వైపు ఐదారు వరుసలుగా వీరసైనికులు, అశ్వాలు, ఏనుగులు, విజయనగర సైన్యశక్తిని చెబుతున్నట్లున్నాయి. ప్రధాన దైవమైన విష్ణువు, బుద్ధునిగా కన్పించడం ప్రత్యేక ఆకర్షణ. ఇది రాజవంశీకులు దర్శించే ఆలయం కావటాన ఎక్కువగా జనం లేరు.
ఎన్నోసార్లు చూసిన దేవాలయమైనా ఆనాడు మంజరి ప్రత్యేకంగా ప్రతిశిల్పాన్ని శ్రద్ధగా చూస్తూ పరిశీలిస్తూ ముందుకు నడిచింది. ఎంతటి నిష్ణాతులైన శిల్పులైతేనే ఇది చెక్కగలుగుతారు! చంద్రప్ప ఎంతకీ రాడేం? జరిగింది చెప్పాలని తనెంత ఆతురతతో ఉంది.
దేవాలయ శిల్పాలమీద మనసు నిలవడం లేదు. ఇంతలో దూరంగా చంద్రప్ప కనిపించాడు. ఆ నడకలో మునుపటి చురుకుదనం లేదు.
‘‘చంద్రా!’’ ఎదురెళ్ళి కౌగిలించుకుంది. అతనామెకు దగ్గరకు తీసుకొని దేవాలయం ప్రాంగణంలో అరుగుమీద కూర్చుండబెట్టాడు.
‘‘ఎలా జరిగింది? ఎవరి పని?’’ అడిగాడు.
‘‘తెలియటం లేదు. కంటకుని పనేమో! మొన్నరాత్రి జరిగిన సంఘటనలు రెండూ జోడిరచి చూస్తే మనమీద కాదు, విజయనగరం మీదే ఏదో కుట్ర జరుగుతున్నట్లనిపిస్తుంది.’’
‘‘రహస్యపత్రాలు దొంగిలించబడినట్లు తిమ్మరుసులవారికి తెలియాలి.’’
‘‘వారు చారచక్షువు. వారికీపాటికి తెలిసే వుంటుంది. నన్ననుమానిస్తే ఎలాగా అనే ఆలోచిస్తున్నాను.’’
‘‘నువ్వే వెళ్ళి తిమ్మరుసు మహామాత్యుల వారికి జరిగింది విన్నవించు. అమాత్యులు ప్రజ్ఞావంతులు. విచక్షణతో వ్యవహరిస్తారని నా నమ్మకం.’’
ఆమె విశ్వాసాన్ని అతను ఖండిరచలేదు.
‘‘సరే! నేను తిమ్మరుసులవారిని కలుస్తాను. అంతా విరూపాక్షుని దయ’’
విచారంగా వెళ్ళిపోతున్న చంద్రప్పనుఅలాగే చూస్తూండిపోయింది.మంజరి.
అతను తిమ్మరుసును కలవలేదనీ, వీరేంద్రుని కుట్రవల్ల దారిలోనే రాజభటులు రాజద్రోహం నేరంకింద అతన్ని బందీనిచేసి చెరసాలలో పెట్టారనీ మరో నాలుగు దినాలదాకా మంజరికి తెలిసే అవకాశమే లేదు.
వేలవేల వెలుగు అక్షింతలు వర్షిస్తున్నాయి. విజయనగరంలోని దేవాలయాల నుండి సుప్రభాత సమయాన జరిపే పూజాదికాల మంత్రోచ్ఛాటనా తరంగాలు పంపానదీ జలాలను తాకి పవిత్రమొనర్చి మరల విరూపాక్షుని చరణాలను అభిషేకిస్తున్నాయి.
విరూపాక్షస్వామి దేవాలయం బయట తుంగభద్ర కృష్ణరాయని కీర్తి వాహినిలా ప్రవహిస్తోంది. విరూపాక్ష ఆలయ గాలిగోపురం శిల్పకళాశోభితమై అనేక స్తంభాలు కిటికీలతో విరాజిల్లుతోంది. ప్రాకారద్వారం నుండి వశిష్టతీర్థమనే తుంగభద్రానదీ భాగం పవిత్రఘట్టంగా విరాజిల్లుతోంది. హంపీ విరూపాక్ష దేవాలయం హేమకూట పర్వతపాదం దగ్గర హంపీ పట్టణం నడిబొడ్డున వుంది. దీనినే ‘పంపావతి దేవాలయం’ అని కూడా అంటారు. హంపీలోని అన్ని దేవాలయాలకన్నా పరమ పవిత్రంగా భావించబడే ఈ దేవాలయం ఏడవ శతాబ్దకాలంనాటిదని చెప్తుంటారు. శివ, పంప, భువనేశ్వరీ ఆరాధన జరిగే ఈ గుడి గర్భగుడి, మూడు అంతర్భాగాలు, స్తంభాల మండపం, శ్రీకృష్ణరాయ నిర్మిత రంగమండపంతో అలరారుతున్నది. ఈ దేవాలయం చుట్టూ అనేక స్తంభాల మండపాలు, ద్వారాలు సమావేశ మందిరాలున్నాయి.
రంగమండపం అనేక శిల్పాకృతులతో ముప్ఫై రాతిస్తంభాలతో నిర్మితమైంది. ప్రతిస్తంభం రెండు నిలువు భాగాలుగా కన్పిస్తుంది. మొదటిది మకర శరీరంతో సింహాకృతిలో కన్పిస్తే రెండవది శైవ సంబంధిóత అంశాలతో అలరారుతున్నది. రంగరాయ మండపం లోపల పైభాగం దూలాలన్నింటిమీద మహాభారతం, రామాయణం, శివపురాణాలు చిత్రీకరించబడినాయి. విరూపాక్ష గుడివద్ద తొమ్మిది అంతస్థులతో అత్యంత ఎత్తులో ఉండే బృహద్గోపురాన్ని అనుసరించి విపణివీధి ఉంది. విరూపాక్షగుడి ప్రధాన గోపురాన్ని ‘బిష్టప్ప గోపురం’ అంటారు. దీనికి మరో చివర మహానంది వుంది.
భువనేశ్వరీ దేవాలయ మహాద్వార కళాత్మకత, రాతిస్తంభాలు, పైకప్పు లోపలిభాగ చిత్రాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.
హంపీ విరూపాక్షస్వామిని దర్శించుకొన్న మంజరి చంద్రప్పలు స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించి కాసేపు దేవాలయం మెట్లమీద కూర్చున్నారు.
‘‘మంజూ! ఈ విజయనగర ప్రజలు ఎంత అదృష్టవంతులో కదా! ఇంతటి మహనీయుడైన ప్రభువు పాలనలో జీవించటానికి అర్హులయ్యారు. విరూపాక్షస్వామి దయవల్ల ఆ తిరుమలేశుని కృపవల్ల కృష్ణరాయ ప్రభువు కీర్తిచంద్రికలు దశదిశలా వ్యాపిస్తున్నాయి.’’
‘‘అవును చంద్రా! రాయలవారు ప్రతి విజయయాత్ర తర్వాత దేవేరులతో తిరుమల సందర్శించి తులలేని కానుకలను సమర్పించడం ప్రభువు భక్తికి నిదర్శనం.’’
‘‘మంజూ! చెప్పటం మరిచాను. తిమ్మరుసులవారు నాకోపని అప్పగించారు.’’
‘‘వారికి నీవు నమ్మినబంటువి కదా! ఏం చెప్పారేంటి?’’
‘‘నిర్మాణం కొనసాగిస్తున్న విఠల మండపం, ఏకశిలారథం నిర్మాణ పర్యవేక్షణ నాకప్పగించారు.’’
‘‘ఇంకేం! ఇక రాత్రింబవళ్ళు ఆ శిల్పకన్యల ధ్యాసే!’’ ఉడుక్కుంది మంజరి.
‘‘ఆ శిల్పాలకి మించిన సజీవ శిల్పమే నాకోసం ఉంది మంజూ! ప్రధాన శిల్పాచార్యుడు ఎంపికచేసిన శిల్ప విన్నాణాలన్నింటిలో నీవే కన్పిస్తున్నావు. ఆయన నిన్ను, నీ నృత్యాన్ని ఎప్పుడైనా చూశారా అని నా అనుమానం.’’
‘‘చాలులే చంద్రా! అతిశయోక్తి వద్దుగానీ వారు నా నాట్యాన్ని రాయలవారి పట్టాభిషేకోత్సవ సందర్భంలో చూశారు అంతే’’ నవ్విందామె చిన్నగా.
‘‘కళాహృదయుల కళాతపస్సుకు కాలమే బందీ అవుతుంది. విఠల మందిరంలో నిర్మితమవుతున్న సప్తస్వర స్తంభాలని మీటుతుంటే వివిధ వాయిద్యాల సందడి. నువ్వయితే పరవశంతో నర్తిస్తావు.
‘‘ఎల్లుండి పున్నమిరాత్రి నన్నక్కడికి తీసుకుపో చంద్రా’’ తమకంగా అడిగింది.
‘‘పరులకు ప్రవేశం నిషిద్ధం. అయినా ఆచార్యుల అనుమతి అడిగి తీసుకెళ్తాను.’’
‘‘పద! చిన్నాదేవిగారి పూజకు వేళకాకముందే నేను మందిరానికి చేరాలి.’’
‘‘ఉండుండు! ఇవ్వాళ విద్యారణ్యస్వామి జయంతి. వారి ఆశీస్సులు ప్రత్యేకంగా తీసుకోవాలి. ఈ గుడి వెనుక వారి ఆలయానికి వెళదాం.’’
మంజరి చంద్రప్ప వెంట విద్యారణ్యుల గుడిలోకి ప్రవేశించింది.
విజయనగర సామ్రాజ్య నిర్మాణానికి ప్రేరణగా నిలిచిన ఆ మహనీయుని మూర్తి చూడగానే చంద్రప్ప పరమ భావుకుడయ్యాడు. అతని కళ్ళు ఆనందంతో చెమర్చాయి.
‘‘మంజూ! స్వామి ఎంతటి శక్తి సంపన్నుడో చూడు! పాడయిన ఓరుగల్లు సౌభాగ్యాన్ని విద్యానగర రాజవీధిలో నిలిపిన ఘనుడీయన. క్షీణిస్తున్న హిందూమత ప్రాభవాన్ని తిరిగి నిలబెట్టిన తపస్వి. రాజకీయ తంత్రజ్ఞుడు. ఇహానికి పరానికి నిలిచిన నిస్సంగి. ఎప్పుడో వశిష్టుని గురించి విన్నాము. ఈ విద్యారణ్యుల దివ్య ఋషిత్వము వారి విగ్రహంలో ఎంతగా ప్రస్ఫుటిస్తున్నదో చూడు.’’
‘‘ఆ కన్ను మూతలో నంతర్విలీల పం
చాలనిలస్తంభ నాత్మార్చి వెలుగు
ఆ బొమ్మ మోడ్పులో నసమాక్షుసెగకన్న
మంట రేగిన సుళ్ళు మాటుమణుగు
ఆ కన్నువిప్పులో నఖిల రాజన్య శి
క్షాదక్షమైన వర్చస్సు మెరయు
ఆ చిరునవ్వులో నాంధ్ర సామ్రాజ్యసు
శ్రీ నవ్య జీవన శీలమిముడు
ఈ శిలావిగ్రహము నందె యింతగొప్ప
కుదురుకొని యుండ ఊహలు గుములుకొనిన
ఎంతవాడవొ నిను స్తుతింప గలమె?
విజయనగరాంధ్ర దేవుడవే నిజంబు’’
అంటున్న చంద్రప్పతో కలిసి ఆ స్వామికి నమస్కరించింది మంజరి.
‘‘దేశబాధ చూసి తపస్సు మాని రాజకీయాలలో ప్రవేశించి హంపీలో తెలుగు రాజ్యాన్ని పునఃప్రతిష్టించి సంస్కర్తjైు మతోద్ధారకుడై ముక్తిపొందిన ఈ విద్యారణ్యస్వామి గుడి తెలుగు ప్రజలందరూ చూసి తరించాల్సినది’’ మంజరి ప్రస్తుతించింది.
మనసులోని భావోద్వేగాలను సమన్వయపరుచుకుంటూ గుడి మెట్లు దిగి వస్తున్న మంజరి చంద్రప్పలను చాటునుంచి చండ్రనిప్పుల్లాంటి రెండు
కళ్ళు ఆగ్రహజ్వాలలతో గమనించడం వారికి తెలియదు. ఆ క్షణం నుంచి ఆ కళ్ళు వారి జీవితాలపై నిప్పుల వర్షం కురిపించబోతున్నాయని తెలిస్తే ఆ జంట అంత ఆనందంగా ఉండగలదా?
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
శ్రీకృష్ణదేవరాయలు ఆలోచనామగ్నుడై మందిరంలో పచార్లు చేస్తున్నారు. వార్తాహరుడొచ్చాడు. తిమ్మరుసు మహామంత్రి రాక గురించిన సమాచారాన్ని నివేదించి నిష్క్రమించాడు. విజయనగర సామ్రాజ్యమే తిమ్మరుసు తయారుచేసిన చిత్రపటం. ఆయనకి ఎక్కడికెళ్ళాలన్నా ఆంక్షలుండవు. ముఖ్యంగా రాయలను కలవాలంటే కూడా కబురు పంపటం అనుమతి పొందటం అవసరం లేదు. అయినా రాచమర్యాదలు తప్పని సంస్కారి ఆయన. తిమ్మరుసు ప్రవేశించగానే కృష్ణదేవరాయలు ఎదురేగి ఆహ్వానించారు.
‘‘రండి అప్పాజీ! మీ కోసమే ఎదురుచూస్తున్నాను.’’
ఇరువురూ ఆసీనులైనారు. అప్పాజీవారు ఎప్పటిలాగే గంభీర ముద్రతో
ఉన్నారు.
‘‘అప్పాజీ! మన సామ్రాజ్యవిస్తరణకు దక్షిణ జైత్రయాత్ర దిగ్విజయంగా సాగింది. ఇక ఉత్తర విజయయాత్ర గురించి ఏమాలోచించారు’’
‘‘రాయా! కృష్ణకు ఉత్తరాన మనకున్న బలమైన శత్రువు గజపతి. గతంలో విజయనగర సామ్రాజ్య ఆధీనంలో ఉదయగిరి కొండవీడులను జయించి తన ఆధీనం చేసుకొన్నాడు. అవి తిరిగి విజయనగర సామ్రాజ్యంలో చేరాలి’’ యుద్ధానికి తిమ్మరుసు అనుమతి లభించినట్లే!
వెంటనే సేనానాయకులకు సమాచారం అందింది. శత్రు దుర్భేద్యమైన
ఉదయగిరికోట ముట్టడి ప్రారంభమైంది. నెలల తరబడి జరిగిన ముట్టడివల్ల
ఉదయగిరి రాయలవశమైంది. ఉదయగిరికి రాయసం కొండమరుసును పాలకుడిగా నియమించి రాయలు తిరుమల శ్రీనివాసుని దర్శనానికి పయనమయ్యారు. తిరుమల వేంకటేశునికి అనేక కానుకలు సమర్పించి మళ్ళీ కొంతకాలానికి కొండవీడుపై దండెత్తారు. దారిలో అద్దంకి, వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ వంటి ఉపదుర్గాలను జయించి కొండవీడును ముట్టడిరచి గజపతి కుమారుడు వీరభద్రగజపతిని ఇతర సామంతులతో బందీలుగా పట్టుకున్నారు. ధరణికోటలోని అమరేశ్వరుడ్ని, శ్రీశైల మల్లన్ననూ దర్శించి భక్తిమీర అర్చించారు రాయలు.
అనంతరం కొండపల్లి, అనంతగిరి, నల్గొండ, కంభంమెట్టు, కనిగిరి కోటలు ఆక్రమించి సింహాచలం చేరారు. విజయస్తంభం నాటారు. కృష్ణరాయని విజయయాత్ర శ్రీకూర్మం, పూరి, కటకందాకా సాగింది. కృష్ణరాయ గజపతుల మధ్య ఎడతెగని యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. తిమ్మరుసు భేదోపాయం, రాయల అసాధారణ ప్రజ్ఞాపాటవాలు విజయనగర విజయానికి దోహదపడ్డాయి. రాయల కీర్తిపతాక నీలిగగనంలో రెపరెపలాడిరది.
నిర్వీర్వుడయిన గజపతి రాయలతో సంధిచేసుకుని అయిష్టంగా అయినా తప్పని పరిస్థితులలో తన కుమార్తె అయిన ఆన్నపూర్ణాదేవిని రాయలకిచ్చి వివాహం చేశాడు.
తనను దాసీపుత్రుడని అవమానించిన గజపతిచే కాళ్ళు కడిగించుకుని కన్యాదానం పొంది సంతృఫ్తుడైన కృష్ణరాయలు కృష్ణకు ఉత్తరాన ఉన్న భూములన్నీ గజపతి ఆధీనం చేసి తన సహృదయతను ప్రకటించారు. అన్నపూర్ణాదేవిని బెదిరించి వారి తొలిరేయి రాయలను హత్య చేయించాలను కున్న గజపతుల కుట్ర ఫలించలేదు. రాయలు అన్నపూర్ణాదేవిని క్షమించి జంటగా విజయనగరానికి చేరారు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
చల్లని వెన్నెల రాత్రి చంద్రికల వెలుగులో మెరిసిపోతున్న మంజరిని తదేకంగా కొన్ని నిమిషాలు చూశాడు చంద్రప్ప. ప్రేమగా ఆమెను కౌగలించాడు. నిర్మాణం దాదాపు పూర్తవుతున్న విఠల మండపంలోకి తీసుకెళ్ళాడు.
మానవుడికి విశ్వకర్మకు జరిగిన పోటీయా అన్నట్లుండే విజయ విఠల దేవాలయం విఠలస్వామి విష్ణువుకు అంకితంగా నిర్మితమవుతోంది. కృష్ణరాయ ప్రభువు ప్రారంభించిన ఈ కట్టడం పూర్తికావటానికి ఎన్నాళ్ళు పడుతుందో మరి! గర్భగుడిలో మూలవిరాట్, ఉత్సవ విగ్రహాలుండాలి. విఠలస్వామిమందిరం మూడువైపులా ద్వారాలతో పెద్దరాతి గోడలమీద నిర్మాణమవుతోంది. బలమైన శిలావేదికను సైనికులు నర్తకీమణులు మోస్తున్నట్లు తీరుస్తున్నారు. మూలలు నిర్మితమౌతున్న నృత్యమందిరాలు, కల్యాణ మండపాలు పూర్తిగా తయారయ్యాక ఎంత సుందరంగా ఉంటాయో!
ఒక్కొక్క శిల్పాన్ని చూస్తూ నడుస్తున్నారు. ఏమి అందమా కళాకృతులది! నాట్యభంగిమలు నాట్యశాస్త్రాన్ని లిఖిస్తున్నాయి. ప్రతిభంగిమ మన్మోహనంగా నృత్యానికి ప్రేరణ ఇస్తోంది. మంజరి పాదాలు లయగా మండపమంతా తిరుగాడుతున్నాయి. చంద్రప్ప మురళీ మాధురులు పున్నమి పరిమళంతో కలసి అల్లనల్లన గాలి తరంగాలుగా వ్యాపిస్తున్నాయి. విఠలస్వామి దేవాలయంలోని శిల్పవిన్యాసం చూస్తుంటే మంజరి మనస్సు ఆనందార్ణవంలో ఉరకలు వేస్తున్నది. అక్కడక్కడ స్తంభాలకు పాక్షికంగా అమర్చిన సంగీతశిలలను స్పృశించాడు చంద్రప్ప.
సరి… గమ… ప… ద… ని…
సప్తస్వరాలు పలుకుతున్న కొన్ని సంగీత స్తంభాలు స్వర సంచారం చేస్తున్నాయి. మీటగల కళాకారునికి, సంగీతజ్ఞునికి ఎదురుగా నిలిచి హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాయి. కొన్ని శిలా స్తంభాలు మృదంగ ధ్వానాన్ని, కొన్ని వీణాస్వనాన్ని, కొన్ని సారంగిని… ఓప్ా… సకల సంగీత ప్రపంచమంతా విఠలస్వామి మందిరంలో కొలువుదీరింది. చేతిలోని వెదురు వేణువును పక్కనబెట్టి శిలావాయిద్యాలతోనే రకరకాల మేళకర్తలు రంగరించి వాద్యాలాపన చేశాడు చంద్రప్ప. శిల్పరాగాలకు పులకించిన మంజరి మరింత తన్మయ సమ్మోహనంగా విఠలమండపంలో నృత్యం చేస్తున్నది.
ఆమె అందెల రవళికి ప్రతిస్పందించిన శిలావాయిద్యాలు చంద్రప్ప అంగుళీస్పర్శతో ప్రాణం పోసుకుని మరింత చైతన్యాన్ని ప్రసారంచేశాయి. ఆ రాత్రి నాదమాధురీ మహిమ ఎంతసేపు పరిసరాలను రసప్లావితం చేశాయో వాళ్ళకే తెలీదు. ఒకరి కౌగిట ఒకరు పరవశించి ఆదమరిచిపోయిన ఆ జంట హృదయాలు తొలికిరణ స్పర్శకు జాగ్రదావస్థకు వచ్చాయి.
విఠలమండపం మెట్లుదిగి తూర్పువైపున తేజరిల్లుతున్న ఏకశిలారథం ఎదుట నిలిచారు.
ఒకే శిలలోంచి శిల్పీకరించినట్లుండే ఈ ఏకశిలారథం పెద్ద రాతివేదికపై చెక్కబడిరది. నాలుగు రాతిచక్రాలు వృత్తాకారంలో రాతిఇరుసులతో పూడ్చబడ్డాయి. ఇవి కదులుతాయని కూడా ప్రతీతి. గుండ్రని రాతిచక్రాలపై ఇరుసు కేంద్రంగా వలయాకారంలో చెక్కడపు రేఖలు తీర్చబడ్డాయి. ఆ రేఖల వలయాల్లో లతలు, కళాకృతులు చూసినవాళ్ళకి కనుల పండుగే! దాదాపు ఎనిమిది అడుగుల ఎత్తైన పీఠంపైన రథం రకరకాల శిల్ప స్తంభాలతో కన్పిస్తున్నది. రథానికి నాల్గువైపులా పీఠాన్ని మోస్తున్నట్లు సింహవాహికలు బలాఢ్యులున్నారు. రథశిఖరంపై రాతితో రథం. ఆపైన గోపురం…. ఇదంతా ఒకే శిలలోంచి మలిచారంటే నమ్మలేనట్లు అన్పిస్తుంది.
రాతిరథాన్ని చూస్తుంటే మంజరికి నోటమాటే రాలేదు.
‘‘మనిషి ఎంత గొప్పవాడు! శక్తిమంతుడు! అలవిగాని గండశిలలను సైతం చిన్నఉలితో లోబరుచుకుని ఇంతటి శాశ్వతత్వాన్ని ప్రసాదించిన ఆ శిల్పుల పేర్లు కూడా తర్వాతి తరాలకు తెలియకపోవచ్చు. అటువంటి ప్రజ్ఞావంతులైన శిల్పకారులను పోషించి తన కీర్తితోబాటు వారి ప్రావీణ్యతకు శాశ్వతత్వాన్ని కల్పించిన కృష్ణరాయప్రభువెంతటి ధన్యుడు! రాజులు, రాజ్యాలు శాశ్వతం కాకపోవచ్చు. కానీ చెదరని ఈ శిల్పనగరం ఎప్పటికీ ప్రభువును చిరంజీవిని చేస్తుంది’’ తనలో తాను అనుకున్నట్లుగా మంజరి మాట్లాడుతుంటే చంద్రప్ప సంతోషభరితుడయ్యాడు.
‘‘మంజూ! నీవింతటి భావుకురాలవని తెల్సు. ఈ స్థలం, ఈ శిల్ప సౌందర్యం నీ రసపిపాసను మరింతగా ఇనుమడిరపచేస్తుందని తెలిసే శిల్పాచార్యుల అనుమతితో నిన్నీనాడు ఇక్కడికి తీసుకువచ్చాను. నా ఆలోచన ఫలించింది. ఈ సంగీత మండపంలో నిత్య నృత్య గాన వినోదాలు జరగాలనే సత్సంకల్పంతోనే ప్రభువీ సరస్వతీ నిలయాన్ని రూపొందింపజేశారు’’ చంద్రప్ప మాటలు శ్రద్ధగా విన్నదామె.
సంగీత మండపంలో బోర్లాపడుకుని అరచేతుల్లో పద్మంలాంటి వదనాన్ని
ఉంచి ప్రేమంతా కుప్పబోసి చంద్రప్పవైపే చుస్తూ పారవశ్యంతో వింటున్న మంజరిని రహస్యంగా వెంటాడుతున్నాయి అవే జత కళ్ళు. ఆ కళ్ళల్లో చంద్రప్ప పట్ల అసూయ, కసి కన్పిస్తున్నాయి.
‘‘మంజూ! నడిరాత్రి దాటింది. ఇక పోదాం. రేపు మరికొన్ని చూద్దాం.’’
చంద్రప్ప మంజరి చేయిపట్టుకొని మెట్లు దిగుతున్నాడు.
‘‘చంద్రా! నీకో మాట చెప్పాలి. మా అమ్మ ఎవరితోనో రహస్యంగా చర్చలు చేస్తున్నది.నేను వెళ్ళగానే ఆపేస్తున్నది. నాకేదో అనుమానంగా ఉంది. మొదట్నుంచీ మన స్నేహం అమ్మకి ఇష్టంలేదు. ఈ మధ్య సేనానాయకుడు గండమనాయకుని కుమారుడు మా యింటికి వచ్చి అమ్మను కలిసి ఏవో మంతనాలు చేస్తున్నట్లు తెలిసింది. ఆ కంటకుని చూపులు, చేష్టలు నాకంతగా రుచించటం లేదు’’ దిగులుగా అంది. చంద్రప్ప మౌనంగా విన్నాడు.
వాళ్ళిద్దరూ విఠలస్వామి దేవాలయ ప్రాంగణం దాటి మెట్లు దిగుతున్నారు. వెన్నెల విరగకాస్తున్నది. ప్రేమైక జీవుల హృదయాల పట్ల వెన్నెలకీ ఆసక్తి ఎక్కువేమో అన్నంత ప్రకాశవంతమైన రాత్రి అది.
‘‘మంజూ! ఇంటిదాకా వస్తాను పద’’ ఆమె చేతిని వదల్లేదు చంద్రప్ప.
‘‘అహ… వద్దు. అమ్మకి తెలిస్తే! ఇంత పొద్దుపోయి రావటానికి కారణాలు చెప్పాలి. ఇంక నీతో చూస్తే?’’
‘‘మరేం చెప్తావు’’
‘‘మా నేస్తం మలయద్వతి ఇంట నృత్యారాధన చేసి వస్తున్నానని’’
‘‘ఎంతటి జాణవు! నీ ఆరాధన నృత్యానికా! నాకా!’’ కొంటెగా నవ్వాడు చంద్రప్ప.
‘‘చంద్రా! నిజం చెప్పనా! నీవు గాయకుడివి. నీ స్వరాలు నా అందెలు చేస్తున్న స్నేహం మనది.’’ అతని చేతిని మృదువుగా నొక్కి ముందుకు కదిలింది. ఆమె కనుమరుగయేంతవరకు చూసి చంద్రప్ప వడివడిగా కదిలాడు.
చంద్రప్ప అటు నాలుగడుగులు వేశాడో లేదో ఇటు తన గృహాన్ని సమీపిస్తున్న మంజరిని వెనుకనించి ఎవరో నోరు మూసేసి రెండు చేతులు వెనక్కి బిగించి పట్టుకున్నారు. ఈ హఠాత్పరిణామానికి ఆమె దిగ్భ్రాంతి చెందింది. కీచుగా అరవబోయింది. కానీ గొంతు భయంతో పెగలలేదు.
ఆమెను పట్టుకున్న వ్యక్తి కొంత నీడలో ఉండటం వల్ల ముసుగేసుకోవటం వల్ల అతనెవరో తెలీటం లేదు.
‘‘ఆ చంద్రప్పను మర్చిపో! లేదంటే’’ బొంగురు గొంతుతో హుంకరించాడు ముసుగుమనిషి.
ఇంతలో మరోవ్యక్తి చెంగున దూకి ముసుగుమనిషిని గట్టిగా మెడమీద కొట్టాడు. ఊహించని దెబ్బకు ముసుగుమనిషి మంజరి నొదిలేశాడు. ఆమె అతనికేసి తీక్షణంగా చూస్తున్నది. ఎవరో తెలీటం లేదు. కొత్తవ్యక్తి వదలకుండా కొడ్తున్న దెబ్బలకు ముసుగుమనిషి తట్టుకోలేకపోయాడు. దూరంగా పరుగులు పెట్టాడు. కొంతసేపట్లో కొత్తవ్యక్తిని తిమ్మరుసు మహామాత్యుని కుమారుడు గోవిందరాయలుగా గుర్తించిన మంజరి అతనికి వినమ్రంగా నమస్కరించింది.
‘‘మంజరీ! ఇంత రాత్రివేళ ఇలా రావటం మంచిదేనా! త్వరగా వెళ్ళిపో!’’ అంటూ గోవిందరాయలు చకచకా కదిలి నీడల్లో కలిసిపోయాడు.
అతని సంస్కారానికి మనసులోనే అంజలి ఘటించిందామె.
శ్రీకృష్ణదేవరాయల రాజ్యం తిమ్మరుసు శక్తిమీదే ఆధారపడిరదనుకున్నా, తిమ్మరుసు కుటుంబీకులంతా రాజు గౌరవాన్ని కాపాడేవారేననిపించింది.
ఆమె నివాసం మొన్నటిదాకా చిన్నాజీ భవనంలోనే! అప్పుడప్పుడు వచ్చే మంజరి కోసం కృష్ణసాని ఎదురుచూడటం జరిగేది కాదు. అందులోనూ మంజరిని రాజభవనానికి చేర్చాక కృష్ణసాని మరింత హాయిగా నిద్రపోతున్నది.
తల్లిగాఢనిద్ర చూసి నిట్టూర్చి తన కక్ష్యలోకి ప్రవేశించిన మంజరి అక్కడి వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి నిర్ఘాంతపోయింది. ఎవరో తన గదిలో దేనికోసమో వెదికారన్న వాస్తవం అర్థం అయింది. తన గదిలోని భద్రపేటికలో తనపైన అతినమ్మకంగా చంద్రప్ప దాచిన రహస్యపత్రాలు మాయమయ్యాయని గుర్తించిన మంజరి వణికిపోయింది. రాజాగ్రహానికి గురికావలసివస్తుందనే భయంతో ఆ రాత్రంతా జాగారమే చేసింది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీతో సమావేశ మందిరంలో దీర్ఘచర్చల్లో మునిగి
ఉన్నారు.
‘‘అప్పాజీ! మీరు చెప్పిన విషయాలకు మా మనసు కల్లోలపడుతున్నది. మనమేం చేయలేమా?’’
‘‘రాయా! రాజ్యక్షేమం రాజు వ్యక్తిగత అంశాలకన్నా ముఖ్యమైంది. అన్నపూర్ణాదేవిగారు సకల సద్గుణశీల. గజపతుల ఇంటి ఆడబడుచుగా తగిన మర్యాదలు కోరటం సహజం.’’
‘‘మనమూ ఏ విషయంలోనూ తీసిపోనివారమే!’’ రాయలు పౌరుషంగా అన్నాడు.
‘‘నిజమే రాయా! కానీ చెప్పుడు మాటలు ఎంతటివారలకైనా చేటు చేస్తాయి. మీరు అన్యథా భావించకపోతే ఆ వీరేంద్రుని… అదే… అన్నపూర్ణాదేవి వెంట ఈ రాజ్యానికి వచ్చిన ఆమె బంధువు. అతనిని ఓ కంట కనిపెట్టడం మంచిది’’ సాలోచనగా అన్నాడు తిమ్మరుసు మంత్రి.
‘‘నిజమే! గజపతులకు మనమీద ప్రేమాభిమానాలుంటాయని ఎప్పటికీ అనుకోలేము. మన సైన్యాధికారులందరినీ అప్రమత్తుల్ని చేయండి అప్పాజీ. చిన్నపామైనా పెద్ద కర్రను ఉపయోగించాల్సిందే.’’
‘‘మంచిది రాయా! నేనిక వెళ్ళివస్తాను.’’
తిమ్మరుసు వెళ్ళిపోయాక కృష్ణరాయలు చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
మంజరి కంగారుగా హజరారామ దేవాలయ ప్రాంగణంలో కదంబం చెట్టు నీడలో ఎదురుచూస్తున్నది చంద్రప్ప కోసం! అతను ఎంతకీ రాలేదు. మనసును సమాధానపరుచుకొని ఆలయానికి ప్రదక్షణం చేస్తున్నది.
హజరారామ దేవాలయం పేరుకు తగ్గట్టు రామాయణ కాలంనాటి కిష్కింధాపురిలో నిర్మించబడినందున ప్రాకారాల గోడమీద లోపలివైపు రామాయణ గాధంతా శిల్పచరిత్రగా లిఖించబడి ఉంది. వెలుపలి వైపు ఐదారు వరుసలుగా వీరసైనికులు, అశ్వాలు, ఏనుగులు, విజయనగర సైన్యశక్తిని చెబుతున్నట్లున్నాయి. ప్రధాన దైవమైన విష్ణువు, బుద్ధునిగా కన్పించడం ప్రత్యేక ఆకర్షణ. ఇది రాజవంశీకులు దర్శించే ఆలయం కావటాన ఎక్కువగా జనం లేరు.
ఎన్నోసార్లు చూసిన దేవాలయమైనా ఆనాడు మంజరి ప్రత్యేకంగా ప్రతిశిల్పాన్ని శ్రద్ధగా చూస్తూ పరిశీలిస్తూ ముందుకు నడిచింది. ఎంతటి నిష్ణాతులైన శిల్పులైతేనే ఇది చెక్కగలుగుతారు! చంద్రప్ప ఎంతకీ రాడేం? జరిగింది చెప్పాలని తనెంత ఆతురతతో ఉంది.
దేవాలయ శిల్పాలమీద మనసు నిలవడం లేదు. ఇంతలో దూరంగా చంద్రప్ప కనిపించాడు. ఆ నడకలో మునుపటి చురుకుదనం లేదు.
‘‘చంద్రా!’’ ఎదురెళ్ళి కౌగిలించుకుంది. అతనామెకు దగ్గరకు తీసుకొని దేవాలయం ప్రాంగణంలో అరుగుమీద కూర్చుండబెట్టాడు.
‘‘ఎలా జరిగింది? ఎవరి పని?’’ అడిగాడు.
‘‘తెలియటం లేదు. కంటకుని పనేమో! మొన్నరాత్రి జరిగిన సంఘటనలు రెండూ జోడిరచి చూస్తే మనమీద కాదు, విజయనగరం మీదే ఏదో కుట్ర జరుగుతున్నట్లనిపిస్తుంది.’’
‘‘రహస్యపత్రాలు దొంగిలించబడినట్లు తిమ్మరుసులవారికి తెలియాలి.’’
‘‘వారు చారచక్షువు. వారికీపాటికి తెలిసే వుంటుంది. నన్ననుమానిస్తే ఎలాగా అనే ఆలోచిస్తున్నాను.’’
‘‘నువ్వే వెళ్ళి తిమ్మరుసు మహామాత్యుల వారికి జరిగింది విన్నవించు. అమాత్యులు ప్రజ్ఞావంతులు. విచక్షణతో వ్యవహరిస్తారని నా నమ్మకం.’’
ఆమె విశ్వాసాన్ని అతను ఖండిరచలేదు.
‘‘సరే! నేను తిమ్మరుసులవారిని కలుస్తాను. అంతా విరూపాక్షుని దయ’’
విచారంగా వెళ్ళిపోతున్న చంద్రప్పనుఅలాగే చూస్తూండిపోయింది.మంజరి.
అతను తిమ్మరుసును కలవలేదనీ, వీరేంద్రుని కుట్రవల్ల దారిలోనే రాజభటులు రాజద్రోహం నేరంకింద అతన్ని బందీనిచేసి చెరసాలలో పెట్టారనీ మరో నాలుగు దినాలదాకా మంజరికి తెలిసే అవకాశమే లేదు.
2
చిన్నాదేవికి నిద్రపట్టడం లేదు. కళ్ళు మూసినా, తెరిచినా ప్రభువు సుందరరూపమే మెదులుతోంది. కదిలితే తల్లికి నిద్రాభంగం అవుతుందని అలాగే కళ్ళుమూసుకుని పడుకుంది.
వాతావరణం వసంత మనోహరంగా ఉంది. కిటికీలోంచి పిల్లగాలి అల్లరిపెడుతోంది. అది కొంత ఊరట కల్గిస్తున్నా మరింత నిట్టూర్పుకు కూడా కారణమవుతోంది. నిండు పేరోలగంలో కొలువు తీరిన రాయలమూర్తి గంభీర రాజసంతో ధీర విలసితంగా ఉంది. నాడు తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో తన నృత్యం చూసిన కృష్ణరాయని కళ్ళల్లో తొణికిసలాడిన ఆ భావం ఏమిటో పూర్తిగా అర్థం కావటం లేదు. అది ప్రేమా? ప్రశంసా? అనురాగమా? అభిమానమా?భగవానుని సన్నిధిలో ప్రభుదర్శనం వల్ల తన జీవితంలో ఎటువంటి మార్పు జరుగనున్నదో ఆ నాట్యమయూరికి అవగతం కాలేదు. ఏమో! చల్లనితల్లి అలివేలుమంగమ్మ అనుగ్రహంతో రాయలు తనను అంగీకరిస్తే ఈ జన్మకదే వరం. ఇదంతా శ్రీకృష్ణరాయలు ప్రభువు కాకముందు. కానీ ఇప్పుడు ఆయన విజయనగర సామ్రాజ్యాధీశుడు. ఒక దేవదాసి చేయి పట్టుకుంటాడా? ఒకవేళ ప్రభువు అలా అనుకున్నా అప్పాజీ అంగీకరిస్తారా! అప్పాజీ మాటను ప్రభువు శిరసావహిస్తాడు కదా! ఎప్పుడు నిద్ర పట్టిందో ఆమెకే తెలీదు.
చిన్నాదేవి పారవశ్యంతో నృత్యం చేస్తున్నది. దేవాలయ ప్రాంగణంలో పలువురు ప్రముఖులున్నారు. ఆమె దృష్టి మాత్రం మురళీమోహనుడి మీదే కేంద్రీకృతమై ఉంది. ఇదేమిటి! స్వామి స్థానంలో కృష్ణరాయలు చిరునవ్వులతో తనకేసి చూస్తున్నాడు? రారమ్మని చేతులు చాపి ఆహ్వానిస్తున్నాడు?
‘‘స్వామీ పూజా ప్రసూనమై నీ
పద పద్మముల వాలెదను
ఎన్ని జన్మలైన నిన్నెడ బాయను స్వామి!’’
చిన్నాదేవి నర్తిస్తూ మురళీమోహనుడి వైపే అడుగులేస్తోంది. అందరికీ ఆవేళ చిన్నాదేవి ధోరణి కొత్తగా ఉంది. సమ్మోహనకరంగా ఆరాధనానృత్యం చేస్తూ అటు స్వామిని, ఇటు దేవాలయ ప్రేక్షకులను అలరించే ఆ కళాతపస్విని ఇవ్వాళ పూర్తిగా స్వామి తప్ప మరో ప్రపంచం పట్టనట్లు ఏదో మైకం కమ్మినట్లు ప్రవర్తిస్తున్నది.
విగ్రహంలోంచి కృష్ణదేవరాయలు తనకేసి చేతులు చాపి వచ్చేశాడు. ఆమె అతని విశాల వక్షస్థలంపై వాలిపోయింది. పెదవులు పాటను గుసగుసలాడు తున్నాయి. స్వామి చేతుల్లో బందీఅవటం హాయిగా ఉంది. సిగ్గుతో తలెత్తి రాయల మొహంకేసి కూడా చూడలేకపోతున్నది. ఆమె అణువణువూ అతని వశమై మనసు పరవశమైంది. కళావతంసుడు రాయలు కళాకారిణి చిన్నాదేవి మనుసులు ఐక్యమైన అద్భుత అనుభూతి. చుట్టూ ఎందరున్నా ఎవ్వరూ లేని ఏకాంత భావనా ప్రపంచం అది.
కల చెదిరింది. ఆశ్చర్యపడి చుట్టూ చూసింది చిన్నాదేవి. పక్కన తల్లి గాఢనిద్రలో ఉంది. ఆమెకీ అనుభూతి కొత్తది. తాను ఎవరిబిడ్డో ఏమో ఈ తల్లి పెంచి నాట్యం నేర్పింది. చిన్నతనం నుంచి ‘నీజన్మ కృష్ణార్పణం’ అన్న అమ్మమాట తలదాల్చి జీవిస్తున్న చిన్నాదేవి మనసీనాడు చెదిరిపోతున్నది.
రాయలు ఎంత అందగాడు! అచ్చు కృష్ణునిలా… తప్పు తప్పు! కృష్ణుడు భగవంతుడు. మరి రాయలు కూడా భగవంతుని అంశే! ప్రభువు అంటే విష్ణువే కదా! తన పిచ్చిగాని ప్రభువు తనని స్వీకరిస్తాడా! తన జన్మ ఎలాంటిదో ఆయనకి తెలుసా? దేవదాసీ వ్యవస్థలో దేవాలయాలలో ప్రభువుల సమక్షంలో మాత్రం నాట్యం చేసే నర్తకిని ప్రభువు రాణిగా చేసుకుంటాడా! కలతగా నిద్రపట్టింది చిన్నాదేవికి.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
‘‘ఏయ్ మంజరీ ఆగు!’’ చంద్రప్ప మంజరిని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
మంజరి అతనికి చిక్కినట్లే చిక్కి జారిపోతోంది.
‘‘ఇలా అయితే నేను నీతో మాట్లాడను’’ అతను బుంగమూతి పెట్టుకొని ఓ చంద్రకాంతశిల మీద కూర్చుండిపోయాడు. దిగువుగా ఉన్న శిలమీద కూర్చుని అతని వడిలో తన్మయంగా తలవాల్చి కూర్చుంది మంజరి.
ఆ ఉద్యానవనంలో వెన్నెల్లో చెట్ల పూలు కొత్తగా మిలమిల్లాడుతున్నాయి. చంద్రప్ప వేణువును తీసి పాడటం మొదలుపెట్టాడు. అతనికి తెలుసు మంజరినెలా అలరించాలో! నాగస్వరానికి వివశురాలైన నాగినిలా ఆమె శరీరమంతా ప్రకంపనలే.
చంద్రప్ప సమక్షంలో… మంజరి నర్తనం ముందు ఇంద్రసభలో అప్సరల నృత్యాలు కూడా సరిచాలవు.
అతని వేణువు నింపుకుంటున్న ఊపిరి విన్పించే పాటను ఆమె కాలి అందెయలు నాట్యంగా అనువదించుకుంటున్నాయి. ఆ నాదానికి ఈ పాదంతోడై ఇరువురి శరీరాలు తన్మయంగా పరవశిస్తున్నాయి. అలా ఎంతసేపు గడిచిందో వాళ్ళకే తెలీదు. రెండు నాగుపాములు జంటగా పెనవేసుకున్నట్లు.
రాత్రి ఒక జాము దాటింది.
పహారా నగారా మోగింది. చంద్రప్ప ఒళ్ళో తలపెట్టి పడుకొన్న మంజరి ఉలిక్కిపడిరది.
‘‘చంద్రా! చాలా పొద్దుపోయింది. నీ దగ్గర ఉంటే కాలం ఆగిపోతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక అమ్మ నన్ను చంపేస్తుంది’’ అంది భయంగా.
‘‘భయమెందుకు? నువ్వు నా దానివి… నా నుండి నిన్నెవ్వరూ దూరం చేయలేరు. మంజరీ! నీ నృత్యం నా గానానికి ఊపిరి. మీ అమ్మకి చెప్పెయ్. మనం వివాహం చేసుకుందాం’’ చంద్రప్ప ఆమె ముంగురులు సవరిస్తూ వెన్నెల కాంతిలో తళతళలాడే ఆమె కనుపాపల్లో తన బింబాన్ని చూసుకుంటూ చిలిపిగా నవ్వాడు.
ఆ నవ్వు ఆమె మనసులో పులకింతలు రేపింది. పెళ్ళిమాట వింటూనే మంజరి నిటారుగా అయింది.
‘‘నీకు తెలీదు చంద్రా! చిన్నాదేవిగారిని ప్రభువు కోరుకుంటున్నారని తెలిసినప్పటి నుంచి మా అమ్మకి కూడా అదే ఆశ పుట్టింది. నన్నే రాజ ప్రముఖుడెవరైనా చేసుకుంటే రాజవైభోగాలన్నీ దక్కుతాయని ఆమె ఆలోచన. నీలాంటి సంగీతకారుడికి నన్నిచ్చి పెళ్ళి చేయదుగాక చేయదు’’ నిరాశగా అంది మంజరి.
‘‘నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకు నేను నిన్ను వదులుకోలేను మంజూ! మనది జన్మజన్మల బంధం’’ ఆమెను కౌగిట చేర్చుకున్నాడు చంద్రప్ప.
మంజరి అతన్ని వదలలేక వదలలేక వెళ్ళింది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
అది దేవదాసీల వీధి. ఆ భవనాల్లోంచి అనుక్షణం నృత్యగానాలు విన్పిస్తూ
ఉంటాయి. మంజరి తల్లి కృష్ణసాని ఆ వీధిలోకెల్లా సంపన్నురాలు. మంజరికి చిన్నతనం నుంచి నృత్యం, గానం నేర్పింది. మంజరి భగవంతుని కైంకర్యంగా నర్తిస్తున్నా, కృష్ణసాని కళ్ళు మాత్రం ధనవంతుల కోసం వెదుకుతున్నాయి. ఈ మధ్య మంజరి చంద్రప్పతో పొద్దుపుచ్చటం కృష్ణసాని దృష్టికి రాకపోలేదు. సమయం సందర్భం చూసి కుమార్తెను హెచ్చరించాలనుకుంది.
తల్లి నుంచి ఎటువంటి పెడసరపు మాటలు వినాల్సి వస్తుందోనన్న భయంతో మంజరి మెల్లగా తన కక్ష్యవైపు నడిచింది. పర్యంకం మీద కృష్ణసాని అరుణ నేత్రాలతో కుమార్తెకేసి తీక్షణంగా చూసింది.
మంజరి భయభీత అయి కంపించింది.
‘‘అమ్మా! ఈ వేళప్పుడు…’’ అర్థోక్తిలో ఆగిపోయిందా బేల.
‘‘అదే అడుగుతున్నాను. ఈ వేళప్పుడు ఎవరితో తిరుగుళ్ళు? ఎక్కడ నించి?’’ కృష్ణసాని తీవ్రస్వరంతో అడిగింది.
మంజరి మాట్లాడలేదు. తలవంచుకుని నిలబడిరది.
‘‘ఆ చంద్రప్పదగ్గర్నుంచేనా’’ కరకుగా ఉందా స్వరం.
అవునన్నట్లు తలూపింది మంజరి.
‘‘నేను నీకు గతంలో ఒకసారి చెప్పాను. ఆ ఉన్మత్త గాయకుడితో తిరిగితే లాభం ఏముండదని. ఇదే నీకు ఆఖరుసారి చెప్తున్నాను. నువ్వు అతన్ని మర్చిపో! చిన్నాదేవిలా నీక్కూడా ఓ ప్రభువు లేదా ప్రభువంతటివాడు…’’ తల్లిమాటలు పూర్తికాకుండానే మంజరి ఆపింది.
‘‘నేను చంద్రాన్ని ఇష్టపడుతున్నానమ్మా! అతనే నా జీవితేశ్వరుడు’’ ఆమె స్వరం మెల్లగా ఉన్నా దృఢంగా ఉంది.
కృష్ణసాని తోకతొక్కిన కృష్ణతాచులా లేచింది.
‘‘కళ్ళు పైకెక్కినాయా! చిన్నాదేవి వైభోగం చూశావా! శ్రీకృష్ణదేవరాయ ప్రభువు కూడా రాజుకాకముందే ఆమెను కోరాడు. మాట ఇచ్చాడు. ప్రభువైతే కూడా ఆమెని మరువడు. పట్టాభిషేకం జరుపుకోబోతున్న రాయల మనసులో పట్టమహిషి చిన్నాదేవే! ఎంత అదృష్టవంతురాలామె! నేనెంత కలలు కంటే మాత్రం ఏం లాభం!’’ నిట్టూర్చింది నిస్సహాయంగా కృష్ణసాని.
‘‘అమ్మా! ఇతరులతో మనకెందుకు? అది ప్రభువు ఆదరం. నన్నూ, చంద్రాన్ని ఆశీర్వదించు. కళాపోషకుడైన ప్రభువు నీడలో మా జీవితాలు తరిస్తే నాకదే పదివేలు’’ మంజరి నచ్చచెప్పింది.
‘‘నీ మాట నీదేనా! ఇక పడుకో! రేపటినుంచి నేను చెప్పినదే జరగాలి. మరో ఆలోచనకు తావులేదు’’ విసవిసా బయటికి నడిచింది కృష్ణసాని.
మంజరి విశ్రమించిందేగానీ మనోహర వేణుగానం మదిలో ఆ గదిలో విన్పిస్తూనే ఉంది. ఆమెకదే ఏకాంత సేవాభాగ్యం.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
నర్సప్ప నాయకుని మరణకాలానికి కృష్ణరాయని పట్టాభిషేక కాలానికి విజయనగర సామ్రాజ్య రాజకీయ పరిస్థితులు అంత బాగా లేవు. సరిహద్దు రాజ్యభాగాలు కోల్పోయి రాజ్యం అంతఃబహిర్ శత్రువులతో, అంతఃకలహాలతో, బహ్మనీ గూఢచారులతో నిండి సంక్షోభంలో ఉంది. ఈ పరిస్థితులలో ప్రబల రాజాధిరాజు, రాజ పరమేశ్వర, వీర ప్రతాప శ్రీకృష్ణదేవరాయు తిమ్మరుసు ధీయుక్తితో చక్రవర్తిగా పట్టాభిషిక్తుడౌతున్నాడు.
ఆరోజు కృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవం జరుగుతున్నది.
శ్రీజయంతి నాడు జరుగుతున్న ఉత్సవానికి కర్ణాటకాంధ్ర దేశాల ఏలికలకు ఆహ్వానాలు అందాయి.
ఆనాడు విజయనగరం వికసించిన వనవాటికలా సుగంధ పరిమళాలతో విలసిల్లుతున్నది. అనేకమంది రాజులు, పండితులు, కవులు, జ్యోతిష్కులు విచ్చేశారు. నగరాన్ని అరటిబోదెలతో, మామిడి తోరణాలతో అలంకరించారు. బ్రాహ్మణ శ్రేష్టులు గ్రహశాంతి, హోమయజ్ఞాలు చేశారు. శుద్ధోదక స్నానం చేసిన రాయలు నూతన వస్త్రాలంకార భూషితుడై మరో విష్ణువులా భద్రాసనంపై శోభిల్లుతున్నాడు, వేదపండితుల మంత్రోచ్ఛాటనంతో బంగారు కలశంలోని సకల నదీజలాలతో రాయలకు సంప్రోక్షణ చేశారు. అందరి జయజయధ్వానాల మధ్య శ్రీకృష్ణదేవరాయల కిరీటధారణ జరిగింది.
రాజోద్యోగుల పరిచయం, రాజధానీ సందర్శనం అయినాక రాయలు తల్లికి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నాడు. మహామంత్రి, పితృసమానులు అప్పాజీ, గురువు వ్యాసరాయల ఆశ్సీసులు పొందాడు. కవులు పద్యాలతో ఆశ్సీసులందించారు. శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవం జరిగాక అప్పాజీ మరోసారి రాయల్ని గౌరవించి కౌగిలించి ఆశీర్వదించాడు. ఈ ఉత్సవానికి గుర్తుగా విరూపాక్ష మందిరంలో ‘రంగనాథ మందిర గోపురం’ నిర్మించబడిరది.
ప్రజలంతా అప్పటికే కృష్ణరాయని గురించి విన్నారు. అతనిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. దక్షిణాపథాన మహత్తర గిరి దుర్గం విజయనగరం. ఆ పేరును సార్థకం చేయటానికి రాయలు అనేక చర్యలు తీసుకున్నాడు.
రాచకార్యాలతో వ్యస్తుడైన రాయలకు చిన్నాదేవి అనుక్షణం గుర్తు వస్తున్నది. ఆమెని పట్టమహిషిని చేస్తానన్న తన వాగ్ధానం పదే పదే ఆయన స్మృతిపథంలో మెదుల్తూ అది నెరవేర్చటానికి వేగిరపడుతోంది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
‘‘చిన్నా! ఏమిటి ఈ బేలతనం!’’ చిన్నాదేవికి చేరువగా వచ్చి ఆమె మునిగడ్డం పట్టి ఎత్తి కళ్ళలోకి చూసింది మంజరి.ఆ కళ్ళు తామర కొలనులా ఉన్నాయి.
‘‘అవును మంజరీ! నీవీవేళ బాగా గుర్తొస్తున్నావు సుమా! మనిద్దరం ఒకే గురువు దగ్గర నాట్యం నేర్చాం. నా పాదాలు నేడెందుకో మొరాయిస్తున్నాయి. మనం నేర్చుకున్న కృష్ణనృత్యాన్ని ఓసారి ప్రదర్శిస్తావని.’’
చిన్నాదేవి స్వరంలో తెలియని ఆవేదన, అలసట.
నిరంతరం రాయల గురించిన ఆలోచనలతో ఆమె మనసు వడిలిపోయింది. తన రాయలు ప్రభువైనాడు గదా! తననింక గుర్తుంచుకుంటాడా! మనసు నిండా సంతాప మేఘాలు కమ్ముకుంటున్నాయి. తనవల్ల రాయల కీర్తికి ఎటువంటి మచ్చ రాకూడదు. పట్టమహిషి పదవిమీద కూడా ఆమెకి ఆశలేదు. రాయలే ఆమెకి సర్వస్వం. ఆమె అతనికి ప్రియురాలు, భార్య, అర్థాంగి, రాణి కూడా.
మంజరి ముద్ర పట్టి ‘కృష్ణనృత్యం’ చేస్తున్నది. రాధ విరహంతో వేగిపోతూ కృష్ణుని రాకకోసం చెట్టునీ, పుట్టనీ, పులుగునీ, పున్నమినీ స్వామి జాడకోసం అభ్యర్థిస్తోంది.
‘‘రాడేలనే స్వామి రాడేలనే
నా వాడని నమ్ముకొంటి
ఇంతకింత రేయిమించె
రాడేలనే స్వామి రాడేలనే!’’
మంజరి విరహోత్కంఠిత రాధలా మారిపోయింది. ఆమె హృదయంలో అగ్ని బాణాలు గుచ్చుకుంటున్నాయి. నేటికి పది దినాల నుండి చంద్రప్ప జాడ లేదు. అతని సన్నిధి కోసం ఆమె బేలహృదయం పలవరిస్తోంది.
‘‘నే తాళ లేనే చెలియా
నే తాళ లేనే ఓ సఖియా’’
అంటూ ఉన్మత్త విరహిణిలా మంజరి నేలకొరిగింది. అప్పటివరకూ అదే స్థితిని అనుభవిస్తూ విపరీత వేదనకు గురవుతున్న చిన్నాదేవి మంజరి స్థితికి కంగారుపడిరది. ఆమె పరిచారికల సహాయంతో మంజరిని సేద తీర్చింది.
‘‘మంజరీ! ఏమిటిది! నీది నర్తనమా! నిజస్థితి ప్రదర్శనమా?’’
మంజరి బలహీనంగా నవ్వింది. ఆమె ఆహారం తీసుకొని కొన్ని దినాలయిందని గ్రహించింది చిన్నాదేవి. మంజరిని మంచం మీదికి చేర్పించింది. పానీయం ఇప్పించింది. ఆమె సేద తీరాక విషయం అడిగింది.
‘‘మంజరీ! చెప్పు. మనం చిన్నప్పట్నుంచీ నేస్తాలం. ఒకరి మనసు మరొకరు బాగా తెలిసినవాళ్ళం. నీవు చంద్రప్ప ఒకరికొకరుగా మెలగటం నాకూ తెలుసు. ఇప్పటి నీ పరిస్థితికి అతను కారణమా?’’ ప్రేమగా మంజరి చేతిని తన చేతిలోకి తీసుకుని అడిగింది.
మంజరి తలదించుకోవటం వల్ల ఆమె మనసులో ఏముందో తెలీటం లేదు. సన్నగా కంపిస్తున్న ఆమె శరీరం మనోవ్యాకులతను తెలుపుతోంది. చిన్నాదేవి మంజరిని మరి ప్రశ్నించదలచలేదు.
‘‘కాసేపు విశ్రాంతి తీసుకో తర్వాత మాట్లాడుకుందాం’’ అని మంజరిని ఏకాంతంగా వదిలేసి బయటి కక్ష్యలోకి వచ్చింది.
అప్పటికే ఆమెకోసం ఒక వార్తాహరుడు ఉన్నాడు. శ్రీకృష్ణదేవరాయల ప్రేమకు పాత్రమైన ఆమెపట్ల అంతా గౌరవం, వినయాలనే ప్రదర్శిస్తున్నారు. ఏమో! ‘రాబోవు కాలంలో కాబోయే రాణి’ అని తలచి కాబోలు!
‘‘ఏమి వార్త తెచ్చావయ్యా!’’ చిన్నాదేవి రాజసాన్ని ఒలకబోస్తూ ఆసనంపై ఆసీనురాలయింది.
‘‘మహామంత్రి తిమ్మరుసులవారు మరో రెండు గడియల్లో మిమ్ములను కలవనున్నారు. ఇది అతి గోపనీయమని సెలవీయమన్నారు’’ వార్తాహరుడు అభివాదం చేసి నిష్క్రమించాడు.
దిగ్గున లేచింది చిన్నాదేవి. మనసు భయాందోళనలతో, ఆశ్చర్యానందాలతో నిండిపోయింది. ఏమి చేయటానికీ పాలుపోవటం లేదు. అంతటి మహామాత్యుడేమిటి… తమ ఇంటిని పావనం చేయటమేమిటి? విజయనగర సామ్రాజ్య యశస్సుకు మూలస్తంభంలాంటి అప్పాజీ తమబోటి వారింటికి రావటమా! సమయానికి తల్లికూడా ఇంట లేదే!
ఆలోచిస్తుండగానే తిమ్మరుసు మహామంత్రి ధీరగంభీర మూర్తిలా ఆ దేవదాసి ఎదుట నిలిచాడు. తొట్రుపడిరది చిన్నాదేవి.
‘‘మహామంత్రికి ప్రణామాలు!’’ పాదాభివందనం చేసింది. ఆయనను ఆసనం మీద కూర్చుండబెట్టి ఎదుట తలవంచి వినమ్రంగా నిలిచింది ‘ఏమి ఆజ్ఞ’ అన్నట్లు.
సర్వాలంకారభూషితjైు శ్వేతాంబర ధారిణిగా అపర సరస్వతిలా నిలుచున్న చిన్నాదేవి ముగ్ధమనోహర రూపాన్ని ఒక నిమిషం పరికించాడు అప్పాజీ.
‘ఈమె ఇంతటి సౌందర్య సౌశీల్యాలు కల్గిఉంది కాబట్టే రాయలు మనసిచ్చాడు. పట్టమహిషి కాదగిన సకల లక్షణ సముపేత’ అనుకున్నాడు అప్పాజీ.
నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ చిన్నాదేవి మెల్లగా అడిగింది. ‘‘పెద్దలకి నా మీద ఇంత అనుగ్రహానికి కారణమేమో తెలుసుకోవచ్చునా?’’
అప్పాజీ గంభీరముద్ర వహించాడు. మరుక్షణం చిన్న చిరునవ్వు ఆయన పెదవులపై చంద్రవంకలా మెరిసింది.
‘‘అమ్మా! విజ్ఞురాలివి. రాయలు ఏనాడో నీవాడైనాడు.రాజుకు భార్యలెందరున్నా దోషం కాదు. అయినా నీ స్థానం నీదే! ప్రభువుల వివాహానికి అనేక కారణాలుంటాయి. నీవల్ల ఒక సహాయం కోరి వచ్చాను.’’
ఉలిక్కిపడిరది చిన్నాదేవి.
‘‘నావల్లనా అప్పాజీ! విజయనగర సామ్రాజ్యమే మీకెంతో ఋణపడిరది చెప్పండి మహామాత్యా!’’
‘‘చిన్నాదేవీ! కృష్ణరాయలు రాజుకాకముందే వారి అభిమానం సంపాదించావు. నీకాయన ఖడ్గవిద్య నేర్పారు. నీ సహజ లలిత కళాకౌశలాన్ని ప్రభువు అభిమానించారు. ఇప్పుడు రాజయ్యాక పట్టమహిషి స్థానం కూడా నీకివ్వదలిచారు. అయినా రాయలు మరో వివాహం కూడా చేసుకోవాలి. దీనికి రాయల్ని నువ్వే అంగీకరింపచేయాలి’’ అభ్యర్థనగా అన్పిస్తున్నా ఆదేశం ధ్వనించిందా స్వరంలో.
‘‘నేనా’’ చిన్నాదేవి గొంతు జీరవోయింది. ఆమె హృదయవేగం పెరిగింది.
‘‘అవునమ్మా! శ్రీరంగ పట్టణానికి చెందిన వీర శ్యామల రాయల కుమార్తె తిరుమలదేవితో రాయల వివాహం చేయదలిచాను. ఇది ప్రభువుకు, రాజ్యానికి కల్యాణకారణం అవుతుంది. రాయలు నా మాట కాదనడు. కానీ నీ ప్రేమ రాజ్యశ్రేయస్సుకు ప్రతిబంధకం కాకూడదు కదా!’’ అర్థస్ఫురణతో అన్నాడు అమాత్యుడు.
‘‘అప్పాజీ! మీరు నాకు తండ్రిలాంటివారు. ప్రభువు ఉన్నతి కోసం నేను ఏమైనా చేస్తాను. మీరు నిశ్చింతగా ఏర్పాట్లు జరుపుకోండి’’ చిన్నాదేవి మాటల్లోని గంభీరతకు తిమ్మరుసు మంత్రి ఆశ్చర్యపడ్డాడు. ఆమె మట్టిలో మాణిక్యమని గుర్తించాడు.
‘‘మేము నిన్ను కల్సిన సంగతి రహస్యం సుమా’’ అని హెచ్చరించి గడప దాటుతూ ‘‘మంజరి క్షేమమా’’ అడిగాడు. చిన్నాదేవి తలూపింది.
అప్పాజీ అటువెళ్ళగానే కూలబడిరది చిన్నాదేవి. అశ్రుధారలతో ఆమె
చెక్కిళ్ళు, చీర తడిసిపోయాయి.
‘ప్రభువు తనకు దూరమవుతాడా’ ఆలోచనకే ఆమె హృదయవేదన మిక్కుటమయింది. అన్నింటికీ ఆ విరూపాక్షుడే సాక్షి అనుకున్నది. మంజరి ఎప్పుడువచ్చిందో చిన్నాదేవి భుజంమీద చేయివేసి పిలిచేదాకా తెలీలేదు.
‘‘చిన్నాజీ! నేనంతా విన్నాను. నీ నిర్ణయంలో ఎంత త్యాగముందో రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయి.’’
‘‘ఏమో! నా ప్రభువు లేని జీవితం మాత్రం నేనూహించలేను’’ చిన్నాదేవి మంజరిని కౌగలించుకుని రోదించింది.
‘‘అలా ఎన్నటికీ జరుగదు. ప్రభువులు అనేక కారణాలతో ఎందర్ని చేసుకున్నా వారు అనుమతిస్తేనే భార్యగా చెలామణి అవుతారు. ప్రభువు నిన్నేనాడో పట్టమహిషిని చేశారు. మరెందరు భార్యలుంటేనేం? దుఃఖించకు’’ అని ఓదార్చింది మంజరి. చిన్నాదేవి ఒకింత సాంత్వన పొందింది.
‘‘అవును మంజరీ! నువ్వు మహామంత్రికి ఎలా తెల్సు? నువ్విక్కడ ఉన్నట్లు వారికి ముందే తెలుసా?’’ ఈ లోకంలోకి వచ్చినట్లుగా ప్రశ్నించింది చిన్నాదేవి.
‘‘విజయనగర సామ్రాజ్యంలో చీమ కదిలినా కూడా మహామంత్రికి తెలియకపోదు. శ్రీకృష్ణదేవరాయ ప్రభువుల పట్టాభిషేక మహోత్సవంలో జరిగిన నాట్యప్రదర్శనలో నీతోపాటు నేనూ నాట్యం చేశాను కదా! తిమ్మరుసు మంత్రివర్యులు ఆనాడే నన్ను పసిగట్టారు. మనలో మాట… చంద్రప్ప సంగతి అడిగావుగా! చంద్రాకు అప్పాజీగారు కొన్ని రాచకార్యాలు అప్పగిస్తుంటారు. ఈ పదిరోజులుగా అతను కన్పించలేదంటే అదే అనుకుంటున్నాను.’’
చిన్నాదేవి ఆదరంగా మంజరి చెక్కిళ్ళు నిమిరింది. మేనా తెప్పించి ఆమెను ఆదరంగా సాగనంపింది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
చిన్నాదేవి రాయలను ఎలా ఒప్పించిందోగానీ, రాయల వివాహం తిరుమలాంబతో వైభవంగా జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు తల్లి నాగాంబ కోడల్ని ప్రేమతో అంతఃపురానికి ఆహ్వానించింది.
ముత్యాల హారతులు
ముదితలంతా ఈరె
ముద్దుల సీతకు
మురిపాలు మీర ॥
పగడాల హారతులు
పడతులంతా ఈరె
పసిడి పళ్ళెమ్ములో
పూవు లక్షతలుంచి ॥
వజ్రాల హారతులు
వనితలంతా ఈరె
వైభోగములు వెలయ
వాణీశుడే బ్రోవ ॥
తిరుమలదేవికి సాహిత్యమంటే బహుప్రీతి. ఆమె చాలా అందగత్తె. వీణావాదనలో నిష్ణాతురాలు. రాజసం ఉన్న ధీరవనిత. అంతఃపురంలో నృత్యగాన వినోదాలతో పొద్దుపుచ్చుతున్నా తిరుమలదేవి మానసంలో ఏదో ముల్లులా ఒక బాధ. అది చిన్నాదేవి గురించి తెలియటమే!
ఆ రోజు సాయంత్రం తిరుమలదేవి అంతఃపురంలో ‘కృష్ణలీలలు’ నృత్యసన్నివేశం జరుగుతోంది.
‘‘ఈమె ఎవరు? ఇంత అద్భుత సౌందర్యంతో తన్మయపరుస్తున్న ఈ నర్తకి విజయనగర సామ్రాజ్యానికే మణిదీపంలా ఉంది’’ అని మంజరిని చూస్తూ తలపోసింది మహారాణి.
నాట్యప్రదర్శన ముగిశాక మంజరి గురించి వివరాలు అడిగి తెలుసుకుంది. ఆమె చిన్నాదేవికి అత్యంత ప్రీతిపాత్రురాలని అవగతమైంది. మంజరి దేవదాసి అనీ, ఆమె నర్తనంలో అలౌకిక దివ్యత్వం ఉందనీ అర్థం చేసుకుంది. ఆమెను అనేక బహుమతులతో సత్కరించింది.
తిమ్మరుసు మహామంత్రికి తన మనసులోని ఆవేదన నివేదించిన తిరుమలదేవి చిన్నాదేవిని అంతఃపురానికి సకల లాంఛనాలతో రప్పించమని కోరింది.
తిరుమలాంబ ధీరత్వానికి అప్పాజీ లోలోపల సంతోషించాడు. సామ్రాజ్య పటిష్టతకు రాయల వ్యక్తిగత జీవన ప్రశాంతత కూడా చాలా అవసరం అని ఆయనకు తెలుసు.
చిన్నాదేవి రాజమందిరంలో చెలికత్తెలతో ప్రవేశించటం రాయలకు మహదానందంగా ఉంది. తిరుమలదేవి స్వయంగా ఎదురువెళ్ళి హారతిచ్చి చిన్నాదేవిని ఆహ్వానించింది. తిరుమలదేవికి ఆమెను చూస్తూంటే తన ప్రతిబింబాన్ని చూస్తున్నట్లే అన్పిస్తున్నా మనసులో స్త్రీ సహజమైన కలత తొంగిచూస్తున్నది.
మంజరి చిన్నాదేవితో బాటు రాజమందిరంలోకి వచ్చిందే కానీ మొహాన చిరునవ్వు మాయమైంది. ఎప్పుడూ అన్యమనస్కంగా ఉంటున్నది. నాట్యం చేసినా ఆత్మ పలకటం లేదు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
అప్పాజీ రహస్య సమావేశ మందిరంలో దీర్ఘాలోచనలో నిమగ్నమై ఉన్నాడు. వార్తాహరుడు వచ్చి అందించిన సమాచారం వల్ల ఆయన మనస్సు చాలా అశాంతిగా ఉంది. ఇంతలో చంద్రప్ప వచ్చినట్లు కబురందింది. లోపలికి అనుమతించాడు మహామంత్రి. చంద్రప్ప వచ్చి వినయంగా చేతులు కట్టుకొని నిలబడ్డాడు.
‘‘చంద్రప్పా! వెళ్ళిన పని ఏమయింది’’ ఆయన మామూలుగా అడిగినా అది ఉరుమంత గంభీరంగా ఉంది.
‘‘మహామాత్యా! మీ ఆనతి ప్రకారం ఉమ్మత్తూరు, శివసముద్రం ప్రాంతాలు పరిశీలించి వచ్చాను. అక్కడి మన వేగులతో సంప్రదించాను. ఆ పాలెగాళ్ళు మన విజయనగర ఆధిపత్యాన్ని లెక్కచేయటం లేదు. వాళ్ళు మనకి పన్నుకట్టరట. త్వరలోనే స్వతంత్రత ప్రకటించుకుంటారట అప్పాజీ!’’ నమ్రతగా చెప్పాడు.
‘‘ఆహా! ఎవ్వరికీ ఏమీ ఉప్పందించలేదు కదా!’’ అప్పాజీ లోతుగా ప్రశ్నించాడు.
‘‘లేదు అప్పాజీ! ఈ మాసం రోజులు నా వేణుగాన ప్రదర్శనలతో ప్రజల్లో ధారాళంగా సంచరించాను.’’
‘‘ప్రజలేమనుకుంటున్నారు?’’
‘‘ప్రజలంతా కృష్ణరాయలవారి పాలనే కోరుకుంటున్నారు అప్పాజీ!’’
‘‘మంచిది. ఇక నువ్వు వెళ్ళవచ్చు’’ తిమ్మరుసు ఆజ్ఞఅయినందుకు వినమ్రంగా నమస్కరించి నిష్క్రమించాడు చంద్రప్ప.
సేనానాయకుడు దండపాణి ప్రవేశించాడు. మహామాత్యులు ఆసీనుడైనాడు. సుదీర్ఘ మంతనాలు జరిపాడు.
‘‘మహామంత్రి! మనం అభివృద్ధిపరిచిన ప్రకారం మన సైన్యం ఏడులక్షల కాల్బలం, ఐదువందల యాభై గజబలం, ముప్ఫైరెండు వేల ఆరువందల అశ్వికదళం, ఇది కాక కామానాయకుడు, తిప్పన్న నాయకుడు, కొండమరెడ్డి, మధుర నాయకుడి ఆధీనంలో వేల కాల్బలం, గుర్రపుదళం, గజబలం కేంద్రీకృతమై యుద్ధసామాగ్రితో సిద్ధంగా ఉంది. రాయలవారు పట్టాభిషిక్తులైన ఈ సంవత్సరంలో మనసైన్యం బహుధా శిక్షణ పొంది ఉంది. ఇంకా కొద్దిరోజుల్లోనే బహుమనీ సుల్తాన్ రెండవ మహమ్మద్షా, బీజాపూర్ యూసఫ్ అదిల్ఖాన్ షాతో కలిసి మనమీద యుద్ధం ప్రకటించబోతున్నారని వేగులవల్ల తెలిసింది.’’
‘‘మంచిది. సైన్యాన్ని ఆయత్తపరచండి. వాళ్ళు సరిహద్దు చేరగానే మన సైన్యం ఆ మ్లేచ్ఛులను చీల్చి చెండాడగలదు’’ మహామంత్రి ఆజ్ఞకాగానే దండపాణి సమరోత్సాహంతో నిష్క్రమించాడు.
ఆ రాత్రి రెండుజాముల వరకు తిమ్మరుసు దీపం వెలుగులో పలు లేఖలు రచించి వేగులతో వర్తమానాలు పంపించాడు. అవి ఎవరికోసం రాశాడో మున్ముందు చరిత్రే చెప్తుంది.
చిన్నాదేవి మందిరంలో ప్రణయ సామ్రాజ్యంలో ఓలలాడి ప్రశాంతంగా నిద్రిస్తున్న రాయలకీ విషయాలేవీ తెలియవు. మహామంత్రి తిమ్మరుసు విజయనగర సామ్రాజ్యాన్ని కంటి రెప్పలా కాపాడుతున్నంత కాలం నిశ్చింతగా ఉండొచ్చని రాయల అచంచల విశ్వాసం.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
అంతఃపుర సౌధాన్ని ఆనుకొని ఉన్న సుందర ఉద్యానవనంలో చాలాసేపటి నుంచి మంజరి వేచిఉంది. చంద్రాన్ని చూసి ఎంత కాలమైంది! తనను కలవలేనంత రాచకార్యాలేముంటాయి? తను అతనికోసం అంతగా వేదన చెందుతుంటే చంద్రాకి ఇదేవిూ పట్టదా! ఈ రోజు చంద్రుడు నడినెత్తి మీదికి వచ్చే సమయానికి ఈ వసంతవాటికలో కలుస్తానని కబురంపాడు. ఇంతవరకు జాడలేదు.
ఆకాశంకేసి చూసింది మంజరి. మబ్బులు అడ్డగించడం చల్ల చంద్రుడు ఎంతమీదికి వచ్చాడో తెలీటం లేదు. ఉస్సురని నిట్టూర్చింది. చిన్నాదేవిదే అదృష్టం. ప్రభువుకాకముందే కృష్ణరాయని ప్రేమకి పాత్రురాలయింది. ప్రభువయినా రాయలవారి మనసు ఇసుమంతయినా మారలేదుసరికదా తిరుమలాంబతో వివాహమైనా చిన్నాదేవి పట్ల మక్కువ పెరిగిందే కానీ తరగలేదు. ఓసారి నిట్టూర్చి పాలరాతి మండపంలో స్తంభానికి చేరగిలపడి చంద్రప్ప గురించి తలపోస్తున్నది మంజరి.
‘‘ఎదుట ఉన్నవారిని మరిచి ఎంతసేపా ధ్యానం మంజూ’’ చంద్రప్ప ప్రేమపూరితమైన స్వరం విని నిలువెల్లా పులకించింది.
‘‘చంద్రా!’’ ఉదుటన లేచి నిలువెల్లా అల్లుకుపోయింది.
‘‘ఇన్నాళ్ళకా చంద్రా! నేనేమైపోవాలి’’ ఆమె గొంతు మూగవోతున్నది.
‘‘మన్నించు మంజూ! అప్పాజీవారు అప్పగించిన స్వామికార్యంలో నిమగ్నమై నిన్ను కలవలేకపోయాను’’ బుజ్జగిస్తూ చెప్పాడు. ఆమె భుజంమీదుగా చేయివేసి లతామండపానికి తీసుకుపోయి పక్కన కూర్చోబెట్టుకుని చెప్పాడు.
‘‘నువ్వు వినే ఉంటావు. మనకీ, బహుమనీ సుల్తాను, బీజాపూర్ సుల్తాన్లు కలిసి జరిపిన యుద్ధం గురించి’’
‘‘అవును… మనం సాధించిన విజయవార్త కూడా విన్నాను… విజయనగర సైన్యం శత్రుసైన్యాన్ని చీల్చి చెండాడిరదనీ, మహ్మద్షాకు తీవ్రగాయాలైనాయనీ’’
‘‘ఆ! అంతేకాదు. పిరికితనంతో పలాయనం చిత్తగిస్తున్న మహ్మదీయ సైన్యాన్ని మనవాళ్ళు తరిమి తరిమి కొట్టారు. ఈ యుద్ధంలో బీజాపూర్ యూసఫ్ ఆదిల్షా మరణించాడు. అతని కుమారుడు పన్నెండేళ్ళ బాలుడైన ఇస్మాయిల్ ఆదిల్ఖాన్ సుల్తాన్ అయ్యాడు. ఇస్మాయిల్ బాలుడు కావటాన బీజాపూర్లో కామల్ఖాన్ సర్దారు అధికారం చేజిక్కించుకున్నాడు. బీదర్ ఆక్రమించి సుల్తాన్ మహమ్మద్ షాని బందీని చేశాడు. రాయచూర్ని జయించాక కామల్ఖాన్ హత్య తర్వాత రాయలు మహమ్మద్ షాని బంధవిముక్తుడ్ని చేసి మళ్ళీ సుల్తాన్ని చేశాడు’’ సంతోషంగా చెప్పాడు చంద్రప్ప.
‘‘ఇవన్నీ విజయనగర పౌరులందరికీ తెల్సినవే! రాయలవారికి ‘యవనసామ్రాజ్య స్థాపకాచార్య’ బిరుదు ప్రదానం అందుకే కదా’’ నవ్వింది మంజరి ఉల్లాసంగా.
‘‘మంజరీ! అన్నీ శుభవార్తలే! ఇన్నాళ్ళ ఎడబాటు తర్వాత మళ్ళీ నీ సుందర వదనారవిందాన్ని చూసే అదృష్టం కలిగింది. నా దేశాంతరవాస శ్రమంతా నీ చిరునవ్వుతో, ఆలింగన స్పర్శతో తీరిపోయింది’’ చంద్రప్ప మంజరిని తన బాహువుల మధ్య మళ్ళీ చేర్చుకున్నాడు. మంజరి గువ్వలా అతని కౌగిట ఒదిగిపోయింది.
‘‘చంద్రా! మరో ముఖ్య విషయం. నేను నీ ఎడల అనురాగాసక్తనై ఉన్నట్లు చిన్నాజీకి తెల్సింది.’’
అతను కౌగిలి నుంచి విడివడి ఆమె కళ్ళల్లోకి చూశాడు.
‘‘నువ్వే చెప్పావా?’’
‘‘లేదు. ఆమె గ్రహించింది. రాయలవారి అనుంగు పట్టమహిషి ఆమె. ఆమె ప్రియసఖిని నేను. నా మనసు తెలుసుకోవటం అంత కష్టమేమీ కాదులే!’’ బుంగమూతి పెట్టింది మంజరి.
‘‘అప్పాజీవారు కూడా మనకి ఆశీస్సులందిస్తారు’’ నమ్మకంగా చెప్పాడు చంద్రప్ప.
‘‘అప్పాజీవారా’’ ఆశ్చర్యంగా చూసింది మంజరి.
‘‘అవును. ఈ రాచకార్యం మీద నేను దేశాంతరం వెళ్ళేముందు వారు ‘కళ్యాణమస్తు’ అని కూడా ఆశీర్వదించారు.’’
‘‘అయితే అది మన కోరిక తీరే దీవెనే’’
‘‘అయినా కొంచెం ఆగాలి సుమా’’
‘‘ఇంకానా’’ ఆమె అతని భుజంపై తలవాల్చింది.
‘‘రాయలవారు దక్షిణ దిగ్విజయయాత్రకు బయలుదేరుతున్నారు. నీకు తెలుసుకదా! ప్రభువుతోబాటు సైన్యమే కాదు కళాకారులు, కవులు కూడా యుద్ధరంగానికి తరలి వెళ్తున్నాం’’ ఉత్సాహంగా చెప్పాడు చంద్రప్ప.
‘‘మీరు కూడానా! యుద్ధరంగానికా! ఇదేమిటి చంద్రా! అక్కడ మీకేం పని? వేగు పనిచేయటం వేరు. వేణుగానంతో మనసుల్ని అలరించే లలిత హృదయుడివి. రక్తపుటేరులు పారే కదనభూమిలో నిలువగలవా?’’ భయాందోళనలతో అడిగింది మంజరి.
ఆమె చేతిమధ్య అతని చేతిని బిగించి పట్టుకోవటంలోనే అతనిపట్ల ఆమెకున్న ప్రేమానురాగాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రప్ప చిన్నగా నవ్వాడు. అతనికి తెలుసు ఆమె మనసులో చెలరేగే సంఘర్షణాజ్వాల.
‘‘రాయలవారు ఏ జైత్రయాత్రచేసినా కవులు, కళాకారులు సైన్యంతో పాటు బయలుదేరాల్సిందే. సాయంత్రం యుద్ధవిరమణానంతరం ప్రభువు కవిపండిత గోష్ఠితో మానసోల్లాసం పొందుతారు. అల్లసానిపెద్దన, నందితిమ్మన వంటి కవులు కూడా వస్తున్నారు. నా గానంతో ప్రభువు అలసట ఉపశమిస్తే అంతకంటే మనకు కావలసినదేముంటుంది మంజరీ!’’ ఆమె చుబుకం పట్టి చెప్పాడు చంద్రప్ప మృదువుగా.
కళ్ళల్లో నీళ్ళు కనపడకుండా తలదించుకుంది మంజరి.
‘‘నేనూ వస్తాను. నా నాట్యంతో ప్రభువుల్ని అలరిస్తాను’’ బింకంగా అంది.
‘‘స్త్రీలను తీసుకెళ్ళటంలేదు’’ చంద్రప్ప అర్థవంతంగా నవ్వాడు.
‘‘ఓహో! ప్రభువు స్త్రీలను తగురీతిగా గౌరవిస్తారని విన్నామే!’’
‘‘అది ఆస్థానంలో! శత్రువుల మాయోపాయాలతో ద్వేషం బుసలుకొట్టే రణరంగంలో కాదు.’’
ఆమె నిరుత్సాహపడిరది. చంద్రప్పతో వియోగం సహింపరానిదిగా ఉంది. అతనామె మనస్థితిని గ్రహించాడు.
మరుక్షణం మొదలైన అతని వేణుగాన మాధురీ తరంగాలు ఆమెను చుట్టుముట్టేశాయి.
ఆమె ఉన్మత్త నాగినిలా ఉంది. ఆ రాత్రి శరీరమంతా వేయినాగులు చుట్టుకున్నట్లు మంజరి నర్తించింది. కారణం ఆ ప్రకృతికి తెలుసు. చంద్రప్పకీ తెలుసు. రాత్రి రెండవరaాము నగారా మోగింది.
చిన్నాదేవి మందిరంలో ఆమెను వక్షస్థలానికి చేర్చుకుని నిద్రిస్తున్న శ్రీకృష్ణరాయలకి లీలగా మెలకువ వచ్చింది. చిన్నాదేవి ప్రభువు హృదయంపై తలవాల్చి ‘రాయలే లోకం’ అన్నట్లు నిద్రిస్తోంది.
దూరంగా గాలితరంగాలు భారంగా మోసుకొస్తున్న వేణుగానం వింటుంటే ఆ కళాకారుడు ఆనందపరవశంతో పాడుతున్నట్లు అన్పించదు. ఏదో హృదయ తాపాన్ని గానరూపంలో వెలిబుచ్చుతున్నట్లనిపిస్తుంది. ఎవ్వరో ఆ గాయకుడు? మున్నెన్నడూ విన్నట్లు లేదు. నడిజామున ఈ విరహగానాలాపన ఏంటి? కృష్ణరాయలకు నిద్రాభంగమైంది. కాపలావారిని పిల్చి ఆ గానాన్ని ఆపించుదామనుకున్నాడు. కానీ మనసొప్పలేదు. ఒకనాడు చిన్నదేవి కోసం తాను పడిన వేదనను గుర్తుచేస్తున్న గానం అది. ఆ వేణుగానం మెల్లగా మంద్రస్థాయికి దిగింది. క్రమంగా గాలిలో విలీనమైంది. ప్రభువుకు కలతగానే నిద్రపట్టింది.
‘‘ఇక నేను వెళ్ళివస్తాను మంజూ!’’
‘‘అప్పుడేనా’’ దిగాలుగా అందామె.
‘‘ఉదయానికే ప్రయాణానికి సన్నద్ధం కావాలి మరి’’ ఆమెను మరోసారి సందిట చేర్చి ముద్దాడి వీడ్కోలు పలికాడు చంద్రప్ప.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
శ్రీకృష్ణదేవరాయలకు దేవేరిలిద్దరూ హారతిచ్చి వీరతిలకం దిద్ది యుద్ధరంగానికి సాగనంపారు. రాయల దక్షిణ దిగ్విజయ యాత్ర మొదలైంది. కాలం నడక వేగం పుంజుకుంది.
అంతఃపురంలో చిన్నాదేవి దిగులుగా ఉంది. ఆభరణాలు, అలంకారాలు లేవు. మంజరి రావటం చూసింది.
‘‘రా మంజరీ!’’
‘‘ఏంటి చిన్నాజీ ఇంతటి వైరాగ్య వేదన! నిరాలంకరణ దేనికి?’’
‘‘ప్రభువు దగ్గరలేని అలంకరణ దేనికి మంజరీ! నేటికి పదినెలలు గడిచింది ప్రభువు యుద్ధానికి వెళ్ళి.’’
‘చంద్రప్ప వెళ్ళి’ మనసులో మంజరి అనుకుంది.
‘‘ఆ వార్తలు తెలుస్తున్నాయి గదమ్మా! అంతా జయమే’’ పైకి బింకంగా అంది.
‘‘కానీ నాకు మాత్రం క్షణమొక యుగంలా ఉందే!’’
‘‘పాద సంవాహన చేయించనా’’
‘‘వద్దు! ఓ పాట పాడు’’
మంజరి గొంతు సవరించుకుని ఓ గీతాన్ని ఆలపించింది.
‘‘మోహన మురళి ఊదవోయి కృష్ణా!
తేనెలొలికే పాట మధువు
ఓపలేదీ రాధ బ్రతుకు’’
‘‘మంజరీ! నా బాధ పెంచే పాటే పాడుతున్నావే’’ చిన్నాదేవి వారించింది.
‘‘మనిద్దరిదీ ఒకే బాధగదా చిన్నాజీ’’
‘‘అంటే చంద్రప్ప కూడా’’ ప్రశ్నార్థకంగా అడిగింది చిన్నాదేవి.
మంజరి అవునన్నట్లు తలాడిరచింది. నిట్టూర్చింది చిన్నాదేవి. మంజరిని పంపేసింది గానీ మనసు కుదుటపడలేదు. రాజులకి యుద్ధాలు తప్పవు. అలాగే వారి ప్రియసతులకీ వేదనా తప్పదనుకొంది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
యాభైవేల కాల్బలం, రెండువేల అశ్వికదళంతో గంగరాజు పాలిస్తున్న శత్రుదుర్భేధ్యమైన ఉమ్మత్తూర్ కోటను రాయలు ముట్టడిరచాడు. భీకర పోరాటం సాగుతున్నది.
యుద్ధశిబిరంలో కృష్ణరాయలకి నిద్రరావటం లేదు. శ్వేతాంబరధారిణి అయిన చిన్నాదేవి జ్ఞప్తికి వస్తోంది. ఆమె బాహువుల్లో ఒదిగి హాయిగా నిద్రించే రోజెన్నడో! ఏదైనా గానం వింటే మనసుకి కొంత ఊరట. చంద్రప్పకు కబురందింది.
అతని బాధాతప్తగానం రాయల హృదయానికి ఊపిరులూదుతోంది. ఇదివరలో రాత్రివేళ విన్న గానమిదే! ఇతనికీ ఓ ప్రేయసి ఉందేమో! లేదంటే ఎందుకింత విరహ వ్యధ? ఈ యుద్ధంవల్ల లాభమా! నష్టమా! హిందూ సామ్రాజ్య సంస్థాపన కోసం కంకణంగట్టుకున్న తాను ఇలాంటి ఆలోచన చేయొచ్చా?
ప్రభువు నిద్రించారని గ్రహించి ఆలాపన ఆపేశాడు చంద్రప్ప.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
సంవత్సరం పాటు జరిగిన పోరులో గంగరాజు మరణంతో ఉమ్మత్తూర్పై విజయం సిద్ధించింది. శ్రీరంగపట్నం జయించి విజయుడై వస్తున్న రాయలకు విజయనగర ప్రజలు హర్షధ్వానాలతో జేజేలు పలికారు.
మంజరి మనసు పాలసముద్రంలా ఎగసిపడుతోంది. వార్తాహరుని ద్వారా చిన్నాదేవి మందిరంలో అందరికీ తెల్సిన వార్త ఆమెలో నూతనోత్సాహాన్ని నింపుతోంది. చిన్నాదేవి కూడా పరవళ్ళు తొక్కే నదిలా పూజామందిరంలో నృత్యం చేయటం చూసి మంజరి చాలా సంతోషించింది. ఎవరికైనా మనసు ప్రతిబింబించేది ఆరాధించే కళలోనే గదా!
తిరుమలదేవి, చిన్నాదేవిలతో కొలువుతీరిన ప్రభువు రుక్మిణీ సత్యభామా సమేతుడైన శ్రీకృష్ణునిలా భాసించాడు. నాటి కొలువులో చంద్రప్ప గానానికి మంజరినాట్యం కళాకోవిదుల ప్రశంసలు పొందింది. తిమ్మరుసు మంత్రి వాళ్ళిద్దరికీ ఆశీఃపూర్వకంగా సంభావనలిచ్చాడు. రాయలు మహాదానాలు చేశాడు.
దక్షిణాపధాన విజయప్పనాయకుడి దండయాత్రవల్ల చేర, చోళ, పాండ్యరాజులు విజయనగరానికి సామంతులు కావటం రాయల కిరీటంలో మరిన్ని మణులు చేరినట్లయింది.
కృష్ణరాయల కోసం బంగారంతో రత్నాలు, వజ్రాలు తాపడం చేసిన కళాత్మక సింహాసనం ఏర్పాటయింది. చక్రవర్తి కోశాగారం నిండిరది. లక్షకిపైగా నివాస గృహాలున్న విజయనగరం లక్ష్మీశోభతో కళకళలాడుతోంది. బహుభాషా కోవిదులు, చాకచక్యంగల చారుల సేవలవల్ల విజయనగరం మరింత భద్రంగా శోభిల్లుతున్నది.
(ధారావాహిక నవల) by డా. చిల్లర భవానీదేవి
‘అహో! ఆంధ్రభోజా! శ్రీకృష్ణదేవరాయా!
విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా!!…’’
ఘంటసాల గళంలోంచి ఉత్తేజకరంగా అద్భుతగీతం ఆడియో మంద్రస్థాయిలో విన్పిస్తోంది.
తెల్లారితే బస్ హంపీనగరాన్ని చేరుతుందంటే అమృతకి చాలా ఎక్సయిటింగ్గా ఉంది. బస్ అంతా నిద్రమూడ్లోకి జారుకుంటున్నారు. అభిషేక్ కూడా హంపీ గురించే ఆలోచిస్తున్నాడని అమృతకి తెలుసు. రాత్రి పదవుతోంది. దాదాపు నలభైమంది ప్రయాణిస్తున్న ఆ టూరిస్ట్ బస్ తెల్లవారితే ఒక అద్భుత ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నదని వాళ్ళిద్దరికీ అన్పిస్తున్నదంటే ఆ స్థలం వాళ్ళకి ఎంత ప్రీతిపాత్రమైందో మరి!
‘‘అభీ!’’ మెల్లగా పిల్చింది అమృత.
‘‘ఊ…’’ అభిషేక్ బదులిచ్చింది ఒక్క అక్షరమే అయినా అమృత మీద ప్రేమంతా రంగరించి అన్నట్లుంది.
‘‘ఇప్పుడు నీకేమన్పిస్తుంది’’ అతని భుజమ్మీద వాలి కళ్ళు మూసుకుంది.
‘‘మనం మనదైన లోకంలోని కాలానికి వెళ్ళిపోతున్నాం అమ్మూ’’ ట్రాన్స్లో
ఉన్నట్లు అన్నాడు.
‘‘నిజంగా అప్పుడు ఉండేఉంటాం అభీ!’’ అమృత రెప్పల కింద సినిమా రీళ్ళలాగా… అనేక దృశ్యాలు కన్పిస్తున్నాయి.
‘‘అమ్మూ!’’ మంద్రంగా హస్కీ వాయిస్తో పిలిచాడు అభిషేక్.
అలా పిలిస్తే అమృతకెంత ఇష్టమో అతనికి తెలుసు. నాగస్వరానికి ఆడే నాగినిలా అయిపోయింది అమృత.
‘‘చెప్పు అభీ!’’
‘‘రేపట్నుంచి మన జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని నాకన్పిస్తుంది.’’
‘‘అవును అభీ… నాక్కూడా’’
‘‘మనం ఇన్నాళ్ళుగా కన్న కలలు నిజం కాబోతున్నాయంటే… ఓప్ా నమ్మలేకుండా ఉన్నాను’’ ఉద్వేగంగా అన్నాడు అభిషేక్.
‘‘అవును అభీ! మనం యూనివర్శిటీ స్టూడెంట్స్గా ఏ క్షణంలో కలిశామో… ఆ ఘడియ అద్భుతమైంది అభీ. ఎందరో అక్కడ చదువుకుంటారు. కాని మనలాగా చరిత్రలోకి ప్రయాణించేవాళ్ళుంటారా! అనిపిస్తుంది.’’
‘‘అవును అమ్మూ! నీకు చెప్పాను గుర్తుందా! మొదటిసారి ఫీల్డ్వర్క్ కోసం నేను హంపీ వచ్చినప్పుడు ఎంత ఆశ్చర్యపోయానో!క్లాసులో ప్రొఫెసర్ విజయనగర సామ్రాజ్యం గురించి చెప్తున్నప్పుడు అవన్నీ నేను చూసినవే అన్పించింది.’’
‘‘అవును అభీ! మనం ఈ సామ్రాజ్యంలో పుట్టామనే నా నమ్మకం.’’
‘‘ఏదో పరీక్షల కోసం చదివాను, రాశాను గానీ ఇద్దరం కల్సి హంపీ ఎప్పుడు వస్తామా అని నా మనస్సు వేగిరపడుతోంది.’’
‘‘అవును అభీ! పెళ్ళయితేగానీ ఇలా కల్సి రాలేం కదా!’’
‘‘కళాకారులుగా కల్సి మనం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం. కానీ ఈ అనుభవం వేరు. చదువుకన్నా నీ నాట్యమే నన్ను నీ దగ్గరికి చేర్చింది అమ్మూ.’’
‘‘నీ పాటకోసమే నా పాదాలు ఎప్పుడూ ఎదురుచూస్తాయి అభీ!’’
‘‘రేపటి నుంచి మనం మనదైన అద్భుత ప్రపంచంలో విహరిద్దాం’’
అభిషేక్ ఆమె నడుం చుట్టూ చేయి వేశాడు.
‘‘అందుకే గదా! హనీమూన్కి ఎక్కడికెళ్తారు? అని నాన్న అడిగితే ‘హంపీ’ పేరు చెప్పాను’’ కొంచెం సిగ్గుపడిరది అమృత.
‘‘అంతా నవ్వారు తెలుసా! శిథిలాల్లో హనీమూనా అని’’ అభిషేక్ అల్లరిగా చూశాడు.
‘‘నువ్వెక్కడుంటే అదే నా స్వర్గం అభీ! మనం కలలు కన్న కళాప్రపంచం కన్నా మనకింకేం కావాలి చెప్పు’’ తన్మయంగా అంటున్న అమృత భుజంచుట్టూ చేయివేసి దగ్గరగా తీసుకున్నాడు అభిషేక్.
నవదంపతుల మనసులు పరస్పరం ఊసులాడుకుంటుంటే నిద్రలోకి జారుకున్నారు.
బస్ రాత్రి చీకటిని లైట్ల కత్తులతో చీలుస్తూ పరిగెడుతోంది. రాబోయే రోజు వాళ్ళ జీవితాలనే మార్చేస్తుందని తెలీని ఆ యువజంట ఆదమరిచి నిద్రపోతున్నది.
తెలతెలవారుతోంది. సూరీడు కూడా బద్ధకిస్తున్నట్లు ఇంకా పూర్తిగా పక్కమీంచి లేవలేదు. బస్లో లైట్లేసి హారన్ కొట్టాడు డ్రైవర్. అంతా నిద్రలేచి గమ్యం చేరినట్లు గుర్తించారు.
‘‘అభీ!.. హంపీ అదే హాస్పేట్ వచ్చేశాం’’ అమృత అతన్ని నిద్రలేపింది ఆనందంగా.
అభిషేక్ కళ్ళు నులుముకుని చుట్టూ చూశాడు. అంతా దిగుతున్నారు. పెద్ద లగేజీలన్నీ బస్ డిక్కీలోంచి తీస్తున్నారు.
అమృత, అభిషేక్లు బస్ దిగారు.
ఎదురుగా హోటల్ ప్రియదర్శిని. టూరిజం ప్యాకేజీ సభ్యులుగా అందరికీ డబుల్ బెడ్ ఎ.సి రూంలు కేటాయించారు. అంతా వెళ్ళాక రిసెప్షన్లో కొంచెంసేపు ఆగి అభిషేక్ తనకి కావాల్సిన సమాచారాన్ని తీసుకున్నాడు. రూంకి వచ్చి ఇద్దరూ రిఫ్రెష్ అయ్యారు. రూంకే బ్రేక్ఫాస్ట్ తెప్పించుకుని తిన్నారు.
‘‘అభీ! మనం అడిగినట్లు విడిగా ఒక కారు ఏర్పాటయిందా?’’
‘‘ఆ! ఒక గైడ్ కూడా’’
‘‘మనకి గైడ్ ఎందుకు అభీ! నువ్వున్నావుగా’’
‘‘అలా అనకు అమ్మూ! మనతో వచ్చేది డ్రైవర్ కం గైడ్. నేను ఆర్కియాలజీ విద్యార్థినే! అయినా మనం చదువుకోని ఎన్నో విషయాలు స్థానికులకు తెలుస్తాయి…’’ నవ్వాడు.
‘‘వాటికి ఆధారాలుంటాయా?’’ అనుమానంగా అడిగింది.
‘‘ఉండకపోవచ్చు… కానీ జనశ్రుతిలో పుట్టిన కథలుండొచ్చు…’’
‘‘అసలు భారతదేశ చరిత్రే సరిగ్గా రికార్డుకాలేదంటారు. పోర్చుగీసు యాత్రికులు, బ్రిటీష్ చరిత్రకారులు, శిలాశాసనాలు, సాహితీ గ్రంథాలు ఇవేకదా మన చరిత్రకు ఆధారాలు.’’
‘‘నిజమే!’’ ఒప్పుకున్నాడు అభిషేక్.
‘‘మనవాళ్ళు సరిగ్గా అన్నీ రికార్డు చేసివుంటే మనకి ఇంకెంత విలువైన సమాచారం తెలిసేదో! నాకు మాత్రం విజయనగర సామ్రాజ్యం గురించి ఇంత అభిమానం పెరగటానికి కారణం నువ్వే అభీ! నేను తెలుగు లిటరేచర్ విద్యార్థిగా శ్రీకృష్ణదేవరాయల సాహితీ ప్రియత్వం, కవిపోషణ, ఆ కవుల గురించి వాళ్ళ కావ్యాల గురించి చదువుకున్నాను. కానీ నీలా విజయనగర సామ్రాజ్య శిథిలాల వెనుగ దాగిన చరిత్ర పునాదుల నుంచి తెలియదు.నీ మాటల్లో నేను ఆ స్వర్ణయుగం మళ్ళీ చూశాను. ఆ హంపీ గురించి మనిద్దరికీ ఎందుకింత ప్రేమ అభీ!’’
అతని చేయి తన చేతిలోకి తీసుకొని అడిగింది అమృత.
‘‘తెలీదు అమ్మూ! కారణం ఇదని చెప్పలేను. మేం ఈ ప్రాంతం వాళ్ళమేననీ, మా పూర్వీకులు తెలుగునాడుకు వలస వెళ్ళారనీ అమ్మ చెప్పేది. అయినా రాయల పాలనలో తెలుగు, తమిళ, కన్నడ ప్రాంతాలున్నాయని అందరికీ తెలుసు.’’
‘‘మరి అలా ఎందరో ఉంటారు. నీకు మాత్రం ఎందుకింత ఇది.’’
‘‘ఏమో! చిన్నప్పట్నుంచీ శ్రీకృష్ణదేవరాయల పేరు వింటే నా మనసు పులకరించేది. హంపీ విజయనగర సామ్రాజ్యం నేపథ్యం గల సినిమాలు గానీ పాటలు గానీ చాలా ఇష్టం అన్పించేవి. శ్రీకృష్ణదేవరాయల అసలు చిత్రపటం లభ్యంకాలేదుగానీ లేకపోతే రాయల చిత్రం చూస్తే అది ఏ జన్మలోనైనా గుర్తించగలను.’’ అభిషేక్ మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాడు.
‘‘నాక్కూడా అంతే అభీ! విచిత్రంగా లేదూ! మనిద్దరి అభిరుచి ఒకటే కావటం’’ నమ్మలేనట్టు చూసిందామె.
‘‘అవును. కొన్నిసార్లు జన్మాంతర సంస్కారాలు వెంటవస్తాయి. అందుకే నర్తకిగా నువ్వు, గాయకుడిగా నేను కళ పట్ల సహజాభిమానంతో ఉన్నాం. ఇది మన జన్మాంతర హృదయధర్మంగా ఉంది.’’
‘‘కారు వచ్చేలోపు మనం ఈ హంపీ విజయనగర సామ్రాజ్య ఆత్మని పూర్తిగా స్పర్శించేలోపు ఇన్నాళ్ళూ నాకు చూపించాలని నువ్వు కలలుగన్న ఈ పుణ్యస్థలం గురించి కొంచెం చెప్పు అభీ!’’
‘‘అలా అయితే ప్రస్తుతానికి నేనే నీ గైడ్ని. విను’’ అంటూ అభిషేక్ ఏదో ప్రపంచంలో ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. ఆర్కియాలజీ స్టూడెంట్గానే కాదు, ఈ మట్టి గురించిన జ్ఞాపకాలతో అతని మాటల్లో ఆ మట్టిబంధం పరిమళిస్తూంది.
‘‘నీకు తెలుసా అమ్మూ! ఇందాక మనం అనుకున్నట్లు మనవాళ్ళు రాసిన ఆధారాలే కాదు… ‘రాబర్ట్ సీవెల్’ అనే ఆంగ్ల ప్రభుత్వాధికారి ‘ద ఫర్గాటన్ ఎంపైర్’ పేరుతో ఈ మట్టిలో కలిసిన విజయనగర సామ్రాజ్యం అనే మాణిక్యాన్ని వెలికితీసేదాకా మనకెవ్వరికీ దీన్ని గురించి తెలియలేదు.’’
‘‘అయ్యో! ఇప్పటికీ పూర్తిగా తెలీదని నువ్వే అన్నావోసారి.’’
‘‘అవును. శ్రీకృష్ణదేవరాయల పూర్వీకులు బళ్ళారివారంటారు. ఈ రాజ్యాన్ని సంగమ, సాళువ, తుళువ, ఆరవీటి వంశాలు పాలించారు. రాయలు తుళువ వంశీకుడు. రాయల తాత ఈశ్వర నాయకుడు, తల్లిదండ్రులు నాగాంబ నరసరాయలు. నరసనాయకుని పెద్దకొడుకు వీరనరసింహరాయలు ‘సాళువ’ వంశాన్ని కూలదోసి రాజై తుళువ వంశాన్ని ప్రతిష్టించాడు. అతని మరణం తర్వాత తిమ్మరుసు సహాయంతో శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటక సింహాసనానికి క్రీ.శ 1509లో అధిపతి అయ్యాడు.
‘‘ఈ తిమ్మరుసుకేగా తర్వాతి కాలంలో రాయలు కళ్ళు పీకించింది’’ అమృత
ఉద్విగ్నంగా అడిగింది.
‘‘అవును!’’ విచారంగా చెప్పాడు అభిషేక్.
‘‘మరి కుందేళ్ళు వేటకుక్కల్ని తరమటం, హరిహరరాయలు బుక్కరాయలు విద్యారణ్యస్వామి కథ!’’ అర్థంగానట్లు చూసింది.
‘‘నువ్వు విన్నది సరైన ఐతిహ్యమే! దక్షిణాపథంలో తెలుగుల కాకతీయ సామ్రాజ్యం పతనమయ్యాక అక్కడ్నుంచి పారిపోయి హరిహర, బుక్కరాయలనే అన్నదమ్ములు విద్యారణ్యస్వామి ఆశీస్సులతో ఈ స్థలప్రభావం గుర్తించి ఇక్కడ సామ్రాజ్య స్థాపన చేశారని ప్రతీతి. కొందరైతే ఆ కాలానికి విద్యారణ్యస్వామి లేరనీ, విజయనగర రాజగురువు క్రియాశక్తియోగి అనీ అంటారు. ఏదైతేనేం ఇంతటి కళావైభవాన్ని సంతరించిన ఆ పాలన మరపురానిది… మహనీయమైనది కదా!’’ అభిషేక్ మాట పూర్తి అవుతూనే రూం అటెండర్ కాలింగ్ బెల్ కొట్టాడు.
అమృత తలుపు తీసింది.
‘‘వెహికల్ రెడీ మేడమ్!’’ చెప్పేసి వెళ్ళిపోయాడతడు.
అమృత, అభిషేక్లు కార్లో కూర్చున్నారు. అమృత బ్యాగ్లో కెమెరా, బైనాక్యులర్స్, సెల్, వాటర్ బాటిల్ అన్నీ సరిగ్గా ఉన్నాయో, లేవో సరిచూసుకుంది.
కొత్త మోడల్ ఎ.సి కారు. కొత్తగా పెళ్ళయిన జంట. పాత వైభవాన్ని చూడటానికి బయలుదేరారు. దోవలో పడిపోయిన ప్రాకారాలు శిధిలమైన కట్టడాలు కన్పిస్తున్నాయి. అభిషేక్ వాటి దగ్గర రెండు నిమిషాలు కారాపి ఫోటోలు తీసుకుంటున్నాడు. ఆ మొండిగోడలను ఆత్మీయంగా తడుముతున్న అభిషేక్ని చూస్తుంటే అమృతకి విచిత్రంగా అన్పించింది. మనిషి హృదయం ఎంత గొప్పది! ఎంతగా స్పందిస్తుంది! ఒక్కొక్క మనిషి జీవమున్నా రాయిలాగే ప్రవర్తిస్తుంటాడు. కొందరు సున్నిత మనస్కులు రాళ్ళలో కూడా ప్రాణాన్ని చూస్తారు.
అమృతకి ఒక తెలుగుకవి పాట గుర్తొచ్చింది.
‘‘రాలలోపల పూలు పూచిన రామమందిరలీల
ఆరామ సుందర హేల
రాలలో హృదయాలు మ్రోగిన రాచకేళీశాల
ఆరామమందిర లీల
నిన్నటిదా మరి మొన్నటిదా ఇది
ఎన్ని జన్మల గాథ!…’’
పాటని హమ్ చేస్తూ అభిషేక్ చేయి పట్టుకొని ఆ ప్రాచీన శిథిలాల్లో తిరుగుతుంటే అమృతకి గమ్మత్తుగా అనిపించింది. హంపీ శిథిలాల విూంచి గెంతుకుంటూ వెళ్తున్నాయి కోతుల గుంపులు. కొన్ని పిల్లకోతులు ఆగి వీళ్ళ చేతుల్లో ఏమైనా తినే వస్తువులున్నాయేమో లాక్కునిపోదామని చూస్తున్నాయి. అభిషేక్ గాగుల్స్ చూసి వెక్కిరించిందో పిల్లకోతి. మళ్ళీ ఇంతలోనే తల్లిపొట్ట కరుచుకొని వెళ్ళిపోయింది. సృష్టిలో ఏ ప్రాణికైనా మాతృత్వం అనే వరాన్ని భగవంతుడు ఇవ్వకపోతే ఈ కాస్త ప్రేమ, కరుణ కూడా మాయమైపోయేవేమో!
‘‘అమ్మూ! ఇటు చూడు. గతవైభవదీప్తికి చిహ్నాలుగా ఈ ప్రాకారం మీద అద్భుత శిల్పాలు. ఇది రాయల రాజముద్ర. ఈ అందమైన స్త్రీమూర్తి మొహాన్ని ఇలా చెక్కేయటానికి దాడిచేసి ఆక్రమించిన ఆ దురాత్ములకి మనసెలా ఒప్పిందో! ఏ శిల్పి కలగని ఈ శిల్పాన్ని చెక్కాడో! ఇప్పుడీ శిల్పాన్ని చూస్తే ఆ శిల్పికి గుండె ముక్కలవదూ…’’
అమ్మూ! ఇటుచూడు. కొండకు కొండ కొక్కేలు వేసినట్లు బారులు తీరి ఇంత పటిష్టంగా ఉన్న ప్రాంతం కాబట్టే విజయనగర రాజులు దీనిని రాజధానిగా కోట కట్టారు. ఇప్పుడు బీటలువారిన వీటిని చూస్తుంటే కొడాలి సుబ్బారావుగారి ‘హంపీక్షేత్రం’లో ఆ పద్యమే గుర్తొస్తున్నది.
‘‘శిలలు ద్రవించి యేడ్చినవి జీర్ణములైనవి తుంగభద్ర లో
పల, గుడిగోపురంబులు సభాస్థలులైనవి కొండముచ్చు గుం
పులకు చరిత్రలో మునిగిపోయిన దాంద్ర వసుంధరాధి పో
జ్జ్వల విజయప్రతాప రభసంబొక స్వప్నకథా విశేషమై’’`
అంటూ మధురంగా అభిషేక్ పాడిన ఆ పద్యానికి అమృత పరవశించి పోయింది. అతని కంఠం అచ్చంగా ఘంటసాల గళమే! అదే భావోద్దీపన. అందుకే ఆ పాట వినేవాళ్ళ హృదయాలలో తిష్టవేసుకుంటుంది. అమృత కళాహృదయం దోచుకున్న గాయకుడు అభిషేక్. ఆమెకి ఎన్నిసార్లు విన్నా తనివితీరదు అతని పాట.
‘‘అమృతా! కొడాలివారు ఈ హంపీ చూసే అంత గొప్పకావ్యం రాశారు! మరి నువ్వేం రాస్తావు!’’ అభిషేక్ కవ్వించాడు.
‘‘నేను హంపీలో మన ప్రేమకావ్యానికి మారాకు తొడిగిస్తాను’’ అమృత గుసగుసలాడిరది.
విజయనగర సామ్రాజ్య వైభవ ద్వారంలో అడుగుపెట్టిన ఆ దంపతులకి కళ్ళముందున్న శిథిల కట్టడాల నుండి నాటి విజయ నగరశోభ మనోహర కథన దృశ్యంగా సాక్షాత్కరించింది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
సప్తప్రాకార పరివేష్టితమై ఆదర్శప్రావీణ్యంతో కట్టబడిన అరవైమైళ్ళ చుట్టుకొలత ఉన్న ఆ పట్టణం మొదటి కోటగోడ వరస హాస్పేటకి ఆగ్నేయంగా రెండు కొండలు కలిసేచోట ఉంది. మొదటి ప్రాకారం నుంచి మూడో ప్రాకారం వరకు పొలాలు, తోటలు. రెండవది హాస్పేటలో ఉంది. దానికి ఉత్తరంగా మూడోది, మలపనహోగుడి గ్రామానికి దక్షిణాన నాల్గోది. దానికి ఉత్తరంగా కన్పించేది ఐదోది. కమలాపురం చెరువుకు దక్షిణాన ఆరోది. నిలిచి ఉన్నది ఏడోది. ఇదే అంతర్భాగ ప్రాకారం. నిరంతరం కట్టుదిట్టమైన పహారాలతో ‘మూరురాయలగండ’ శ్రీకృష్ణదేవరాయలు అమిత ధీశక్తిశాలి తిమ్మరుసు మహామంత్రి చల్లని నీడలో విలసిల్లుతోంది. ఆ ప్రాకారాల లోపలే నగరానికి కావలసిన సర్వసంపదలు నెలకొని ఉన్నాయి. అందుచేత కోటతలుపులు మూసివేసినా ఎవరికీ ఎటువంటి కష్టం కలుగదు.
రాజభవనానికి దగ్గరలో ఎదురుగా నాల్గు విపణి వీధులున్నాయి. ఆ వీధులలో పురుషులంతా సమస్త వస్త్రాలంకార భూషితులయి కన్పిస్తున్నారు. వీధుల్లో రత్నాలు, వజ్రాలు రాసులుగా పోసి అమ్ముతున్నారు.
రక్షక భటులు గుర్రాలపై హడావుడిచేస్తూ వచ్చారు. ‘‘తొలగండి.. తొలగండి..’’
ప్రజల మధ్యనించి మార్గం ఏర్పడిరది.
గుర్రాలు ఆగాయి. రాజోద్యోగి దిగటంతో అంతా భయభక్తులతో లేచి నిలిచారు. ఆయన ఒక వర్తకుని వద్దకు వెళ్ళి ‘‘మీ వర్తకం బాగా జరుగుతోందా!’’ గంభీరంగా అడిగాడు.
‘‘చిత్తం’’ వర్తకుడు గౌరవంగా బదులిచ్చాడు.
‘‘బీజాపూర్ యుద్ధం ముగిసింది. తెలుసుకదా! మన సైన్యం కుటుంబాలకు ఆర్థిక సాయానికి’’ అర్థోక్తిలో ఆగాడు.
‘‘చిత్తం!’’
‘‘మహామంత్రులవారు రేపు సాయంత్రం ఒక సమావేశం ఏర్పాటు చేశారు. మీరంతా.’’
‘‘చిత్తం!… ఏలిన వారి కృప.’’
వర్తకుల రాజభక్తి ఆ సమావేశంలో మణి మాణిక్యాల రూపంలో ప్రతిఫలించింది.
విజయనగర సామ్రాజ్యంలో రాయలపాలన వచ్చాక ముందు అంతశ్శత్రువుల్ని సరిచేయటం జరిగింది. మహామంత్రి ఏర్పాటుచేసిన సమావేశంలో తిమ్మరుసు ఇలా చెప్పాడు.
‘‘అధికారులు సత్యాహింసలు, నీతిసూత్రాలకు కట్టుబడి ఉండాలి. మనం పోర్చుగీసువారితో స్నేహం చేసి వారివద్ద గుర్రాలు, తుపాకులు, ఆయుధాలు కొంటున్నాం. సైన్యానికి వివిధ భాగాల్లో శిక్షణ ఇచ్చాం. అశ్వారోహకులు, గజారోహకులు, విలుకాండ్రు, సైనికులు అంతా ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి. మన ప్రభువు కూడా యుద్ధవిద్యలో అసమానులే!
ఆయన జగజ్జెట్టి, వీరుడు. తాను స్వయంగా సైన్యం ముందుండి నడిపిస్తారు. మన ప్రభువు ప్రతి విజయానికి మనవంతు కర్తవ్యం నెరవేర్చాలి.’’
కాదంటే బతకలేరు అనే కఠోర హెచ్చరిక అందరికీ తెలుసు. తిమ్మరుసు మహామంత్రి మేథోకుశలత ఆ ప్రముఖులకి తెలియందికాదు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
దృశ్యాన్ని కళ్ళకి కట్టించిన ఆ శిథిల వైభవాన్ని చూస్తూ కారులో ముందుకు కదిలారు అభిషేక్, అమృతలు. అభిషేక్ కళ్ళతో చూసినట్లుగా అమృతకు చెప్తున్నాడు.
‘‘అమృతా! అటుచూడు! అక్కడ రాయలవారి అంతఃపురం ఉండేది. దానిచుట్టూ ఇది విశిష్టమైన మహానగరంగా నిర్మితమైంది. సుమారు ఏడుమైళ్ళ చుట్టుకొలత కలిగి బలిష్టంగా యాభై అడుగుల ఎత్తు, పది అడుగుల వెడల్పు గల ప్రాకారం ఉండేది. దీని ప్రధాన ద్వారాన్ని ఇరవై వేలమంది అశ్వికులు రాత్రింబవళ్ళు కాపలా కాసేవారు.
‘‘అభీ! కృష్ణదేవరాయల కాలం స్వర్ణయుగం అని ప్రసిద్ధికెక్కిందిగదా!’’
‘‘అవును అమ్మూ! రాయల కాలంలో విజయనగర సామ్రాజ్యం అద్భుతమైన సంపదలతో వెలలేని అమూల్య అరుదైన వస్తువులతో దేవలోకంలా ఉండేది. దేనికీ లోటులేక శాంతి సౌభాగ్యాలతో తులతూగేది. ఇదంతా కేవలం రాయల ప్రతిభ మాత్రమే కాదు. అప్పాజీ మేధస్సు కూడా! వివిధ కార్యక్రమాలతో కృష్ణదేవరాయలు నిమగ్నమై ఉంటే తిమ్మరుసు మహామంత్రి తన అసాధారణ ప్రజ్ఞాపాటవాలతో రాజ్యపాలనను నిర్వర్తిస్తూ రాయలను, రాజ్యాన్ని రెండు
కళ్ళుగా చూసుకున్నాడు. విజయనగర సామ్రాజ్య చరిత్ర గురించి చెప్పేటప్పుడు తిమ్మరుసు గురించి చెప్పకపోతే అది అసంపూర్ణమే!’’
కారు మళ్ళీ ఆగింది.
అభిషేక్ ఆ ప్రాంతమంతా చిరపరిచితమైనట్లు సొంతింట్లో నడుస్తున్నట్లు అనుభూతి చెందటం అతనికే విచిత్రంగా అన్పిస్తుంది. అతను వరుసగా ఒక్కొక్క స్థలాన్ని చూపిస్తూ రాయల స్వర్ణయుగాన్ని మళ్ళీ అమృత కనుల ముందు ఆవిష్కరించాడు.
‘‘శ్రీమద్రామాయణంలో వాల్మీకి వర్ణించిన కిష్కింధ ఈ హంపీయే. తుంగభద్రా నదీతీరంలో కిష్కింధ ముఖ్యపట్టణంగా ఆనెగొంది కలిపి ‘వానరధ్వజ’మనే పేరుతో విలసిల్లాయి. నగరాన్ని భద్రంగా కాపాడే ఐదు పర్వతాలు మాతంగం, మాల్యవంతం, హేమకూటం, బసవశృంగం, కిష్కింధ. వీటిలో మాతంగం సుగ్రీవుడెక్కటానికి సాధ్యమైంది. వాలి దీనిని ఎక్కలేక పోయాడని రామాయణ శృతి. వాలి, దుందుభుల గుహ ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తుంది.
రావణాసురుడు సీతని చెరపట్టి ఆకాశ మార్గాన తీసికెళ్ళినప్పుడు ఆమె నగలు మూటగట్టి ఇక్కడి పంపా సరోవరం ఒడ్డున పడేసింది. శ్రీ విరూపాక్ష దేవాలయం ఉన్న ఈ ప్రాంతాన్ని దక్షిణకాశిగా వర్ణిస్తారు. కన్నడంలో ‘పాలు’ అనే పదాన్ని ‘హాలు’ అంటారు. ‘పంపా’ అనే పదం ‘హంపా’, ‘హంపీ’గా రూపాంతరం చెందింది. హనుమంతుడు పుట్టిన హనుమత్పర్వతం కన్పిస్తుంది. వాలిని శ్రీరాముడు దహనం చేసిన ‘వాలికాష్టం’ ఇక్కడ ఉంది.
ప్రతి సంవత్సరం ఏప్రిల్లో హంపీ రథోత్సవం జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి లక్షమంది ప్రజలు ఈ ఉత్సవానికి వస్తారు.
శిథిల కట్టడాలు, రాతిగుళ్ళు, శిలాకనుమలు, కరకులోయలు, నిర్జన వీధులు, శిథిల దేవాలయాలు, నదిలోంచి వచ్చే కాలువలు, చెరుకు, అరటి తోటలతో కన్పించే ఈ హంపీ పట్టణంలో నాటి రాయల ప్రాభవం ఈ శిథిలాల నేపథ్యం లోంచి చూస్తేనే ఇంత అద్భుతంగా అన్పిస్తుంది. ఇక నిజంగా ఈ కాలంలో ఈ పట్టణం ఎంత ఉజ్వలంగా వెలిగిందో కదా’’ తన్మయంగా చెప్పాడు అభిషేక్.
‘‘అవును అభీ! ఈ దేవాలయం పేరేంటి? ఇంతటి శిల్పకళతో చాలా సంపన్నంగా ఉంది’’ అమృత ఒక పెద్ద దేవాలయం గోడలమీది శిల్పకళను తనివితీరా చూస్తూ అడిగింది.
‘‘ఇది పట్టాభిరామ దేవాలయం. ఇక్కడ నుంచి కమలాపురం దాదాపు ఒక కిలోమీటరుంటుంది. ఇది అచ్యుతరాయల నిర్మితం. దీనికి దగ్గరే తుంగభద్రా ప్రాజెక్టు పెద్దకాలువ ఉంది. ఇక్కడ ఇలాంటి దేవాలయాలన్నీ దీర్ఘచతురస్రంగా గానీ సమచతురస్రంగా గానీ ఉన్నాయి. ఐదు కక్ష్యాంతరాలుగా బహిర్ద్వారం, రంగమండపం, అర్థమండపం, అంతరాళ మండపం, గర్భగృహం అనే పేర్లతో కన్పిస్తాయి. బహిర్ద్వారం ఉపరితలంలో గోపురం ఉంటుంది. దీనినే ‘రాయల గోపురం’ అంటారు. ద్వారానికి రెండువైపులా శిల్పాకృతులు, ధ్వజస్తంభం, బలిపీఠం, ముఖమండపం సమ చతురస్ర స్తంభాల మండపాలు కన్పిస్తాయి. దేవతా శిల్పాలంకరణలు సర్వసామాన్యం. గర్భగుహలో ఏ అలంకరణా ఉండదు. పై భాగంలో పరిణతి పొందిన తల విమానం ఉంటుంది. అధిష్టానం, పట్టిక, తలం, శిల్పం, పట్టిన పైన కలశం… ప్రతిభావంతమైన
శిల్పాచార్యుల పర్యవేక్షణలో రాయల కాలంలో కట్టబడిన అనేక దేవాలయాలున్నాయి. పెనుగొండ, లేపాక్షి, కంబ, కదిరి, మధుర, తంజావూరుమొదలైనచోట్ల విజయనగర శైలికి సంబంధించిన వాస్తుకన్పిస్తుంది.
ఈ దేవాలయమే కాదు హంపీలో పంపాపతిస్వామి, చక్రతీర్థంలో కోదండ రామస్వామి, విఠలస్వామి దేవాలయాలు ఇలాంటివే!
‘‘అభీ! ఇవన్నీ ఎప్పుడో చూసినట్లన్పిస్తుంది. నేను మొదటిసారి ఇప్పుడేగా వచ్చానిక్కడికి’’ ఆశ్చర్యంగా అడిగింది అమృత.
ఆమె చేతిని సున్నితంగా ప్రేమగా పట్టుకున్నాడు అభిషేక్.
‘‘అమృతా! పద! ఆ మండపంలో విశ్రాంతిగా కూర్చో… ఆ… ఈ నీళ్ళు తాగు. కళ్ళకి కన్పించినంత మేరా సువిశాలంగా కన్పించే ఈ హంపీ విజయనగర పట్టణంలో మనం ఉండేవాళ్ళమని నాకు చాలాసార్లు అన్పించింది. గతజన్మలు నమ్ముతావో లేదోనని నీతో అనలేదు. ఇప్పుడు నీక్కూడా అలాగే అన్పిస్తుందంటే మనకి ఈ హంపీకి ఏదో ఆత్మబంధం ఉంది. అమ్మూ! ఇది మనకి చిరపరచితమైన నగరమే! ఈ వీధులు మనం తిరిగినవే! నీకు ఒక్కొక్కటి గుర్తుచేస్తూ రాయలవారి కాలంలోకి తీసుకెళ్తాను. ఇలా నా హృదయానికి నీ అరచేతిని ఉంచు’’ వివశంగా కళ్ళు మూసుకున్నాడు.
ఆమె అలాగే చేసింది.
ఇద్దరూ విజయనగర సామ్రాజ్య వైభవోన్నతికి కారకుడైన ప్రభువు శ్రీకృష్ణదేవరాయల పాలనలో పౌరులుగా రాయల ఆదరణ చూరగొన్న కళాకారులుగా, శ్రీకృష్ణదేవరాయల స్వర్ణయుగ అనుభవాలనూ, గతజన్మ జ్ఞాపకాలనూ నిశ్శబ్దంగా మననం చేసుకుంటున్నారు.
అదొక విచిత్ర కాలసంయోగం.
(సశేషం)
పదకొండవ ప్రకరణ
గ్రంథకర్త:-ఒద్దిరాజు సీతారామచంద్ర రాయశర్మ
సరళీకృతం:-రంగరాజు పద్మజ
[ నేడు తప్పినది; రేపు తప్పదు.]
శ్లో ॥ ” అస్మిన్ దినేనిష్ఫలతా భవేచ్ఛేత్
శ్వః సమ్యగేవ రచయామి నహిత్యజామి.”
— నవీన తపశ్విని.
భావం :–ఈ రోజున ప్రయత్నించిన కార్యం నిష్ఫలమయినా కానీ ,రేపు మళ్లీ ప్రయత్నం చేస్తాను కానీ ,దాన్ని వదిలి పెట్టను..మరల మరల..సఫలం అయ్యేదాక ప్రయత్నిస్తూనే ఉంటాను.
వ్యాఖ్య:–
రుద్రమదేవి నవలలోని ఈ కథాభాగానికి సరిగ్గా సరిపోయే అంశాన్ని ” నవీన తపశ్విని ” నుండి ప్రకరణాంశంగా తీసుకోవడం గ్రంథకర్త ప్రతినాయక లక్షణాలను చక్కగా వ్యక్తీకరిస్తూ… కథాగమనానికి ఎంతగానో తోడ్పడింది.
ఇలా పూర్వ కావ్యాలు, సుభాషితాలు. హితోపదేశం వంటివి ప్రకరణానికి పేర్లుగా ఉపయోగించడం వల్ల పాఠకులకు ఆ యా విశేషాలు ఏ గ్రంధంలో ఉన్నాయనే ఉత్సుకతతో వెతుకుతూ ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ చదువరులను తయారు చేసే నూతన ఒరవడి .
రంగరాజు పద్మజ
కథాభాగం:-
మహాదేవరాజు దేవగిరిలో తన ఉద్యానవనంలో విచిత్ర మంటపంలో ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. క్షణక్షణానికి అతని ముఖ కవళికలు రకరకాలుగా మారుతున్ననందు వల్ల అతడు ఒక విషయం కాకుండా, చాలా విషయాల గురించి ఆలోచిస్తున్నాడని మనకు తెలుస్తుంది. కోపం, దుఃఖం మొదలైన ఎన్నో భావాలు అతని ముఖంలో స్పష్టంగా కనపడుతూ మాయమవుతున్నాయి.
అప్పుడు సాయంకాలమైంది. ఇంకా చీకటి ముసురకున్నా దీపాలు వెలిగించారు. చల్లటి గాలి వీస్తున్నది. నిర్మలమైన ఆకాశంలో ఎరుపురంగు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. సంతోషం కలిగించే ఆ సమయం రాజులకు వేడుకగా తిరిగే సమయం. అయినా మహాదేవరాజు ఇంకొక మనుషి లేకుండా ఒంటరిగా ఉండడానికి జరిగిన విఫలతయే కారణమని తెలుస్తున్నది.
ఈ ఉద్యానవనం మహాదేవరాజు ఇంటి తోట. ఎన్నో రకాలైన పూలతో ఎప్పుడు చాలా దూరం వరకు సువాసనలను వ్యాపింపజేస్తూ మనసుకు సంతోషాన్ని కలిగిస్తుంది. మిగుల మగ్గిన పండ్లున్న చెట్లతో ఉన్న ఆ ఇంటి తోట ఈ మధ్యన నిండుగా ఉన్న నీటితో ఒక కొలను ఒడ్డున అందమైన పర్ణశాల ఉన్నది. దాన్నే ‘విచిత్ర మంటపం’ అని అంటారు. ఈ విచిత్ర మంటపంలోనే మహాదేవరాజు కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు.
మహాదేవరాజు ఆలోచిస్తున్న సమయంలో ఒకతను వచ్చి నమస్కరించి నిలబడ్డాడు. పది నిమిషాల దాకా రాజు ఏమి మాట్లాడలేదు. తరువాత అతనిని కూర్చోమన్నాడు. వచ్చినతను కూర్చున్నాడు.
అప్పుడు అతనితో ఇలా మాట్లాడాడు.
” ప్రహారేశ్వరా!” ఏం విశేషాలు?
ప్రహరేశ్వరుడు దేవగిరికి చెందిన వాడు. బ్రాహ్మణుడు కాక ఇతర వర్ణంవాడు. మహాదేవరాజు అతను కలిసి ఓకే గురుకులంలో చదువుకున్నారు. చిన్నతనం నుండి ఇద్దరూ మంచి స్నేహితులు. వీరిద్దరి మధ్య బంధుత్వం కూడా ఉన్నది. చూడడానికి రూపంలోనూ, వయసులోనూ ఇద్దరికీ అంత తేడా ఉండదు. వాళ్లకు చిన్నతనం నుండి ఉన్న వారి అభిప్రాయాలకు ఎటువంటి ఆటంకం కలగలేదు. ఇద్దరి మధ్య ఉన్న చనువు అలా కొనసాగటానికే మహాదేవరాజు దగ్గర ప్రహారీశ్వరుడు ఉద్యోగం చేయలేదు. మహాదేవరాజన్న మాటలకు అతను ఇలా బదులిచ్చాడు.
“అనుకున్న పనంతా ఇంకో తీరుగా జరిగింది”. అంతా అవమానం పాలే అయింది. అనుకున్నదొకటి జరిగిందొకటి.
రాజు గుండెల్లో రాయి పడ్డట్టయింది. ఆశ్చర్యంతో ఇలా అన్నాడు. ఏమైంది? తొందరగా వివరంగా చెప్పు! నా మనసులో మొదలే ఒక అనుమానం వచ్చింది. నీ మాట మరింత భయం కలిగుతుంది. ఆలస్యం చేస్తే మనసులోని బాధ ఎక్కువ అవుతుంది.
” ఏమీ లేదు! మన ముగ్గురు యోధులు మరణించారు”.
చెప్పవెందుకు? కొంపముంచారే? ఎలా జరిగింది?
ప్రహరేశ్వరుడు జరిగిందంతా రాజుకు పూసగుచ్చినట్టు చెప్పాడు. రాజు పదిహేను నిమిషాల దాకా కొయ్యబారిపోయి, ఏమీ మాట్లాడలేదు. తరువాత దీర్ఘంగా నిట్టూర్చాడు.
బాధపడి మనం ఏం చేయగలం? చేయాల్సిన పని చాలా పకడ్బందీగా చేశాం. కాని దైవాజ్ఞ లేక ఫలించలేదు. అని ప్రహరేశ్వరుడు అన్నాడు.
నిజమే! చేసేది ఏమీ లేదు! పని సులువుగా అవుతుందనుకున్నాం. ఏ కారణం లేకుండానే మన పేరు బయట పడింది. అయినా అయ్యేది కాక మానదు! అని మహాదేవరాజు అన్నాడు.
ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగానే ఒక భటుడు వచ్చి ఒక కాగితం తెచ్చి మహాదేవరాజుకిచ్చి నమస్కరించాడు.
మహాదేవరాజు ఆ ఉత్తరం తీసుకుని నెమ్మదిగా చూస్తున్నాడు. అందులో ఏమి రాసి ఉన్నదో? కానీ, మహాదేవ రాజు పొగలేని నిప్పువలె మండిపడుతున్నాడు. గడ్డం దువ్వుతూ, మీసం మెలివేస్తూ, పళ్ళు పటపట కొరుకుతూ, లోలోపల చదువుకుంటున్నాడు.
కారణమేమిటో తెలియక ప్రహరేశ్వరుడు అలా చూస్తున్నాడు. మహాదేవరాజును ఆ విధంగా చూసి కారణం ఏమిటని అడిగే అవకాశం ప్రహరేశ్వరునికి ఇవ్వలేదు.
మహాదేవరాజు ఇలా కోపంతో ఊగిపోతూ, తరువాత చూశావా? ప్రహారేశ్వరా! ఆడవాళ్లకు కూడా కళ్ళు తలకెక్కాయి. నా దాసీదైన కమలనెంత అవమానించిందో ఈ రుద్రమ్మ! ” వినాశ కాలే విపరీత బుద్ధి” ( నాశనం అయ్యే సమయానికి వింత బుద్ధి పుట్టింది) అన్నట్టు నన్ను, నా పరివారాన్ని చులకనగా చూడడం ఈ రుద్రమకు పోయేకాలం వచ్చిందేమో? ఈ ఉత్తరం చూడు! అని ఆ ఉత్తరాన్ని ప్రహరేశ్వరుడికి ఇచ్చాడు.
అంతలోనే” ప్రహారేశ్వరా” ! ఒకసారి ఆ ఉత్తరాన్ని పెద్దగా చదువు! నేను వింటాను.” అని మహాదేవరాజన్నాడు.
ప్రహరేశ్వరుడు ఆ ఉత్తరాన్ని ఈ విధంగా చదవడం మొదలు పెట్టాడు.
” నన్నేలుతున్న నా శౌణ దేశాధీశ్వరులైన మహాదేవరాజ రాజ చూడామణి గారి పాదపద్మాల వద్ద పాద దాసైన కమల రోజూ మూడు కాలాల్లోనూ నా తలతో పాటు సాష్టాంగ నమస్కారాలెన్నో చేస్తూ రాసుకునే మనవి…..
అయ్యా! తమ ఆజ్ఞ తీసుకొని మురారి దేవుడు గారు, హరిహర దేవుడు గారు, ధర్మ వర్ధనుడు గారు, నేను….
సరే అదంతా వదిలేసి, ఉత్తరంలో ముందున్న విషయం చదవమన్నాడు మహాదేవ రాజు.
ప్రహరేశ్వరుడు అలాగే ఉత్తరం కొంత భాగం తన లోలోపల చదువుకొని, తరువాత ఇలా పైకి చదవడం మొదలు పెట్టాడు”ప్రహరేశ్వరుడు.
నన్ను తీసుకొనిపోయి సభలో రుద్రమ్మ ముందు నిలబెట్టారు.
ఆ…. అక్కడ నుండి చదవమని అన్నాడు మహాదేవ రాజు.
రుద్రమదేవి ముందు నిలబెట్టారు. రుద్రమదేవి ఎన్నో విషయాలు అడిగి, చివరకు నావైపు చూసి నిన్ను ఎవరు పంపారు? అని అడిగింది. నేను సమాధానమివ్వలేదు.
ఎవరు పంపారన్నది తెలుస్తూనే ఉన్నది. మహాదేవుడు వంకరగా చూశాడు. మంచిది! చదవమన్నాడు మహాదేవ రాజు.
” సభలో ఎవడో మీ పేరు కూడా చెప్పాడు.” అని చదివాడు.
రుద్రమదేవి సభలో నా పేరు పలికేంత మొనగాడున్నాడా? సరే !మిగతా ఉత్తరాన్ని చదువు !
” తరువాత రుద్రమదేవి నన్ను చూసి ఇవాళే మా రాజ్యం వదిలి వెళ్ళి పో! మా భటులు నిన్ను వెంబడిస్తారు.
నీకో రాజ్యం ఉన్నదా? ఆ రాజ్యం ఎలా దక్కించుకుంటావో నేనూ చూస్తాను.ప్రహారేశ్వరా! చదువు! చివరనున్న ఆ నాలుగు మాటలు ఏమిటో చదువు!
సరే అని ప్రహరేశ్వరుడు చదవడం మొదలు పెట్టాడు.” మళ్లీ మా రాజ్యంలో నీ మొహం కనపడితే నీ ప్రాణాలు దక్కవు!” ఆడదానివైనందున బ్రతికి పోయావు!”
వెంటనే మహాదేవరాజు ఇలా అన్నాడు. ఈ మాటలు విని, నేను తనని ఆడదని, జాలిపడి, విడిచి పెడతాననుకున్నది కావచ్చును… ఇంత అహంకారమా?
మళ్లీ ప్రహరేశ్వరుడు ఉత్తరం చదవడం మొదలు పెట్టాడు. నీ మహాదేవ రాజు ఆడదై గాజులు తొడుక్కోవడం వల్ల కావచ్చు! బహిరంగ యుద్ధంలో ఆడదానినైన నన్ను ఎదుర్కోలేక, మోసానికి తలపడ్డాడు….
శత్రువులను తిరస్కరించడం మోసమా? సరే! ఇక బహిరంగ యుద్ధమే చేస్తాను. కాచుకో! అన్నాడు మహాదేవరాజు.
మళ్లీ చదవడం మొదలు పెట్టాడు… సిగ్గు తెచ్చుకుని మళ్లీ ఇటువంటి పనులు చేయాలనుకోవద్దని చెప్పు!
సిగ్గు తెచ్చుకోవాలా? నిన్ను సింహాసనం ఎక్కించి నందుకు సిగ్గు తెచ్చుకోవాల్సిందే! మళ్లీ ఇటువంటి పని చేయకుండా.. నేనే ఓరుగల్లు సింహాసనాన్ని చేజిక్కించుకుంటాను. అహంకరించకు లెమ్మని అన్నాడు మహాదేవరాజు.
మళ్లీ ఉత్తరం ఇలా చదవడం మొదలుపెట్టాడు.
“రాజ్యం దక్కించు కోవాలంటే మాతో స్నేహంగా ఉండమని చెప్పు! ”
ఎలా? ఎలా? నీతో స్నేహం చేయాలా? నీకూ నాకూ మధ్య ఏమైనా బంధుత్వం ఉన్నదా? లేక నాకు వరసైన దానవా? పరాయి ఆడదానివి! అందులోను వితంతువువు! నీతో స్నేహం మాకు ఎలా మంచి జరుగుతుంది? నీతో స్నేహం ఒక యమభటులు మాత్రమే చేస్తారులే! గర్వపడకు! అన్నాడు మహాదేవరాజు.
” గర్వం, అహంభావం, వదులుకో” అని చదివాడు ప్రహరేశ్వరుడు.
” మంచేదో? చెడేదో తెలియని దానివి. మహా నాకు నీతులు చెప్ప వచ్చావా? అన్నాడు మహాదేవరాజు.
” మేము చెప్పే మంచి మాటలను మరిచిపోతే, నీకు తెల్లవారితే మా పదునైన బాణాలు చురచురమని తగిలి బుద్ధి చెప్తాయని చెప్పు! అని చదివాడు.
ఇంతటి పొడుగైన బాణాలు ఎన్నడు చేయించుకున్నావే? చురచుర తలగించు కోవాలనే బుద్ధి ఉంటే… అలాగే తగిలించుకుందువు గానిలే! అన్నాడు మహాదేవరాజు.
” అని కర్ణకఠోరాలైన మాటలని, ఆనాడే నన్ను భటుల నిచ్చి వెళ్ళ కొట్టించింది. నేను మన దేశం వచ్చాను. కొద్ది రోజులలో మీ పాదసేవ చేసి, నా దుఃఖాన్ని అంతా చెప్తాను.
ఇట్లు పాద సేవకురాలు
కమల.
కమల ! పాపం ! కమలకు ఎంత అవమానం జరిగిందో కదా! దీనికి ప్రతీకారం మనం తీర్చుకోకుంటే రుద్రమదేవి గర్వం కానీ, దాసి దుఃఖం కానీ తగ్గదు అన్నాడు ప్రహరేశ్వరుడు.
నిజమే! అన్నాడు.
ఆలస్యం చేయకుండా రేపటి కొలువులో పౌరులు, ఉద్యోగులు, మంత్రులు, సేనాపతులు మొదలైన వారందరిని పిలిపించండి. తగిన పనులు చేసి, ఆలస్యం చేయకుండా ఓరుగల్లు మీద దండెత్తి పోకుంటే మనం చేతగాని వారి వలె అవుతామన్నాడు మహాదేవరాజు.
తప్పనిసరిగా అలాగే చేద్దాం అన్నాడు ప్రహరే శ్వరుడు .
ఇంటికి వెళుతూ నా మాటగా మంత్రికి చెప్పు రేపు దర్బారుకు అందరూ వచ్చేటట్టు చేయమని.
మంచిది అన్నాడు ప్రహారేశ్వరుడు.
రాత్రి కావడంతో ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాత్రంతా మహాదేవ రాజుకు నిద్ర పట్టలేదు. మాటిమాటికి ఆ ఉత్తరాన్ని చూస్తున్నాడు. చిట్టచివరకు తెల్లవారుజామున శరీరం మంచం మీద వాల్చాడు.
మహాదేవరాజు స్థిర చిత్తుడు కాబట్టి ఉలిక్కిపడి లేచి కళ్ళు విప్పి చూశాడు. తెల్లవారి రెండు ఘడియల పొద్దు ఎక్కింది. తను అజాగ్రత్తగా ఉన్నందుకు విచారించి, పడక విడిచి, కాలకృత్యాలు తీర్చుకొని కొలువు కూటమికి నడిచి వచ్చాడు.
మంత్రి ఆజ్ఞ ప్రకారం సభ్యులందరూ ముందే వచ్చి ఎవరి తాహతుకు తగిన ఆసనాలలో వారు కూర్చుని ఉన్నారు. ఇంతలో మహాదేవరాజు సభా మంటపానికి వచ్చాడు. సభలోని వారంతా రాజును చూసి, తమతమ ఆసనాలలో నుండి లేచి నిలబడి రాజుకు నమస్కరించి,రాజుపట్ల తమకున్న ప్రభుభక్తిని చాటుకున్నారు. రాజు సభ్యులందరినీ వారికి తగినట్టుగా మర్యాదతో పలకరిస్తూ వచ్చి తన సింహాసనం మీద కూర్చున్నాడు. సభలోని వారంతా కూర్చున్నారు.
ఎప్పటివలె రోజువారీ కార్యక్రమాల సభ జరుగుతున్నా, ఈరోజు మంత్రి ఆజ్ఞతో సమావేశమైన ఈ సభకు కారణం ఏమై ఉంటుందా? అని ఆలోచిస్తున్నారు కానీ కారణం ఎవరికీ తెలియదు. ప్రహరేశ్వరుడికి మాత్రం తెలుసు .అతడు మంత్రికి చెప్పలేదు. తెల్లవారక ముందే కాలకృత్యాలు తీర్చుకొని రాజు గారి ఇంటికి వెళ్లి, రాజు కోసం ఎదురుచూస్తూ, రాజు నిద్ర లేవగానే రాజుతో కలిసి సభకు వచ్చాడు. కాబట్టి అసలు విషయం తెలియని ప్రజలు రకరకాలుగా ఆలోచిస్తున్నారు.
ఇంతలో రాజుసభలోని వారందరినీ చూసి, సభ్యులారా! కొన్ని రోజుల కింద ఒకనాడు ఓరుగల్లు మీద దండయాత్ర గురించి సభ జరిగింది. దానికి మీరు అందరూ ఒప్పుకున్నారు. ఇవాళ అది కలిసి వచ్చింది. రుద్రమదేవికి అహంకారంతో కళ్లు తలకెక్కాయ్. నాకుబుద్ధి చెప్పేంత మొనగత్తె అయింది.
నిన్న మా దాసీదైన కమల నాకు ఒక ఉత్తరం పంపింది. దానిని మీరంతా వినాలి! అది వింటే మీకు రుద్రమ యొక్క గర్వం ఎంత ఉన్నదో తెలుస్తుంది. ఉత్తరాన్ని ప్రహరేశ్వరుడు చదివి మీ అందరికీ చదివి వినిపిస్తాడు.
” ప్రహారేశ్వరా! ” నన్ను గొనిపోయి సభలో రుద్రమదేవి ఎదుట” అక్కడి నుండి ఉత్తరం చదువు అని అన్నాడు.
ప్రహారేశ్వరుడు కమల రాసిన ఉత్తరాన్ని చదివి వినిపించాడు. ఆ ఉత్తరం విన్న సభ్యులందరూ” రుద్రమదేవి ఇలా చేయడం తప్పని ముక్త కంఠంతో అన్నారు .
సభలో నుండి ఒకడు లేచి” రాజచంద్రా! మీ శౌర్య ప్రతాపాలకు భయపడిన తమ రాజ్యాన్ని దక్కించుకోవాలనే బలమైన కోరిక ఉండి, తెలుగు వారొక ఆడదానిని మాళవులు ఒక పిల్లవాడిని సింహాసనంపై కూర్చుండబెట్టారు. దాని వల్ల స్త్రీ హింసకు, శిశుహింసకు వెనుకంజ వేసే ప్రభువులైన మీరు వారి దేశాల పైకి దాడికి వెళ్లరని, వాళ్ల రాజ్యాలకు ఎటువంటి అంతరాయం, నష్టం రాదనుకొని, అలా చేశారు. అయినా రాజ్యగర్వం కళ్ళకు మంచేదో?చెడేదో? తెలుపనీయక వాళ్ళమతులు పోగొట్టాయి. కాబట్టి తలచినంత మాత్రాన గుండెల్లో దిగులు పుట్టించే మీకు ద్రోహం చేయాలనుకోవడం పెద్ద సాహసమే అవుతుంది.తమరు ఇప్పుడు ఇటువంటి మహిళలనీ, శిశువులనీ అనుకుని ఊరుకుంటే మీకు ముప్పు తప్పక కలుగుతుంది.
” దుర్జనం, కాంచనం, భేరీమ్,దుష్టస్త్రీం,దుష్ట వాహనం, ఇక్షుఖండాన్, తిలాన్, మర్దనం- గుణ మర్దనం” అని( నీచులను, బంగారాన్ని, నగారాలనే వాయిద్యాలను, చెడు స్త్రీలను, చెడు వాహనాన్ని, చెరుకు గడలను, నువ్వులను మర్దించాలి… వాటి గుణం మారేదాకా) మర్దించాలని శాస్త్రం తప్పుగా చెప్పలేదు. మత్తెక్కి భూమ్యాకాశాల తేడా తెలియకుండా ఉన్న ఆడదాన్ని నరికినా పాపంలేదు.ఇది ఎన్ని సార్లూ చెప్పినా నిజం ! అని అన్నాడు.
ఇతను గుజరాత్ దేశ పాలకుడైన లవణ ప్రసాదుడు .మహాదేవ రాజుకు సంతోషం కలిగించాలని అనుకొని , దేవగిరికి తన కుమారుడుతో పాటు కలిసి వచ్చి, కొంత కాలమైంది. కుమారుడైన వీరధవలుడిని తన సొంత రాజ్యానికి పంపి,తను ప్రతి దినం మహాదేవ రాజ్యసభకు వస్తూ… రాజ కార్యాలలో జోక్యం కలిగించుకొని, రాజుకు నచ్చేటట్లు మాట్లాడు తుంటాడు. రాజుకు కూడా ఇతనంటే కొంచెం ఇష్టమే. లవణ ప్రసాదుడు అలా అని ,తన ఆసనం మీద కూర్చున్నాడు.
లవణ ప్రసాదు గారు అన్న మాటలు మెచ్చుకునే విధంగా ఉన్నాయి. మనమిప్పుడు సైన్యసహితంగా ఓరుగల్లుకు వెళ్లి, పొగరుతో గుడ్డిదైనా రుద్రమను, ఆమె సేనను యుద్ధంలో ఓడించి, రాజ్యాన్ని మనం చేజిక్కించు కోకపోతే మనకు ఆమె ఉత్తరంలో కలిగిన అవమానం మాసిపోదు. కాబట్టి మనం ఓరుగల్లు పైకి దండెత్తి పోవడానికి ఆలస్యం చేయవద్దని మహాదేవరాజు అన్నాడు.
రాజుగారి ఆజ్ఞ రావడమే ఆలస్యం, సేనా నాయకుడు తమ సైన్యంతో యుద్ధ సామగ్రితో బయలుదేరడానికి ఆలస్యం చేయరని మంత్రి అయిన భోళేశ్వరుడన్నాడు.
నాతో పాటు సేనానాయకులందరూ యుద్ధానికి ఎదురు చూస్తున్నాం. సైనికులు యుద్ధ పరికరాలతో సిద్ధంగా ఉన్నారు మీ అనుమతి తప్ప కొరత ఏమీ లేనేలేదని సేనాపతులలో ముఖ్యుడైన రామశర్మ అన్నాడు.
మంత్రిగారూ! మన విధేయులైన వారు, మిగతా వారైన మండలాధ్యక్షులకు ఉత్తరాలు రాసి పంపాలి. వారంతా వస్తే మనకి ఇంకా మంచిది. రుద్రమదేవి చాలా పెద్ద సైన్యం తయారుచేసింది. ఆమె తండ్రి అయిన గణపతిరాజు కూడబెట్టిన సైన్యాన్ని ఈమె రెండింతలు చేసిందన్నా తప్పు లేదు. కాబట్టి మన దగ్గర ఎంత ఎక్కువ సైన్యం ఉంటే అంత మంచిది. మనకు సహాయం చేసేవారు దేవగిరిలోనే మనతో కలవాలంటే అలా వీలు కాదు. కొంతమంది దేవగిరిలోనూ, కొందరు దారిలో మధ్యన, కొందరు పొలిమేర వరకు, తక్కినవారు ఓరుగల్లు వచ్చి చేరవచ్చును. మనం రాసి పంపే ఉత్తరాలలో ఇలా వివరంగా రాసి పంపాల్సి ఉంటుంది. మన సైన్యం సిద్ధంగా ఉంది కదా? ఇంకా బయలుదేరేందుకు నగారా మోగించేందుకు తగిన ముహూర్తం ఆలోచించాలి. ముహూర్తం అంటే చాలా రోజుల వ్యవధి ఉండకూడదు. జ్యోతిష్యులకు ఈ విషయం చెప్పి పది, పదిహేను రోజులలో మంచి ముహుర్తం నిర్ణయించుకుని వచ్చి నాకు తెలియ చేయాలి. ఆ రోజు మనం బయలుదేరి వెళ్లాలి. ముందుగా రాయబారి కానీ మరెవరినైనా పంపేందుకు నాకు ఇష్టం లేదు. మీరంతా దీనికి ఒప్పుకోవాలి. ఎందుకంటే మనతో సమానులయితే ఎటువంటి రాయబారినైనా పంపవచ్చు. కానీ, ఒక ఆడది, అందునా మనను దూషించిన దాని దగ్గరకు రాయబారం పంపితే సిగ్గుచేటు. మన రాయబారం బాణాలతోనే పంపాలి. నా మాటలు శ్రద్ధగా విని అలా చేయండి! అని మహాదేవ రాజు మంత్రితో అన్నాడు.
చిత్తం! రాజుగారి ఆజ్ఞ! తెల్లారేసరికి మీకు శుభముహూర్తం నిర్ణయించి తెలియజేస్తాను. మిగిలిన సేన మొదలైనవి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయని మంత్రి చెప్పాడు.
సభలోని వారంతా యుద్ధోత్సాహాన్ని తెలిపారు.
కొంతసేపటికి సభ ముగిసింది. ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.
పన్నెండవ ప్రకరణ
[ యుద్ధ ప్రయత్నం]
శ్లోకం. ప్రవిష్ట శత్రుసైన్యంహి ప్రాజ్ఞ శత్రురతర్కితః
నిహన్యాదన్తరం లబ్ధ్వాఉలూక ఇవ వాయసాన్
శ్రీమద్రామాయణం- యుద్ధకాండం. సర్గ-17
శ్లో. వధ్యతా మేషతీవృణె దణ్డేన సచివైస్సహ
రావణస్య నృశంసస్య భ్రాతాహ్యేష విభీషణః”
శ్రీమద్రామాయణం-యుద్ధకాండం- సర్గ-17
ఈ శ్లోకాలు విభీషణుడు రామ శరణాగతి కోరి తన మంత్రులతో సహా వచ్చినప్పుడు, సుగ్రీవుడు రామునితో అన్నమాటలు.
భావం :– తెలివైన మరియు జ్ఞానం కలిగిన శత్రువు, శత్రుసైన్యంలో ప్రవేశించి, తరువాతి కాలంలో అవకాశం చూసుకుని, రాత్రిపూట చీకటిలో గుడ్లగూబ కాకులను చంపినట్లుగా …
చంపి వేయగలరు. పైగా విభీషణుడు పర హింసా తత్పరుడైన రావణుడికి తమ్ముడు. కనుక ఇతనిని అనుచరులతో సహా తీవ్రమైన దండనతో వధించవలెను.
కథా భాగం:– క్రీస్తుశకం 1285 వ సంవత్సరంలో రెండు ,మూడు నెలలు గడిచాయి.చలికాలం క్రమంగా పోయి ఎండాకాలం వేడి తగులుతున్నది. పగలు ఎక్కువగా, రాత్రిపూట తక్కువ సమయంగా మారింది. చలి బాధ వల్ల ఎండకు కూర్చోవడం, లేదా చలిమంటల దగ్గర కూర్చుని వేడి కాపులు పెట్టుకోవడం జనాలకు తగ్గింది. శుభకార్యాలు చేయాలనుకునేవారు ఆ పనికి వస్తువులను సేకరించుకోవడం కోసం తిరుగుతున్నారు. ఆధ్యాత్మిక చింతలలో ఉన్న వారు బ్రాహ్మణులు యజ్ఞ యాగాలు చేయాలనుకుని వాటికి కావలసిన వస్తువుల కొరకు భిక్షాటనకు వెళ్లారు. పురోహితులకు,జ్యోతిష్యులకు శుభాకార్యాలు చేయించడం వల్ల, శుభ ముహూర్తాలు నిర్ణయించడం వల్ల తీరిక లేకుండా ఉన్నారు. కొందరు యజమానులు పాత ఇండ్లను కూలగొట్టించి, కొత్త ఇండ్లు కట్టిస్తున్నారు. శ్రీమంతులు కొందరు ఎత్తయిన ఇండ్లను చూసి అటువంటి ఇండ్లు తమకు కావాలని, తమ ఇండ్లు అందంగానూ, గట్టిగా ఉన్నా కూడా వాటిని కూల్చేసి, మళ్లీ కొత్తగా కట్టిస్తున్నారు.
ఓరుగల్లు పట్టణంలో రాతి పనులు, మట్టిపనులు ఎక్కువగా జరుగుతున్నవి. అయినా కారణం లేకుండా అవి జరగడం లేదు. కోటగోడలు అక్కడక్కడా కొద్దిగా కూలిపోయాయి. కూలిపోయిన చోట ముందటి కన్నా బలంగా బాగు చేయిస్తున్నారు. పట్టణం చుట్టూ కంప కోట కట్టిస్తున్నారు. కంప కోట అంటే పెద్ద పెద్ద ఇనుప ముళ్ళు ఉన్న ఇనుప తీగను చిక్కగా, దట్టంగా పట్టణానికి చుట్టూ గుండ్రంగా చుట్టడం. ఎందుకంటే వేగంగా వచ్చిన ఫిరంగి గుండ్లు కంపలో దూరితే అవతలికి గానీ, ఇవతలికి గాని వెళ్లదు. ఈ కంపకోటలో పెద్ద కందకం తవ్విస్తున్నారు. ఆ కందకంలో తవ్వగా వచ్చిన మట్టితో ప్రహరీని ఆనుకుని లోపలి వైపు మట్టికోట కడుతున్నారు. మట్టి కోటకు లోపలివైపు రాతికోట ఒకటి కడుతున్నారు. ఈ రాతికోట సున్నంతో కానీ, మట్టితో కానీ కట్టకుండా బలమైన రాతితో కడుతున్నారు. ఈ రాతికోట మందంగా ఉండి, అష్ట కోణాకారంలో ఉన్నది. రాతితో కట్టినదైనా వెంట్రుక కూడా పట్టేంత సందు లేకుండా కట్టిన ఆ రాతి పనివాడి పని ఈ నాటికీ సందర్శకులకు కళ్ళ పండుగగా ఉంటుంది. ఈ రాతిప్రాకారం లోపల సున్నంతో, ఇటుకలతో మరొక ప్రాకారం కడుతున్నారు. దాన్ని ఇటుకకోటని, భూమి కోటని పిలుస్తారు.
మొదట శత్రువులు దూరరాని కంపకోట, దాని తరువాత అగాధమైన కందకము, దాని వెనుక చాలా మందపాటి, చాలా ఎత్తయిన,పగలకొట్టి చొరబడరానిదైన మట్టికోట, తరువాత వంద వేల శతఘ్నుల పేల్చినా ఏమాత్రం చెడిపోకుండా, దాడికి లొంగని రాతికోట, దాని పక్కన దానికి ఏ మాత్రం తీసిపోని భూమి కోటలుండి ఏకశిలానగరమని తలిస్తే చాలు గుండె దిగులు పుట్టేలా ఉన్నది.
భూమి కోటకు నాలుగు దుర్గపు ద్వారాలు, వాటి పక్కనే ఎనిమిది చిన్న వాకిళ్లున్నాయి. రాతి కోటకు నాలుగు దుర్గపు ద్వారాలు, ఎనిమిది చిన్న వాకిళ్లున్నాయి. పుట్ట కోటకు ఎనిమిది దుర్గ ద్వారాలు, 18 చిన్నవాకిళ్లున్నాయి. పనివాళ్ళు కూలి వాళ్ళు రాత్రింబగళ్ళు పనులు చేస్తూనే ఉన్నారు. కొంత మంది ఉదయం కొంత మంది రాత్రి వరుసగా అంచలంచలుగా ఎనిమిది సంవత్సరాల నుండి పని చేస్తున్నారు. అందుకే ఈ కోటలు కందకాలు ఇప్పటికి సిద్ధమైనాయి. అప్పుడు ఇవన్నీ సిద్ధమైనట్టు రుద్రమదేవికి తెలిసింది. రుద్రమదేవి దర్బారులోనికి వచ్చినప్పుడు కట్టడాలను పర్యవేక్షిస్తున్నప్పుడు, గుఱ్ఱపుస్వారీ చేసేటప్పుడు పురుషుల వలె దుస్తులు ధరిస్తుంది. ఆరోజు సిద్ధమైన కోటలను చూసేందుకు రుద్రమదేవి మగవేషం వేసుకొని, వెంట కొంతమంది తోడురాగా బయలుదేరింది. వాళ్ళంతా వరుసగా ఒక్కొక్క కోటను, వాటికున్న బురుజు ద్వారాలు, చిన్న వాకిళ్ళను, కందకాలను, అన్నింటినీ జాగ్రత్తగా చూపారు. రుద్రమదేవికి చాలా సంతోషం కలిగింది. ఆ కట్టడాలను కట్టిన పనివాళ్లు, కూలి వాళ్లు రుద్రమదేవిని చూసి నమస్కరించారు. పని చేయించేందుకు నియమించిన పెద్దపనివాళ్ళు రుద్రమదేవి గుర్రం వెంట నడుస్తూ ఆయా ప్రదేశాలను, కట్టించే టప్పుడు కలిగిన శ్రమను, చాలా సన్నని స్వరంతో రుద్రమదేవికి చెప్పి చూపిస్తున్నారు. చిన్న వాకిళ్ళలో, బురుజు ద్వారాలలో అమర్చిన తికమక దర్వాజలను చేతితో ముట్టి, కదిలించి రుద్రమదేవి స్వయంగా పరీక్షించి చాలా బలంగా ఉన్నాయనుకొని సంతృప్తి పడింది.
రుద్రమదేవి అన్ని చోట్ల భద్రంగా పరిశీలించి నగరానికి బయలుదేరింది. పనివాళ్ళు ఆమె వెంట నడిచారు. ఆమె అంతరంగికులు వెంట నడిచారు. కొన్ని ఘడియలలో వారంతా నగరం చేరారు. రుద్రమదేవి రాజదర్బారులోనికి వచ్చి, వజ్రాల సింహాసనం మీద కూర్చున్నది. ఎప్పటివలె సభ్యులంతా వారివారి స్థానాలలో కూర్చున్నారు. లెక్కలు రాసే వారిని పిలిపించారు. రుద్రమదేవి ఆజ్ఞతో లెక్కలు వ్రాసేవారు, పనివాళ్ళ కూలి, వాళ్ళ జీతాలు మొత్తం లెక్క చేసి ఇచ్చిన డబ్బు తీసేసి , మిగిలిన డబ్బులు లెక్క చెప్పి రుద్రమదేవికి చూపించారు. రుద్రమదేవి కోశాధికారికి ఉత్తరం రాసి పని వాళ్లకు ఇవ్వవలసిన డబ్బును, మరి కొంత ధనాన్ని తెప్పించి వరుసగా అందరికీ లెక్క చొప్పున పంచి పెట్టింది. తరువాత ఒక్కొక్క పని వానికి వాడు చేసిన పని తెలుసుకొని కొంత బహుమతిని తన చేతితో పంచి, వారందరినీ పంపి వేసింది. పని వాళ్ళంతా చాలా సంతోషంతో దీవిస్తూ, పొగుడుతూ, సంతోషంతో కేకలు వేస్తూ రుద్రమదేవికి నమస్కరించి వెళ్లిపోయారు.
తరువాత రుద్రమ్మ కొలువులో ఉన్న తన సేనా నాయకుల పేర్లు పెట్టి పిలిచింది. వెంటనే వాళ్లంతా తమ ఆసనాల నుండి లేచి నిలబడ్డారు. అప్పుడు రుద్రమదేవి గంభీరమైన కంఠంతో ఇలా చెప్పటం మొదలు పెట్టింది.
సైన్యాధికారులారా! ఈనాటికీ మన ఏకశిలా నగరానికి ప్రసిద్ధమైన కోటలుండే భాగ్యం కలిగింది. ఎన్ని కోటలు, ఎన్ని కందకాలున్నా వాటి రక్షణభారం వీర భటులు చేయకుంటే ప్రయోజనం ఉండదు.మనలను ఎదిరించ లేరనుకొని ఊరికే ఉండటం మంచిది కాదని మా నాయన గారి హితవచనం.
అందుకు మనం పూర్తి శ్రద్ధ కలిగి కోటలను రక్షించడంలో ఏకశిలానగరం అందరికీ ఆదర్శంగా ముందుండాలి. దానికి నేను చెప్పేది ఏమిటంటే కోట గోడకు ఆధారంగా వేసిన కొరడు ( కోటకు అవతలివైపు ఉన్న మట్టి దిమ్మ) మీద రక్షణ బాధ్యత రాజ బంధువులలోని ముఖ్యులైన వీరుల ఆధీనంలోనూ, భూమి కోటలోని రక్షణ బాధ్యత మిగిలిన బంధు వీరుల ఆధీనంలో ఉంచాలి. జన్నిగ దేవసాహిణి తను చెప్పిన మాట వినే సేనలోని వారిని భూమి కోటలోని ఎనిమిది చిన్న వాకిళ్ళకు ఒక్కొక్క వాకిలికి ఐదు వందల మంది చొప్పున,18 చిన్న వాకిళ్ళకు ప్రతి ఒక్కొక్క వాకిలికి 100 మంది వీరభటుల చొప్పున, బురుజు ఒక్కదానికి 500 మంది వీర భటులను నియమించి, రాతికోటలోని నాలుగు బురుజుల, ఎనిమిది చిన్న వాకిళ్ళను రక్షించాలి.
అంబయ్య దేవ మహారాజు ఆదేశాల ప్రకారం సైనికులను అక్కడ ఉంచి, మట్టి కోటను రక్షించాలి.
గోనగన్నారెడ్డి తన అధికారం కింద ఉన్న సైనికుల నుండి కోటకు రెండు వైపులా నుంచి కోటను రక్షించాలి.
దాదియ సోమయ సాహిణి తన సైన్యం నుండి బూడిద ఒకటికి యాబై మందిని నిలపాలి. రుద్రమ నాయుడు నాగచమూపతి ఇద్దరూ యుద్ధానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయించాలి. మిగిలిన సేనానులు కంప కోటను, కందకాలను కాపలా కాయాలి. మనకు ఇప్పుడు ఎటువైపు నుండి కానీ యుద్ధం జరుగుతుందనే అనుమానం లేదు. కానీ దుర్మార్గుడైన మహాదేవరాజు విషయంలో మాత్రం కొంచెం అనుమానం ఉన్నది. అతని దుష్టస్వభావంతో నిస్సహాయులైన మమ్మల్ని పట్టుకుని తీసుకొని పోవాలి అనుకున్నాడు. హఠాత్తుగా మన మీద దండెత్తి వస్తాడనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అతను దండెత్తి వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. మనం జాగ్రత్తగా ఉంటే అంతా భద్రంగా ఉంటుంది.
రుద్రమదేవి చెప్తున్నప్పుడు సేనా నాయకులు తమకు అప్పగించిన పనులను, తమ రక్షణ కిందకు వచ్చిన కోటలను కాగితాల మీద రాసుకున్నారు. రుద్రమదేవి తాను చెప్పగలిగిన మాటలను చెప్పి ముగించగానే సేనా నాయకులందరూ ఒక్కసారి సింహనాదాలు చేసి తమ చేతులలో ఉన్న బరికత్తులను తళతళమని మెరిసేటట్లు ఊపారు. తర్వాత సభను ముగించారు.ఎవరి ఇళ్లకు వారు వెళ్లారు. సేనానాయకులు రాణిగారి ఆజ్ఞ ప్రకారం ఆయా చోట్లలో సైన్యాన్ని నియమించి, వారు శ్రద్ధగా ఉన్నట్టు గమనించి వచ్చి రాణికి తెలుపుతున్నారు.
కొన్ని రోజులు గడిచాయి. ప్రతిరోజు సభలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటివలె ఆ రోజు రాత్రి రుద్రమదేవి సభ తీర్చి ఉన్నది. రాజ దర్బారంతా సభ్యులతో కిక్కిరిసి నిండి ఉంది. రకరకాల విషయాలు చర్చిస్తున్నారు.
ఇంతలో ఒక యువభటుడు గబగబా వచ్చి, రాణీకి మొక్కి, సభలోని వారందరూ, రాణి గారు వినేటట్టుగా బిగ్గరగా ఇలా చెప్పాడు.” శౌణదేశాధీశ్వరుడైన మహాదేవరాజు గొప్ప సైన్యంతో దేవగిరి నుండి వస్తున్నాడు” మన ప్రాంతానికి ఇంకా నాలుగైదు రోజులలో ఇక్కడికి చేరగలడు. ప్రభువు ఆజ్ఞతో ఇతర దేశాల నుండి వచ్చే రహదారులను మేము కాపలా కాస్తున్నాం. అక్కడి పరిస్థితి చూసి వచ్చిన సంగతి ఇది. తర్వాత ప్రభువులకు ఎలా అనిపిస్తే అలా జరుగుతుంది. మాకు అప్ప చెప్పిన పని చక్కగా చేసుకుని వచ్చాం.”
మంచిది! నువ్వు వెళ్లిపొమ్మని రుద్రమదేవి అన్నది. గూఢచారి నమస్కరించి వెళ్ళిపోయాడు. రుద్రమదేవి మంత్రి అయిన శివదేవయ్య వైపు చూసి ఏమో చెప్పబోయి, చెప్పదలుచుకున్న విషయం కాస్త రహస్యంగా ఉంచ తలుచుకొని, సేవకుడిని చూసి, ఓరీ! నువ్వు వెళ్లి ఇప్పుడు వచ్చిన గూఢచారిని పిలుచుకొని రా! అని చెప్పింది. సేవకుడు గబగబా నడిచివెళ్ళి ,వెళ్ళిన గూఢచారిని సభలోనికి పిలుచుకొని వచ్చాడు.
ఓరీ! మహాదేవరాజు దండెత్తి వస్తున్నాడని చెప్పావు కదా! అతని సైన్యం ఎంత ఉందో నువ్వు చెప్పగలవా? అని రుద్రమదేవి గూఢచారిని అని అడిగింది.
అయ్యా! నేను నిజంగా అతని సైన్యం ఎంత ఉందో చెప్పలేను. కానీ ఎంత దూరం చూసిన సైన్యమే కనబడుతున్నది. గుర్రాలను ఏనుగులను ఒకటొకటి లెక్క పెట్ట గలమా? మా పని శత్రుసేన కొంత దూరంగా ఉండగా చెప్పడం వరకే! అదే చేశానని గూఢచారి జవాబిచ్చాడు.
సరే !నువ్వు వెళ్ళి, మీలో ఒకడినిఅక్కడికి పంపి, సైన్యం ఎంత ఉందో సంఖ్య తెలుసుకుని రమ్మని చెప్పు! అని రాణి అన్నది. గూఢచారి వెళ్ళిపోయాడు. రుద్రమదేవి మంత్రితో ఇలా మాట్లాడింది.
చూశారా! మహాదేవరాజు దండెత్తి వస్తున్నాడట.పూర్తిగా కుటిల మనసున్న వాడైనాడని అనడానికి సందేహం లేదు.
తల్లీ! కాల మారినట్లు గుణాలు మారుతాయి! అయినా వాళ్లు చేసిన దానికి తగిన ఫలితం అనుభవిస్తారు. కారణం లేకుండా మన మీద కోపం పెంచుకుని, మీకు అపకారం చేయదలచి, అందులో విఫలమవడంతో అసూయతో మనసులు నింపుకొని, ఇలా చేస్తున్నాడు. ఇప్పుడు దండెత్తి రావడానికి అదే కారణం. నాకు ముందే అనుమానం వచ్చి, దేవగిరి తోవకు గూఢచారులను కాపలా పెట్టాను.
దండెత్తి వస్తే రానివ్వు! అతనికి ఎన్ని రోజుల నుండి యుద్ధం చేయాలనే ఆలోచన ఉన్నదో? దానిమీద కాకతీయుల పదునైన బల్లేల రుచి చూస్తాడు. కానివ్వు! అతని ఉద్ధతి ఎంత ఉందో? దాని ప్రకారం ప్రతీకారం జరగనీ! వెనుకటి వాళ్లు కాకతీయుల అగ్నివంటి ప్రతాపాన్ని చూశారు. కానీ రెండు తరాల నుండి వీరికి ఆ రుచి తెలియదు. ఇతడు కావాలను కోరి వస్తే అతనిని చిన్న పుచ్చడం ఎందుకు? మనం కోటలను మరమ్మతు చేయించడం, కొత్తకోటలు కట్టించడం, వాటి మీద గట్టి కాపలా పెట్టడం మంచి పని అయింది. ఒక్క మహాదేవరాజే కాదు వంద మంది మహాదేవ రాజులొచ్చినా ఓరుగల్లుకు నష్టం లేదు.
కోటలే కాదు… మీ శౌర్య ప్రతాపాలు…నేనేమి చేయగలను? మరొకడు ఏమి చేయగలడు? రాజులకు ప్రాణం సైన్యం. ఉదారంగా పౌరుషవంతులైన శూరులు రాజ్యాన్ని దక్కించుకుంటే రాజ్యం దక్కుతుంది.
అందుకోసం మన సేవకులంతా సిద్ధంగా ఉన్నారు. కంఠనాళంలో రక్తప్రసారం జరుగుతున్నంతసేపు యుద్ధం చేసి, తమ ప్రభువును గెలిపించడమే వారి పనిగా మన సైనికులు యుద్ధం ఎప్పుడా? అని ఎదురు చూస్తున్నారు.
వీరిద్దరూ అలా మాట్లాడుతూ ఉండగా ఒక్క గూఢచారి సభలోనికి వచ్చి, రుద్రమదేవికి నమస్కరించి, అయ్యా! మహాదేవరాజు దండెత్తి వస్తున్న విషయం ఇంతకు ముందే నా తోటి ఉద్యోగులు మీకు తెలిపి ఉన్నారు. నేను సేనా సంఖ్య ఎంత ఉందో తెలుసుకొని వచ్చాను. మహాదేవరాజు సైన్యం మొత్తం మూడు లక్షలు. యుద్ధ సామాగ్రి, వస్తు సామాగ్రి చాలా ఉన్నది. సైన్యం ఇక్కడికి రావడానికి నాలుగు రోజులు పడుతుందని చెప్పాడు.
మంచిది! నువ్వు నీ పని మీద వెళ్ళు! అని రుద్రమదేవి అతనిని పంపి…
మంత్రిగారూ! మన సైన్యం ఎంత ఉంది? మహాదేవ రాజు సైన్యం మూడు లక్షలట! అని అన్నది.
తల్లీ! అయితే ఏం? బురుజులపైనా, కందకాలపైనా, చెట్లకొమ్మలపైనా ద్వారాల దగ్గరా, చిన్న తలుపుల దగ్గరా ఉన్న సైన్యం కాకుండా… మిగిలిన సైన్యం రెండు లక్షల డెబై వేలని నిన్న మన సేనా నాయకులు లెక్క ఇచ్చారు. కాపలా కాసే వారి సంఖ్యతో కలిసి మూడు లక్షల కన్నా ఎక్కువే ఉంటుంది. వస్తుసామగ్రి కూడా చాలా ఎక్కువగానే ఉంది. మూడు ,నాలుగు సంవత్సరాలు విరామం లేకుండా యుద్ధం చేసినా తక్కువ పడదు.
మనం ఒక్కసారి సైన్యం చూసి వస్తే బాగుంటుంది కదా! నాగచమూ నాయకులు మన వెంట వస్తారు.
సరే!
రుద్రమదేవి లేచి నిలబడింది. సభ్యులందరూ లేచి నిలబడ్డారు. రుద్రమదేవి భూమి కోట బురుజు ద్వారం దగ్గరకు నడిచింది. మంత్రి , సేనాధిపతులు వెంట నడిచారు. తక్కిన సభ్యులు వారి వారి ఇళ్లకు వెళ్ళారు.
పదమూడవ ప్రకరణ
[ సంధి ]
శ్లో॥ అపనీత శిరఃస్త్రాణాః శేషాస్తుం శరణం యయౌ ;
ప్రణిపాత ప్రతీకారః సంరంభోహి మహాత్మనాం !
— (రఘువంశము)
భావం :– చచ్చిన వారు పోగా బ్రతికి ఉండే వారు టోపీలు తీసివేసి, ఆ రఘువంశ మహారాజును శరణుజొచ్చారు. మహాత్ములు శత్రువుల గర్వం అణిచివేయడంలోనే దృష్టి ఉంచుతారు. కానీ వారు వినయంగా ఉండే వారిని, ముందటి వలె చంపాలనే కోపం ఉండదు కదా!
వ్యాఖ్య:– ఈ రఘువంశంలోని శ్లోకం ప్రకరణ మకుటంగా గ్రంధకర్త తీసుకోవడం, రుద్రమదేవి నవలలోని రుద్రమదేవి- మహాదేవరాజు మధ్య గల సంధిని సూచిస్తూ, కథార్ధ సూచిగా ఎంతో చక్కగా అమర్చారు.
ఈ శ్లోకాన్ని చదువుతూనే కథలోని మలుపులు తెలుస్తునాయి.ఈ విశేషమైన ప్రక్రియ అరుదుగా కనిపిస్తుంది.
కథాభాగం:– మహాదేవరాజు సైన్యం ఓరుగల్లు కోటను ముట్టడించింది. ఏనుగులు, గుర్రాలు వీరభటులు ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కనపడుతున్నారు. మహాదేవరాజు మూడు లక్షల సైన్యంతో ఓరుగల్లును ముట్టడించి, పదిహేను రోజులు అయింది. ప్రతిరోజు రుద్రమదేవి సైన్యానికి మహాదేవరాజు సైన్యానికి యుద్ధం జరుగుతూనే ఉన్నది. రెండు వైపులా సైన్యంలో సైనికులు చనిపోతున్నారు.
ఈరోజు పదిహేనవ రోజు యుద్ధం మొదలైంది. రుద్రమదేవి మగవేషంతో ఉత్తమజాతికి చెందిన గుర్రాన్నెక్కి పౌరుషానికి మారురూపుగా వచ్చిందా? అన్నట్టుగా చూడ శక్యం గానంతగా యుద్ధభూమిలో తిరుగుతూ, కనపడ్డ శత్రువులందరిని చంపి వేస్తున్నది. రుద్రమదేవి సేనానాయకులలో ముఖ్యులైన రుద్రమ నాయుడు వెలమ సైనికులకు, నాగచమూపతి కమ్మ సేనకు అధికారులై తమ సైన్యాన్ని ప్రోత్సహిస్తూ వీరవిహారం చేస్తున్నారు.
జన్నిగదేవ సాహిణి, త్రిపురాంతక మహాదేవ రాజు, అంబయ్య దేవమహారాజు, గోనగన్నారెడ్డి, దాదియ సోమన సాహిణి మొదలైన సేనానాయకులు ఎవరూ దగ్గరకు రావడానికి సాహసించ లేనంత భయంకరంగా యుద్ధం చేస్తున్నారు.
రుద్రమదేవి అల్లుండ్లైన ఇందులూరి అన్నమ రాజును, చాళుక్య వీరభధ్రుడు రాజును తన సైన్యాన్ని ప్రోత్సహిస్తూ, యుద్ధభూమిలో తిరుగుతూ, శత్రుసైన్యం గుడారాలను, శత్రువులను కింద మీదలు చేస్తున్నారు. మల్యాల గుండాదీశ్వరుడు మహాదేవరాజుతో యుద్ధం చేస్తున్నాడు. రుద్రమదేవి ముఖ్యమంత్రి అయిన శివదేవయ్య వయసురీత్యా ముసలివాడైనా యువకునివలె యుద్ధం చేస్తున్నాడు. గుండ ధరాధీశ్వరుని తమ్ములైన మల్లయ్య, బుద్ధయ, కోటయ్య, పిడుగు గుండయలు నాలుగు వైపులా తిరుగుతూ యుద్ధం చేస్తున్నారు. ప్రసాదాదిత్య నాయకులు మొదలైన సేవక వర్గం తమవెంట ఎవరైనా తోడుగా వస్తున్నారా? లేదా? అని చూడకుండా యుద్ధం చేస్తూ ఉన్నారు.
మహాదేవరాజు మంత్రి అయిన సాధులుడు, సేనాపతులైన భోళేశ్వరడు, రామశర్మ, బిచ్ఛణుడు మొదలైన వారు, కొంకణ దేశపురాజు, ఘూర్జర దేశపు అధినేతైన లవణప్రసాదుడు మొదలైనవారు చెలరేగి యుధ్ధం చేస్తున్నారు. ఇంకా ఎందరో మహాదేవరాజుకు సహాయం కోసం వచ్చిన మాండలికులు వీరవిహారం చేస్తున్నారు. రెండు వైపుల వారు విజయం మాకే కావాలనే కోరికతో గుంపులతో దొమ్మి యుద్ధం చేస్తున్నారు. యుద్ధం తీవ్ర రూపం దాల్చింది.
మధ్యాహ్నం రెండు జాములయింది. చెట్ల కొమ్మల మీద, బురుజుల మీద ఉన్న ఓరుగల్లు సేన మహాదేవరాజు సైనికుల మీద బాణాల వర్షం కురిపిస్తున్నది.
రుద్రమనాయుడు, నాగ చమూపతి తమ పరివార మైన వెలమ,కమ్మ వారిని వెంట తీసుకొని, దేవగిరి దళాన్ని ఎదుర్కొన్నారు. వారి పరాక్రమం చెప్పలేనంతగా ఉన్నది.
మల్యాల గుండదండధీశ్వరుడు శౌణ దేశాధీశ్వరులిద్దరూ కత్తి యుద్ధం చేస్తున్నారు.వారిద్దరి శరీరాలు రక్తంతో తడిసి, ఎర్రని పూలతో ఉన్న మోదుగ చెట్ల వలె కనపడుతున్నారు. యాదవరాజు పదునైన బల్లేన్ని తీసుకొని గుండ దండాధీశ్వరుని గుర్రాన్ని నరికి వేశాడు. అతడు కొంచెం కూడా తొట్రు పడకుండా పదునైన ఖడ్గం తీసుకొని మహాదేవరాజుపైకి ఉరికి అతనెక్కిన ఏనుగును కొట్టాడు. తొండం తెగిపోవడంతో ఆ ఏనుగు గీ అంటూ అరుస్తూ నేలమీద కూలిపోతున్న ది. వెంటనే మావటిని తల నరికేసి, నేలమీదికి దుముకుతున్న శౌణదేశపు రాజును చంపాలని, గుండ దండాధీశ్వరుడు కత్తిగిరగిరా తిప్పి విసిరాడు.
మహాదేవరాజు అతని కత్తి వేటునుండి తప్పించుకొని, యుద్ధం చేయడం మొదలు పెట్టాడు. దండాధీశ్వరుడు పరిశ అనే ఆయుధాన్ని మహాదేవరాజుపై విసిరాడు. ఆ దెబ్బకతను సొమ్మసిల్లి నేల మీద పడ్డాడు. గుండ దండాధీశ్వరుడు సింహనాదం చేశాడు. దేవగిరి సైనికులు భయపడ్డారు. మహాదేవరాజు వెంటనే తెప్పరిల్లి చీకటిని గిరగిరా తిప్పి దండాధీశ్వరుని పైకి విసిరాడు. ఆ కత్తివేటుకు కంఠానికి తాకినందున అతడు నేలపై పడి ప్రాణాలు విడిచాడు .
అన్న అలా నేల కూలాగానే తమ్ముళ్లు ఒక్కసారిగా యాదవరాజుపై కలియబడ్డారు. శౌణదేశాధిపతికి సహాయంగా లవణప్రసాదుడు, మంత్రి అయిన సాధులుడు వచ్చి కలిశారు. రుద్రమదేవి సేనా నాయకులను చుట్టుముట్టినందు వల్ల వాళ్లు రాజుకు సహాయం చేయలేకపోయారు.
గుండదండాధీశ్వరుని తమ్ముళ్లు ఐదుగురు ఎదురు నిలిచి యుద్ధం చేస్తూ మంత్రిని మూర్ఛ పోగొట్టారు. రుద్రమదేవి యాదవ రాజున్న దగ్గరికి దుర్గాదేవి ప్రత్యక్షమైందా అన్నట్లు భయంకర రూపంతో వస్తూ ఉండగా… తోవలో సేనా నాయకుడైన దాదియ సోమయ సాహిణి వీరమరణం పొందాడనే పిడుగు లాంటి ఆ వార్త విని మళ్లీ వచ్చిన చోటికి వెళ్ళి పోయింది రుద్రమదేవి.
గుండ దండాధీశ్వరుని తమ్ముడు శౌణదేశాధిపతిని చుట్టుముట్టి, మూర్చ పోయిన అతనిని కోటలోనికి మోసుకొని పోతున్నారు. వెలమ, కమ్మ వీరులు పరాక్రమంతో శత్రువులను మట్టి కరిపిస్తున్నారు. సైన్యం ఉత్సాహంగా, బలంగా ఉన్నది. అయినా ఓరుగల్లు సైన్యం అలిసిపోయింది. కానీ బింకం తగ్గలేదు. ఇంతలో” ” శత్రువులను చుట్టు ముట్టండి! వీరులకు వీరస్వర్గం కన్నా మించిన మంచి మార్గం లేదు!” శూరులకు వీర విహారమే ఉత్సాహంగా ఉంటుంది.” పోరాడి పోరాడి విజయం సంపాదించినా, వీరమరణం పొందినా మీ కీర్తి శాశ్వతంగా ఉంటుంది!” యుద్ధభూమిలో భయపడి,పారిపోయి మీ ఇండ్లకు శరణార్థుల వెడితే మీ భార్యలు మిమ్మల్ని ఆడవారి కన్నా ఎక్కువ హీనంగా చూస్తారు.” మన పూర్వీకుల పౌరుష చరిత్రలు మీ మనసులో జ్ఞాపకం చేసుకోండి!” ధైర్యాన్ని మీ సొంతం చేసుకోండి!” శత్రువులు పెచ్చుమీరుతున్నట్టున్నారు. వారి పొగరు అణచండి. అని గంభీరంగా అంటూ రుద్రమదేవి అక్కడికి వచ్చింది.
తమ రాణిని దగ్గరగా చూడగానే సైన్యంలో కొత్త ఉత్సాహం నిండి, ఏనుగంత బలం కలిగి,” హరహర ” అంటూ ఒక్కసారిగా శత్రువుల మీద పడ్డారు. అప్పటి ఆ యువ సైన్యాన్ని వర్ణించటం , దేనితో పోల్చాలో వర్ణించడానికి భాష చాలదు.
కోట బురుజుల మీద, కందకాల మీద, చెట్ల కొమ్మల మీద ఉన్న సైనికులు వచ్చి చేరారు. బురుజుల దగ్గర, చిన్న వాకిళ్ల దగ్గర కాపలా ఉన్న సైన్యంలో సగం సైన్యం వచ్చి, చేయూతనిచ్చింది. కోటలో ఉన్న మూలబలం కూడా కేకలు వేస్తూ వచ్చి చేరింది.
రుద్రమదేవి సైన్యం చాలా పెద్దదై శత్రువులను నరికి వేస్తున్నది. తళతళ మని కత్తులు మెరుస్తున్నాయి. తటతట మని తలలు తెగి కింద పడుతున్నాయి. ఇలా రెండు ఘడియల కాలం యుద్ధం చేసేసరికి వెలమనాయకుల, కమ్మ నాయకుల శౌర్యానికి తట్టుకోలేక అక్కడ ఉన్న శత్రువులు పారిపోయారు. రుద్రమదేవి సైన్యం వెంట పడగా… శౌణదేశపు సైన్యం అటు ఇటు పారిపోయింది.
అప్పుడు రుద్రమదేవి అక్కడ సైన్యాన్ని పంపి వేసి, ఉత్తర దిక్కున పోరాడుతున్న వీరుల వైపు తన సైన్యంతో వెళ్లి వారితో యుద్ధం చేసింది.
గుండ దండాధీశ్వరుని తమ్ములైదుగురు రాజును మూసుకొని పోయిన సమాచారం సేనాని అయిన బిచ్ఛణుడు విని, కోపంతో గబగబా వెళ్లి వారితో కలియబడ్డాడు. వాళ్ళు శౌణరాజును విడవకుండా సైన్యాన్ని ఎదుర్కొన్నారు. సైన్యాధిపతి కోపంతో వింటితో బాణాలు ఎక్కుపెట్టి పిడుగు గుండయ్య, విట్టల అయ్యను పడగొట్టాడు. మిగిలిన ముగ్గురు బిచ్చనుడితో యుద్ధం చేస్తున్నారు.
ఇంతలో శౌణరాజు మూర్ఛ నుండి తేరుకున్నాడు. శౌణరాజు తననెవరో మోసుకొని పోతున్నట్టు తెలుసుకొని, కోపంతో మండిపడుతూ నేలమీదకు దుమికాడు. వెంట ఖడ్గాలు చేతిలో పట్టుకొని, మల్లయ్య, బుద్ధయ, కోటయ్యలపై కలియబడేంతలో బిచ్ఛనుడు ప్రాణాలు విడిచాడు. సేనాని పరిస్థితి చూసి, కోపంతో శౌణరాజు ఖడ్గాన్ని తీసుకొని, ఆ ముగ్గురు వీరుల మీద పడి చాలా నొప్పించాడు. కొంతసేపటికి వాళ్ళు ముగ్గురు నిలువలేక పారిపోయారు.
శౌణదేశపు రాజు రుద్రమదేవి దగ్గరకు పోవాలనుకొని తలెత్తి చూశాడు. అప్పుడు అతనికి కలిగిన కలత అంతా ఇంతా కాదు. తన సైన్యం దెబ్బతిని పారి పోతున్నట్లు, రుద్రమదేవి, ఆమె సైన్యం తన సైన్యాన్ని తరుముతున్నట్లు, అతడు చూశాడు.ఎంత ప్రోత్సహించినా తన సైన్యం యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉన్నది అనుకోని, తన సైన్యం చాలా తక్కువ గానూ, రుద్రమదేవి సైన్యం చాలా ఎక్కువగా ఉన్నట్లు, ఆమె సైన్యంతో ఎదుర్కొంటే ప్రాణాలు దక్కవని, అతడు తెలుసుకున్నాడు.కాలం కలిసి రానప్పుడు తాను మాత్రం ఏం చేయగలడు. రుద్రమదేవికి ఆమెకు సంబంధించిన వారికి కనిపించకుండా ఒదిగి ఒదిగి ఒక పక్కనుండి పారిపోయాడు.
రుద్రమదేవి శౌణసేనను కొంతదూరం తరిమివేసి, మళ్లీ యుద్ధభూమికి వచ్చింది.దేవగిరి రాజును పట్టుకోవాలని ప్రయత్నించింది. కానీ అతడు కనపడక పోవటంతో మరలి వచ్చింది. ఆమె చుట్టూ సేనా నాయకులు, మిగిలిన సైన్యం నిలబడ్డారు. రుద్రమదేవి తన చుట్టూ మూగిన సైనికులను చూసింది. పెద్ద మొత్తంలో చనిపోయిన సైనికుల గురించి బాధ పడింది. సేనానాయకుడైన దాదియ సోమయ సాహిణియొక్క, గుండదండాధీశ్వరుని యొక్క,అతని తమ్ములయొక్క, మరికొందరు ప్రసిద్ధులైన వీరుల మరణం, మంత్రి అయిన శివదేవయ్య చాలా గాయపడడం ఆమెకు చాలా బాధ కలిగించింది. అప్పుడు ఆమె ఇలా అన్నది.
” ఓ! రాజభక్తి కల సైనికులారా! ఈరోజు మీరు నాకు విజయం కలిగించినా, వీరమరణం పొందిన సైన్యం, సైన్యాధికారులు, వీరులను పోగొట్టుకోవడం నాకు బాధను కలిగించారు. కులదైవంతో సమానమైన ముఖ్యమంత్రి శివదేవయ్య గారు గాయాల పాలవడం చాలా విచారకరం!శౌణదేశపు రాజు మనకు చిక్కకుండా దొంగవలె పారిపోయాడు. అతని పట్టుకోకుండా ఇల్లు చేరవద్దు! నేను సైన్యానికి ఆధిపత్యం వహించి, అధికారిగా ముందుకు నడుస్తాను. మిగిలిన సైనికులు, గాయపడిన వారు నా వెంట రావాలి! అని పెద్దగా అన్నది. సైనికులు, సేనాపతులు సరేనన్నారు.
రుద్రమదేవి గాయపడ్డ సైనికుల కొరకు మంత్రిని కోటకు పంపించి, గాయపడిన వారికి చికిత్స కోసం తగిన ఏర్పాట్లు చేయించింది. కోట నుండి భోజనం తెప్పించింది. వాళ్లంతా స్నానం చేసి , భోజనం చేసి, యుద్ధానికి సిద్ధమై శౌణదేశపు సైన్యం వెంటపడి, మహాదేవ రాజును పట్టి తేవాలనే గట్టి పట్టుదలతో నడిచారు.
ముందు దేవగిరి సైన్యం, వెనుక రుద్రమదేవి పరివారం నడుస్తున్నది ఓరుగల్లు సేన ఉన్న సంగతి శౌణ సైన్యానికి తెలియదు. గెలువలేక పోతిమనే విచారంతో, దేవగిరి రాజు పోయి పోయి రుద్రమదేవి రాజ్యం పొలిమేర దాటి,శౌణదేశపు ప్రాంతంలో ఒకచోట సైన్యాన్ని నిలిపి వేశాడు. అలసట తీరుతుందని, విడిపోయిన సైన్యం వచ్చి కలుస్తుందని రెండు రోజులు అక్కడే ఉన్నారు. ఆనాటి సాయంకాలమే విడిపోయినా కొంత సైన్యం, వస్తు సామాగ్రితో ఉన్న బండ్లు వచ్చి కలిశాయి. మూడు లక్షల సైన్యంతో వెళ్ళిన మహాదేవరాజు పదివేల కన్నా తక్కువ సైన్యంతో తన దేశపు పొలిమేర చేరి నిలిచాడు.
శౌణదేశపు సైన్యం తెల్లవారిన తర్వాత మేలుకొని చూసేసరికి ఏమున్నది? వారి చుట్టూ ఓరుగల్లు సేన ఉన్నది. తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎదిరించి యుద్ధం చేయడానికి రుద్రమ సైన్యం ఎక్కువగా ఉన్నది. ఆలస్యంగా ఈ వార్త రాజుకు తెలిసింది విచారంతో మహాదేవరాజు మంత్రులను, ముఖ్యులను పిలిపించి చేయవలసిన పనులు విచారించాడు. వాళ్లు తమ అభిప్రాయాన్ని రకరకాలుగా చెప్పారు. ఎవరి అభిప్రాయం అయినా యుద్ధం చేయటానికి సైన్యం సుముఖంగా లేదని…
చివరకు వారంతా సంధి కుదుర్చుకోవడం మంచిదని నిశ్చయించుకున్నారు. దేవరాజు రాయబారం నడిపేందుకు భోళేశ్వర సైన్యాధిపతి నియమించి చెప్పవలసిన విషయాలన్నీ అతనికి చెప్పి, రుద్రమదేవి వద్దకు పంపాడు.
భోగేశ్వరుడు ఏ ఆయుధాలు వెంట తీసుకొని పోకుండా. రుద్రమదేవి సైనిక గుడారంలోనికి వచ్చాడు.సైన్యం అతనిని అడ్డగించ లేదు. రాయబారి రుద్రమదేవి గుడారం దగ్గరకు వచ్చి , ద్వారపాలకుడితో తను వచ్చినట్లు లోపలికి తెలియజేశాడు. ద్వారపాలకుడు తిరిగివచ్చి భోళేశ్వరునికి రాణి అనుమతి తెలిపాడు. భోళేశ్వరుడు గుడారం లోనికి వెళ్ళాడు.
రుద్రమదేవి ముఖ్యులతో అంతరంగిక సమావేశమై,భోళేశ్వరుడు రావడం చూసింది.భోళేశ్వరుడు బ్రాహ్మణుడని తెలుసు కాబట్టి తన సింహాసనం నుండి లేచి నమస్కరించింది. భోళేశ్వరుడు యధావిధిగా బ్రాహ్మణ ఆచారపరంగా ఆశీర్వదించి, రాజు వేషంలో ఉన్న రాణి మీది గౌరవం తెలిపాడు. తరువాత తనకు కేటాయించిన ఆసనం మీద కూర్చున్నాడు.
అప్పుడు రుద్రమదేవి భోళేశ్వరునితో ఈ విధంగా మాట్లాడింది.
” మీరు ఏ పని మీద వచ్చారు?”
దేవీ! మారాజు రాయబారం పంపించాడు.
ఏమని?
ప్రస్తుత విషయం గురించి.
ఆ… అర్థమైంది… ముట్టడించడం ఆపివేసి వెళ్లిపొమ్మని కావచ్చును . మా పై పన్నిన కుట్ర…
ఆ విషయాలన్నిటినీ దయతో క్షమించండి!
మంచిది !మేము మూర్ఖపు పట్టుదలతో లేము! సంధిని ఒప్పుకుంటాం! మాకు తలపెట్టిన కుట్ర క్షమార్పణ సరిపోయింది. ఇంకా రాయబారం మూడు మాటల్లో చెప్పనా? యుద్ధ ఖర్చుల కింద ఐదు కోట్లధనం, యాభై ఏనుగులు, వంద గుర్రాలు… ఏమంటారు? మీ రాజు ఒప్పుకుంటాడా?, లేక రాజునడిగి చెప్తారా?
సంధిని కుదుర్చుకుని, అపాయం లేకుండా తమ శౌణదేశపు సైన్యాన్ని తమ దేశానికి చేరవేసేందుకు భోళేశ్వరుడు మారుమాట్లాడకుండ ఒప్పుకున్నాడు.రుద్రమదేవి కూడా అంగీకరించింది.
రాయబారి సెలవు తీసుకొని వెళ్ళి,జరిగిన విషయమంతా రాజుకు తెలిపాడు.అతడు సంతోషించి, ఒప్పుకున్న ధనం,మొదలైన వాటిని రుద్రమదేవికి పంపించాడు.
రుద్రమదేవి జయశాసనాలను అక్కడ స్ధాపించి, సైనికులకు యాభై లక్షల హొన్నులను బహుమతిగా ఇచ్చి, దేవగిరిని ముట్టడించాలన్న ఆలోచన మానుకుని ఓరుగల్లు చేరింది.
(సమాప్తం)
[ విఫలత ]
( నిరుపయోగం )
అపరాధః సదైవస్య
నపునర్మన్తిణా మయమ్ ;
కార్యం సఘటితం యత్నాత్, దైవయోగాద్వినశ్యతి ”
— హితోపదేశం.
భావం:-అనగా నాకు కలిగిన వంచన మంత్రి యొక్క లోపం వల్ల కాదు. అది దైవకృతాపరాధం. ఏ హేతువు చేతనో బాగా ప్రయత్నం చేసిన పని దైవాధీనం వల్ల నశించింది. కాబట్టి మంత్రి యొక్క దోషం కాదు.
కథాభాగం:– తెల్లవారుజాము చాలా అందంగా ఉంది.తూర్పుదిక్కున ఎరుపు రంగు కనపడుతోంది.కాకులు తమ గూళ్ళను వదిలి అరుస్తూ వెళుతున్నాయి. పశువుల కాపరులు కట్టి వేసిన ఆవుల దగ్గరకు దూడలను వదిలి, కొంచెం పాలు తాగనిచ్చి, తరువాత దూడలకు పాలు అందకుండా దూరంగా కట్టివేసి, పాలు పితికి, కుండలను నింపుతున్నారు. గృహిణిలు నిద్ర లేచి రోజువారీ పనులు చేయడానికి పూనుకున్నారు.కొందరు పశువులను తోలుకొని ఊరి బయలు ప్రదేశానికి మేపడానికి వెళుతున్నారు. తెల్లవారితే ఏవైనా చెడు శకునాలు ఎదురవుతాయని, వాటివల్ల పనులకు అడ్డంకులు కలుగుతాయని, ప్రయాణాలు చేసేవారు ఇండ్ల నుండి బయలుదేరి వెళ్ళిపోతున్నారు.
ఊరివారు కొందరు రుద్రమదేవి నివసిస్తున్న ఇంటి దగ్గరకు వచ్చి, ఆ రాత్రి జరిగిన ఆ పనికి అందరూ బాధపడుతున్నారు. “ఇంత పని చేయడానికి ఎవరు సాహసించారు?” అని కొందరంటూంటే…ఇంకా కొంత మంది ” ఆ పని చేసేవాడికెంత గుండె ధైర్యం?” అని, ధర్మాత్మురాలైన రుద్రమదేవిని జైల్లో పెట్టారో? చంపేసారో? అయ్యో! అయ్యో!! అని కొందరు బాధపడుతున్నారు. కొందరు ఇంటి లోపలికి వెళ్లి చూసి వస్తున్నారు. కొందరు చుట్టుపక్కల చూస్తున్నారు. ఇలా ఇంటి చుట్టు వాతావరణం దీనంగా తయారయింది.
అక్కడ నుండి ముగ్గురు మగవారు ఒక మహిళ బయలుదేరి ఒకే తోవలో ఒకరి వెంట మరొకరు నడుస్తున్నారు. కొద్ది దూరం నడిచి వారు ఆ ఊరు దాటి చిక్కటి అడవిలోనికి వెళ్లారు. అలాగే కొంత దూరం నడిచి ఒక చోట కూర్చున్నారు.
ఆ ప్రదేశం ఎత్తుగా ఉన్న చెట్లు ఉండటం వల్ల, చిక్కటి పొదలు అల్లుకొని ఉండడం వల్ల రహస్య విషయాలు ఆలోచించు కోవడానికి తగినట్లుగా ఉన్నది. కాబట్టే ఆ నలుగురు ఆ స్థలానికి వచ్చారు. నేలంతా మొనతేలిన కంకర రాళ్ళు ఉండడం వల్ల గడ్డి ఏమంత ఎక్కువగా మొలువలేదు. అలా ఉండడం వాళ్ళకి ఆ స్థలం కూర్చోవడానికి వీలుగా ఉంది.
వారెవరో పాఠకులు ఆలోచించ అక్కరలేదు. ఒక్కడు మురారి దేవుడు, రెండవవాడు హరిహర దేవుడు, మూడవ వాడు ధర్మవర్తనుడు, ఆ మహిళ కమల. అక్కడ కూర్చొని ఇలా మాట్లాడు కుంటున్నారు.
ధర్మ:– చూశారా? పని అంతా ఎలా అయిందో? రుద్రమదేవి మగవాళ్ళను చంపి పుట్టిన ఆడమనిషి. ఆమెకు తెలిసిన అన్ని మాయలు మంత్రాలు మగవాళ్ళకి కూడా తెలియవు. ఏమీ తెలియనట్లుండే రుద్రమదేవి మన ప్రయత్నాన్ని మంట కలిపింది. నాకెందుకో మొదటినుండి అనుమానం గానే ఉన్నది.
మురారి:– నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఇంట్లో కట్టు వేసిన వారు ఎలా తప్పించుకున్నారు? చుట్టూ కాపలా ఉన్న వారు కంటిమీద రెప్పవేయకుండా కాపలా కాస్తున్నారు. అదే కాకుండా ఆ ఊరు చుట్టూ ఉన్న మన సైనికుల కనుగప్పి ఎలా తప్పించుకొని పోనిచ్చారు? ఇదంతా గారడి విద్యవలె ఉన్నది.కమలా! నువ్వు వాళ్ళ దగ్గర ఉన్నావు కదా! వారు ఎక్కడికి వెళ్లారు నువ్వు చూడలేదా?
కమల:– నాతో వారెప్పుడూ భయపడుతున్నట్లుగా మాట్లాడనేలేదు. రోజు ఎలా ఉన్నారో రాత్రి కూడా అలానే ఉన్నారు. మిమ్మల్ని వదిలి వెళ్లిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్లావని కూడా నన్ను అడగలేదు ప్రయాణం ఉందని మాత్రం చెప్పింది. తర్వాత రోజుటివలనే నిద్రపోయాం.
ఇంకా నాకు ఆశ్చర్యం కలిగింది. నేను చూస్తూనే ఉన్నాను. వెనుకనుంచి ఎవరో వచ్చే నా కళ్లను మూసి, నా నోట్లో గుడ్డలు కుక్కి నన్ను తాళ్ళతో కట్టి వేశారు. తర్వాత ఏమైందో నాకు తెలియదు.
హరిహర దేవుడు:– వాళ్ళు తగిన జాగ్రత్తలు ఉండి భయపడకుండా ఉన్నారు. కావలివాళ్లకు ధనమిచ్చి కట్లు విడిపించుకున్నారు కావచ్చును. లేకపోతే వీళ్లు కాకుండా లోపలికి వేరెవ్వరు రావడానికి కానీ పోవడానికి కానీ ఎలా వీలు చిక్కింది? మనం కూడా చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉన్నాం కదా!
కమల:– మొదట వాళ్ళకు ఈ సంగతి ఎలా తెలిసింది?
ఆనాడు ధర్మవర్తనుడు గారు చెరువుకట్టపై కూర్చుని ఉన్నప్పుడు చూసింది గూఢచారై ఉంటాడు.అతను మన గుట్టు బయట పెట్టాడా?
అయ్యో! అయ్యో! మన పని అంతా వెల్లిపాయలో కలిపిన చింతపండు లాగా అయింది కదా!
ధర్మ:– మన ఆశలన్నీ వ్యర్థమైనవి. మహాదేవరాజువద్ద మనం చెప్పినవన్నీ అబద్ధాలు అయినవి కదా! అయ్యో! ఎలా కావలసిన పని ఎలా అయ్యింది? ఆ నలుగురు మాట్లాడుకుంటు ఉండగా ఇద్దరు మగవారు వచ్చి నిలబడ్డారు. వారిని చూడగానే మురారి దేవుడు” మీరేం వార్తలు తెచ్చారు? శుభమా? అశుభమా? శుభమని అనుకోవడానికి వీలు లేకపోతే అది ఎలా కలుగుతుంది? మీరంతా మీ మీ పనుల మీద శ్రద్ధతో ఉన్నా కూడా రుద్రమదేవి ఎలా తప్పించుకొని పోయింది? ఇలా తప్పించుకున్నారని ఆలోచించడానికి అవకాశమే లేదని అన్నాడు.
అయ్యా! మీ ఆజ్ఞ ప్రకారం మేమంతా జాగ్రత్తగా ఇంటి చుట్టూ ఉన్నాం. ఇంటి నుండి పిల్లి కూడా బయటకు పోలేదని మేము ఖచ్చితంగా చెప్పగలం. మాలో తప్పు ఉంటే మమ్మల్ని శిక్షించండి. ఇంత జాగ్రత్తగా ఉన్నా కూడా “రుద్రమదేవి తప్పించుక పోయిందని మీరు చెప్పే దాకా మాకు తెలియదు. ఏమి చేయాలి? మాకు మాట దక్కని రోజు వచ్చిందని వచ్చిన ఇద్దరిలో ఒకడు అన్నాడు.
మరొక చిత్రమైన సంగతి జరిగింది. మీరు అడవిలో కావలి ఉంచిన సైన్యమంతా చనిపోయారని రెండవవాడు చెప్పాడు.
ఆ మాటలకు వారంతా అవాక్కయ్యారు.
ఎలా? ఎలా? సైన్యమంతా చనిపోయిందా? కటకటా! ఆ సైన్యాన్ని చంపిందెవరు? అని హరిహర దేవుడు అన్నాడు.
అయ్యా! ఏమని చెప్పేది? ఊరికే నాలుగువైపులా కావలి ఉన్న సైనికులను రెండు భాగాలుగా మారి ఓరుగల్లు తోవను కాపలా కాస్తూ ఒక సైనిక దళమూ, ఊరిని చుట్టుముట్టి మరొక దళమూ ఉన్నాం. అక్కడక్కడ ఇద్దరిద్దరినీ ఉంచాం. ఎప్పుడు కావాల్సి వస్తే సైగ చేయగానే తోడుగా రావాలని సైగలు ఏర్పాటు చేసుకుని ఎవరి పనుల మీద వారు ఉన్నాం. ఇంతలో గుర్రపు స్వారీ చేస్తూ ఎక్కడినుండో వచ్చారు. మేము ఊరి దగ్గరగా ఉన్నాం కాబట్టి వారు తప్పించుకొని పోతున్న వారనుకొని, వారి మీద దాడి చేశాం , కానీ వాళ్లు నలుగురు మగవారే! కటిక చీకటిలో వాళ్ళను మగవారిగా పోల్చుకోలేదు. పోల్చుకుంటే వారిని ఎదుర్కొనే వాళ్ళం కాదు. ఆ వీరుల శౌర్యం చెప్పనలవికాలేదు. నలుగురు నాలుగు వైపులా మమ్మలను అవతలికి పోనీయకుండా నరికి వేయడం మొదలుపెట్టారు. కొన్ని ఘడియలలో మా సైన్యం పావువంతు మాత్రమే మిగిలింది. చీకటిగా ఉన్నా ఎలానో ఒకలాగ వారి నుండి తప్పించుకొని ఓరుగల్లు తోవను కాపలా కాస్తున్నవాళ్ళను పిలుచుకొని వచ్చేందుకు పోదామనుకునేసరికి శస్త్రాల చప్పుడేదో వినపించింది. పరిగెత్తుకొని అటు వెళ్ళాం. అప్పుడు ఓరుగల్లు సైన్యంతో మనవాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఓరుగల్లు సేన తక్కువగా ఉండి, మన సేన ఎక్కువ మంది ఉండటం వల్ల శత్రువులను ముందుకు రానీయకుండా అరికట్టి నిలిపాం. దాదాపు విజయం మాసొంతమైందని చెప్పవచ్చు. దాదాపు ఇరవై మంది దాకా చంపాం. ఏమనాలి? ముందు మాతో యుద్ధం చేసి, మమ్మల్ని తరిమిన ఆ నలుగురు వీరులు ప్రత్యక్షమై బాధించటం మొదలుపెట్టారు. వారు వచ్చి చాలా మందిని చంపారు. పది పదిహేను మందిమి మాత్రం మిగిలి, అటూ ఇటూ చెల్లాచెదురు అయిపోయాం. మేము కూడా ఊరిలో ఆ ఇంటి చుట్టూ ఉన్న వారితో కలిసి ఏ ఊరుకైనా పోదాం అనుకుని వస్తున్నాం. ఇంతలో ఇతడు కలిసి మీ జాడ మాకు చెప్పాడు. మేమిద్దరం ముందు నడిచి ఇలా వచ్చాం. వారు ఇప్పుడో, ఇంకాసేపటికో ఇక్కడికి వస్తారు. మీరు ఎలా చెప్తే అలా చేస్తానని అందరూ వినేటట్లు గా బొంగురు గొంతుతో అన్నాడు.
పనంతా తలకిందులైంది. మనలను వారు గుర్తుపట్టారా ఏమో? అని కొంచెం అనుమానం వస్తున్నది. ఒక్క పని చెడిపోయి, ఎంత మందికి బాధ కలిగించిందో కదా! మహాదేవరాజుకు, మాకు, కొందరు మాండలికాలకు చెప్తే కూడా తీరనంత ఆశాభంగం కలిగిందని మురారి దేవుడన్నాడు.
వాళ్లు మనను ఎప్పటినుండో కనిపెట్టి తిరుగుతున్నట్టున్నారు లేకపోతే అవలీలగా తప్పించుకోవడం సాధ్యమా? మన కాపలా వారికి లంచం ఇచ్చి ఉంటారు. రెండో దారి లేదు అని కమల అన్నది.
ఇంతలో మరి కొంత మంది మనుషులు వచ్చి నమస్కరించి నిలబడ్డారు. వారు రాగానే మురారి దేవుడు వారిని చూసి, మీరు ఇంత మంది మాత్రమే బతుక గలిగారా? ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు.
సరిగ్గా చెప్పలేం పది పదిహేను మంది చెల్లాచెదరై పోయి ఉంటారు. వాళ్ళందరిని వెతికి రమ్మని మన వాళ్ళను ఇద్దరు ముగ్గురిని పంపాను. వెతికి మనలను కలుస్తారని వచ్చిన వారిలో ముఖ్యుడన్నాడు.
ఇంకా మనం ఆలస్యం చేయవద్దు. ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. మన రహస్యం తెలుసుకుంటున్నవారు మనం ఉన్న చోటు తెలుసుకుంటారనడం నిజం! వాళ్లకు దొరికిపోయి, ఇగిలిగించడం కన్నా పరిగెత్తి వెక్కిరించడం మంచిది. లేవండి! వెడదామని ధర్మవర్ధనుడు అన్నాడు.
వారంతా ప్రయాణమైనారు. కమల కూడా వారి వెంటే ఉన్నది. వారంతా అడవిలో పడి ఒక పక్కగా నడుస్తున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు.నాలుగు వైపులా జాగ్రత్తగా చూస్తూ నడుస్తున్నారు.అర కోసు దూరం నడిచే టప్పటికీ వాళ్లకు ఆడవిలో జనాలు నడుస్తున్నట్టు చప్పుళ్ళు వినబడ్డాయి.ముందుకు నడవకుండా వాళ్ళు నిలిచి తమ చుట్టుపక్కల చూశారు. కొంతమంది బలిష్టులయిన వాళ్ళు కత్తులు పట్టుకొని వస్తుండటం చూశారు.వచ్చినవాళ్లు క్షణంలో చుట్టుముట్టారు. తప్పించుకుని పారిపోవడానికి అవకాశం చిక్కలేదు. అప్పటికి తగిన పని యుద్ధమే అనుకొని, ఒరల నుండి కత్తులను దూశారు. రెండు వైపుల వారికి పోరాటం జరిగింది. మురారి దేవుడు మొదలైనవారు కూడా మామూలు వ్యక్తులు కారు.యుక్తిగా యుద్ధం చేస్తున్నారు. వారి అనుచరులు కూడా యుద్ధం చేస్తున్నారు. వచ్చి చుట్టూ మూగిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో మురారి దేవుడు మొదలైన వారి శౌర్యంతో నిలువలేక గడ్డిపోచ మంటకు మాడిపోయినట్టు క్షణంలో నశించిపోయింది.
క్రమంగా మురారి దేవుడు, హరిహర దేవుడు, ధర్మవరధనుడు నేల మీద కూలిపోయారు.కొందరు సైనికులు చచ్చారు. మిగిలిన వారు తప్పించుకొని పారిపోయారు. కమల ఒక్కతే వారికి చిక్కింది. ఆ స్త్రీ ఎంత మాయామర్మాలు నేర్చుకున్నా పౌరుషానికి చిక్కితే ఏం చేయగలదు? ఆమెను వారు బంధించారు
కమల ఏడుస్తూ ఏమేమో మొర పెట్టుకుంటున్నది. వీరులు ఆమె మాటలను పట్టించుకోకుండా, జాలి పడక, కట్టిన కట్లు విప్పకుండా ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు.
పదవ ప్రకరణ
[ వార్త నిర్దేశనం]
ఏతదాఖ్యాంతితే సర్వే
హరయోరయోరామ సన్నిధౌ
వైదేహీ మర్షతాం శ్రుత్వా
రామ స్తూత్తరమబ్రవీత్
సుందరకాండ..65 సర్గ 3వ శ్లోకం
ఉవాచ వాక్యం వాక్యఙ్ఞ
సీతాయాదర్శనం యథా
సముద్రం లంఘమిత్వాఽహం
శతయోజనమాయతమ్
సుందరకాండ..65 సర్గ 5వ శ్లోకం
భావం:– వానరులు శ్రీ రాముని దగ్గరకు వెళ్లి సీతమ్మ రావణుడి అంతఃపురంలో బంధింప బడి ఉండడం, రాక్షస స్త్రీలు ఆమెను బెదిరించడం మొదలైన సమాచారమంతా రామునికి చెప్పి మౌనంగా ఉన్నారు.
రాముడు సీతాదేవి నాశనం చెందక క్షేమంగా ఉన్నదని విని వానరులను చూచి ఇలా అన్నాడు. హనుమ సీత ఇచ్చిన మణిని రామునకు సమర్పించి, తాను సీతాదేవిని చూసిన విధం చెప్పెను.నేను నూరు యోజనముల విస్తీర్ణం కలిగిన సముద్రం దాటి సీతాదేవిని చూడడానికి వెతుకుతూ పోయాను.
వ్యాఖ్య:–రామాయణం లోని సుందరకాండలోని సీతాన్వేషణ ఘట్టంలోని హనుమ సీతను చూసినట్లు రామునికి చెప్పినట్టు…
రుద్రమదేవి నవలలో ప్రకరణౌచిత్య శ్లోకం…రుద్రమదేవిని గోనగన్నారెడ్డి చూసినట్లు చెప్తూ…రాబోవు కథాసూచిగా చెప్తూ… మంగళాంతంగా ముగియనున్నట్లు గ్రంథకర్త ఇలా ఇతిహాసోపమానం ఇవ్వడం అనేక పురాణ, ఇతిహాసాల పఠనాసక్తి, పరిచయం ఉన్నట్లు తెలుస్తున్నది…
ఇది ఒక అపూర్వ ప్రక్రియ…ప్రకరణాలకు నామకరణం చేయడం పాఠ్యాంశంగా అభ్యాసానికి సులువైన పద్ధతి…
(రంగరాజు పద్మజ)
కథాభాగం:- ఓరుగల్లులో రుద్రమదేవి రాజదర్బార్ లో కూర్చుని ఉంది. ఆమెకు కుడివైపున ముఖ్యమంత్రి అయిన శివదేవయ్య, అతని తర్వాత కాయస్థ కులంలో పుట్టిన వాడు” బ్రహ్మరాక్షసుడు” మొదలైన బిరుదులున్న వాడైన మంత్రి, సేనాపతి రెండు పదవులను నిర్వహిస్తున్న జన్నిగదేవ సాహిణి, అతనికవతల కాయస్త వంశీకుడైన” ఏకంగా వీర, వీరావాతార” మొదలైన ఎన్నో బిరుదులున్న మంత్రి, సేనాధిపతి అయిన త్రిపురాంతక మహాదేవ రాజు, అతనికవితల వైపు ఇతని చిన్న తమ్ముడు “రాయ సహస్ర మల్ల” బిరుదు పొందిన గండికోట, ములికి, నాడు, రేనాడు,పెందాడి , పెడకట్ల, సకిలియెరువ, పొత్తపినాడు మొదలైన ప్రాంతాలను రుద్రమదేవికి ప్రతినిధిగా పాలిస్తున్న అంబ దేవమహారాజు, కూర్చుని ఉన్నారు.ఎడమ వైపున నాగదేవరాజు, ఇతని పక్కన రుద్రమదేవి అల్లుండ్లు విక్రమాఢ్యులైన అన్నమ దేవరాజు, చాళుక్య వీరభధ్రరాజు కూర్చుని ఉన్నారు. ఒకవైపు మిగిలిన సైన్యాధ్యక్షులు, మరొకపక్కన ఆస్థాన పండితులు, ఇంకో వరుసలో విదేశీయులు, ఇంకొక చోట ఉన్నతోద్యోగులు, మరోచోట రాయబారులు కూర్చున్నారు.
రుద్రమదేవి పొగలేని నిప్పు వలె భగభగమండి పడుతున్నది. ఆ సభలో ఉన్న వారికి ఆమె మనసులో ఏమి ఆలోచిస్తున్నదో తెలియడం లేదు. ఆమెను అటువంటి వేషంలో ఎవరూ.. ఎప్పుడూ.. చూడలేదు.సభలోనే కొందరు ముఖ్యులకు అసలు ఏం జరిగిందనే కారణం తెలుసుకోవాలని కుతూహలంతో ఉన్నారు. అయినా కానీ ప్రశ్నించడానికి ధైర్యం చేయలేదు.
శివదేవయ్య సభ్యుల మనసు తెలుసుకొని, తన ఆసనం నుండి లేచి, అందరూ వినేటట్లు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు.
” ఓ సభ్యులారా! భారతీయులకు సత్యం వంటి ఆభరణం ఇంకొకటి లేదు… బాహాటంగా యుద్ధంలో ఖడ్గంతో ఖడ్గం పోరాడి శత్రువును గెలవడమో? లేక శత్రువుతో ఓడిపోవడమో మాత్రమే ప్రజలు మెచ్చుకుంటారు.శాస్త్రం కూడా అదే ఒప్పుకుంటుంది దుర్మార్గులు ఈ పద్ధతిని విమర్శిస్తారు. అంతేకాదు మరింత చెడుతోవ తొక్కుతారు. మనకు తల్లితో సమానమైనది, ధర్మానికి మారూపైన మన రాణి గారి యొక్క ఉత్తమమైన ఉదార గుణాలతో, సేవకుల మీది వాత్సల్యంతో ఉండడం మన అందరికీ తెలిసిందే.
” శరణని వచ్చిన వారికి తల్లివలె కాపాడే శ్రీమతి రుద్రమదేవికి దేశంలో కొందరు దేశద్రోహులు కారణం లేకుండా పగబూని, ఈ కుట్ర పన్నారు. మనం పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యఫలం వల్ల మన రాణి చిక్కులలో పడిన కూడా శ్రమ పడకుండా బయటపడ్డారని చెప్పడానికి నాకూ, వినడానికి మీకు చాలా ఆనందంగా ఉన్నది. అయినా శ్రద్ధతో పనిచేస్తున్న శత్రువులకు పూర్తిగా దొరికిపోయి, ఎక్కువ శ్రమ లేకుండా తిరిగి రావడం అసంభవమని ఆ ద్రోహులను చూసి మీరు అనుకున్నారు కావచ్చు…..
ఇంతలో ఒకతను సభలోనికి త్వర త్వరగా వచ్చి, రుద్రమదేవికి నమస్కరించాడు. అతని వెంట ఒక మహిళ ఉన్నది. ఆమె తాళ్లతో కట్టి వేయబడి ఉన్నది. రాజభటులు ఆమెను కాపలా కాస్తూ వెంట నడుస్తూ వస్తున్నారు. మరి కొంతమంది కొన్ని పెట్టెలను తలపై పెట్టుకొని వచ్చి, రుద్రమదేవి ముందు దింపి, నమస్కారం చేసి పక్కకు పక్కకు ఒదిగి నిలబడ్డారు.
వచ్చినతను గోనగన్నారెడ్డి. ఇతడు రుద్రమదేవికి నమ్మకమైన బంటు.తనకు అప్పచెప్పిన పనికి వెనకడుగు వేయడు. పేరున్న గొప్ప వీరుడు. గోనగన్నారెడ్డి తన వెంట తీసుకొని వచ్చిన స్త్రీని, ధనమున్న పెట్టెలను రుద్రమదేవికి, సభలోని వారికి చూపించి ఇలా అన్నాడు.
ఈమె శత్రువుతో కుట్ర చేయమని పంపినదే అయినా, కాకతీయ రాణివాసం కొలుస్తూ జీవిస్తున్న దాసి కులంలో పుట్టిందనీ,శ్రీ గణపతి రాజరాజ రాజేంద్రుని దేవికి సేవలు చేసిన లలిత కూతురు అని, క్రీ.శ.1228 లో శ్రీ చక్రవర్తి గారు అద్దంకి సేనపై దాడి చేసినప్పుడు తన తల్లి, తాను శ్రీవారి వెంట ఉన్నామని, ఆ కల్లోలంలో తన తల్లి ఎక్కడో తప్పిపోయిందని, మొదలైన ఏవేవో కట్టుకథలు చెప్పి, తన పేరు మదనమంజరి అని చెప్పింది. దీని పేరు కమల. కానీ మదనమంజరి కాదు. మాయలు పన్నే ఈమె చెప్పిన చరిత్ర తన తల్లి గురించి కాకపోయినా, నిజమైన చరిత్ర కాబట్టి మన రాణిగారు నమ్మవలసి వచ్చింది. మన రాణి చాలా ఉపాయంగా ప్రశ్నలు వేసినా, మాయామర్మాలను బాగా వంట పట్టించుకున్న ఈవంచకురాలు ఆ ప్రశ్నలకు చిక్కక సరైన సమాధానాలిచ్చి, రాణి గారు అనుమాన పడకుండా చేసింది. నాకు మాత్రం మొదటి నుండి దీని విషయం కొంచెం అనుమానంగానే ఉంది. అందుకే నేను ఈమె విషయంలో శ్రద్ధతో గమనిస్తున్నాను. కొన్ని రోజులకు రాణిగారు తమ కూతుళ్లతో బుద్ధగణపతిని పూజించాలని వడ్డేపల్లికి వస్తున్నారు. అప్పుడు ఈ దొంగ దాసీ మంతనాలతో మన రాణిగారి వెంట వీరులను లేకుండా చేసింది. మొదటి నుండి అనుమానం ఉన్న నేను మారువేషంలో రాణిగారి వెంట మొగిలిచర్లకు వెళ్లాను. నేనెప్పుడూ దాసిని కనిపెట్టుకొని ఉన్నా కూడా ఒకనాటి సాయంకాలం ఈ దాసి కనిపించకుండా ఉండటంతో భయం వేసి, అటు ఇటు కొంతసేపు వెతికి, ఈ దాసి దొరకక నిరాశతో ఎక్కడ పోయిందో చూద్దామని చెరువు కట్ట ఎక్కి నడుస్తూ పోతున్నాను. నేను కొంత దూరం నడిచేటప్పటికీ ఈ దాసి కట్టకింద ఉన్న మర్రిచెట్టు దగ్గర నుండి వస్తున్నది. అప్పుడు నా అనుమానం సరైనది అనుకొని, దానికి కనిపించకుండా దాక్కొని, అది వెళ్లిపోయిన తర్వాత అక్కడ ఏమీ తెలియనట్లు కూర్చొని, నా ద్యాసంతా మర్రిచెట్టు మీదే నిలిపాను. ఎవరో ఆ చెట్టుకింద ఉన్నట్టు, గుసగుసలు పెట్టుకుంటున్నట్టనిపించింది. వాళ్ళ మాటలు స్పష్టంగా వినబడటం లేదు. ఇంతలో ఒకడు వాళ్ళ దగ్గర నుండి నా వైపు వస్తున్నాడు. అతను పైకి వస్తున్నప్పుడు” ఇప్పుడే వెళ్లి త్వరత్వరగా కమలను కలుసుకోవాలి” అనే మాటలు వినబడ్డాయి. చూసి చూడనట్టు వాళ్ళ వైపు చూసి వారి రూపాలను నా హృదయంలో ముద్ర వేసుకున్నాను. వాళ్ళు ముగ్గురు మగవారు, అందులో ఇద్దరు అక్కడ ఉన్నారు. ఒకతను గబగబా నడుస్తూ వచ్చి నన్ను చూసి” ఎవరు నువ్వు?” అని అడిగాడు. నేను వినిపించుకోలేదు. వచ్చిన అతను అచ్చంగా బ్రాహ్మణుడు వలె ఉన్నాడు. ఇంకా కొన్ని మాటలు అడిగాడు. చెవిటి వాడి వలె నటించాను. అతను నన్ను ఏమీ అడగకుండా వెళ్ళిపోయాడు. మర్రిచెట్టు కింద ఉన్న ఇద్దరు ఎక్కడికో వెళ్ళిపోయారు.నేను లేచి ఇంతకుముందు నా దగ్గరకు వచ్చి నన్ను మాట్లాడించిన బ్రాహ్మణుని వెంట నడిచాను. అతడు అంతకుముందే చాలా దూరం వెళ్ళాడు.అయినా నాకు అతడు కనిపిస్తున్నాడు.అతన్ని చూస్తూ పోతున్నాను. కాబట్టి అతడు తోవలో ఈ దుర్మార్గురాలుని పనికి పురమాయించడం చూశాను. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ, ఏదో మోసం ఉన్నది అని అనుకొని, బుద్ధగణపతి ఆలయానికి వెళ్లి, నా వేశం మార్చుకుని, పరమభక్తుని వేషం వేసుకున్నాను. ఇంతలో ఆ బ్రాహ్మణుడు దేవుడు ఆవేశం అయినట్టు నటించి, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడాడు. మర్రిచెట్టు కింద నేను చూసిన మరో ఇద్దరు కూడా వచ్చి అతనికి సేవలు చేశారు. ఇదంతా నా అనుమానాన్ని మరింత బలపరిచింది.నా అనుమానం సరైనదే అని తేలేదాక ఆ విషయం రాణిగారికి చెప్పడం సమంజసం కాదని, అప్పటికి చెప్పడం మానివేసి ఆ ముగ్గురి వెంటనే ఉన్నాను.
తెల్లవారకముందే రాణిగారు ఇద్దరు కూతుళ్లతో మాయ బ్రాహ్మణునికి దేవత ఆదేశించినప్పుడు అన్న మాటల ప్రకారం మొగిలిచర్లకు ప్రయాణం అయిపోయారు. నేనా ముగ్గురుతో పాటు వారికి తెలియకుండా మొగిలిచర్లకు వెళ్లాను. వాళ్లు నేరుగా ఆ ఊరికి రాకుండా అడవి నుండి రావడానికి నిశ్చయించుకున్నారు. ఆ ఆలోచన మోసానికి సంబంధించిందని నేను అనుకొని, రుద్రమదేవి తెలుపాలని అనుకొని, రుద్రమదేవిగారున్న విడిది గృహానికి వెళ్లాను కానీ, ఆ ఇంటి చుట్టూ కాపలా ఉన్న భటలు నన్ను లోపలికి వెళ్లనియ్యలేదు. ఎన్ని విధాల చెప్పినా లోపలికి వెళ్లి వచ్చి,” ఇది సమయం కాదని రాణిగారు అన్నారు అని” నాకు వచ్చి చెప్తున్నారు .
” నా దగ్గరకు ఎవరూ రాలేదని” రుద్రమదేవి అన్నది.
నాకు తెలుసు వాళ్లు శత్రుపక్షం వారు. కాబట్టి లోపలికి వచ్చి మీకు చెప్పలేదని తెలుసు. వాళ్ళని ఎదుర్కొందామంటే నేను ఒక్కడినే ఉన్నాను. అంతే కాదు నా దగ్గర నన్ను నేను రక్షించుకునేంత మాత్రమే ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి సాహసించే వీలు లేకపోయింది.
ఓరుగల్లుకు పోయి సైన్యంతో వద్దామంటే ఆ లోపలే ఇక్కడ ఏం జరుగుతుందో అని మనసొప్పలేదు. అప్పుడు ఆ ఊరికి పోయి దేనికైనా పనికి వస్తుందని నా వెంట తెచ్చిన ధనంతో కొంతమంది మట్టి పని చేసే వారిని నా వెంట తీసుకొని, ఊరి బయట నుండి చిన్న ఎడ కత్తులతో సొరంగం చేసి, దేవిగారు ఉన్న ఇంటి గదిలోనికి సొరంగం తవ్వమని చెప్పి, నేను ఆ ఇంటిని కాపలా కాస్తున్నాను. మళ్లీ ఒకసారి అడవి మధ్యకు వచ్చాను.అప్పటికి ఈ దాసి, ఆ ముగ్గురు అడవిలో కూర్చొని ఏదో రహస్య ఆలోచన చేస్తున్నారు. నేను వచ్చిన సంగతి వాళ్లకు తెలియక, ఆనాటి రాత్రి రుద్రమదేవిని పట్టి బంధించాలనుకుంటున్నారని, పట్టణం చుట్టూ దారుల వెంట జనాలు కాపలా ఉండాలని అనుకుంటున్నారు. నేను అక్కడ నిలబడడం అంత మంచిది కాదనుకుని, ఊరికి వచ్చాను. కానీ ఇంతలోనే మరొక ఆపద ఎదురైంది. ఊరి బయట సొరంగం ఊరికి ఏమంత దూరంలో లేదు.ఆ సొరంగం నుండి రుద్రమదేవి వస్తే,ఇవతల కాచుకొని ఉన్న వారిని ఎదుర్కో లేము. అయినా పనికి విచారించక, గబగబా ఊరికి వెళ్లి, ఒక ఊరు అతని దగ్గరకు పోయి, రహస్యంగా అతనికి కొంత ధనమిచ్చి, శ్రీ శివదేవయ్య మంత్రి పేరు మీద” మోసం జరిగింది. జాము రాత్రి లోపల సైన్యం మొగిలిచర్లకు రావాలని” ఒక ఉత్తరం రాసి పంపాను.
ఇంతలో సొరంగం తవ్వడం అయిందని తెలిసింది. సాయంత్రం అయింది. నాలుగు ఘడియల రాత్రి దాటిన తర్వాత ఆ సొరంగం బయట చాటుగా నాలుగు గుర్రాలను, నాలుగు నిలువు కత్తులను సిద్ధంగా ఉంచి, ఆ సొరంగం ద్వారా నడచి, శ్రీ రుద్రమదేవి దగ్గరకు చేరాను. నేను రావడం దేవికి ఆశ్చర్యం వేసింది. జరిగిన సంగతంతా సంక్షిప్తంగా చెప్పి, దాసిని కట్టేసి, కళ్ళకు గంతలు కట్టి, ఆ వచ్చిన తోవనే బయట పడ్డాము.
సొరంగం తవ్విన వారే వెంటనే దానిని సాధ్యమైనంత వరకు పూడ్చి వేశారు. దాసిని వెంట పెట్టుకొని వెడితే తోవలో రహస్యం దాచడం కష్టమని అక్కడనే కట్టి వేసాం. బయట పడి కొన్ని రాళ్ళు రప్పలు, సొరంగంలో వేసి నలుగురం గుర్రాలనెక్కాము. ఇద్దరు కూతుళ్లతో రాణిగారు కట్టుకున్న బట్టలనే మగవారు కట్టుకున్నట్టుగా సవరించుకున్నారు. మేము నలుగురం నడుస్తూ వస్తుండగా ఊరు చుట్టూ కాపలా ఉన్న వారు మాపై దాడి చేశారు. వాళ్లని అవలీలగా చంపేసి, ఓరుగల్లు తోవ వెంట వస్తుండగా బాటకు కొంచెం దూరంలో రెండు సైన్యాలు యుద్ధం చేస్తున్నట్టు తెలిసి అక్కడికి వెళ్ళాం. అందులో ఒక సైన్యం ఓరుగల్లు సైన్యమని, మేము అంచనాగా తెలుసుకొని, శత్రువులను వెళ్ళగొట్టాం. మేం ఎవరిమో? ఆ సైనికులకు తెలియదు. వాళ్లను వెంట తీసుకొని వచ్చి, కొంత దూరం వెళ్ళేటప్పటికి ఇంకొంత ఓరుగల్లు సైన్యం మాకు కలిసింది. కొత్త సైన్యాన్ని వెంటబెట్టుకుని నేను మళ్ళీ మొగిలిచర్లకు వెళ్లాను. కూతుళ్లు ఇద్దరు నీ వెంట తీసుకొని రాణిగారు జాగ్రత్తగా ఓరుగల్లు చేరారు. నేను మొగిలిచర్లకు వెళ్లి; నేరస్తుల కోసం వెతికాను కానీ వారు ఎక్కడా కనపడలేదు. ఆ రాత్రి అక్కడే గడిపి, తెల్లవారక ముందే చెట్లపై దాక్కొని, వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను. ఇంతలో వాళ్ళు మా దగ్గరికి వచ్చి, మేమున్నది తెలియక నడుస్తున్నారు. మేము వాళ్లను చుట్టుముట్టి సైనికులను, ఈ పనికి ముఖ్య కారకులైన మురారి, హరిహర దేవులను, ధర్మవర్ధనుడుని చంపేసి, ఈ దుర్మార్గురాలిని కట్టేసాం. దీనిని అడిగి మురారి దేవుడికి ,హరిహర దేవుడికి సంబంధించిన ధనాన్ని కొల్లగొట్టు కొని తెచ్చాను.ఇక ముందు మీ ఇష్టప్రకారం ఈ ధనాన్ని, ఈ దాసీని ఏమి చేస్తారో చేయవచ్చు. అని చెప్పి గోనబుద్ధారెడ్డి తన ఆసనం మీద కూర్చొన్నాడు.
ఈ విషయం విన్న సభలోని సభ్యులందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. కమల వంచిన తల ఎత్తలేదు. అందరూ గన్నారెడ్డి చేసిన సాహస కృత్యానికి , అతని రాజభక్తికి మెచ్చుకున్నారు.
రుద్రమదేవి తన సింహాసనం నుండి లేచి, ” నా ప్రాణాలను ,నా కూతుళ్ళ మాన, ప్రాణాలను ” రక్షించిన గోనగన్నారెడ్డికి నా మనస్ఫూర్తిగా నా చేతిలో ఎప్పుడూ ఉండే ముత్యాల బాకును బహుకరిస్తున్నానని అంటూ తన చేతిలో ఉన్న బాకు గన్నారెడ్డి కిచ్చారు.
రాణీగారు అన్నమాటలతో సభ్యులందరికీ సంతోషంతో కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
గోనగన్నారెడ్డి దిగ్గున లేచి రెండు చేతులతో ఆ కత్తిని తీసుకుని, కృతజ్ఞతగా నమస్కారం చేసాడు.
రుద్రమదేవి కమలను చూస్తూ ” నువ్వేమైనా చెప్పదలచుకున్నావా?” అని అన్నది.కమల ఏమీ సమాధాన మీయకుండా తలవాల్చుకుని నిలబడింది.
మారుమాట్లాడకున్నంత మాత్రాన నువ్వు నిర్దోషివి కాదు ! నీ ప్రాణాలు మా చేతిలో ఉన్నాయి.నిజం చెప్పి,నీకొచ్చే ముప్పు తప్పించుకో ! నిన్నెవరు పంపారో? చెప్పు! అని రుద్రమదేవి అడిగింది.
” నన్నేమి చేసినా సరే! నేను మీకేమీ చెప్పలేను.” అని కమల అన్నది.
ఎవరు పంపారన్న అనుమానం మీకక్కరలేదు. వీళ్ళ నందరినీ పంపింది మహాదేవరాజు. ఈ నలుగురు దుర్మార్గులు. మొగిలిచర్లకు చెందిన అడవిలో కూర్చుని మాట్లాడుకుంటుండగా నాకు తెలిసిందని అన్నాడు గోనగన్నారెడ్డి.
నువ్వు చెప్పకున్నా నిన్ను పంపింది మహాదేవరాజని తెలిసింది. నీ నోటితో చెప్పి ఇక్కడ నుండి వెళ్లి పో! అని అన్నది రుద్రమదేవి.
దాసి కొంచెం సేపు ఆలోచించి ” నేనిక్కడ నుండి పోకున్నా, నన్ను మీరు కఠినంగా శిక్షించినా నన్నెవరు పంపారో వారి పేరు చెప్పను. ” అని మొండికేసి నిలబడింది.
దాసి మొండితనానికి రుద్రమదేవికి చాలా కోపం వచ్చింది. ఆడది కావడం వల్ల చంపక వదిలాను.” నువ్వు ఈరోజే మా దేశాన్ని వదిలి వెళ్లిపో! మా ఎల్లలు విడిచే దాకా మా భటులు నిన్ను వెంటాడుతూ ఉంటారు.మళ్లీ మా రాజ్యంలో నీ మొహం కనపడితే నీ ప్రాణాలు నీకు దక్కవు.ఆడుదానివైనందుకు బతికిపోయావు! నీ మహాదేవరాజు కూడా ఆడదాని వలె గాజులు తొడుక్కోవడం వల్లనే కదా! బహిరంగంగా యుద్ధంలో ఆడదానినైన నాతో ఎదుర్కోలేక కుట్ర చేసాడు.
సిగ్గు, బుద్ధి తెచ్చుకుని మళ్లీ ఇటువంటి పనులు చేయవద్దని చెప్పు. రాజ్యం దక్కించుకోవాలంటే మాతో స్నేహంగా ఉండమనీ గర్వం, అహంకారం వదిలి పెట్టమని చెప్పు! మేము మంచిగా చెప్పిన మాటలు మరచిపోతే మా పదునైన బాణాల గుట్టలై చురచుర మని వచ్చి తగిలి , బుద్ధి చెబుతాయని చెప్పు! అని దాసికి చెప్పి, ” త్రిపురాంతక దేవా! దీన్ని ఈ రోజు మన రాజ్యం దాటించేందుకు నలుగురు భటులకు చెప్పి పంపుమని అన్నది.
త్రిపురాంతక దేవుడు వెంటనే లేచి నమస్కరించి, కమలను వెంటబెట్టుకొని అక్కడ నుండి వెళ్లి పోయాడు.
అంతలో సభలో నుండి ఒకతను లేచి, నిలబడి “నేను వెనీసు వర్తకుడిని , నా పేరు మార్కోపోలో” అని అంటారు. నేను చాలా దేశాలు వ్యాపారంకోసం తిరుగుతుంటాను. పురుష పరిపాలన అజమాయిషీలో ఉన్న దేశాలు , స్త్రీ స్వభావమున్న పరిపాలనలో ఉన్న దేశాలను చూసాను. రాజులకుండాల్సిన ధర్మాలోచన, నీతి సమృద్ధిగా ఉండడం, సేవకుల పట్ల అభిమానం ఆదరణ , రాచకార్యాలు చేసేటప్పుడు చూపించే చతురత కలిగి ఉండడం మొదలైనవి ఈ రాణి దగ్గర చూసినట్లు ఎక్కడా చూడలేదు. రాజు పట్ల ఎంత భక్తి శ్రద్ధలుండాలో అవన్నీ ఈ రాణి సేవకుల దగ్గర మాత్రమే చూడగలిగాను. మిగిలిన దేశాలలో సేవకులకు ఇటువంటి వినయం లేదు.ఈ రాజ్యం కేవలం పురుష రాజశ్రేష్ఠులు పాలిస్తున్నట్టున్నది కానీ మహిళ చేత పరిపాలింప బడుతున్నట్టు లేదు. ఈమెను రాజు అనక తప్పదు.నాకు చాలా సంతోషంగాఉంది. మిగతా దేశాధినేతలు ,ఆ దేశాలలోని సేవకులు ఇక్కడకు వచ్చి ఈ నీతిని నేర్చుకోవాలని బిగ్గరగా అంటూ తన దగ్గర ఉన్న విలువైన విదేశీ వస్తువులను రుద్రమదేవి కి బహుమతిగా ఇచ్చాడు.
సభ్యులందరూ రుద్రమదేవి యొక్క చాకచక్యమైన పనులను పొగుడుతూ అవన్నీ మార్కోపోలోకు తెలిపారు.
సభ్యులారా! ఈనాటి ఈ అపూర్వమైన కార్యక్రమం వల్ల సభయొక్క ఉద్దేశ్యం మీరు ఇంకో తీరుగా అనుకున్నారు. కానీ ముఖ్యమైన అభిప్రాయం తెలుసుకునే అవకాశం చిక్కలేదు. రాయబారులెందరో వచ్చినట్టు తెలిసింది.వారి రాయబారాలను తెలుసుకునేందుకు సమయం చిక్కలేదు. దాడిలో పాల్గొని గెలిచిన వీరులైన సైనికులకు పారితోషికం ఇవ్వలేదు. కుట్రలో బలైనవారెందరో ? ఎంతమంది ఉన్నారో? తెలుసుకొని, వాళ్ల కుటుంబాలకు భరణం ఏర్పాటు చేయలేదు.
ఇప్పుడు సమయం చాలా గడిచి పోవడంవల్ల సభ ఇంతటితో చాలిస్తున్నాం. రేపటి కొలువులో అన్నీ జరుగుతాయని మంత్రి శివదేవయ్య తన ఆసనం నుండి లేచి చెప్పి మరలా కూర్చున్నాడు.
సభలోనివారందరూ ఒప్పుకున్నారు
(కొలువుకూటమి ముగిసింది.)
(సశేషం)
ఆరవ ప్రకరణం
గ్రంథకర్త:-ఒద్దిరాజు సీతారామ చంద్రరాయశర్మసరళీకృతం:- రంగరాజు పద్మజ
( సిగము )
(దేవతావేశం)
పరమభక్తినుపాసించు భక్తవరుల
కొక్క చోటుగాకున్న నింకొక్కచోట
ఫలము బ్రాపింపగోఱి చెప్పంగలేడే?
తద్విధివిధానముల దేవతా ప్రభుండు.
— గ్రంథకర్త.
భావం:- భక్తుడైనవాడు తాను నమ్మిన దైవాన్ని పరమభక్తితో విధివిధానంగా పూజిస్తే ఒకచోట కాకున్నా మరొక చోటైనా ఫలితం పొందగలడు.
వ్యాఖ్య:-గ్రంథకర్త ఈ పద్యాన్ని రుద్రమదేవి తన కూతుర్లకు సంతానం కలగక పోవడంతో బుద్ధ గణపతిని పూజించమని మదనమంజరి చెప్పినప్పుడు “ఎంత పూజించినా లాభమేముంది ?”అని నిరుత్సాహ పడిన సందర్భంలో పూజలు చేయగానే వెంటనే ఫలితం కలగక పోయినా పూజల ఫలితం తప్పక ఉంటుందని భావి కథాభాగాన్ని సూచిస్తూ సాగిన ప్రకరణ ఔచిత్య పద్యమిది–
సాయంకాలం తర్వాత రుద్రమదేవి బుద్ధగణపతి దేవాలయంలో కూర్చుని ఉన్నది. ముమ్మడమ్మ, రుయమ్మలు ఆమె పక్కనే కూర్చున్నారు. మరికొందరు సేవికులు కొంచెం దూరంలో కూర్చున్నారు. మదనమంజరి రుద్రమదేవి దగ్గరకు వెళ్లి ఇలా అన్నది.
తల్లీ ! ఈ బుద్ధగణపతి ఆలయంలో ఇంతకు ముందు ఎవ్వరూ ఇంతగా దానం చేసిన వారులేరని అనుకుంటున్నారు. బ్రాహ్మణులు మీరు చేసిన దానాలతో చాలా సంతృప్తి పొందారు. మీరు ఇచ్చిన ధనం మోసుకొని పోలేక దారిలో ఎదురైన వారికల్లా పంచిపెడుతూ పోతున్నారు.
నిజమేనా? అయినా ఫలితం ఏమున్నది? అన్నది రుద్రమదేవి. ఫలితానికి భక్తి కారణమైనా, భక్తి కలిగినప్పుడే ఫలితం కలుగదు ! కొన్ని రోజు
లు కొలిస్తే ఫలితం కనపడుతుంది. అయినా ఇవన్నీ మీకు తెలియవా? నేను మీకు తెలియదని చెప్పడం లేదు. ఫలితం కోరే వాళ్ళు శ్రద్ధతో మనస్సును లగ్నం చేసి అనుకున్న పని నెరవేరే దాకా దేవుడిని పూజించడం వదలకూడదని దాసి అన్నది.
మరిచిపోయాను
నువ్వు చెబితే జ్ఞాపకం వచ్చింది. సాయంత్రం ఎక్కడికైనా వెళ్లావా? కనిపించలేదు? అని రుద్రమదేవి అడిగింది.
అమ్మా! మీరు తప్ప నాకు ఇక్కడ పరిచయస్తులు ఎవరున్నారు? కనుక ఎక్కడికి వెళ్ళలేదు. రుయ్యమ్మ దొరసాని ,నేను తోటలో తిరుగుతూ ఏవో పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేశామన్నది మదనమంజరి.
ఆ సంగతి నాకు తెలుసు. అప్పుడు కాదు… మీరు వచ్చేసరికి కొంచెం పొద్దున్నది. ఆ తర్వాత సాయంత్రం నువ్వు కనిపించలేదు. అక్కడా ఇక్కడ చూశానని అన్నది రుద్రమదేవి.
అయ్యోయ్యో! మీరు బిగ్గరగా పిలిచి ఉండరు. అయినా ఎక్కడికైనా వెళ్లే పని నాకు ఏముంది? చిన్న దొరసాని, నేను తోటలో తిరుగుతున్నప్పుడు కొన్ని అందమైన పూలు కనిపించాయి. వాటిని తెంపీ తెచ్చి చిన్న దొరసానులకు ఈరోజు దండలను గుచ్చాలను కున్నాను. అప్పుడు నేను రుయ్యమ్మ గారితో మాట్లాడుతున్నాను. కానీ పూలు ఏరడం కోసం కాదు. దొరసానిని ఇక్క
డికి తీసుకొని వచ్చి, మళ్లీ నేనొక్కదాన్నే వెళ్లి తోటలో ముందు చూసిన పూలను తెంపుకుని వచ్చి, మళ్లీ ఇక్కడ కూర్చుండి పోతే దండలను గుచ్చడానికి అవకాశం దొరకదని అనుకొని, దేవుని గుడి వెనుక కూర్చొని దండలను గుచ్చుకొని వచ్చాను. ఇది సరే! మన మొగిలిచర్ల ప్రయాణం ఎప్పుడు? రేపు తెల్లవారుజామున పోవాలి కావచ్చని అన్నది మదనమంజరి.
ఇక్కడి నుండి ఇంటికే వెళ్ళేది. మళ్లీ ఒకసారి మొగిలిచర్ల ప్రయాణం గురించి ఆలోచించవచ్చు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం లేదని రుద్రమదేవి అన్నది.
అప్పటికి రాత్రి రెండు మూడు గడియలు అయింది. ముమ్మడమ్మ, రుయ్యమ్మ బుద్ధ గణపతిని పూజించడానికి వెళ్ళిపోయారు.
రుద్రమదేవి అక్కడే కూర్చుని ఉన్నది. మదనమంజరి ఆమె దగ్గర కూర్చొని, ఒకసారి వెనకవైపు చక్కగా చూసి తర్వాత ఏమేమో విచిత్రంగా మాట్లాడుతూ కాలం గడుపుతున్న ది.
ఇంతలో ఒక బ్రాహ్మణుడు వచ్చి రుద్రమదేవి దగ్గర నిలబడ్డాడు. ఆ బ్రాహ్మణుడు దాదాపు యాబై సంవత్సరాల వయస్సున్న వాడు. వెంట్రుకలు తెల్లబడ్డాయి. ఎర్రని శరీరం మీద తెల్లని విభూతి రేఖలు స్పష్టంగా కనబడుతున్నాయి. నుదుటిమీద విభూతి రేఖలమధ్య గంధంతో తడిపిన అక్షింతలు అందంగా కనబడుతున్నాయి. మెడలో రుద్రాక్షమాల వేలాడుతున్నది. ఏడువరుసలు కుచ్చిళ్ళు పోసి తెల్లని ధోవతి కట్టుకున్నాడు. పెట్టిన శాలువా భుజంపై రెపరెపలాడుతున్నది.చేతిలో చిన్న పంచ ఉన్నది.
నడుముకు( రొంటిలో) చెక్కిన నశ్యపు కాయ అతడు అచ్చమైన బ్రాహ్మణుడని తెలుపుతున్నది.
ఇలాంటి వేషంతో వచ్చిన బ్రాహ్మణుని చూడగానే రుద్రమదేవి లేచి భయంతోనూ, వినయంతోనూ నమస్కరించింది.
బ్రాహ్మణుడు రుద్రమదేవిని శాస్త్ర ప్రకారంగా ఆశీర్వదించాడు. బ్రాహ్మణుడు, రుద్రమదేవి వారివారి ఆసనాలపై వారు కూర్చుని ఇలా మాట్లాడుతున్నారు.
బ్రాహ్మణోత్తమా! మీరు ఈ ప్రాంతం వారేనా?
అమ్మా నాది; ఈదేశం కాదు.
ఏ దేశం?
పనికిరాని దేశంలో బతికాను. అయినా వెనుకటి మాటలు ఎందుకు?
ముందు మీరు ఏ దేశంలో ఉండేవారో చెప్పండి? మన చరిత్ర మనకే వద్దంటే మరెవరికి అవసరమవుతుంది?
ధర్మానికి మారురూపంగా ఉన్న అమ్మా! నా వెనుకటి విషయాలు చెప్తే నా శత్రువులు నన్ను ఏమైనా హింసిస్తారేమో అని భయం.
నేను ఉన్నంతదాకా మీకేమీ భయంలేదు చెప్పండి!
నేను దేవగిరిలో నివసించే వాడిని.
దేవగిరిని ఎందుకు వదిలారు?
రాజు అవమానించటం వల్ల.
యాదవ రాజులు బ్రాహ్మణులపై కోపగించుకున్నరా?
రాజుల కోపం బ్రాహ్మణులా? భట్టులా? అని చూడనీయదు.
అక్కడ మీరు ఏం పని చేసేవారు?
వారికి నేను పురోహితుడిని. ఒకనాడు కృష్ణ భూపతి ఇంట్లో వ్రతం జరిగింది. ఆ రోజు నాకు ఆరోగ్యం బాగా లేక, లేవలేక పోయాను. వ్రతం చేయించి రమ్మని నా మేనల్లుడిని పంపాను. అలా అతన్ని పంపినందుకు నా మీద చాలా కోపంతో నన్ను మోసం చేయాలని ప్రయత్నించాడు.నాకు ఈ సంగతి తెలిసి వచ్చాను. కృష్ణ భూపుడు మరణించినా… అతని తమ్ముడు మహాదేవరాజు మాపై ఉన్న కోపం వదలలేదు.
ఏవండీ ! మీ మాటలు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కృష్ణభూపాలుడు సామాన్యుడు కాడు. తెలివి లేని వాడు అంతకన్నా కాడు. కారణం లేకుండా ఇంత చిన్న విషయానికి మిమ్ములను ఇంత స్థితికి రానివ్వడని నాకు బాగా తెలుసు. మీరు బ్రాహ్మణులు.అబద్ధం ఆడరని నాకుతెలిసినా ఇప్పుడు మీ మాటలు నేను నమ్మలేను. బ్రాహ్మణుని మొహం విచారంగా మారింది.
ఏమండీ! అలా ఎందుకు బాధ పడుతున్నారు? మిమ్మల్ని మోసం చేయాలనుకుంటే కృష్ణభూపుడు గానీ, మహాదేవరాజు గాని ఈ చిన్న కారణం చేత అలా చేయరు.
నా మాట మీరు నమ్మకపోతే మొన్న నాకు నా స్నేహితుడు రామభట్టు రాసిన ఉత్తరం చూడండి! అది చదివితే మీకే తెలుస్తుంది.
బ్రాహ్మణుడు రుద్రమదేవి చేతికి ఒక ఉత్తరాన్ని ఇచ్చాడు.
రుద్రమదేవి ఆ ఉత్తరం విప్పి చదివింది. దానిలో ఉన్న సమాచారం ఇలా ఉంది.
యజ్ఞయాగాలు చేయించడంలో, పరమ నిష్ణాతులైన షడ్వింశ బ్రాహ్మణులైన శాస్త్రి గారికి…
రాంభట్టు ఈరోజుపదివేల నమస్కారాలు చేస్తూ,
ఇక్కడ మేమంతా క్షేమం! మీ క్షేమసమాచారాలు రాయించగలరు.
తర్వాత చాలా రోజుల నుండి మీ క్షేమ సమాచారాలేమీ తెలియడం లేదు. మీ మీద మహాదేవరాజుగారికి చాలా కోపంగా ఉన్నది ఇప్పట్లో మీరు ఈ దేశానికి రావడం మంచిది కాదు అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మీకా మారువేషం బాగానే ఉన్నది. మీ వారు అందరూ క్షేమంగా ఉన్నారు.
కావున దయ ఉంచండి….
ఉత్తరం నిపుణుడైన వాడు రాయలేదని రుద్రమ తెలుసుకుంది. ఆ ఉత్తరం వంకరటింకర అక్షరాలతో రాసి ఉన్నది మళ్లీ రుద్రమదేవి బ్రాహ్మణునితో ఇలా అన్నది .
కావచ్చును కానీ ఈ ఉత్తరం వల్ల మీకున్న శత్రుత్వానికి సరైన కారణం తెలియడంలేదు. మీరు చెప్పిన కారణం మాత్రం సరిగ్గా లేదు
నీ సన్నిధికి వచ్చి రాయబారం అనే మాట ఇంతదాకా వచ్చినప్పుడు అసలు విషయం చెప్పకుండా ఉండడం మంచిది కాదు. నేను ఒక తప్పు చేశాను. దాన్ని వివరించి చెప్తే మీకు తప్పక కోపం వస్తుంది. అయినా చెప్పక తప్పదు. దేవగిరి రాజులు మేము శ్రీకృష్ణుని సంతతి వారమని, యాదవులమనీ, యాదవ శబ్దం మా ఇంటి పేరు గాని, మేము గొల్లవాళ్ళ తెగకు చెందమనీ చంద్ర వంశాన పుట్టిన క్షత్రియులమనీ, మాకు వేదోక్త కర్మలు కావాలని వారంటారు. నేనందుకు ఒప్పుకోక పురాణం చెప్పిన ప్రకారం కర్మలు చేయించేవాడిని. వారికి నామీద అనుమానం ఎక్కువై,ఆ వ్రతం రోజున నేను వెళ్ళక, నా మేనల్లుడైన చిన్నవాడిని పంపాను. రాజు వల్ల అవమానమైనా,సన్మానమైనా చిన్నవాడు అతను భరిస్తాడనీ పంపాను. రాజు ఈ విషయం తెలుసుకున్నాడో? ఏమో? నా అల్లుడిని తిప్పి పంపేసి, నన్ను రమ్మని కబురు చేశాడు, నేను ఒప్పుకోలేదు. ఆ కోపం ఇంతకాలమైనా విడిచిపెట్టలేదు. అందుకే దేశం వదిలి వచ్చాను. కుటుంబాన్ని వదిలి పెట్టాను. ఒంటరి వాడిని పారాయణం ఇంట్లో ఉంటూ కాలక్షేపం చేస్తున్నాను. ఏం చెప్పను? తల్లీ!? మాటలలో పడి నాసంగతి మీకు చెప్పాను. ఎన్నడూ, ఎక్కడా, ఎప్పుడూ, ఎవరితోనూ చెప్పినా నాకు ముప్పు తప్పదని నాకు పూర్తిగా తెలుసు. తల్లీ! మీరు వారికి తెలిపితే నా కొంప మునుగుతుంది. నా ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి. ముంచినా తేల్చినా మీదే భారం!
భక్తులందరు బుద్ధ గణపతి ఆలయం లోపలికి వెళ్లి స్తోత్రపాఠాలు చేస్తున్నారు. కీర్తనలు పాడుతున్నారు. ఆ శబ్దాలన్నీ భక్తిభావంతో కూడి ఉన్నాయి. గుడి బయట చాలా దూరం వరకు వినవస్తున్నాయి.
” కుమార శాస్త్రి గారూ! మీరు భయ పడకండి! మీ మాటలను నేను రెండో వాడి చెవిలో పడనివ్వను లెండి! అని అన్నది రుద్రమదేవి.
బ్రాహ్మణుడు తల పంకించాడు. తన మాటలకు సమాధానం చెప్పేందుకు తల ఊపాడు అనుకున్నది రుద్రమదేవి. కానీ ఆ బ్రాహ్మణుని తల అలా ఊగుతూనే ఉన్నది… ఆగడం లేదు. తలతోపాటు కాళ్లు చేతులు కూడా ఊగుతున్నాయి. రుద్రమదేవికి ఏమీ తోచటం లేదు. అయ్యా! అయ్యా !!అని పిలిచింది. అతను సమాధానం ఇవ్వలేదు.
ఆయన స్వభావం తెలియని రుద్రమదేవి” రక్షించండి! రక్షించండి! అని పెద్దగా కేక వేసింది. ఆ గుడిలో ఉన్న వారికి వినబడనందున ఎవరు రాలేదు. ఇంతలో దాసి బ్రాహ్మణుని తేరిపార చూసి, అమ్మా! మీరు భయపడవలసిన పనిలేదు ఈ బ్రాహ్మణునికి ఏం భయం లేదు. ఇతనికి దేవత ఆవేశం అయినట్టు అనిపిస్తుంది. ఇతని వల్ల మనకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే రాశిఫలాలు అడిగి తెలుసుకోవచ్చని అన్నది.
ఆ బ్రాహ్మణుడు అలా వణికి -వణికి కెవ్వుమని కేక వేసి లేచి, బుద్ధ గణపతి కోవెలలోనికి పరిగెత్తి వెళ్ళాడు. రుద్రమదేవి, దాసి ఇద్దరు అతని వెనుకనే నడిచారు.
కుమార భట్టు పెద్దగా అరుస్తూ… ఒక చోట నిలబడకుండా అటూ- ఇటు తిరుగుతూ, ఊగి పోతూ, వణుకుతూ, పండ్లు పటపటా కొరుకుతూ, కౄరంగా దేవతా విగ్రహాన్ని చూస్తున్నాడు.
అతని పరిస్థితి తెలుసుకొని కొందరు కొంత సామ్రాణి, నిప్పును తెచ్చి ధూపంవేసి,” స్వామీ! ఏం సమాచారం? ఇంతగా ఎందుకు ఊగిపోతున్నారు? ఎందుకు వచ్చారు? ఎందుకు ఆయాస పడుతున్నారని అడిగారు.
రుద్రమదేవి ఇటువంటి వినోదం ఎప్పుడూ చూడలేదు కాబట్టి ముందుకు వచ్చి నిలబడింది. రాణి గారి కొరకు ప్రజలు కాస్త వెనుకకు వెళ్లి చోటుకల్పించారు. దాసిని దగ్గర నిలబెట్టుకొని ఆ వింత చూస్తున్నది రుద్రమ దేవి.
ఒక మనిషి ఆ గుంపు నుండి ముందుకు వచ్చి నమస్కారం చేసి ,చేతులు జోడించి, నిలబడి” స్వామి నా సంగతి ఏమిటి? అని అడిగాడు.
“హూ! ఏమిరా? భక్తుడా? నువ్వు నన్ను పూజిస్తూ ఉండి రెండు మూడు మండలాలైనా ( మండలం అనగా నలబై రోజులు.) కాలేదు, అప్పుడే నీకు ఫలితం కావాలిరా? ఇంకొక మండలం నన్ను పూజించు! నీ కోరిక నెరవేరుతుంది.
హూ! అని గంభీరంగా అన్నాడు.
ఇలా ఒకరి తర్వాత మరొకరు వచ్చి దేవుని వల్ల తమకు ఎటువంటి ఫలాలున్నాయో అని అడిగి తెలుసుకుంటున్నారు. దేవుడు పూనిన బ్రాహ్మణుడు కొందరికి మంచి జరుగుతుందనీ, కొందరికీ చెడు ఫలితాలు ఉన్నాయని చెబుతున్నాడు కొందరికి విభూతి, ఖర్జూర ఫలాలు, సామ్రాణి ఇస్తున్నాడు.
అమ్మా! మనం వచ్చిన పని గురించి అడుగుదామా? అని రుద్రమదేవిని అడిగింది మదనమంజరి. రుద్రమదేవి అవునని కానీ, కాదని కానీ ఏమీ అనలేదు. ఆమెకు ఇది అంతా విచిత్రంగా అనిపిస్తుంది.
మదనమంజరి దేవతావశమైన బ్రాహ్మణుని దగ్గరకు వచ్చి భయభక్తులతో నమస్కరించి, దేవుడా!మేమొక పని మీద వచ్చాం. మా మనసులోని అనుమానం తొలిగేటట్టు మంచి వరమివ్వమని అడిగి మళ్లీ నమస్కరించింది.
రుద్రమదేవి మనసులో కొంచెం ధైర్యం తెచ్చుకున్నది.ముమ్మడమ్మ, రుయ్యమ్మ కూడా ధైర్యం చెప్పారు దాసి మాత్రం ధైర్యం వదలకుండా… స్వామీ! ఎల్లకాలం మిమ్మల్నేనమ్మి ఉన్న మా కోరికలను తప్పక తీర్చాలి! మీరు తప్ప మాకు వేరే గతిలేదు. మమ్ములను ఆదరించండి !అని వేడుకున్నది.
హా! భక్తురాలా! హూ! మీకు… మంచి ఫలితం లేదని నేను చెప్పలేదు కానీ, మీరు రేపు పొద్దున్నే…హా… లేచి.. మొగిలిచర్లకు పోయి… ఏకవీరా… మహాదేవిని.. హా .. మొక్కండి! ఫలము….హూ! … తెండి… శీతలం
( బెల్లంపానకం) ఏదిరా? అని అరవడం మొదలు పెట్టాడు వెంటనే అక్కడే ఉన్న బ్రాహ్మణుడొకడు” స్వామీ! మీరు అడిగిన శీతలం చేస్తాము! శాంతి పొందండి! అని రెండు బిందెల నీళ్ళలో బెల్లం కలిపి తెచ్చాడు దేవుడు ఆవేశించినవాడు ఆ శీతలం తాగకముందే ” ధభేలుమని” నేల మీద పడ్డాడు. అతనికి స్మృతి లేనట్టున్నది. గుడి అంతా సంక్షోభం తీరిన సముద్రం వలె నిశబ్దంగా మారింది.
ఏడవ ప్రకరణ
గ్రంథకర్త:- ఒద్దిరాజు సీతారామ చంద్రరాయ శర్మ
సరళీకృతం:-రంగరాజు పద్మజ
[ ముఖ్యరాలు రుద్రమ చిక్కినది]
అల్పోపాయాన్మహాసిద్ధి
రేతన్మసన్త్ర ఫలంమహత్ ॥
—హితోపదేశము.
భావం:-కొంచెమైన సాధన వల్ల గొప్ప లాభం పొందవచ్చు.విస్తారమైన ఆలోచన వల్ల మరెంతో లాభం పొందువచ్చు
కథాభాగం:- రుద్రమదేవి వడ్డేపల్లి విడిదికి వచ్చి ఐదు రోజులు అయింది. ఇప్పుడు రుద్రమదేవి కూతుళ్లతో, దాసితో మొగిలిచర్లలో ఉన్నది. మొగిలిచర్ల ఓరుగల్లుకు ఈశాన్యదిశలో నాలుగైదు కోసుల దూరంలో ఉంటుంది.
మొగిలిచర్ల పెద్ద ఊరు కాకున్నా ఆ ఊరిలో” ఏకవీర మహాదేవి” చాలా ప్రభావవంతమైన దేవత.ఆ కోవెలతో ఆ ఊరు ప్రశస్తి గాంచినది. ఆ కోవెలలో రుయ్యమ్మ ,ముమ్మడమ్మ ఇద్దరూ ఏకవీరాదేవిని భక్తితో పూజిస్తున్నారు.
మనకథా కాలంలో ఈ ప్రదేశమంతా అడవి ఉండేది. అడవి పగటిపూటనే చీకటి అయిందా ! అని భ్రమ కలిగించేలా చిక్కగా ఉండేది. అడవి నుండి మనుషులు ,బండ్లు నడవడానికి ఒక బాట ఏర్పడింది. ఆ బాటకు ఉత్తరానికి కొంత సాగి తిరిగి తూర్పుదిక్కుకు మళ్ళింది. ధర్మాత్ములు కొందరు ఆ దారి వెంట అక్కడక్కడా మూడు నాలుగు ఆమడలకొక ధర్మసత్రాలు కట్టించారు. అందులో ఎవరూ నివసించరు. కానీ, ప్రయాణపు అలసట తీర్చుకుని తమ వెంట తెచ్చుకున్న భోజన పదార్థాలను తినేందుకు ఉపయోగకరంగా ఆ ధర్మసత్రాలలో యోగులు, బైరాగులు , అడవి జంతువులకు భయపడని వారు ఒక పగలో, ఒక రోజో ఉంటారు.
ఇప్పుడు మన ఈ ప్రయాణానికి సంబంధించిన అటువంటిదే ఒక సత్రం. ఆ సత్రం మొగిలిచెర్లకు దాదాపు ఒక కోసు దూరంలో ఉన్నది. మొగిలిచర్ల నుండి ఉత్తరానికి పోయే బాట తూర్పు దిక్కునకు మరిలే బాట దగ్గర ఆ సత్రం ఉన్నది. అక్కడ ఒక బావి ఉన్నది. అందులో నీరు ఏమంత పరిశుభ్రంగా ఉండదు. అయినా బావి నిండా నీరున్నా వాడక పోవటం చేత నాచు పట్టి ఉన్నది.
ముగ్గురు మగవారు, ఒక స్త్రీ ఆ సత్రం ముందటి వైపు కూర్చున్నారు. ఏమంత పొద్దు పోలేదు. సాయంకాలం అయింది. వాళ్ళందరూ ఏం మాట్లాడు కుంటున్నారు? వారి చూపులు అడవి జంతువులను కనిపెట్టేందుకో ఏమో! నాలుగువైపులా చూస్తున్నారు. అందులో ఇద్దరు మగవారు మాత్రం దాదాపు ఒకే వయసు ఉన్నవారు. ఒకడికి మాత్రం యాబై సంవత్సరాల వయసు ఉన్నది.ఆ స్త్రీ దాదాపు నలబై సంవత్సరాలు వయస్సున్నది. మగవారి చేతులలో నిలువెత్తు ఖడ్గాలు ఉన్నాయి.
ఆ బాట వెంట జనాలు ఎక్కువగా తిరగరు. అందున సాయంకాలమైంది కాబట్టి ఎవరో వస్తారని అనుకోలేము. వారిలో ఒకరి పేరు హరిహర దేవుడు, మరొకరి పేరు మురారి దేవుడు, ముసలి వాడి పేరు ధర్మవర్తనుడు. ఆమె పేరు కమల. వాళ్ళు ఇలా మాట్లాడు కుంటున్నారు.
మురారి:– కమల చాలా నేర్పు ఉన్న స్త్రీ. చక్కని చమత్కారంతో మాట్లాడుతూ పనిని చక్కగా తోవకు తెచ్చింది.అందుకే అంటారు”బుద్ధిష్చాపి చతుర్గుణమ్”
( అంటే ఆడవాళ్లకు మగవారికన్నా బుద్ధి నాలుగు రెట్లు ఎక్కువ పని చేస్తుందని)
ధర్మ:– నిజమే మనం తలపెట్టిన పనికి మూడు వంతుల సహాయం కమలదే! అనుమానమే లేదు.
మురారి:– మీరు మాత్రం సామాన్యమైన వారా? పనిని ఆచరణలో పెట్టే దక్షులు.
హరి:– అవును అలా కాకపోతే వెతికి వెతికి మహాదేవరాజు వీరిని ఎందుకు పంపుతాడు? మన పనికి సగం సహాయం కమల, సగం సహాయం ధర్మవర్తనుడు గారు తల పెట్టిన పనని పూర్తి చేసి వచ్చారు.
ధర్మ:– నా సహాయం ఏం సహాయం? కమలను మెచ్చుకోవాలి. మహాదేవరాజు గారి దగ్గర తాంబూలం పుచ్చుకొని, వచ్చి రుద్రమదేవి దగ్గర చేరి, పన్నిన మాయలను, ఆడిన అబద్దాలను పొల్లు పోకుండా ఎలా సమర్థించుకుంటూ వచ్చిందో చూడండి! పనిలో నైపుణ్యం అంటే ఇంతకన్నా ఎక్కువ ఏముంటుంది? రుద్రమదేవిని ఓరుగల్లు నుండి లేవదీసి వడ్డేపల్లికి తీసుకొని వచ్చింది ఎవరు? మన కమలనే కదా! కమల సాయం మనం మెచ్చుకోవాలి. అవును మరిచిపోయాను కమల నీ పేరేమిటి? కమల కాదు కదా! మదనమంజరీ! మీ అమ్మని ఎత్తుకొని పోయిన వాడెవడు?
కమల సిగ్గుపడింది.
ధర్మ:– చెప్పు చెప్పు! నిన్ను పెళ్లి చేసుకున్న భర్త ఏ రోగంతో ప్రాణాలు కోల్పోయాడు? మీ రుద్రమదేవితో చెప్పిన మాటలే మాతో చెప్పు, కానీ ఏడవ వద్దు!
హరి:– కమలకు ఇప్పుడు ఏడుపు ఎందుకు వస్తుంది? అప్పుడంటే రాచకార్యం ఎలా చక్కబెట్టాలని ఒకవైపు, రుద్రమదేవి తనను ఎలా నమ్ముతుందా? అని మరోవైపు, తనను అనుమానించకుండా పని ఎలా చక్కబడుతుందా! అని ఇలా మూడు రకాల విచారంతో అప్పుడు అలా నటించవలసిన వచ్చింది కానీ ఇప్పుడు విచారం ఎందుకు? ఇద్దరు బిడ్డలతో రుద్రమదేవి మన చేత చిక్కింది. ఇంకో జాముకో అర జాముకోపూర్తిగా మన వశం అవుతారు. సంతోషించే వేళ ఏడ్చేందుకు కమలకేమి గ్రహచారం? రుద్రమదేవికి చెప్పిన విషయం ఎన్నిసార్లు పాఠం అభ్యాసం వలె చేసిందో కానీ అలా చెప్పకుంటే రుద్రమదేవి కమలను నమ్మక పోయేది.
మురారి:– నిజమే! కమల బుద్ధి మెచ్చుకో తగిందే!ఏం మంజరి ఏమంటావు?
కమల:- వడ్డేపల్లికి రుద్రమదేవిని తీసుకొని రావడానికి నాకు అంత కష్టం అనిపించలేదు. కానీ మొగిలిచర్లకు రానని అన్నారు. నా ప్రాప్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని ఆమె అనగానే నాకు నిరాశ కలిగింది. మన ధర్మవర్తనుడు గారు దేవుడు, ఆ విషయమైయినట్లు నటించి, వారి బుద్ధిని మరలించక ఉంటే వారు రాకపోయే వారు. వారు అలా బ్రాహ్మణ వేషం వేయకపోతే నేను అన్నమాటలు కానీ, నేను పన్నిన పన్నాగం కానీ ప్రయోజనం లేకపోయేది.మీతో నేను వారిని మొగిలిచర్లకు తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళాను. అప్పటికి నాకు వారి సంగతి పూర్తిగా తెలియదు.” మేము మొగిలిచర్లకు రాము” అని అన్నారని మీకు తెలియజేసి, మన పనిని అక్కడనే చేయాలని ప్రయత్నం చేశాను కానీ వడ్డేపల్లిలో ఈ పని జరుగుతుందా? అని అనుమానంగానే ఉండేది. ఉన్న రెడ్డి వారు రుద్రమదేవిని కనిపెట్టుకొని కాపు వేసినట్లు నాకనిపించింది. ఇంతలో ధర్మవర్తనుడు గారు రావడంతో ఇలా చేస్తే బాగుండు అనిపించింది. అలా ఆలోచన చేశాను. వారు అవునని ఆ వేషం వేశారు .లేకపోతే ఈ పన్నాగం అంతా పాడై పోయేది.
మురారి:- నువ్వూ, మేము చెరువు కట్ట కింద మర్రిచెట్టు నీడలో కూర్చుని మాట్లాడి, నువ్వు పెళ్లిపోయిన మరు నిమిషంలో ధర్మవర్తనుడు గారు మా దగ్గరికి వచ్చారు. పని ఎలా అవుతుందో! అని చూసి రమ్మని వారిని నీ దగ్గరికి పంపాను. వారు నీకు ఎక్కడ కనబడ్డారు?
కమల:– ముందే నాకు వారు కనిపించి తనను పరిచయం చేసుకున్నారు. జరగబోయే సంగతి తెలుసుకొని, వినవచ్చని వారికి చెప్పి తీసుకొని వచ్చాను. రుద్రమదేవితో ప్రయాణం విషయం మాట్లాడుతూ ఉంటే ధర్మవర్ధనుడు గారు మా వెనుక కొంచెం దూరంలో నుండి వింటున్నారు. ముమ్మడమ్మ, రుయ్యమ్మలు దేవుని గుడి లోనికి పోగానే వీరు వచ్చి వింతగా మాట్లాడి చివరకు ఆ వేషం వేశారు. మీరు ఎప్పుడు వచ్చారు? పానకం ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు తడి పడిపోయారు? దేవత నివేదన చేయకుండానే అతని ముందర ఎందుకు పెట్టారు పానకాన్ని?
హరి:– ఏదో జరిగింది జరిగిన దానికేం గాని?
కమల:- ఏం గుర్రపు బండ్లు ,మనుషులు తయారుగా లేరా? ఇంకా మనం విచారించడానికి ఏముంది?
హరి:– అందరూ సిద్ధంగా ఉన్నారు లేకేం? మరి మన ప్రయాణం ఎప్పుడు ?
మురారి :-ఎప్పుడు అనడానికి ఏముంది? మనం ఎప్పడనుకుంటే అప్పుడే! మనలను అడ్డుకొనేవారెవరున్నారు?
మనం ఎంత చేతులు చాపితే బాఱ అంత పొడుగు అవుతుంది.
ధర్మ:– అలా అనుకోవద్దు రుద్రమదేవి సామాన్యురాలు కాదు ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. మహా మేధావతి. కనుమరుగైన అంతవరకూ పనిచేశాం. ఇప్పుడు తప్పించ వలసిన పని జాగ్రత్తగా చేయాలి.
మురారి:– ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నారు కదా!
కమల:- మన ఇల్లు అంటే? మీరున్న ఇంట్లోనా?
మురారి:- కాదు వారి కోసం కట్టించిన ఇంట్లోనే ఉన్నారు. ఇంకా ఎక్కడికి పోగలుగుతారు? వంటిల్లు చొచ్చిన కుందేలు తప్పి పోగలదా?
ధర్మ:- అలా అనలేము! ప్రాప్తం లేకుంటే చేతిలో ఉన్న పండు బావిలో పడి పోతుంది. మన ఇంట్లో ఉన్న వారు మన చేతికి చిక్కినారని అశ్రద్ధగా ఉండకూడదు. వడ్డేపల్లిలో మనం మర్రిచెట్టు కింద కూర్చుని మాట్లాడుతున్న తర్వాత నేను కమలను చూసేందుకు చెరువు కట్ట ఎక్కినాను. అప్పుడు అక్కడ ఒక అతను ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టు కూర్చుని ఉన్నాడు. అతను మన మాటలు విన్నాడో? లేదో ?నేను ఖచ్చితంగా చెప్పలేను. నేను వచ్చింది అతనికి తెలియదు. నువ్వు ఎవరు ? అని నేను అతనిని అడిగాను. ఆ మాటకు అతను ఉలిక్కిపడి లేచి ఏమి మాట్లాడకుండా వెర్రి చూపులు చూస్తూ వెళ్లిపోయాడు. అతను నిజంగా పిచ్చివాడో? లేదా మన మాటలు విన్నాడో? నాకు అర్థం కాలేదు.
మురారి:– అతనెవరో? ఏదైనా గూఢచారిగా పని చేసేవాడేమో? తన నీడ కనపడినా ఉలిక్కిపడ్తాడు. మన మాటలు వింటే రుద్రమదేవికి తెలియకుండా ఉండదు. ఆమె మన మాటలు అతనికి చెప్పితే వడ్డేపల్లి నుండి ఓరుగల్లుకే పోయేది. మొగిలిచర్లకు ఎందుకు వస్తుంది?
ధర్మ:- ఎందుకు రాదు? మన మోసం తెలిసీ, తెలియనట్లు నటించి మనలను పట్టుకునేందుకు తగిన సైనికులను పిలిపించవచ్చు కదా! వచ్చిన సైన్యాన్ని మనం పట్టుకో కూడదా? ఎలా అయినా మన ప్రయత్నం నెరవేరే దాకా ముందూవెనుకా చేయకూడదు. పట్టు విడిచి పెట్టవద్దు!
హరి:- నిజమే! అయినా కూడా దానికి తగిన పని చేశాం. వారు నివసించి ఉన్న ఇంటి చుట్టూ కత్తులు చేతబూని భటులు అప్రమత్తంగా ఉన్నారు. మన సంగతి తెలిసి బయటపడడానికి ప్రయత్నిస్తే వరుసబెట్టి నరికి వేస్తారు. బయటి సైన్యం రాకుండా ఆపేందుకు ఈ ఊరిలో నాలుగువైపులా అడవిలో చాలినంత మంది జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉన్నారు. కాబట్టి వచ్చే సైన్యం కూడా రాలేదు.
ధర్మ:- ఇది మంచి ఏర్పాటు. ఇంకా మనకు ఆలస్యం ఎందుకు? అర్ధరాత్రి దాటిన తర్వాత మన పని మనం చేసుకుందాం! ఊరికి పోదామా!
మురారి:– మంచిది కమలా! నువ్వు వెళ్లి ఎప్పటివలె రుద్రమదేవి దగ్గర ఉండు !
అందరూ తమతమ స్థానాల నుండి లేచి నిలబడ్డారు .ఊరు చేరే దాకా అందరూ కలిసి వచ్చి తర్వాత తలోదారిన వెళ్లారు.
దాదాపు సాయంత్రమైంది. మెల్లగా రాత్రి అవుతున్నది అమావాస్య ముందు దశమి కాబట్టి వెన్నెల జాడలేదు మూడు జాముల రాత్రి అయితే తప్ప సూర్యోదయం కాదని ప్రజలకు తెలియనందున జనలెవరూ వెన్నెల కోసం కానీ ,చంద్రుడి కోసం ఎదురు చూడడం లేదు.
రుద్రమదేవి విడిదిగా చేసుకొన్న భవనం సత్రమని చెప్పటానికి సందేహం లేకున్నా, కేవలం సత్రం వల్లే బట్టబయలుగాలేదు. విశాలంగా లేదు. రెండు మూడు గదులు రెండు మూడు మనసాలలున్న మూసినట్లు ఉన్న ఇల్లు, ఇంటినిండా దీపాలు వెలుగుతున్నాయి. రుద్రమదేవి ఆమె కూతురు ఇద్దరూ ఒక మనసాలలో కూర్చున్నారు.
ఇంతలో మదనమంజరి అక్కడికి వచ్చింది. మదనమంజరి రుద్రమదేవిని వదలిపెట్టి చాలాసేపు అయింది. మదనమంజరి వచ్చేదాకా వాళ్లు ముగ్గురే మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు చాలా నెమ్మదిగా అంటే కనీసం వారికి కూడా వినపడడం లేదేమో అన్నంత మెల్లగా మాట్లాడు కుంటున్నారు. మదనమంజరి రాగానే వారు సంభాషణ ఆపినట్టుగా ఆమె గుర్తించలేదు. మదనమంజరిని చూడగానే అయ్యో! మదన మంజరీ! మమ్మల్ని విడిచి పెట్టి నువ్వు వెళ్లి చాలాసేపు అయింది. కొత్త ఊర్లో తెలిసిన దానివి నువ్వు లేకుండా మాకు పొద్దు ఎలా గడుస్తుంది? దా! కూర్చో! అని అన్నది రుద్రమదేవి.
మదనమంజరి వచ్చి రుద్రమదేవి దగ్గర కూర్చొని ఏదో చెప్పబోయింది ఆమెను మాట్లాడ నివ్వకుండా ఇలా అన్నది.
మదనమంజరీ! నీకు ఒక విషయం చెప్పాలి అనుకుని మరిచిపోయాను. ఈ రోజు ఏకవీరాదేవి దేవాలయం చూశాం. కానీ మదనమంజరి ఏం చెప్పను? దేవికి మా మీద దయలేదు. రుయ్యమ్మకు సంతానం ఇవ్వలేదు. ముమ్మడమ్మకు మాత్రమే సంతానమున్నదని దేవి ఆజ్ఞ!
రేపు ఓరుగళ్ళకు వెళ్లి బ్రాహ్మణ సమారాధన చేయాలి. ప్రయాణానికి తగినట్లు మూటాముళ్ళు కట్టాలి. బండి వాళ్లను, పల్లకీల వాళ్లను ఎక్కడ ఉన్నారో వారికి తగిన జాగ్రత్తలు చెప్పి రావాలేమో? అయినా వారందరూ అంత జాగ్రత్తగా ఉండరేమో? కాచుకొని ఉంటారేమో!
ఇంతలో వంట తయారయిందని లోపల నుండి వంట చేసే సేవకురాలు వచ్చి చెప్పింది. రుద్రమదేవి ఆమె ఇద్దరు కూతుళ్లు లేచి భోజనం చేశారు. మదనమంజరి కూడా తిని లేచింది. పనిచేసే సేవకురాలు ఎప్పటివలె పడుకోవడానికి వెళ్ళింది. మదనమంజరి మూడు పడకలను సిద్ధం చేసింది.దాని మీద ముగ్గురు విశ్రమించారు. మదనమంజరి వారి దగ్గరే తనపడక వేసుకొని పడుకున్నది. అందరూ క్రమంగా నిద్రపోయారు.
దాదాపు జామురాత్రి దాటింది. ఊరి ప్రజలు అందరూ నిద్ర పోయారు. చిన్నపల్లెటూరు కాబట్టి ఊరి వారంతా తలుపులు బిగించుకొని అడవి మృగాల భయం లేదని నిశ్చింతగా నిద్ర పోయారు. రుద్రమదేవి నివసిస్తున్న ఇంటి తలుపులు అన్నీ బిగించబడ్డాయి.
అనుకోకుండా రుద్రమదేవి ఉన్న ఇంటి చుట్టూ ఏదో కలకలం పుట్టింది. ఆ ఇంటి చుట్టూ జనాలు మూగి ఉన్నారు. వారంతా ఊరి వారు కాదు. వాళ్ల చేతులలో కత్తులు మొదలైన సాము చేసే దుడ్డుకర్ర వంటివి చాలా ఉన్నాయి. వారందరూ కలిసి ఇంటి దర్వాజా తడుతున్నారు. కానీ తలుపులు తీయలేదు. తలుపులు రాకపోవడంతో అందులో కొందరు గడ్డపారతో పెళ్లగించి, తలుపులు ఊడదీసి లోపలికి ప్రవేశించారు. మొదట గదిగదికి పది మంది మనుషులు లోపల అంత శ్రద్ధగా వెతుకుతున్నారు. ఒక మనసాలలో మూడు మంచాలపై ఉన్న వారిని కొందరుచూశారు.రుద్రమదేవి ఆమె కూతుర్లు ఆ మంచాలపై నిద్రిస్తున్నారని వారు అనుకున్నారు. మూడు మంచాల మీద ముగ్గురు దుమికారు. ఆ ముగ్గురిలో ఒకడు హరిహర దేవుడు. మరొకడు మురారి దేవుడు. మూడోవాడు ధర్మవర్ధనుడు.
[వీళ్ల ముగ్గురిని మన పాఠకుల్లో నిర్మలాపురం నుండి దేవగిరి కి వెళ్ళే తోవలో ఉన్న చెరువు కట్టమీద మాట్లాడుకున్న అప్పటి నుండి చూస్తూనే ఉన్నారు]
వాళ్లు ముగ్గురూ మూడు మంచాలపై పడి చూశారు. ఆ మంచాలపై ఎవరూ లేరు. వారికి చాలా ఆశ్చర్యం వేసింది. చుట్టుపక్కల చూశారు .ఎవరూ పట్టుబడ్డ లేదు. నాయకులు ముగ్గురూ నిశ్చేష్టులయ్యారు .
ఇంతలో ఒకడు ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి హరిహర దేవుడికి అప్పగించాడు.
అతడి కాళ్లు చేతులు బట్టలతో కట్టేసి ఉన్నాయి. మోహం కనపడకుండా బట్టతో మూతి కట్టేశారు. కట్టుకున్న బట్టలను బట్టి ఆమె ఒక మహిళ అని తెలుస్తున్నది. దాన్ని చూసి హరహర దేవుడు సేవకులకు ఇలా చెప్పాడు.
మిగిలినవారు చిక్కపోయినా సరే ముఖ్యులైన రుద్రమ్మ మన చేతికి చిక్కింది. దీనిని కట్లు విప్పకుండానే గుర్రం బండిలో వేసి తలుపులు మూసి చాలా త్వరగా నడిపించండి! ఊరూరికి మన బండ్లు ఉన్నాయి. నదుల దగ్గర మన పడవలు ఉన్నాయి.
సేవకులు ప్రభువు ఆజ్ఞ పాటించారు.
ఎనిమిదవ ప్రకరణ
గ్రంథకర్త:-ఒద్దిరాజు సీతారామ చంద్రరాయశర్మ
సరళీకృతం:-రంగరాజు పద్మజ
[ అనభిజ్ఞాన సహాయ్యము]
(తెలియనివారి సహాయం)
మ. సమదాటోపత వాయునందనుడు ధృష్టద్యుమ్ను శైనేయు లే
కమనోవృత్తి గడంగితో నడర దోర్వర్గంబు శోభిల్ల శౌ
ర్యము సొంపార నిలింపకోటి వొగడన్ రారాజు సైన్యంబు లొ
క్క మొగిం బెల్లగిలంగ బెట్టడరె సక్రోధాంతరంగంబుతోన్ .
— మహాభారతము
భావం:- క్రోధాంతరంగంతో, పరాక్రమాతిశయంతో భీముడు దృష్టద్యుమ్న , సాత్యకులు తనకు తోడురాగా, దుర్యోధనుడి సేనలు పారి పోయేటట్లుగా విజృంభించాడు. అది చూసి దేవతలు ప్రశంసించారు.
వ్యాఖ్య :—కర్ణపర్వం ద్వితీయాశ్వాసం లోని యుద్ధవర్ణనను… గ్రంథకర్త రుద్రమదేవి నవల కథాసూచిగా తీసుకున్నారు. కథార్ధభాగం అచ్చంగా భారత యుద్ధాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించడం పోలికలో గొప్ప విశేషం.
కథాభాగం:-
రెండు జాముల రాత్రి. ఇంకా చంద్రోదయం కాలేదు. లోకమంతా చీకట్లు కమ్ముకుని ఉంది. వేలవేల నక్షత్రాలు ఆకాశంలో వజ్రాల ముక్కల వలె మెరుస్తున్నాయి. మబ్బులు లేకుండా ఆకాశం నిర్మలంగా ఉంది. చూడడానికి ఎంతో అందంగా కనపడుతున్నప్పటికీ… ఆకాశంలో చంద్రుడు లేని వెలితి స్పష్టంగా తెలుస్తూనే ఉంది.
మొగిలిచర్ల నైరుతి దిక్కున పెద్ద అడవి ఉంది. సహజంగా లోకమంతా పరుచుకున్న చీకటి ఆ అడవిలో ఇంకా చిక్కగా పరుచుకొని ఉన్నది. ఆ అడవిలోని ప్రాణులకు కళ్లు మూసినా తెరచినా ఒకే తీరుగా ఉంది. కళ్ళు ఆ చోట్ల ఏమాత్రం పనిచేయవు.
ఏదైనా శరీరానికి తాకితే తెలుసుకోవాల్సిందే తప్ప అలా కాకపోతే తెలుసుకోలేరు. ఆ తాకిన వస్తువును కూడా గుర్తించడం కష్టంగా ఉంది ఆ చీకట్లో…
అంత చిమ్మచీకటిలో ఆనాటి అడవిలో కొందరు ద్వంద యుద్ధం చేస్తున్నారు. ఎవరిని ఎవరు కొడుతున్నారో? తాను ఎవరినీ కొడుతున్నాడో? తనను ఎవరు కొడుతున్నారో కూడా తెలియడం లేదు.
కత్తీ కత్తీ తాకినపుడు వచ్చే నిప్పు కణాల వెలుగు అప్పుడప్పుడు కాస్త కనబడుతున్నది. ఆ నిప్పురవ్వలు ఎంతసేపు ఉంటాయి కనుక? దరిద్రుడి మనసులోని కోరికలు పుట్టడం అవి ఎలా తీరుతాయిలే అనే నిరాశలో మాయమై పోయినట్టు మాయమైపోతూన్నాయి.
అలా చీకటిగా ఉన్నా కూడా వారు యుద్ధం చేయడం ఆపలేదు. అసలు తమ వారెందరు జీవించివున్నారో, ఎదుటి వారి వైపు ఎందరు మరణించారో! అని తమ బలంగానీ, ఎదుటి వారి బలంగానీ వారికి తెలియదు. అలా అని కత్తి వేటు ఏ మనిషిపై వేస్తే అది తప్పకుండా ఆ వ్యక్తిని తాకడం లేదు. అలా అని గాయపడని వారు కానీ, చావని వారు కానీ లేరని చెప్పలేం. ఆ దొమ్మి యుద్ధపు కలకలం చాలా ఎక్కువగా ఉన్నది.
ఇంతలో ఒకప్పుడు ఉన్న చీకటి మెల్లగా తొలగిపోయి, నక్షత్రాలు తన సహజమైన వెలుగునిస్తున్నాయి. ఉదయ పర్వత శిఖరం మీద తెల్లని కాంతులు వెదజల్లుతూ చల్లని సూర్యుడు ఉదయించాడు. ప్రపంచమంతా నిర్మలమైన సూర్యకిరణాలతో చక్కగా కనపడుతున్నది.
సైనికులకు అందాకా చీకటితో మూతపడుతున్న కళ్ళు చీకటి తొలగిపోవడంతో చాలా సంతోషపడ్డారు. కొత్త ఉత్సాహంతో రెండువైపులా సైనికులు ఎదురుపడి యుద్ధం చేస్తున్నారు . ఇప్పుడు వారి యుద్ధ నైపుణ్యం చక్కగా కనపడుతున్నది. అంతకుముందు గాయాలపాలైన వారు, చనిపోయిన వారు అందరూ కనపడి ఎవరెవరో తెలుసుకున్నారు. తమ వారు చచ్చిపడి ఉండటం చూసిన వారి కోపానికి అంతేలేదు.
” హుమ్మని” ఒక్కసారిగా ఎదుటివారిపై దూకి యుద్ధం చేస్తున్నారు.కత్తివేట్లను తప్పించుకుంటున్నారు. కొందరు గాయపడుతున్నారు. కొందరు చస్తున్నారు. యుద్ధతీవ్రత ఎక్కువైపోయింది.
ఒకవైపు సైన్యం తక్కువ సంఖ్యలోనూ, రెండో వైపు సైన్యం కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎక్కువ సైన్యం ఉన్నవారు వారికున్న దళ బలంతో చెలరేగి శత్రు వీరులను చంపుతున్నారు. రెండు వైపులా సైన్యంలో సైనికాధికారులున్నట్టు కనిపించడం లేదు.రథాలు, గుఱ్ఱాలు, ఏనుగులు రెండు వైపులాసైన్యంలోను లేవు. సామాన్య పదాతి దళాలు అయినా బింకంగా, పరాక్రమంతో, పంతంతో బలం గల సేనానాయకులు ఉన్న సైన్యం వలె కనపడుతున్నది.
చంద్రోదయం తరువాత దాదాపు నాలుగు గడియలు యుద్ధం అయ్యే సరికి రెండు వైపులా సైన్యంలో చాలామంది చనిపోయారు. అందులో ఒక వైపు మరీ తక్కువ సైన్యంతో ఉన్నది. అందులో కొందరు శత్రువులచే చంపబడ్డారు. ఇక వారి గెలిచే అవకాశం లేదని అనుకున్నారు. తమను ప్రోత్సహించే వారు లేరు. అయినా ప్రాణాలు ఉన్నంత దాకా పోరాడడమే వారి నిర్ణయం. ఏం చేయగలరు? బలం నశించింది కాబట్టీ శత్రువులను చంపక పోయినా, మనుషులు తమపైన పడకుండా కష్టంగా తప్పించుకుంటున్నారు. శత్రువులు తరుముకుంటూ వస్తున్నారు. తక్కువ సైన్యం ఉన్నవారు వెనుకకు మళ్ళీ పోతున్నారు.ఇంతలో వారికి అడవిలోపల ఫెళఫళమని చప్పుడు వినబడింది. అది జంతువులు పరిగెత్తడం వలన కలిగిన చప్పుడు వలె ఉన్నది. డెక్కలు ఉన్న పెద్ద జాతి జంతువుల పరుగు శబ్దం అది. రెండు వైపులా సైన్యాలు ఆ చప్పుడు విన్నారు. కానీ యుద్ధం ఆపలేదు. యుద్ధం అంత పెద్దగా లేకున్నా… వీరాలాపములు ఎక్కువగా ఉన్నాయి.
ఇంతలో నలుగురు గుర్రపు స్వారీ చేస్తూ వచ్చిన యోధులు త్వరగా త్వరగా వచ్చి రెండు వైపులా ఉన్న సైన్యం మధ్య నిలబడి ఒక సారి అటు ఇటు చూసి, ఎక్కువ సైనికులున్న దళాన్ని నరకడం మొదలు పెట్టారు. ఆ నలుగురూ ఇరవై సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వరకు వయసు ఉన్నవారు.వారు ఎక్కిన గుర్రాలు చాలా ఎత్తుగా, బలంగా ఉన్నాయి. వారు మామూలు మగవారు కట్టుకొనే టటువంటి దుస్తులనే కట్టుకున్నారు. వారి చేతులలో అర్ధచంద్రాకారంలో ఉన్న పదునైన కత్తులు ఉన్నాయి. ఆ వెన్నెల వెలుగులో వారి గుర్రపు జీనులు మిలమిలా మెరుస్తున్నాయి. ఖడ్గాలను పెట్టే ఒరలు ఆ గుర్రపు జీనులకు వేలాడుతున్నాయి. ఆ నలుగురు యోధుల శరీరాలపై, వారు కట్టుకున్న దుస్తులపై నెత్తురు మరకలు ఉన్నాయి. వారెవరు? ఎక్కడనుండి వస్తున్నారు? వారి శరీరాలపై బట్టలపై రక్తపు మరకలు ఎందుకు ఉన్నాయన్న సంగతి మనకు తెలియదు. అలాగే ఆ యుద్ధం చేస్తున్న రెండు సైనిక దళాలు ఎవరివైనవని మనకు తెలియకపోయినా… తక్కువ సైనికులున్న సేన ఈ గుర్రపుస్వారీ చేస్తూ వచ్చిన యోధుల స్వంత సేననో లేక, వారి బంధువుల సేనయో కావచ్చునని మనం ఊహించగలం.
ఆ వీరులు నలుగురు తమకు అండగా రావడం, తనకు బదులుగా శత్రువులను ఎదుర్కొనేందుకు సిద్ధం చేయడం చూసి, ఎక్కువ సేన ఉన్న మిగిలిన సేన యుద్ధానికి సిద్ధపడింది. ఎదుటి పక్షం వారు కొంచెం సేపు యుద్ధం చేశారు కానీ కొత్త వీరుల కోపపు వేడికి నిలువలేక ఎక్కడివారక్కడ పారిపోయారు. యుద్ధభూమిలో శత్రువులు ఎవరూ లేరని గ్రహించారు.
తమను ఆపదనుండి రక్షించిన నలుగురు వీరులు ఎవరైనదీ, సైనికులకు తెలియకపోయినా తమ కృతజ్ఞతా వందనాలు తెలిపి ఇలా చెప్పడం మొదలు పెట్టారు.
అయ్యా! మీరెవరో మాకు తెలియకున్నా మమ్మల్ని రక్షించడానికి వచ్చిన దేవతా స్వరూపులని అనుకుంటున్నాం. మృత్యువు ఒడిలోకి చేరే సమయంలో ఏ కారణం లేకుండా మాపై దయ చూపారు? ఎందుకు మమ్మల్ని రక్షించారు?
అయ్యా! మేము ఓరుగల్లు సైనికులం. మా రాణి గారు తమ కూతుళ్లతో కలిసి వడ్డేపల్లికి పోయి, అక్కడినుండి మొగిలిచర్ల పోయారట. వారి వద్ద మాయలు చేసే ఒక దాసి దాపురించి, మేము ఎవరమూ వెంట రానీయకుండా చేసి, మా రాణి ఒక్క దాన్ని తీసుకొని వచ్చిందట. మా రాజా దేవేరి మోసగించిన బడిందని ఎలా తెలుసుకున్నారో కానీ, శివదేవ మంత్రీశ్వరులు గారు మమ్మల్ని త్వరగా వెళ్లి మొగిలిచర్లకు పోయే మన ప్రభువు ఉన్న విడిదికి వెళ్లి వారికి రాబోయే ఆపదలను తొలగించి, సుఖంగా ప్రయాణం చేయించుకొని రమ్మని ఆజ్ఞ ఇచ్చి పంపారు. మేము దాదాపు నూటా ఇరవై మందిమి బయల్దేరి వస్తున్నాం. మంత్రి మహారాజు గారికి ఈ వార్త సాయంకాలం తెలిసింది కావచ్చు. మాకు వెంటనే తెలిపారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా మేము ప్రయాణమై వస్తున్నాం మమ్మల్ని ఈ సేన రక్షించింది కావచ్చు. రహస్యంగా అల్లరి చేయకుండా తోవను విడిచి, అడవిలో పడి వస్తున్నా కూడా కనిపెట్టి ఎదుర్కొన్నారు. మమ్మల్ని ఎదిరించిన వారు దాదాపు రెండు వందలమంది. సాధ్యమైనంత వరకు యుద్ధం చేసాం. ఎదుటి వారి బలం ఎక్కువగా ఉండడంతో నాలుగువైపులా వాళ్లే నిలిచి, మమ్మల్ని హింసిస్తున్నారు. చివరకు ఈ గుంపుకు చిక్కినాం. ఇరవై మంది ఉన్నామనుకుంటాను. మీరు రాకపోతే మేము మా రాణి గారిని కష్టపడకుండా రక్షించుకోలేక పోయే వాళ్ళం.
అయ్యా! మా నమస్కారాలను అందుకొని మాకు సెలవు ఇప్పించండి. మేము త్వరగా వెళ్లాలి. అక్కడ ఏం జరుగుతుందో ఏమో?
ఎప్పటి వరకు మీరు మొగిలిచెర్లకు పొమ్మని మీ మంత్రి గారు ఆదేశించారు? అని ఒక యోధుడు అడిగాడు.
అయ్యా! మమ్మల్ని మీరు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి సమయం వృధాగా గడిచేలా చేయకండి. ఇప్పటికే ఆలస్యం అయిందని బాధపడుతున్నాం. ఇంకా ఆలస్యం చేస్తే మేము అనుకున్న పని చేయగలమా? అని ఒకడు అన్నాడు.
ఒక విషయం చెప్పండి!
జామురాత్రి కాకముందే పొమ్మని మంత్రి గారి ఆజ్ఞ! మాకు ఇబ్బంది లేకుంటే ఇదివరకే పోయే వాళ్ళం
శత్రువుల వల్ల మీ దొరసానికి ఆపద కలుగుతుందని తెలుసుకొని దానిని ఆపేందుకేనా? మీరు వెళ్ళేది.
ఔను !
మీరు ఇరవై మంది కన్నా ఎక్కువ లేరు. ఇంత తక్కువ మందితో వెళ్లి ఏం చేయగలరు? శత్రువులు మీకన్నా ఎక్కువ మంది ఉన్నారనడంలో సందేహం లేదు.అందున దారిలో మిమ్మల్ని ఎదుర్కొనే వారు ఎక్కువగా ఉన్నప్పుడు… ఇంక ఊరి లో ఎంత మంది ఉన్నారో? ఆలోచించారా? లేకపోతే ఇప్పుడైనా ఆలోచించుకోండి!
ఏది ఏమైనా మాకు విచారం లేదు. మా ప్రాణాలు మా దొరసాని పని కోసం కానీ, వారి కనుల ముందు మా ప్రాణాలు విడువడానికైనా మాకు సంతోషమే! మేము వారి సేవకులుగా ఉన్నందుకు, వారి ఉప్పు పులుసు తింటున్నందుకు మా జన్మలు అప్పుడే సార్థకం అవుతాయి. మమ్మల్ని తొందరగా పంపితే మీకు దండం పెడతాం!
ఎందుకలా తొందర పడుతున్నారు? మీ ప్రాణాలు రక్షించడానికి పైన రెండు మాటలు వినరా?
అయ్యా! మీరంటే మాకు ఎనలేని గౌరవం ఉంది. అయినా మా రాణీగారి పని కన్నా మీతో మాట్లాడటం మాకు ఎక్కువ కాదు. మీరు మా ప్రాణాలు రక్షించినందుకు మేము మరణించేటప్పుడు కూడా మిమ్మల్ని తలుచుకుంటూ మరణిస్తాం. దయతలచి మీరెవరో మాకు చెప్పండి! బతికి ఉంటే మళ్లీ ఎప్పుడైనా మీ సేవ చేసుకుంటాం! మేము స్వతంత్రులం కాము. నాకు అప్పజెప్పిన పని చేసేదాకా మేము ఆలస్యం చేయకూడదు.అయినా మీకు తెలియనిది ఏమున్నది?
మేము రాకుంటే యుద్ధంలో మరణించేవారు కదా! అలా అయితే మీరు ఏం చేసేవారు?
అది మాకు మంచే జరిగింది. మా తోటి వారంతా తమ ప్రభువు కోసం ప్రాణాలను సంతోషంగా విడిచారు. మేము కూడా అలాగే విడిచిపెట్టే వాళ్ళం.
అలా అయితే మీ దొరసాని పని ఏమయ్యేది? ఇలా ఆలోచించే వారు ఎవరు?
మీరు అలా అంటారా? మాలాంటి వాళ్లు వేల మంది ఉన్నారు.
ఇప్పుడు కూడా అలానే అనుకోండి!
అయ్యా! మీరెవరో రాజద్రోహుల వలే కనపడుతున్నారు. మమ్మల్ని ప్రభుత్వం పోషిస్తున్నప్పుడు మా రాణిగారి కోసం నీతి లేని మాటలు విన్నప్పుడు మా చేతులలోని కత్తులు ఊరుకోవు! మీరు మా ప్రాణాలు రక్షించుకునేందుకు యుద్ధంలో మా ప్రాణాలు మీకు అర్పిస్తాం! ఇక ముందు ఎటువంటి మాటలని, మమ్మల్ని కృతఘ్నులుగా చేయకండి! మాకాజ్ఞ ఇవ్వండి !
ఓ సైనికులారా! పిచ్చివాళ్ళయి పోయారు! అలా కాదు! మీ మంత్రి ముందే అక్కడికి చేరుకోమని చెప్పాడు. ఆ సమయం దాటింది. మీరు ఇప్పుడు వెళ్తే ఉపయోగం లేదు. అయ్యే పని ఏదో ఇంతకు ముందే జరిగిపోయి ఉంటుంది. మీరు ఇప్పుడు పోయి ఏం చేస్తారు? అని అన్నాను, కానీ మీ రాజు పైన ఉన్న భక్తిని విడిచి పెట్టమని చెప్పలేదు.
ఒకవేళ జరిగితే వారి జాడ తెలుసుకుంటాం. ఇంకేదైనా జరగకుండా తగిన జాగ్రత్త తీసుకుంటాను. మమ్మల్ని విడిచి పెట్టండి!
సరే !వెళ్ళి రండి! మాకేమీ అభ్యంతరం లేదు! అటు బాట వైపు వెళ్లి, మీరు మీ పని మీద, మేము మా పని మీద వెళ్దాం! అడవిలో నుండి ఎందుకు వెళ్లడం?
బాట ఇక నుండి ఎంత దూరం ఉందో?
అదిగో ! దగ్గరలోనే కనపడుతున్నది. మీ మాటలు మాకు బాట వెంట పోయే వారికి సులువుగా వినపడటం చేతనే ఇక్కడికి వచ్చాం. రండి! బాట దగ్గరికి వెళ్దాం!
సైనికులు ఆ మాటలకు ఒప్పుకున్నారు. గుర్రపు రౌతులు ముందు దారిన వెడుతుంటే… సైనికులు వెనుక నడుస్తున్నారు. వారంతా బాట వెంట నడిచారు.
(సశేషం)
నాల్గవ ప్రకరణ
గ్రంథకర్త:-ఒద్దిరాజు సీతారామ చంద్రరాయ శర్మ
సరళీకృతం:- రంగరాజు పద్మజ
సంతానాపేక్ష
శ్లోకం:–
కింతు వధ్వాంత వైతస్యా
మదృష్ట సదృష ప్రజం
న మా మవతి సద్వీపా
రత్నసూరపి మేదినీ.
–(రఘువంశము)
భావం:– అయినను ద్వీప సహితమైన ఈ భూమి రత్నాలను ఇచ్చినప్పటికీ తమ కోడలైన ఈ సుదక్షిణ యందు మాకు సదృశుడైన కుమారుడనే శ్రేష్ట రత్నం కలగక పోవడంతో నన్ను సంతోషంగా ఉండనివ్వలేదు.
వ్యాఖ్య:– రఘువంశంలో దిలీప మహారాజుకు ఎలాగైతే తమ కోడలైన సుదేష్ణకు సంతానం కలగాలని కోరిక ఉండేదో… అలానే రుద్రమదేవి తన కూతుళ్లకు సంతానం కలుగలేదని బాధపడుతున్నదని సూచిస్తూ రఘువంశ కావ్యం నుండి ఈ శ్లోకాన్ని ప్రకరణ శీర్షికగా రచయిత తీసుకోవడం భావి కథార్ధ సూచికగా పాఠకులకు ఈ కథాభాగంలోని కథ సూచింపబడుతున్నది.
కథాభాగం :— మదనమంజరి రుద్రమదేవి రాణీవాసంలో చక్కగా భక్తిశ్రద్ధలతో ఉంటున్నది. రుద్రమదేవి కూడా మదనమంజరి పట్ల ప్రేమ, ఇష్టం కలిగి ఉన్నది. గంధం తీయడం, ముమ్మడమ్మ, రుయ్యమ్మల కోసం పూల దండలను కట్టటం, పడకల ఏర్పాటు చేయడం, దేవుని గది అలికి ముగ్గులు పెట్టడం మొదలైన పనులను మదనమంజరి చేస్తున్నది. సమయం దొరికినప్పుడు రుద్రమదేవికి వింతైన కథలు చెబుతుండేది.
ఒకరోజు సాయంకాలం ప్రకృతి చాలా అందంగా ఉంది. సాయంత్రపు ఎరుపు రంగు ప్రపంచాన్ని ప్రేమ సామ్రాజ్యంలో ముంచి వేస్తున్నది. పక్షులు ఆకాశం నిండా పరుచుకుని ఎగురుతూ తమ నివాసాలైన గూళ్ళకు పోతున్నవి. ఆకాశంలో రకరకాల మబ్బులు కనపడుతున్నాయి. పిల్లలు ఆ మబ్బులు చూస్తూ” అదిగో రెండు గుర్రాలు! దాని మీద గుట్ట, దాని పక్కనే ఏనుగు, ఏనుగు మీద మనుషి, అదిగో తివాచీ, గుర్రం తలకాయ మాయమైపోయింది. ఏనుగు మీద మనుషి కోడిపుంజుగా మారాడు.” ఇలా మబ్బులు మారుతూ పోతున్నప్పటి ఆ మబ్బుల ఆకారాలకు తగినట్లుగా పేర్లు పెడుతూ ఆడుతూ సంతోష పడుతున్నారు పిల్లలు. ఆవులు” అంబా”అని అరుస్తూ వస్తున్నాయి. కూలి పనులకు వెళ్ళినవారు తమతమ ఇండ్లకు వస్తున్నారు. పశువుల మంద నడవడంతో వీధులలో దుమ్ము లేచి, ఇంకా కూలీనాలీ చేసుకునే ఆడవాళ్ళు వారి ఇంటిలో వంటలు వండుతున్నప్పుడు కమ్ముకున్న పొగా, ఈ రెండూ కలిసి ప్రకృతి అందంగానూ, ఒక వింతగానూ కనబడుతున్నది. వంట కోసం రకరకాల కట్టెలను కాల్చడం వల్ల ఒక రకమైన వాసన గుప్పుమని వస్తున్నది.
కొంతసేపటికి ఆకాశం నిండా వేల కోట్ల నక్షత్రాలు మినుకుమినుకుమంటూ వెలుగుతున్నాయి. ఆనాడు పౌర్ణమి తెల్లవారి కావడంవల్ల నక్షత్రాల వరుస చాలాసేపు తమ అందమైన రీతి ప్రపంచానికి కనిపించకుండా చల్లని చంద్రుని వెలుగుకు లొంగిపోయి ఒకటొకటే కనిపించకుండా మాయమై పోయాయి. అమృతమయుడైన చంద్రుడు ఆకాశాన వెలుగుతూ వేలవేల తన చల్లని కిరణాలు భూమిపై ప్రసరింపజేసి, తెల్లని రాళ్ళను నేల మీద పరిచినట్టుగా కనబడుతున్నవి. ఆ వెన్నెలలో ఓరుగల్లు నగరం గొప్పగా సింగారించుకున్నట్టు ఉన్నది.
పిల్లలు ఆనందంగా వీధులలో ఆటలు ఆడుతున్నారు. సామాన్య యువత గుంపు గూడి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతున్నారు. కూర్చున్న యువకులు తీగలతో ఉన్న యంత్ర వాయిద్యాలతో సంగీతం వాయిస్తున్నారు. కొందరు గుమ్మటెలు ( కుండ వాయిద్యం ) వాయిస్తూ… వీరుల చరిత్రలు పాటలుగా పాడుతున్నారు. కొందరు జంగములు మహావీరులను ఆనంద పరుస్తున్నారు.
దాదాపు మూడు గడియల రాత్రి అవుతున్నది. రుద్రమదేవి, ముమ్మడమ్మ, రుయ్యమ్మ, మదనమంజరి ఇంకో ఇద్దరు చెలికత్తెలు మేడ మీద కూర్చుని ఉన్నారు. ప్రకృతి వారికి ఉల్లాసం కల్గిస్తున్నది. మదనమంజరి ఏవేవో ముచ్చట్లు చెప్పి, అక్కడ ఉన్న వారిని నవ్విస్తున్న ది.
మదనమంజరీ! ముచ్చట్లు చెప్పి కాలక్షేపం చేయడంలో నిన్ను మించిన వారు లేరు. చాలా సమర్థురాలువే! నువ్వు పుట్టినప్పటినుండి మోటు ప్రదేశాలలో తిరిగానని చెప్పినావు! కానీ చక్కగా చాతుర్యంతో మాట్లాడుతూ, హాస్యసంభాషణలతో పొద్దు పుచ్చడం చాలా పాతకథలను చెప్పడం, ఇంకా నీకు బాగా తెలుస్తుంది. చిన్నతనం నుండి నువ్వు అంతఃపురాలలో ఉంటే ఇంకా నీకు ఎంతో నేర్పుగా మాట్లాడడం వచ్చి ఉండేదో? నేను చెప్పలేను” అని రుద్రమదేవి అన్నది.
ఏదో ” మీ దయ నేను అంత నేర్పుగా మాట్లాడక పోయినా, నా మీద మీకున్న దయతో అలా అనిపిస్తున్నదని మదనమంజరి అన్నది.
ఈరోజు ఏదైనా కథ చెప్తావా? కథ అంటే కథ కాదు! జరిగిన విషయం నీకు ఏదైనా తెలిస్తే చెప్పు! కల్పిత కథల కన్నా జరిగిన కథలు సంతోషం కల్పిస్తాయి! రుద్రమదేవి అడిగింది.
మీరు అడిగితే అలాగే చెప్తాను. చాలా పాతకాలం నాటి కథ ఒకటి చెప్పనా? అది అనుమకొండకు సంబంధించిన కథ. అని మదనమంజరి అన్నది.
రుద్రమదేవి చెప్పమన్నది.
రుద్రమదేవి ,మిగతా వారు అందరూ శ్రద్ధగా వింటున్నారు. ఈ విధంగా కథ చెప్పటం మొదలు పెట్టింది..
చాలా కాలం క్రితం కంధార పట్టణంలో సోమదేవరాజు అనే ఒక రాజు సత్యసంధుడై రాజ్యపరిపాలన చేస్తున్నాడు. సోమదేవ మహారాజుకు బ్రాహ్మణులంటే చాలా భక్తి. ఆవులంటే ఎంతో ఇష్టం. వాటి మీద ప్రేమ ఎక్కువగా చూపేవాడు. ఆరాజు చాలా ఆవుల మందలను మంత్ర కూటం( మంథెన), భద్రాచలం మొదలైన గోదావరి ఒడ్డున ఉన్న పట్టణాలకు మేతకోసం పంపించేవాడు. ఈ వార్త కటకపురం రాజధానిగా ఉత్కల దేశాన్ని పాలించే బల్లహుడు విని ససైన్యంగా వచ్చి సోమ దేవరాజు యొక్క ఆవులను చుట్టుముట్టాడు. ఆవులను మేపేవారు అతనిని అడ్డుకున్నారు. కానీ చక్కని శిక్షణ పొందిన చాలా మంది సైనికుల ముందు శిక్షణ పొందని పశువుల కాపరులు సైనికుల ముందు నిలువ గలరా? కొందరు గాయపడ్డారు. కొందరు చనిపోయినారు. బల్లహుడు మందలను తోలుకొని కటకపురానికి పోయాడు. చావగా మిగిలన పశువుల కాపర్లు వచ్చి కంధార రాజయిన సోమదేవరాజుకు చెప్పారు. రాజు సైన్యం సిద్ధం చేసుకొని బల్లహుడితో పోరాడటానికి బయలుదేరాడు. కానీ బల్లహుడు చాలా దూరం వెళ్ళిపోయాడు. అలాగే తరుముతూ తరుముతూ పోయి, సోమ దేవరాజు కటకపురిని ముట్టడించాడు. బల్లహునకు సోమదేవరాజు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సోమదేవరాజు ఓడిపోయి కంధారానికి వచ్చి ఎక్కువ బలమైన మరింత సైన్యాన్ని తీసుకొని రెండవ సారి కటకపురిని ముట్టడించాడు. ఇప్పుడు సోమదేవరాజు గెలుపొందాడు. నాలుగు సంవత్సరాల దాకా యుద్ధ ప్రస్తావన వస్తే ఒకసారి కటకపుర రాజు గెలుస్తూ మరొకసారి ఓడిపోయేవాడు. సోమ దేవరాజు అంతటితో యుద్ధతలంపు మాని, తన నగరానికి వచ్చి సంతానం పొందేందుకు మరియు శత్రువును ఓడించటం డానికి పుత్రకామేష్టి యజ్ఞం జరిపించాడు. వైశ్వానరుడి దయ వల్ల సోమదేవరాజు భార్య గర్భవతి అయ్యింది. ఈ సమాచారం కటకపురి బల్లహునకు తెలిసింది. బల్లహుడు తనకు ముప్పు తప్పదనుకొని గొప్ప సేనతో వచ్చి కంధారాన్ని ముట్టడించినాడు. సోమదేవరాజుకు, బల్లహునకు ఇరవై రోజులు అతి భీకరంగా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సోమదేవరాజు వీరమరణం పొందాడు.కంధార పట్టణం బల్లహునకు మనకు స్వాధీనం అయింది. భర్త చెప్పిన విధంగా సిరియాళదేవి దేశం నుండి పారిపోయింది. బల్లహుడు ఆమెకోసం ఊరంతా గాలించాడు. కానీ ఆమె జాడ తెలియలేదు.సిరియాళదేవి కంధారం నుండి పారిపోయి వచ్చి మన అనుమకొండకు చేరుకున్నది. అనుమకొండ మనకి అప్పుడు లేదు. ఊరు కూడా ఇప్పటి వలే పెద్దగా లేదు. శ్రీశైల అడవుల దగ్గర నివసించే వ్యాధుడు అనే వాడు వచ్చి ఇక్కడ ఒక బోయపల్లెని ఏర్పాటు చేసి, దానిని అభివృద్ధి చేశాడు. అతని వంశం వాడే ఎరుకు దేవరాజు అనే పేరుతో రాజ్యాన్ని పాలిస్తున్నాడు. సిరియాళదేవి ఎరుకు రాజు దగ్గరికి వెళ్లి,”బల్లహునకు” భయపడి పోయి పారిపోయి వచ్చాను. నా భర్త నన్ను చావవద్దని అన్నాడు. నన్ను కాపాడుమని వేడుకుంది. కానీ బల్లహుడికి భయపడి సిరియాళదేవికి అతను ఆశ్రయము ఇవ్వలేదు. సిరియాళదేవని ఎరుకు రాజుకు తెలుస్తే ..సోమదేవ రాజు సహాయం తాను ఎన్నోసార్లు పొంది ఉన్నాడు కాబట్టి తప్పక ఆశ్రయం ఇచ్చి ఉండేవాడు. ఎరుకు దేవరాజు ఆశ్రయం ఇవ్వకపోవడంతో సిరియాళదేవి బయలుదేరి వెళ్లిపోతూ ఉండగా అనుమకొండ నివాసి సదాచార సంపన్నుడైన మాధవశర్మ సిరియాల దేవిని రమ్మని ఆదరించి భయపడకని ధైర్యం చెప్పి తన ఇంటిలో ఉండుమనీ ఆమెకు ఎటువంటి శ్రమ కలుగకుండా కాపాడుతున్నాడు. ఈ వార్త బల్లహుడు విని, అనుమకొండపైకి దండెత్తి వచ్చాడు. బల్లహుడికి భయపడి ఎరుకురాజు తన ఊరిలో సిరియాళదేవి లేదని చెప్పాడు. బల్లహుడు అనుమకొండలోని అందరి ఇళ్లకు ఆయా జాతుల వారిని పంపి సిరియాళదేవిని వెతికించాడు.మాధవశర్మ ఇంట్లో ఉన్న సిరియాళదేవిని , మాధవశర్మను ఒక బ్రాహ్మణుడు తీసుకొని వచ్చి రాజుకు చూపించాడు. బల్లహుడు ఆమెనే సిరియాళదేవి అని అనుమానించాడు. ఎరుకుదేవరాజు కూడా అనుమానించాడు. అప్పుడు అనుమకొండలోని బ్రాహ్మణులందరు కూడబల్కొని ఈమె సిరియాళదేవి కాదని మాధవశర్మ కూతురైన లలిత అని, ఒకవేళ ఈ లలితతోనే మీరు అనుకుంటే తీసుకొనిపోండి! మేమేమీ అడ్డు చెప్పము. మీరు చేసిన ఈ పనిని శాసనాల మీద చెక్కించి అందరం అగ్ని పేర్చుకుని అందులో దూకుతామని బ్రాహ్మణులు అన్నారు. ఆ మాటలకు బల్లహుడు అదిరిపోయి ఈమె మీ లలిత అయినా, సిరియాళ దేవైనా మాకు పని లేదు. సిరియాళదేవి జాడ తెలుసుకోవడం ఆమెకు మానహాని కానీ, ఆమె కడుపులో ఉన్న సంతానానికి హాని చేయడానికి కానీ కాదు. ఆమెను మేము మా ఇంటికి తీసుకుని పోయి ఆమె కడుపులో బిడ్డ కలిగితే మాకు విధేయుడిగా ఉండేలా పెంచుతామని, కంధార పట్టణానికి రాజుగా చేస్తామని అది నిజంగా నిజం అని అన్నాడు.
బ్రాహ్మణులు అతని మాట నమ్మక తమ పట్టుదలను వదిలిపెట్టలేదు. తరువాత బల్లహుడు ఆమె మీ కూతురు అయితే ఆమె చేతితో వడ్డించిన అన్నం తినమని అన్నాడు. అప్పుడు వారంతా సరే అన్నారు.
తెల్లవారి సింగేశ్వరాలయానికి పోయి గర్భిణీ చేత అన్నం తినడం ఆచారం కాదని, బల్లహునకు చెప్పి బెల్లం, నేతిని సిరియాళదేవి చేత వడ్డింపించుకొని తిని అనుమానం తీర్చారు.
బల్లహుడు వెళ్ళిపోయిన తరువాత ఒకానొక శుభ ముహూర్తంలో మాధవశర్మ ఇంటిలో సిరియాళదేవి కొడుకును కన్నది. ఆ పిల్లవాడికి మాధవవర్మ అని పేరు పెట్టారు .
మాధవశర్మ ఇంట్లో సకల వేదాలను, శాస్త్రాలను, ధనుర్విద్యను నేర్చుకొని మొదట ఎరుకు రాజును వెళ్లగొట్టి అనుమకొండను వశపరచుకొని, చాలామంది సంస్థానాధీశులు వెంటరాగా కటకాన్ని ముట్టడి చేసి,
> బల్లహుని చంపి, అతని కుమారుడైన”భండికి” రాజ్య పట్టం కట్టి తన చెప్పుచేతుల్లో ఉండేట్లుగా చేసుకొని, కంధారానికి వచ్చి, కంధారాన్ని , అనుమకొండను ఒకే తీరుగా న్యాయ పరిపాలన చేస్తూ సుఖంగా ఉన్నాడు.
“మదనమంజరీ!” సిరియాళదేవి పడరానిపాట్లు పడింది కదా!బ్రాహ్మణుల ధైర్యం కూడా చాలా గొప్పది.
మాధవశర్మ గారు ఎంతో పరోపకారి. ధీనులను ఆదరించి అక్కున చేర్చుకునే గుణం ,ఎంతో పట్టుదల! ఎంతో నేర్పరులు! వారే లేకుంటే సిరియాళదేవి గతి ఏమై ఉండేదో కదా! కన్నబిడ్డల వలె అనుకొని సిరియాళదేవిని పెంచిన మాధవశర్మ గారు మనందరం ఉదయాన్నే వారిని తలుచుకోవాల్సిన వారు కదా !అని రుద్రమదేవి అన్నది.
అందులో అనుమానమే లేదని అన్నది ముమ్మడమ్మ “. మాధవశర్మ చాలా ప్రేమతో పోషించినట్టు, సిరియాళదేవి కుమారుడు జన్మించడం వల్లనే కదా! చాలాకష్టాలన్నీ తొలగిపోయినవి. లేకపోతే ఇంకేమున్నది, ఒకవేళ కూతురు పుట్టి ఉంటే ఆమెకు పెళ్లి, మనుమడు కలగడం అతను భూమియందు పరాక్రమవంతుడైనప్పుడు కదా! మనవడిగా అధికారియై కంధార రాజ్యానికి రాజైనప్పడు కదా! సుఖం కలిగేది. అంత దాకా సిరియాళదేవి కూతురుతో మాధవశర్మ గారి ఇంట్లో ఉండాల్సి వచ్చేది కదా! కుమారులు లేని జన్మ వృధా అనడంలో అనుమానం ఎందుకు? నా సంగతి చూడు! నాకు ఏమున్నది, ఇద్దరు కూతుర్లు లేకపోతే నాకు ఎంత రాజ్యసంపద ఉన్నా ఎంత ధర్మం ఆచరించినా లాభమేమిటి? అని రుద్రమదేవి అన్నది.
పుత్రులు లేకుంటే పున్నామ నరకం తప్పదని పెద్దలు నిశ్చయంగా చెప్పారు. అయినా కూడా భగవంతుడు మీకు ఇద్దరు పుత్రికలను వరంగా ఇచ్చాడు. వారి కడుపులు పడితే మీకు ఇంక లోపమే లేదు! అని మదనమంజరి అన్నది.
అవును నీవన్నది నిజమే! ఇంకా నాకు ఆ భాగ్యం కలగలేదు. నా కూతుర్లకు పుత్రులు పుట్టడం చూసే భాగ్యం నాకు లేదేమో? అని రుద్రమదేవి అన్నది.
మీరు విచారించకండి! దేవుడు మీ కూతుళ్లకూ త్వరలోనే బిడ్డలనిస్తాడు. ఇప్పుడే మీరు ఇంత బాధ పడటం ఎందుకు? కూతుళ్ళకు ఏమంత ఈడు గడిచిపోయిందని బెంగ?అని మదనమంజరి అన్నది.
అయ్యో !వెర్రిదానా! ఇంకెంతకాలం గడవాలి? ఈ వయసులో ఉన్న ఆడవారు ఇప్పటికే ఇద్దరు పిల్లల్ని కన లేదా? అటువంటి వారిని చాలా మందిని చూశానని రుద్రమదేవి అన్నది
అవును పేదవారికి అధిక సంతానం కలుగుతుంది. శ్రీమంతులకు ఎంతో ఎదురు చూస్తే తప్ప సంతానం కలిగే భాగ్యం ఇవ్వడు భగవంతుడు. రుయ్యమ్మ దొరసానికి ఏమంత వయసు మీరినది? కనే ఈడు ఏమి మించిపోలేదు. లేత ప్రాయంలోనే ఉన్నారని మదనమంజరి చెప్పింది
ఔనే ! మదనమంజరీ! మా రుయ్యమ్మకింకా ఈడు గడవ లేదనడం నిజమే. మరి ముమ్మడమ్మ పరిస్థితి ఏమిటి? ఆమె పెద్ద బిడ్డ కాబట్టి ఆమె వయసు కొంచెం ఎక్కువ అయింది. ముమ్మడమ్మకు ఇదివరకే సంతానం కలగలిసి ఉండేది! ఈ విచారం తప్ప నిజానికి వేరు విచారాలు నాకు లేవు.ఈ చింత ఎన్నడు తీరుతుందో తెలియదు. వీళ్లిద్దరితో ఎంతో మంది దేవతలను స్థాపింప చేశాను. ఎన్నో దానాలు చేయించాను. నా బిడ్డల బిడ్డలను ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటే నేను చూడగలనో?లేదో? అన్నది రుద్రమదేవి.
దేవత మాత్రమేం చేస్తుంది? భగవంతుడు అందరి పట్ల ఒకే తీరుగా చూస్తాడు. మనుష్యులు వారు చేసిన పాపాలకు వారికి తగిన ఫలితాలను ఇస్తాడు. సమయం వచ్చేదాకా దేవుడు కూడా శ్రద్ధగా ఉంటాడు. ఇది మనకు తెలిసినా ఫలించే రోజు వచ్చే దాకా చూస్తూ ఊరుకోకూడదు. ఫలం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి మనకు తోచినంత దానధర్మాలు చేస్తూ… దేవతలను ఉపాసించాలని అన్నది మదన మంజరి.
నువ్వు చెప్పింది నిజమే! అందుకే సంతాన గౌరీవ్రతం చేయిస్తున్నాను. మూడు సంవత్సరాల నుండి చేస్తున్నారు. ఇంకేం చేయాలో తెలియడం లేదు. ఒకటి మాత్రం నిజం అనుకుంటున్నాను. ఏమిటంటే వడ్డేపల్లిలో బుద్ధ గణపతి అనే దేవుడు ఉన్నాడు.ఆ దేవుడు చాలా మహిమగల వాడు. కొన్ని రోజులు అక్కడ ఉండి ఆ దేవుని పూజించమని నా కూతుర్లకు చెప్తాను. చూద్దాం! ఏ దేవుడికైనా దయ రాకపోతుందా? అని అన్నది రుద్రమ్మ దేవి.
మంచి ఆలోచన చేశారు ఇక ఆలస్యం చేయకుండా ఆ దేవుడిని పూజించడం మంచిది .ఆ దేవుడు మంచి ప్రభావం కల దేవుడు. నేను వచ్చినప్పుడు ఆ ఊరు నుండి వచ్చాను. నాతో వచ్చిన వారు ఆ దేవుని దర్శించుకోవడానికి వెళ్లారు. వారివెంట నేను వెళ్ళి దర్శించుకున్నాను. వారందరూ ఆ దేవుని ప్రభావం చాలా గొప్పగా పొగుడుతూ నాకు చెప్పారని మదనమంజరి అన్నది.
అప్పటికి దాదాపు జామురాత్రి దాటింది ఎవరి పడక గదులకు వారు వెళ్లి విశ్రమించారు.
ఐదవ ప్రకరణ
[ అన్యోన్య సంభాషణం]
ఇతి వ్యాహృత్య విబుధాన్
విశ్వయోనిస్తిరోదధే ౹
మనస్యాహితకర్తవ్యాః
తే౽పి దేవా దివం యయుః ౹౹ 2-62
కుమారసంభవము.
భావం:-ఈ విధంగా బ్రహ్మ దేవుడు ఇంద్రాదిదేవుళ్లను గురించి చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆ ఇంద్రాది దేవుళ్లు కూడా మనస్సులో కర్తవ్యబుద్ధిని పొందినటువంటివారై స్వర్గలోకానికి వెళ్లారు.
అనుమకొండకు పడమటివైపున దాదాపు నాలుగు మైళ్ళదూరంలో వడ్డేపల్లి అనే గ్రామమున్నది.ప్రస్తుతం ఓరుగల్లు నుండి వడ్డేపల్లి దాకా దాదాపు ఇండ్లు కట్టుకున్నారని చెప్పవచ్చు.మన కథాకాలంలో ఇప్పటివలె కాకుండా దట్టమైన అడవి ఉండేది.
ఈ గ్రామానికి దక్షిణ దిక్కులో ఒక చెరువు ఉన్నది. అయినా అందులోని నీళ్ళు ఉపయోగించడానికి ఆ చెరువు కింద పొలాలు లేవు.గ్రామం చిన్నదవడం వల్ల అక్కడ నివసించే వారు కొంత మంది కాపురస్తులు కొంత మోతాదులో భూమిని వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
ఆ చెరువు వెనుక ఒక మఱ్ఱి చెట్టున్నది.అది చాలా పెద్దది. దాని కొమ్మలెంత పెద్దగా ఉన్నాయంటే… ఊడలు కిందకు దిగి ఇంటి స్తంభాలవలె ఉండి రంధ్రాలున్న ఆకులు చెట్టు బోదెపై ఇంటి కప్పు వలె ఉన్నది. అంతగా ఎత్తు లేని పరపు బండ ఒకటి ఆ మఱ్ఱి చెట్టు కింద పరచినట్టుగా ఉండి రెండు కుటుంబాలు సునాయాసంగా కాపురం చేయవచ్చు.
ఆ చెట్టు కింద ఇద్దరు మగవారు ఒక స్త్రీ కూర్చుని ఉన్నారు. ఒకని పేరు హరిహరుడు, రెండోవాని పేరు మురారి దేవుడు.ఆమె పేరు కమల.వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారో తెలియదు. వాళ్ళు మాట్లాడుకునే మాటలు వింటే తప్ప తెలిస్తే తెలియవచ్చు.వాళ్లు ఇలా మాట్లాడుకుంటున్నారు.
మురారి:– కమలా! కొరతేమీ లేదు కదా!
కమల:– మీదయ ఉండగా కొరతేముంటుంది ?
మురారి:– ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది?
కమల:- పాచిక పారింది.
మురారి:- ఎలా?
కమల:- మనమనుకున్నట్టే !
మురారి:-ఆ ఉపాయం చక్కగా పనిచేసిందా?
కమల:- తృప్తిగా .
మురారి:- ఇంకా విశేషాలు ఏమిటి?
కమల:- మీకు తెలియనివి ఏమున్నాయి?
మురారి:- తపస్సు చేస్తున్నావా?
కమల:- చాలా శ్రద్ధగా.
మురారి:- మనం ఇక్కడి నుండి ఎప్పుడు బయలుదేరుదాం ?
కమల:- మీకు దయ వచ్చినరోజు.
హరి:- నువ్వు ఎన్ని రోజులుంటావు ?
కమల:- ఎక్కడ?
హరి:- వడ్డేపల్లిలో…
కమల:- ఇవాళ మాత్రమే.
హరి:- ఈ రోజు మనం వెళ్లి పోవడానికి మంచి అనువుగా లేదా?
కమల:- లేదు.
మురారి:- ఎందుకు లేదు?
కమల:- కొందరు మనలను కనిపెట్టుకుని ఉన్నారు.
హరి:- వారు అడ్డమా?
కమల:- ఎవరికెరుక?
హరి:- మరి ఇవాళ ఇక్కడ నుండి బయలు దేరి ఎక్కడకి వెళ్లాలి?
కమల:- మొగిలిచెర్లకు…
హరి:- ఏమో? మా ప్రాణాలు నీ చేతిలో ఉన్నవి.చివరకు ఆశ నిరాశవతుందో ఏమో?
కమల:- మీ అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది.
మురారి:- నీ చేతిలో ఉన్నదానికి మా అదృష్టం అంటావేమిటీ?
కమల:- ఉంటే మాత్రం?
హరి:- మొగిలిచెర్లలో ఎన్ని రోజులుంటాము?
కమల:- ఐదు రోజులు.
మురారి:- అక్కడనుండైనా నిజమైన ప్రణాళికేనా?
కమల:- సమయానికి మీదగ్గరకు రాకుండా ఉంటానా?
మురారి:- తప్పనిసరి వస్తావా?
కమల:- వస్తాను…ఇప్పుడు రాలేదా?
మురారి:-ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే …నువ్వు దరిద్రంతో బాధపడకుండా…ఉండేలా చేస్తాం.
కమల:- సాయంత్రం అయింది. ఇక నేను వెళ్లుతాను.
మురారి:- దయ ఉంచు !
కమల అక్కడి నుండి వెళ్లి పోయి చెరువు కట్టనెక్కి ఊరుకు చక్కగా వెళ్లి పోయింది.
(సశేషం)
★★★★★★★★★★★★★★★