ఆయన ఓప్రసిద్ధ జర్నలిస్టు, ఆకాశ వాణిలో గళం విప్పిన శ్రీ ఉడతా రామకృష్ణ గారి జీవితం నల్లేరుపై బండి కాదు. ఆయన బాల్యం యవ్వనం సంకుల సమరం అనే చెప్పాలి.

కృష్ణాజిల్లాలోని గొల్లనపల్లి గ్రామంలో ఉడతా వెంకటేశ్వరరావు, సీతామహాలక్ష్మి దంపతులకు 2.2.1961లో జన్మించారు. ఈయన 5వ ఏటనే తండ్రి చెప్పాపెట్టకుండా ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోతే, బాల్యం అంతా కష్టాలలో గడిచింది. ఆ తండ్రి 1966 లో వెళ్లిపోయిన ఆయన తిరిగి 1982 లో రావటం మరవలేని జ్ఞాపకం. ఐనా తండ్రిని ఆదరించి అక్కున చేర్చుకున్న రామకృష్ణ, ఆయన తల్లిని మనం అభినందించి తీరాల్సిందే! నిజంగా ఇది నమ్మలేని నిజం! కన్నతల్లి అండదండలతో రామకృష్ణ ఎస్.ఎస్.సి. చదివి పేదరికం, కుటుంబ పోషణ కై చదువుకి ఫుల్ స్టాప్ పెట్టి కులవృత్తి ఐన మగ్గంపై చేనేత వస్త్ర తయారీలో నిమగ్నమైనారు 1975_1988…
అలా రేడియోతో బంధం అనుబంధం ఏర్పడ్డాయి.నేత రాత పడుగుపేకలా సాగాయి.మంచి విశ్లేషణాత్మక లేఖలతో వివిధ భారతి సిన్మాపాటలతో కూర్చిన ప్రోగ్రాంలు (అరగంట ) తయారుచేసి పంపటం వరకు ఎదిగింది ఆయన కలం!అవిప్రసారం కావటంతో రెట్టించిన ఉత్సాహంతో ఆయన లో రచయిత విజృంభించాడు.రేడియో సంగీత పాఠాలు మొదలు కార్మికుల కార్యక్రమాలు కూడా శ్రద్ధగా ఆసక్తిగా వినేవారు.తన గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ చేనేత కార్మికుల చేత ప్రోగ్రాములు చేయించడం తో మంచి గుర్తింపు వచ్చింది.చాణుక్యుడు,చంద్రగుప్తుడు ఏకపాత్రాభినయం తో ఆయన లో నటుడు బైటికొచ్చాడు.తన 20వ ఏటకృతజ్ఞత కృతఘ్నత అనే స్వంత కథను రికార్డింగ్ లేకుండ సరాసరి చదవటం ఆలైవ్ ప్రసారంతో రామకృష్ణ లో ఆత్మవిశ్వాసం పెరగటం,దీనికితోడునిర్వాహకులు శ్రీమాడుగుల రామకృష్ణ గారి మెప్పుపొందటం ఓమధురానుభూతి.
శ్రీసుధామ గారి ప్రోత్సాహంతో రేడియో లో “రాబోయే ఎన్నికలు, నడుస్తున్న చరిత్ర( వారంవారం) ఏనుగులవానిలంక బ్లోఅవుట్ ” రేడియోలో ప్రసారమై అశేషజనాదరణ పొందాయి.చమురుబావిలో మంటలు ఎగిసిపడటాన్ని ప్రత్యేకంగా చెప్పి రాయించిన సుధామ గారికి తను ఋణపడి ఉన్నానని అంటారాయన!
కానీ రామకృష్ణ కు ఏలూరు బదిలీ కావటంతో రేడియోకి దూరమైనారు.

ఇక జర్నలిస్టుగా ఆయన యాత్ర కు మార్గదర్శకులు గన్నవరం ఈనాడు విలేఖరి శ్రీ అవ్వారి గోవిందరాజులుగారని, ఆయనే తన తొలిగురువని చెప్పారు.1988లో ఆయన పరిచయంతో రామకృష్ణ పాత్రికేయునిగా స్థిరపడటానికి దోహదం చేసింది.1990లో ప్రజాశక్తిలో పాత్రికేయుడిగా జీవితం గొప్ప మలుపు తిరిగింది.36ఏళ్లు ఆపత్రికలో విలేఖరిగా, ఎడిటోరియల్ బోర్డ్ సభ్యునిగా ,జర్నలిజం కాలేజీ ఇన్ఛార్జిగా,ప్రిన్స్ పాల్ గా, క్వాలిటీ సెల్ ఇన్ చార్జిగా ఎదిగినా ఒదిగి ఉన్న నిగర్వి కావటంతో అందరిచేత సెభాష్ అనిపించుకొన్నారు. 2019లో రిటైరైనాక ప్రస్తుతం రైతువాణి మాసపత్రిక బ్యూరో చీఫ్ గా ఉన్నారు2020నుంచి.ఆయన కలంపేర్లుఉష్ణ, శ్రీవర్ష, వరుణ్. ఆయన ప్రజాశక్తి ఆదివారం లో వారం వారం రియల్ స్టోరీస్,సాహిత్య నృత్య శిల్ప చిత్ర, నాటక, సినీ నిపుణుల ఇంటర్వ్యూలు,రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ రాజకీయ యోధులచరిత్రలు వెలువడ్డాయి. తెలకపల్లి రవిగారి సలహాపై 36వ ఏట టైప్ ఇన్ స్టిట్యూట్ కెళ్లి 15ఏళ్ల పిల్లల తో కల్సి టైప్ నేర్చుకోటం చిన్నతనంగా భావించలేదు రామకృష్ణ. కారణం కుటుంబ బాధ్యతలు,ఉదరపోషణ!ఆయన ఇంటర్య్వూ చేసిన ప్రముఖ వ్యక్తులుపద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ, కోరాడ నర్సింహ్మారావు,కర్నాటి లక్ష్మీ నరసయ్య, వల్లం నరసింహారావు,చిత్ర కారుడు పద్మశ్రీ రామారావు,అంతర్జాతీయ శిల్పికాటూరి వెంకటేశ్వర రావు,వి.కోటేశ్వరమ్మ, వీరనారి నాగళ్ల రాజేశ్వరమ్మ..ఇలా ఎందరెందరో!
ఇక ఈయన అమ్మకు అక్షరనైవేద్యం,బోనాలపై 535 కవితాసంకలనం,550కవితలతో సమ్మక్కసారలమ్మలపై సంకలనాలు వెలువరించినవిషయనిపుణుడిగా చరిత్రసృష్టించారు





















