
ఆయన వృత్తి ప్రవృత్తి పూర్తిగా భిన్నం! ఒక యువ శాస్త్రవేత్త గా ఎదిగి దేశాలు పర్యటించిన ఆయన శ్రీ రామబ్రహ్మంగారు.చదివిన చదువుకి ఆయన సంగీత సాహిత్య అభిరుచికి ఏమాత్రం సంబంధం లేదు.కానీ ఆరెంటిలోనూ రాణించారు.
28.8.1960లోతూర్పుగోదావరిజిల్లాలోని శ్రీకృష్ణ పట్టణంలో ప్రభవించిన ఆయన ఆధ్యాత్మిక రంగంలో తన అంతిమ శ్వాస దాకా గడిపిన ధన్య జీవి.ఆంధ్రాయూనివర్శిటీలో B.E. ఖర్గపూర్ IIT లో M.Tech చదివిన ప్రతిభాశాలి. ఇస్రో లో సైంటిస్ట్ గా తొలిసారి జాబ్ లో చేరారు.IISC బెంగుళూర్ లో ఎలక్ట్రానిక్స్ లో PHD చేశారు.16 ఏళ్లు ఇస్రోలో ఆపై పలు ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత పదవులు అలంకరించారు.2019 లో ఇద్దరు పిల్లల బాధ్యత తీరాక ఆధ్యాత్మిక రంగంలోప్రవేశించటం పూర్వజన్మ అలరించాయి సుకృతం.2016 నుంచి తనదైన శైలిలో భక్తి పాటలు తెలుగు సంస్కృతంలో రాసి గాయనీ మణుల చేత పాడించారు అవి యూట్యూబ్ లో చాలా మందిని అలరించాయి
54వ ఏటనే అమ్మవారిని స్తుతిస్తూ ఆయన రాసిన భక్తిపాటలు జనాల్ని ఉర్రూతలూగించాయి.తూ.గో.జిల్లా వెదురుపాకలో విజయదుర్గాపీఠం గురువు గారి ఆశీస్సులు స్ఫూర్తితో ఆయన లో కవిత భక్తిధారలుగా ఎగిసి పాటలరూపంలో ప్రజాహృదయాల్లో చొచ్చుకుపోయింది. ఎలాంటి భేషజం గర్వం లేకుండ తరతమభేదం చూపకుండా తోచిన అడిగిన సాయంజేసిన దొడ్డ బుద్ధి ఆయనది.
భగవద్గీత సారాన్ని వంట బట్టించుకున్నారు.ఇలా ఇంటాబైట మంచిపేరు సంపాదించిన ఆయన కాలంచేసి 9నెలలైంది.కానీ ఆయన రాసిన భక్తిపాటలు అజరామరాలు.ఆయన బెంగుళూర్ లోనే స్థిరపడినా మాతృభాష ను సంగీతాన్ని ప్రేమించిన వ్యక్తిగా నిల్చిపోయారు
