13 జనవరి 2025 నుండి మొదలైన మహాకుంభమేళా సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక వ్యాసం. మయూఖ పాఠకులకు ప్రత్యేకం..
పరిచయం
మహాకుంభమేళా అనేది కోట్లాది హిందువులు సంస్కృతి సంప్రదాయాలపై అచంచల విశ్వాసంతో చేసే యాత్ర ఈ సంవత్సరం 13 జనవరి నుండి 26 ఫిబ్రవరి 2025 వరకు సాగే 45 రోజుల యాత్ర.
ఇందులో నాలుగు రకాలు ఉంటాయి. సాధారణ కుంభమేళా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది . ప్రతి ఆరు సంవత్సరాలకు జరిగేది అర్థ కుంభమేళా పూర్ణకుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ లలో జరుగుతుంది . ఇలా 12 పూర్ణకుంభమేళాలు జరిగాక జరిగేది మహాకుంభమేళా . అంటే 144 సంవత్సరాలకు జరిగేది .ఇది అలహాబాద్ లో మాత్రమే జరుగుతుంది. అయితే ఈ రోజులలో 12 సంవత్సరాలకు జరిగే దాన్నే మహాకుంభమేళా అని పిలుస్తున్నారు.
కుంభం అంటే సంస్కృతంలో కుండ అని కలశం అని అర్ధాలు ఉన్నాయి . ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం ఒక రాశి కూడా కుంభరాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు. మేళ అంటే కలవడం, జాతర అని అర్థాలు, లక్షలాది హిందువులు గంగ ఒడ్డుకు చేరుకొని . చేసే వేడుక ఈ జాతర మరిచాను లక్షలాది ఒకప్పుడు . నేఊ కోట్లాది అనాలి. 2013లో జరిగిన కుంభమేళాకు దాదాపు 20 కోట్ల మంది వచ్చారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అంచనా సూర్యుడు, బృహస్పతి గ్రహాల స్థానాల ఆధారంగా ఈ మేళా జరుగుతుంది . సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉంటే త్రయంబకేశ్వర్లో సూర్యుడు మేషరాశిలో ఉంటే హరిద్వార్లో కుంభమేళా జరుగుతుంది .
అలాగే బృహస్పతి వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉంటే ప్రయాగరజ్ లో బృహస్పతి- సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటే ఉజ్జయినిలో జరుగుతుంది . ఇందువల్లే ప్రతి స్థలంలోనూ బృహస్పతి సూర్యుడు చంద్రుడు స్థానాల ఆధారంగా మేళా తేదీలను నిర్ణయిస్తారు. వాటిని షా హిస్నాన్ లేదా రాజస్నాన్ అని అంటారు.
పౌరాణిక ఆధారాలు
పురాణాల ప్రకారం క్షీరసాగర మధనంలో, భాగవత విష్ణు పురాణాలలో రామాయణం, మహాభారతాల్లో దీని ప్రసక్తి కనిపిస్తుంది. – క్షీరసాగ చిలకడం మొదలు పెడతారు. తీరా అమృతం దొరికాక ఎక్కువ వాటా కోసం గొడవలు పడతారు రాక్షసులు చేతిలో ఆ అమృత కుంభం పడితే వారి అరాచకాలకు హద్దులు ఉండవని తెలిసిన మహావిష్ణువు కుంభాన్ని ఆ ప్రదేశం నుంచి దూరంగా తీసుకెళ్తాడు .అలా వెళ్ళినప్పుడు కొన్ని అమృత బిందువులు ప్రయాగ ఉజ్జయిని హరిద్వార్ నాసిక్లలోని నదుల్లో పడ్డాయని ప్రజల విశ్వాసం .
ఎన్నో ఏళ్లుగా ప్రయోగరాజ్ లో పురోహిత్యం చేస్తున్న తెలుగు పురోహితుడు శ్రీ ఎడవల్లి చంద్రశేఖర ప్రవీణ్ శర్మ గారి అభిప్రాయంలో ఈ నాలుగు ప్రదేశాలలోనే కుంభమేళా నిర్వహించడంపై భిన్న కథనాలున్నాయి . సామ. అధర్వణ వేదాల ప్రకారం సముద్ర మధనం లో వచ్చిన అమృత కలశాన్ని మొదటగా జయంతుడు అనే కాకి నోట కరచుకొని భూమి చుట్టూ తిరుగుతుంది. అలా తిరగడంలో నాలుగు చుక్కలు ఈ ప్రదేశాల్లో పడ్డాయని, అందువల్లనే ఈ నాలుగు క్షేత్రాలలో కుంభమేళ జరుగుతుంది. అయితే అమృత కలశాన్ని నోట కరుచుకొని వెళ్ళింది కాకి కాదు గరుడ పక్షి అని మరో కథనం..
చరిత్ర ఏం చెస్తోంది ?
క్రీస్తు శకం 629 -645 మధ్యకాలంలో మన దేశానికి వచ్చిన చైనా యాత్రికుడు హుయున సాంగ్ కుంభమేళాను గురించి ప్రస్తావించాడు. ఇతను హర్షవర్ధనుని కాలంలో మన దేశానికి వచ్చాడు.
ఆధునిక కాలంలో దీని గురించిన ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఇంపీరియల్ గజేటి ఆఫ్ ఇండియా లో 1796 లో రెండు మిలియన్ల మంది 1889లో 2.5 మిలియన్ల యాత్రికులు కుంభమేళాకు వచ్చినట్లు ప్రకటించారు.
జ్వర్ కుంభమేళాలో బ్రిటిష్ అధికారి రాబర్ట్ మాంటి గౌరీ మార్టిన్ సందర్శకులలో బుఖారా కాబుల్ తుర్కిస్తాన్ నుండి వచ్చిన గుర్రాల వర్తకులు ఉన్నారన్నాడు. వీధితో బాటు అరబ్బులు పర్షియన్లు గుర్రాల వ్యాపారం కోసం వచ్చారని చెప్పాడు. ఆ మేళాలో రోడ్డుకు ఇరువైపులా ధాన్యం, తినుబండారాలు, బట్టలు, బొమ్మలు అమ్మవారున్నారట. యాత్రికులు నీళ్లలో వదిలే దీపాలు కదలే నక్షత్రాలలో కనిపించేవని కూడా చెప్పాడు. ఎందరో హిందూ రాజులు సిక్కు ప్రభువులు నవాబులు మేళా చూడడానికి వచ్చే వారిని కూడా చెప్పాడు ప్రయాగ లో 1895 లో జరిగిన కుంభమేళాకు వచ్చిన ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వేయిన్ దీన్ని చాలా మెచ్చుకున్నాడు . 1938లో లార్డ్ అక్లాండ్ యాత్రికులపై పన్నును రద్దు చేశాడు. అందువల్ల యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ రకమైన మేళాలను ఆదాయ వనరు గానే పరిగణించి, ప్రోత్సహించింది. పన్నులు కూడా వసూలు చేసేది . ఈ సందర్భంలో జరిగే అమ్మకాలపై టాక్స్ కూడా విధించేవారు. 1954లో ఐదు మిలియన్ల మంది 1977లో 10 మిలియన్ల మంది 1989లో 15 మిలియన్ల మంది కుంభమేళాను దర్శించుకున్నారు.
ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అంచనా ప్రకారం 2019 కుంభమేళాలో 200 మిలియన్లకు పైగా యాత్రికులు వచ్చారు. ఇది ప్రపంచంలో Largest People Gadharing కుంభమేళా అధికారులు ఒకేరోజులో అత్యధిkuలు దర్శించిన తేదీలు 10 ఫిబ్రవరి 2013లో 30 మిలియన్లు 4 ఫిబ్రవరి 2019లో 50 మిలియన్లు అని ప్రకటించారు.
అయితే ప్రాచీన వేదకాలం నుండే ఈ ఆచారం ఉన్నట్లు వేద విద్వాంసులు అంటారు .ఈ కుంభమేళా స్నానాలు 850 ఏళ్లకు పైగా జరుగుతున్నట్లు, ఆదిశంకరులు దీనికి ఆద్యుడు అని కూడా చెప్తారు .వీరి తర్వాత శంకరుల శిష్యులు, అనుయాయు లు, సన్యాసులు,అఘోరాలు, నాగ సాధువులు రాజస్నానానికి ఏర్పాట్లు చేసేవారు. ఇలా షాహి స్నానం చేయడం వల్ల గత జన్మల పాపకర్మల నుండి విముక్తి కలిగి, మోక్షం పొందుతారని ఆస్తికుల విశ్వాసం. అందుకే ఒకప్పుడు లక్షల్లో ఉన్న యాత్రికుల సంఖ్య కోట్లల్లోకి పెరిగింది పెరగబోతోంది రాబోయే కాలంలో,
మరి కాస్త ముందుకొస్తే 1982లో అమృత్ కుంటే ర్ సంధానే అనే బెంగాలీ సినిమా కుంభమేళా దృశ్యాలను చిత్రీకరించింది. .2001లో మారజయో యో బెంజో, నిక్ డేలు The Greatest Show on earth అనే డాక్యుమెంటరీ తీశారు. నదీముద్దీన్ KUMBH MELA Songs of the river అని 2004లో మరొక డాక్యుమెంటరీ ని చిత్రించాడు. 28 ఏప్రిల్ 2017 BBC. Greatest Show on Earth Kumbha Mela పేరుతో ఇంకో ఆడియో వీడియో రిపోర్టును కూడా విడుదల చేసింది.
అంతేనా
అంటే కాదు అనే చెప్పాలి కుంభమేళా అంటే కేవలం స్నానాలే అనుకుంటే పొరపాటే . అంతకు మించిన విశేషాలు లెక్కలేనన్ని . తర్పణాలు, పిండ ప్రదానాలు, పితృ పూజలు, దాన ధర్మాలు, సంతలు, విద్యావిషయక చర్చలు, వేద పండితుల వాద ప్రతి వాదాలు సాధువుల సంతుల ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు You Name It we have it అన్న రీతిలో ఉంటాయి. సామూహిక భజనలు ప్రార్ధనలు, పారాయణాలు అడుగడుగునా కనిపిస్తాయి.
ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు నడిపే భోజనశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస ఏర్పాట్లు , స్నానానికి కావలసినటువంటి ఏర్పాట్లతో పాటు బట్టలు మార్చుకోవడానికి కూడా ఏర్పాట్లను చేశారు .టెంట్ సిటీని నిర్మిస్తున్నారంటే ఏ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయో ఆలోచించుకోండి. ఇవన్నీ ఎప్పటికప్పుడే ఔరా అనిపిస్తాయి.
ఈ రోజుల్లో మనలాంటి సాధారణ భక్తులతో పాటుగా, వీఐపీలు, నాగా సాధువులు, ఇతర సాధువులు, కల్పవాసీలు ( నెల రోజులు దీక్షలో ఉండేవారు) పీఠాధిపతులు, మఠాధిపతులు, విదేశీ వార్తా విలేకరులు ప్రసిద్ధిగాంచిన వీడియో గ్రాఫర్లు, స్వదేశీ వార్తా సంస్థల ప్రతినిధులు మరెందరెందరో వీటిని ప్రజలకు అందించడానికి ప్రతీక్షణం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
అయిపోయిందా
నాగా సాధువుల ప్రసక్తి లేకుండా కుంభమేళా వేడుకలు వ్యాసాలు అన్నీ అసంపూర్ణమే అసమగ్రమే వేలాది నాగ సాధువుల ప్రవేశం వారి అద్భుత విన్యాసాలు మనల్ని నిశ్చేష్టులను చేస్తాయి.
వీరి ప్రవర్తన, వేషధారణ అన్ని ప్రత్యేకమే. వ రు తప్పకుండా ఈ కుంభమేళా వస్తారు ఎలా వస్తారో తెలీదు. మేళా అయ్యాక ఎక్కడికి వెళ్తారో ఎలా వెళ్తారో కూడా తెలీదు. చాలామంది ఒంటినిండా బూడిద పూసుకొని నగ్నంగా ఉంటారు . తలంతా జడలు కట్టి ఉంటుంది . మేళా మొదలయ్యేసరికి సిద్ధం తర్వాత మాయం. కచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు . సడన్గా తిట్టడం కూడా మొదలెడ తారు .కసురుకుంటారు .ఏ కాలమైనా, ఎలాంటి వాతావరణమైనా దిగంబరులే బంధాలను ఇష్టపడరు. అత్యంత తీవ్రమైన పద్ధతులలో శారీరక క్రమశిక్షణను పాటిస్తారు . మనసుతో శరీరాన్ని శాసిస్తారు .ఈ యాత్ర సమయంలో మాత్రమే జనాలతో కలుస్తారు.
సభ్య సమాజం వీరిని దూరంగా పెట్టినా, అసహ్యించుకున్న, భయపడ్డా గ్రామీణ ప్రాంతాల వారు, విదేశీయులు బాగా నమ్ముతారు . ప్రత్యక్ష దైవాలుగా కొలుస్తారు. వారి ఆగ్రహాన్ని భరించి, ఆశీస్సులను పొందడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు . సాధువులు, బిక్షకులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అధికారులు ప్రభుత్వం సాధారణ భక్తులు, దేశ విదేశీ సందర్శకులు ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, చరిత్రకారులు, స్వచ్ఛంద సంస్థలు ఇందరు మరెందరో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న కుంభమేళా కొన్ని గంటల్లో మన కళ్ళ ముందుకు రాబోతోంది .రెండు చేతులు చాచి తరతరాల సంస్కృతి సంప్రదాయాలకు విశ్వాసాలకు భారతీయతకు చిరునామాగా నిలిచిన ఈ కుంభమేళాను ఆనందిద్దాం. ఆహ్వానిద్దాం. మన మధ్యలో రాజకీయాలను చేరనీయకుండా మానవత్వాన్ని పరిమళింప చేద్దాం .ఎందుకంటే ఇది 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పండుగ ఎందుకంటే ఇది ది గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్ కనుక.
రెండవ మరియు చివరి భాగం కొరకు ఎదురు చూడండి. త్వరలో..