ఇంద్రధనుస్సు
ఒకరోజు ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మొదటి వ్యక్తి భగవంతుడు ఏదైనా చేయగలడు అని అంటాడు. రెండవ వ్యక్తి ఏదైనా చేయగలడు అని అంత గట్టిగా చెప్తున్నావు ఏంటి నీకు ఆయన మీద అంత నమ్మకం అని అడుగుతాడు. అప్పుడు ఆ స్నేహితుడు ఒక చిన్న కథ చెప్తా విను తర్వాత నువ్వే ఆలోచించు నీకే అర్థమవుతుంది నేను చెప్పింది నిజమా కాదా అనేది అని కథ చెప్పటం మొదలు పెడతాడు.
ఒక ఊళ్లో ఒక చెప్పులు కుట్టుకునే వాడు ఉంటాడు. అతడు తన పని తాను చేస్తూ కూడా ఆ శివ నామస్మరణ అనుక్షణం చేస్తూ ఉంటాడు. అదే ఊర్లో ఇంకొక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ధనవంతుడవటం చేత ఎన్నో రకాల పూజలు, దానధర్మాలు చేస్తూ అందర్నీ పలకరిస్తూ సరదాగా మాట్లాడుతూ అందరూ తనను పొగుడుతూ ఉంటే సంతోష పడిపోతూ ఉంటాడు. అటుగా వెళుతూ ఈ ఇద్దరిని చూసిన నారద మహర్షి ఆ శివుడి దగ్గరికి వెళ్లి ప్రణామములు తెలియజేసి నాకు ఒక సందేహం శివయ్య. అది నువ్వైతేనే తీర్చగలవు అని అంటాడు. ఏంటో చెప్పు అని ఆ శివుడు అడగగా….. ఆ నారద మహర్షి శివుడితో నువ్వు చూస్తున్నావు కదా కింద ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పు ఎవరికి ఎక్కువ పుణ్యం లభిస్తుంది అని అంటాడు. అప్పుడు ఆ శివుడు చెప్పులు కుట్టే అతనికి అని చెప్తాడు. అదెలా ఆ ఇంకో వ్యక్తి కూడా అనేక రకాల పూజలు దానధర్మాలు చేస్తాడు కదా మరియు చెప్పులు కుట్టుకునే వ్యక్తి అవేమీ చేయకపోగా నీ నామస్మరణతో కాలక్షేపం చేస్తున్నాడు కదా అంటాడు. అయితే ఒక పని చెయ్యి నేను ఒక మాట చెప్తాను దానిని తూ.చా తప్పకుండా వారితో చెప్పు ఎవరు ఏం సమాధానం చెప్తారో దానిని బట్టి ఎవరికి పుణ్యం ఇవ్వాలో నిర్ణయిద్దాం అని అంటాడు. నారద మహర్షి సరే అని శివుడు చెవిలో చెప్పిన విషయాన్ని మారువేషంలో ముందుగా సంపన్నుడి దగ్గరికి వెళ్లి ఈ విధంగా చెప్తాడు. ఓయ్ పెద్దమనిషి నేను ఆ శివయ్యను చూశాను తెలుసా అని చెప్తాడు. ఓ!!! అవునా. శివయ్య ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు వెటకారంగా. శివయ్య సూది బెజ్జం లో నుండి ఏనుగును దూరుస్తున్నాడు అని సమాధానం చెప్తాడు మారువేషంలో ఉన్న నారద మహర్షి. చాలు చాలు లేవయ్యా సూది బెజ్జం లో నుండి ఏనుగును దూర్చడమేంటి వెటకారంగా ఉందా అని కసిరి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాస్త ముందుకెళ్లి ఇదే విషయాన్ని చెప్పులు కుట్టుకునే వాడితో చెప్తాడు. చెప్పులు కుట్టుకునే వాడు చాలా సంతోషంగా అవునా!!! అయినా నా శివయ్య ఏదైనా చేయగలడు అని అనుకుంటూ తన పనిలో తాను నిమగ్నమై శివనామ స్మరణ చేస్తూ ఉంటాడు. అది గమనించిన నారద మహర్షి నీకు నేను చెప్పిన విషయాన్ని విన్న తర్వాత కోపంగానీ ఆశ్చర్యం కానీ కలగలేదా అని అడుగుతాడు నారద మహర్షి. లేదయ్యా ఆ రెండు కలగటానికి ఆయన మనలాగా మామూలు మనిషి కాదు కదా!!!! అంటూ పక్కనే చెట్టు మీద నుండి రాలి పడిన మర్రి పండును ఒక దాన్ని తీసి మారువేషo లోఉన్న నారదమహర్షికి చూపిస్తూ ఇంత చిన్న పండు లో నుండి ఇంత పెద్ద వృక్షాన్ని సృజించగలిగిన నా తండ్రి సూది బెజ్జ ం లోనుండి ఏనుగును తీయలేడా??? ఇంత చిన్న విషయానికి ఆశ్చర్యం ఎందుకు???? ఆయన ఏదైనా చేయగలడు. మనకు కావాల్సిందల్లా ఆయన మీద నమ్మకం మాత్రమే అని తన పని తాను చేసుకుంటాడు. ఈ సమాధానం విన్న నారద మహర్షి శివుడి దగ్గరికి వెళ్లి నిజమే స్వామి మీరు చెప్పింది అని ప్రణామాలు చేసి వెళ్ళిపోతాడు.
మనం కూడా చాలాసార్లు మనకు దైవం మీద నమ్మకం లేకపోయినా అలవాయితీగానో అలవాటుగానో ఇష్టం లేకపోయినా ఆడంబరాలకు పోయి పొగడ్తలకు లొంగిపోయి చాలా పనులు చేస్తుంటాం. కానీ ఆ పరమేశ్వరుడికి కావలసింది తన పైన నమ్మకం పెట్టుకోవటం, భగవంతుడు మీద ప్రీతి కలిగి ఉండటం . దేవుడి మీద భారం వేసి మనం చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని చేకూర్చటమే ఆయన పని. తనపైన నమ్మకం పెట్టుకున్న వారిని అనుక్షణం కాపాడటం భగవంతుడు ప్రధమ కర్తవ్యం గా భావిస్తాడు. అందుకే మనం ఏ పని చేసినా అంతా మనదే గొప్ప అని గొప్పలకు పోకుండా ఆ భగవంతుని తలుచుకొని చేసే ప్రతి పనిలో తప్పకుండా విజయం సాధిస్తాం. అప్పుడప్పుడు చిన్నచిన్న ఆటంకాలు అవరోధాలు ఎదురవుతాయి.ఇక ఎదురయ్యే ఆటంకాల గురించి అంటారా అవి మన కర్మఫలం తప్పకుండా అనుభవించి తీరాల్సిందే.
సర్వేజనా సుఖినోభవంతు
నిర్వహణ-
నెల్లుట్ల ఇందాణి
మయూఖ ద్వైమాసిక పత్రికలో జనరల్ నాలెడ్జ్ క్విజ్ ను ప్రారంభించాము. మీరేమి చేయాలో నెల్లుట్ల ఇంద్రాణి చెప్తున్నారు చదవండి- ఎడిటర్
Hi everyone ! Good morning from “Mayukha and Tharuni.My name is Indrani Nellutla.
Here I am shooting 20 General Knowledge questions for brain storming.If you know correct answers for 15 questions ” You are good”. More than 15 ” Clap your hands “.
I am also Providing Correct answers below, “But ……. but…”. don’t look at the answers 🙈. ( Now) 😄
చూసారా… మీ జవాబు లు 15 సరైనవైతే మిమ్మల్ని మీరే అభినందించుకోండి. మీ తెలివికి , మీ జ్ఞాపక శక్తి కి మీరే నిర్ణాయకులు. ఇదే మనకు ఉత్సాహాన్నిస్తుంది. ఇవిగో ప్రశ్నలు…
- Which country is known as “Rising sun” ?
A. United States of America. B. China. China.D. Japan. - Who is the first black president of South Africa?
A. Nelson Mandela . B .Musaveni . C. Paul Kagame . D. Barak Obama. - Which is the longest river in Europe?
A. Godavari. B. Volaga. C. Amezan. D . Nile. - 4.In Which Year United Nations was established?
A. 1940 . B. 1950 . C. 1945 . D . 1960 . - .Which line separates India and Pakistan?
A. Red Cliff line. B. Ma Mohan line . C . Equater .D . Tropc of cancer. - Where is Great Barrier Reef located . ?
A. United States. B. Europe. C. Australai. D. Africa. ? - Who wrote ” The Tale of Two Cities” .?
A. Charles Dickens .B.G.Shaw .C. Clerk Hemes . D. William Shakespeare. - .What is the National bird of New Zealand .?
A. Bald eagle .B . Peacock. C. Elephant. 4. Kiwi. - Which mountain separates Europe and Asia ?
A . Urals . B. Pamir .C. Cascade. D . Andes. - Who is one of the ” Kavithryam” from the below poets ?
A . Kalidasa. B. Nannaya . C. Bhanu . D. Kanva. - Name the first Indian Sattilite ?
A. Aryabhatta B. Shankara C. Banabatta D. Bhaskara ? - Who is the first recipient of Gyanpit award ?
A. Vishwanatha Satyanarana B . Dr. C. Narayan Raddy . C. Dasarathi . D. Arudra. - Which strait separates Iran and Soudi Arabia ?
A. Hormuz. B . Panama . C. Suez. D. Bay of Bengal. - Which painting of Ravi varma sold approx. 17.9. Million dollars ?
A. Lord Rama .B. Lord Shiva. C . Lord Indra. D. Lord Krishna. - The study of the kidney is called ?
A. Cardailogy . B . Nephrology. C. Apthamology. D. Anthropology. - Who is the Lyricist of ” Geet Gata Chal O Sathi Gun Gunatha Chal” ?
A. Ravindra Jain B. Mahmmad Rafi . C. Gulzar. D . Kishore Kumar. - Who is the founder of ” Amezan” ?
A.Satya Nadella.B. Bill Gates. C. Jeff Bezos . D. Rishi. - Who invented telphone ? A. Madam Currie .
Thomas Edison. C. Enlisteen . D. Alexander Graham Bell. - Which fruit is good source of vitamin. C .?
A. Spinach . B. Orange . C. Potatoes .D. eggs . - Good Year is trade name of ?
A .Cars .B. Tires . C. Bikes. D. Racing Cars . ———-
Correct Answers ———.
1. D. ( Japan. The land of rising sun. The rising sun represents hope, renewal and energy for the Japanese people).
2. A. Nelson Mandela ( from 1994 to 1999.).
3.B. Volga ( stretching approximately 3,530 to 3,690 k.m ).
4. C .1945 ( Biggest funder is United States America ).
5. A. Red Cliff line ( Established on August 17, 1947 ).
6. C. Australia ( it spans over 2,3000 k.m ).
7. A. Charles Dickens ( He wrote about London and Paris).
8. D. Kiwi ( Flightless bird).
9. A.Ural mountains ( Running 2,500 k.m. North to South through Western Russia).
10. B. Nannaya ( He translated Adi Parva ,Sabha Parva and a portion of Aranya Parva ).
11. A. Aryabhatta ( launched on April 19 , 1975 ).
12. A. Viswanatha Satyanarana.( For Ramayana Kalpavruksham in 1970 ).
13. A. Hormuz ( Approximate length 90 to 104 miles ).
14. D. Lord Krishna ( The Art work was purchased by Dr. Cyrus Poonwala ).
15. B . Nephrology ( A specialist in this field known as Nephrologist .).
16. A. Ravindra Jain ( He redefined Bollywood music despite being born blind .).
17. C. Jeff Bezos ( He is a American Business man ).
18. D. Alexander Graham Bell ( He invented the devise on March 7 , 1876.).
19. B. Oranges ( a single orange can meet daily requirement ).
20 .B. Tires ( Founded in 1898 , is a company that produces tires for passenger cars , trucks and racing Cars ). _**_.
ఈ 20 ప్రశ్న లకు సరైన జవాబులు ఎన్ని వచ్చాయో మీరే చెక్ చేసుకోండి.. మిమ్మల్ని మీరే అభినందించుకోండి.. ఇది నిజమైన బలం ! – ఎడిటర్
ఆయన ఓప్రసిద్ధ జర్నలిస్టు, ఆకాశ వాణిలో గళం విప్పిన శ్రీ ఉడతా రామకృష్ణ గారి జీవితం నల్లేరుపై బండి కాదు. ఆయన బాల్యం యవ్వనం సంకుల సమరం అనే చెప్పాలి.

కృష్ణాజిల్లాలోని గొల్లనపల్లి గ్రామంలో ఉడతా వెంకటేశ్వరరావు, సీతామహాలక్ష్మి దంపతులకు 2.2.1961లో జన్మించారు. ఈయన 5వ ఏటనే తండ్రి చెప్పాపెట్టకుండా ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోతే, బాల్యం అంతా కష్టాలలో గడిచింది. ఆ తండ్రి 1966 లో వెళ్లిపోయిన ఆయన తిరిగి 1982 లో రావటం మరవలేని జ్ఞాపకం. ఐనా తండ్రిని ఆదరించి అక్కున చేర్చుకున్న రామకృష్ణ, ఆయన తల్లిని మనం అభినందించి తీరాల్సిందే! నిజంగా ఇది నమ్మలేని నిజం! కన్నతల్లి అండదండలతో రామకృష్ణ ఎస్.ఎస్.సి. చదివి పేదరికం, కుటుంబ పోషణ కై చదువుకి ఫుల్ స్టాప్ పెట్టి కులవృత్తి ఐన మగ్గంపై చేనేత వస్త్ర తయారీలో నిమగ్నమైనారు 1975_1988…
అలా రేడియోతో బంధం అనుబంధం ఏర్పడ్డాయి.నేత రాత పడుగుపేకలా సాగాయి.మంచి విశ్లేషణాత్మక లేఖలతో వివిధ భారతి సిన్మాపాటలతో కూర్చిన ప్రోగ్రాంలు (అరగంట ) తయారుచేసి పంపటం వరకు ఎదిగింది ఆయన కలం!అవిప్రసారం కావటంతో రెట్టించిన ఉత్సాహంతో ఆయన లో రచయిత విజృంభించాడు.రేడియో సంగీత పాఠాలు మొదలు కార్మికుల కార్యక్రమాలు కూడా శ్రద్ధగా ఆసక్తిగా వినేవారు.తన గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ చేనేత కార్మికుల చేత ప్రోగ్రాములు చేయించడం తో మంచి గుర్తింపు వచ్చింది.చాణుక్యుడు,చంద్రగుప్తుడు ఏకపాత్రాభినయం తో ఆయన లో నటుడు బైటికొచ్చాడు.తన 20వ ఏటకృతజ్ఞత కృతఘ్నత అనే స్వంత కథను రికార్డింగ్ లేకుండ సరాసరి చదవటం ఆలైవ్ ప్రసారంతో రామకృష్ణ లో ఆత్మవిశ్వాసం పెరగటం,దీనికితోడునిర్వాహకులు శ్రీమాడుగుల రామకృష్ణ గారి మెప్పుపొందటం ఓమధురానుభూతి.
శ్రీసుధామ గారి ప్రోత్సాహంతో రేడియో లో “రాబోయే ఎన్నికలు, నడుస్తున్న చరిత్ర( వారంవారం) ఏనుగులవానిలంక బ్లోఅవుట్ ” రేడియోలో ప్రసారమై అశేషజనాదరణ పొందాయి.చమురుబావిలో మంటలు ఎగిసిపడటాన్ని ప్రత్యేకంగా చెప్పి రాయించిన సుధామ గారికి తను ఋణపడి ఉన్నానని అంటారాయన!
కానీ రామకృష్ణ కు ఏలూరు బదిలీ కావటంతో రేడియోకి దూరమైనారు.

ఇక జర్నలిస్టుగా ఆయన యాత్ర కు మార్గదర్శకులు గన్నవరం ఈనాడు విలేఖరి శ్రీ అవ్వారి గోవిందరాజులుగారని, ఆయనే తన తొలిగురువని చెప్పారు.1988లో ఆయన పరిచయంతో రామకృష్ణ పాత్రికేయునిగా స్థిరపడటానికి దోహదం చేసింది.1990లో ప్రజాశక్తిలో పాత్రికేయుడిగా జీవితం గొప్ప మలుపు తిరిగింది.36ఏళ్లు ఆపత్రికలో విలేఖరిగా, ఎడిటోరియల్ బోర్డ్ సభ్యునిగా ,జర్నలిజం కాలేజీ ఇన్ఛార్జిగా,ప్రిన్స్ పాల్ గా, క్వాలిటీ సెల్ ఇన్ చార్జిగా ఎదిగినా ఒదిగి ఉన్న నిగర్వి కావటంతో అందరిచేత సెభాష్ అనిపించుకొన్నారు. 2019లో రిటైరైనాక ప్రస్తుతం రైతువాణి మాసపత్రిక బ్యూరో చీఫ్ గా ఉన్నారు2020నుంచి.ఆయన కలంపేర్లుఉష్ణ, శ్రీవర్ష, వరుణ్. ఆయన ప్రజాశక్తి ఆదివారం లో వారం వారం రియల్ స్టోరీస్,సాహిత్య నృత్య శిల్ప చిత్ర, నాటక, సినీ నిపుణుల ఇంటర్వ్యూలు,రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ రాజకీయ యోధులచరిత్రలు వెలువడ్డాయి. తెలకపల్లి రవిగారి సలహాపై 36వ ఏట టైప్ ఇన్ స్టిట్యూట్ కెళ్లి 15ఏళ్ల పిల్లల తో కల్సి టైప్ నేర్చుకోటం చిన్నతనంగా భావించలేదు రామకృష్ణ. కారణం కుటుంబ బాధ్యతలు,ఉదరపోషణ!ఆయన ఇంటర్య్వూ చేసిన ప్రముఖ వ్యక్తులుపద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ, కోరాడ నర్సింహ్మారావు,కర్నాటి లక్ష్మీ నరసయ్య, వల్లం నరసింహారావు,చిత్ర కారుడు పద్మశ్రీ రామారావు,అంతర్జాతీయ శిల్పికాటూరి వెంకటేశ్వర రావు,వి.కోటేశ్వరమ్మ, వీరనారి నాగళ్ల రాజేశ్వరమ్మ..ఇలా ఎందరెందరో!
ఇక ఈయన అమ్మకు అక్షరనైవేద్యం,బోనాలపై 535 కవితాసంకలనం,550కవితలతో సమ్మక్కసారలమ్మలపై సంకలనాలు వెలువరించినవిషయనిపుణుడిగా చరిత్రసృష్టించారు
వన్ ప్లస్ వన్ నాటిక
రచన మాడభూషి దివాకర్ బాబు గారు . దర్శకత్వం డా. శ్రీజ సాదినేని. నటీ నటులు శ్రీజ సాదినేని, శశిధర్ ఘణపురం
వన్ ప్లస్ వన్ సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయంలో రసరంజని , శ్రీ చాట్ల శ్రీ రాములు థియేటర్ ట్రస్ట్ నిర్వహణలో ప్రతిభా పురస్కారం 2025 శ్రీ ఎస్ ఎస్ రామశాస్త్రి గారికి (సీనియర్ రంగస్థల నటులు ) ప్రదానం చేసిన సభలో శ్రీ ఎస్ ఎస్ రామశాస్త్రి గారికి ప్రతిభా పురస్కారం అందించి ఘనంగా సత్కరించిన తరువాత నాటిక ప్రదర్శన జరిగింది. ఇది డా. శ్రీజ సాదినేని దర్శకత్వం వహించిన 38 వ నాటిక.

డా. శ్రీజ సాదినేని ప్రముఖ రంగస్థల, టీవీ, చలనచిత్ర నటి, రచయిత్రి, దర్శకురాలు, వ్యాఖ్యాత, యాక్టింగ్ ఫ్యాకల్టీ, డబ్బింగ్ ఆర్టిస్ట్. చిన్నతనంలోనే హరికథలు చెప్పడం ప్రారంభించిన శ్రీజ అనేక హరికథలను చెప్పడమేకాఉండా కథా వాచస్పతి, అభినేత్రి వంటి బిరుదులు కూడా అందుకుంది. 1994, ఏప్రిల్ 14న తొర్రూరు పరిషత్ లో నిర్వహించిన నాటికల పోటీలలో జన చైతన్య ఒంగోలు వారి మేడిపండు నాటికలో అమ్ములు పాత్ర ద్వారా బాల నటిగా నాటకరంగంలో అడుగుపెట్టిన శ్రీజ అనేక ఇప్పటివరకు అనేక ప్రదర్శనల్లో పాల్గొని, మూడువేలకు పైగా బహుమతులను అందుకున్నది. 150 కి పైగా సాంఘిక నాటికలు/ నాటకాలలో, 15 కు పైగా పద్య నాటకాలు, 40 నాటికలు దర్శకత్వం వహించారు . కొన్ని నాటికలు, ఏక పాత్రలు స్వయంగా రచించారు. జయా ఆర్ట్స్ , హైదరాబాద్ నిర్వహణలో ‘వన్ ప్లస్ వన్‘ నాటిక ప్రదర్శించారు.
రచయిత శ్రీ మాడభూషి దివాకర్ గారు ప్రముఖ సినీ రచయిత యమలీల, శుభలగ్నం, మావి చిగురు , చూడాలని ఉంది , టాప్ హీరో, నెంబర్ వన్ ,ఆహ్వానం, వినోదం ,సర్దుకుపోదాం రండి ,ఇద్దరు మిత్రులు మొదలైన వంద సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే సంభాషణలు అందించారు. కథలు కవితలు రేడియో నాటకాలు అనేకం రచించారు .నాటక రచయితగా ప్రతి నాటికకు నాటకానికి అనేక పరిషత్తులలో ఉత్తమ రచన తదితర బహుమతులు అందుకున్నారు. యువ వాహిని డి.వి. నరసరాజు స్మారక పురస్కారం , అక్కినేని నాటక కళా సమితి అక్కినేని జీవన సాఫల్య పురస్కారం, బాపు రమణ వారి ముళ్ళపూడి వెంకటరమణ సాహితీ పురస్కారం ,సంస్కృతి సాంస్కృతిక సంస్థ గుంటూరు వారిచే ‘ఆచార్య’ బిరుదులు అందుకున్నారు. మంచి రచనా శిల్పం కలిగిన రచయిత. వైవిధ్యమైన నాటికలు నాటకాలు రచించి ప్రదర్శింపచేసారు.దివాకరబాబు నాటకములు , నాటికలు రెండు వాల్యూములుగా వచ్చాయి. వీటిలో రెండవ వాల్యూమ్ లో వన ప్లస్ వన్ ప్రచురితమై ఉంది .

వన్ ప్లస్ వన్ నాటిక నేపథ్యం :
ఈ నాటికకు ఓ ప్రత్యేకత. నాటకం లో రెండు పాత్రలు. సరిగ్గా రెండు పాత్రలే. జీవితాన్ని ఒంటరిగా గడపడం తప్ప వేరే దారి లేదని భావించే అతను , జీవితాన్ని ఇష్టం లేని వృత్తిలో కొనసాగుతున్న ఆమె ఒకానొక పరిస్థితి లో ఎలా కలిశారు వాళ్ళ మధ్య జరిగిన హృద్యమైన సన్నివేశాల సమాహారం ఈ నాటిక . మనసు విప్పి ఒకరి భావాలు మరొకరు తెలియజేసుకున్న వైనం , ఎలాంటి పరిణామానికి దారి తీసిందో రచయిత సున్నితంగా ఆవిష్కరించారు.
కేవలం రెండు పాత్రలతో కథ నడపడం నాటిక ఎక్కడా విసుగు రాకుండా సాగించిన విధానంలో దర్శకత్వ ప్రతిభ కనబడింది. నాటకం ఆద్యంతం తమ నటనతో ఎప్పటికప్పుడు తగిన హావ భావాలు పలికిస్తూ విరామం లేకుండా నటించడం కష్టసాధ్యమైనప్పటికీ తమ నటనతో ఆకట్టుకున్నారు శశిధర్ , శ్రీజ. నాటిక ను సహజ నటనతో శశిధర్ సొంతం చేసుకుని ఆ పాత్రకు తగిన న్యాయం చేసాడు. శ్రీజ ఎక్కడా ఏ మాత్రం తడబాటు లేకుండా హుషారుగా పాత్రకు ప్రాణం పోసింది. ఇద్దరి మధ్య సున్నితమైన బంధం ఎక్కడా ఇబ్బందికరంగా లేకుండా కొనసాగింది. వారి మధ్య ఒకరిపై ఒకరికి ఏర్పడిన అనుబంధాన్ని
చూపించే ప్రయత్నంలో సంభాషణలు “మాటి మాటికి నిన్ను పిలిపించుకునే ఆర్థిక స్థోమత నాకు లేదు” అన్న అతను “నీ దగ్గర నేనీ ఇంటి ఇల్లాలిననిపించేది” అన్న ఆమె సమాజంలోని స్థితిగతులను ప్రశ్నిస్తాయి.
నాటికకు సహకారం సాంకేతిక నిపుణులు మేకప్ అవినాష్, సంగీతం రాజశేఖర్, సెట్& లైటింగ్ సురభి ఉమా శంకర్ అందించారు.
జయా ఆర్ట్స్ , హైదరాబాద్ నిర్వహణలో ప్రదర్శించిన ‘వన్ ప్లస్ వన్‘ నాటికకు దర్శకత్వం వహించిన శ్రీజను రసరంజని వారు సత్కరించారు. నగదు బహుమానం అందించారు . కార్యక్రమ అతిథి శ్రీ బొల్లినేని కృష్ణయ్య గారు శ్రీజకు , శశిధర్కు , రచయితకు , సాంకేతిక నిపుణులు అవినాష్, రాజశేఖర్, ఉమా శంకర్ లకు నగదు బహుమానం అందజేసారు.
రెండు పాత్రలు అనగానే భూమిక థియేటర్ గ్రూప్ లో ఝాన్సీ రచించి వంశీ చాగంటి తో కలిసి ఇదే విధమైన రెండు పాత్రలతో నటించిన నాటకం రవీంద్ర భారతిలో ప్రదర్శించిన విషయం గుర్తు రాక మానదు. ఇటువంటి వైవిధ్య భరితమైన రచనలు తెలుసుకొని నాటకసాహిత్యంలో వాటి వైశిష్ట్యాన్ని తెలియజేయాలి. ప్రదర్శనలు జరిగినప్పుడు ఎంతో శ్రమకోర్చి సాధన చేసి ప్రదర్శించిన నాటిక చూడటం మన సాంస్కృతిక శోభను ఇనుమడింప చేసుకున్నట్లు అవుతుంది.
రచయిత శ్రీ మాడభూషి దివాకర్ బాబు గారు , దర్శకురాలు డా. శ్రీజ సాదినేని, నటుడు శశిధర్ , సాంకేతిక నిపుణులు సర్వదా అభినందనీయులు.





భారత స్వతంత్ర పోరాటంలో దేశంమొత్తంగా సత్యాగ్రహాలు, నిరసనలు, ఉద్యమాలు చేసి ప్రాణత్యాగాలు కూడా చేసారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ మొదలైనవారు 1931 లో ఉరికొయ్యలు ఎక్కారు. విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ పోరాటంలో చంపబడ్డాడు. ఆంగ్లేయులు అరాచకంగా లాటీచార్జ్ చేయటం వల్ల లాలా లజ్ పత్ రాయ్ తీవ్రంగా గాయాలై చనిపోయాడు.
1928లో సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా లాహోర్లో జరిగిన నిరసనల్లో లాలా లజ్పత్ రాయ్ పాల్గొన్నారు. అప్పటి బ్రిటిష్ పోలీస్ సూపరింటెండెంట్ జేమ్స్ ఏ. స్కాట్ ఆదేశాలపైభారీ లాఠీచార్జ్జరిగింది.ఆ లాఠీచార్జ్లో లజ్పత్ రాయ్తీవ్ర గాయాలపాలయ్యారు.“ఇవాళ పోలీసులు నాపై కొట్టిన ప్రతి దెబ్బ, ఆంగ్లేయుల పాలనపై కొట్టిన దెబ్బే.”అని ఆయన అన్నారు. లాఠీచార్జ్లో వచ్చిన తీవ్రమైన గాయాల వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించింది.కొద్ది వారాల తరువాత,గుండె సమస్యలు తీవ్రమై, ఆ గాయాల ప్రభావంతోనే ఆయన మరణించినట్లు ఆ కాలం నాటి వైద్యులు, చరిత్రకారులు పేర్కొంటారు.
బ్రిటిష్ పంజాబ్ గవర్నర్ మైఖేల్ ఓ డైయర్ జలియన్ వాలా బాగ్ మారణకాండకి వ్యతిరేకంగా అతన్ని మట్టుపెట్టి జైల్లో మగ్గాడు ఉద్దమ్ సింగ్. జనవరి 21, 1943 నాడు క్విట్ ఇండియా మూమెంట్ నాయకుడినిహోము కలానిని ఉరితీసారు. రాణి లక్ష్మీబాయి, మంగల్ పాండే, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ లాంటి ఎంతోమంది త్యాగధనుల కష్టమే ఈనాడు మనమనుభవిస్తున్న స్వతంత్ర భారతం.
ఈపోరాటపు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాయబడి ఘనతకెక్కినవారు కొందరైతే, ప్రపంచానికి తెలియని, మనవరకు చేరని త్యాగధనులు లెక్కలేనంత మంది ఉన్నారు. భారత దేశపు మూలమూలలనుండి పౌరులు ఈ ఉద్యమాల్లో పాలు పంచుకున్నవారే. చాలా మంది స్వాతంత్ర్యం పోరాటయోధులు చరిత్రమరుగున అనామకంగా జారిపోయారు. అందరూ మనదేశంలో ఉండి పోరాడిన వారు. కాని మన దేశపు వనిత, పరాయి దేశం అందునా మనదేశాన్ని పట్టి పీడిస్తున్నబ్రిటన్ లో ఉండి భారతదేశం కోసం పోరాటం చేసిన యోధురాలు. బ్రిటిష్ అరాచకపు పాలన గురించి ప్రపంచ దేశాలకు తెలియజెప్పిన, గళమెత్తిన వీర వనిత మరెవరో కాదు “భికాజీ రుస్తుం కామా”. కాని మనలో చాలా మందికి తెలియదు ఆమె సేవా నిరతి, పోరాట ధీరత్వం.
భికాజీ రుస్తుం కామా, “మేడమ్ కామా”గా కూడా పిలువబడేవారు, భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ముఖ్యమైన వ్యక్తి. ఆమె భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్సీ వనిత.భికాజీ కామా సెప్టెంబరు 24 1861న ధనవంతుడైన పార్సీ కుటుంబంలో జన్మించింది. తండ్రి, సొరాబ్జీ ఫ్రాంజీ పటేల్, బొంబాయి ( ముంబై ) నగరంలో వ్యాపారస్తుడు. దానం చేయడంలో, సహాయ పడడంలో అగ్రగామిగా ఉన్న ప్రముఖ వ్యాపారి. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రభావితమైన భికాజీ బాల్యం నుండే రాజకీయ సమస్యల వైపు ఆకర్షితురాలైంది. ఆమెకు భాషల పట్ల ఉన్న తేలివితేటలతో దేశంలో ఉన్న ఇతర వర్గాలతో వాదించడంలో ప్రావీణ్యం పొందింది. ఆ సమయంలో దేశంలోనే అత్యుత్తమ మహిళల విద్యాలయంగా భావించే అలెగ్జాండ్రా సంస్థ నుంచి ఆమె చిన్నతనంలోనే పలుభాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. మంచి విద్య, ఆంగ్లం మీద పట్టు వచ్చింది.
భికాజీ 1885లో రుస్తుం కామా అనే ప్రసిద్ధ న్యాయవాదిని వివాహం చేసుకుంది, కానీ సామాజిక రాజకీయ సమస్యలతో ఆమెకు విభేదాలకు దారితీసింది. భర్తతో పాటు అత్తవారింట అంతా ఆంగ్లేయ సర్కారుకు మద్దతుదారులే. రుస్తుం కామా బ్రిటిష్ వారి వ్యామోహం, సంస్కృతి పట్ల మోజుతో, బ్రిటిష్ పాలకులు భారతదేశానికి ఎంతో మేలు చేసారనే భావనతో ఉన్నవాడు. జాతీయవాది, దేశ భక్తి ఉన్న భికాజీ, బ్రిటిష్ వారు తమ సొంత లాభం కోసం భారతదేశాన్ని నిర్దాక్షిణ్యంగా దోపిడీ చేశారని నమ్మిన వ్యక్తి. ఇద్దరూ భిన్నధ్రువాలయ్యారు. చివరకు బ్రిటిష్పై పోరాటం కోసం ఆమె భర్తకు దూరమయ్యారు.
భికాజీ తన సమయాన్ని, దాతృత్వ కార్యకలాపాలు చేయడం, సామాజిక సేవలాంటి వాటితోగడుపుతూ ఉండేది. 1896లో బాంబే ప్రెసిడెన్సీలో ‘బుబోనిక్ ప్లేగు’ వ్యాధి రావడం, ఎంతో మంది చనిపోవడం, దానితో ప్లేగు బాధితులను కాపాడటానికి పనిచేస్తున్న బృందానికి సహాయం చేయడానికి భికాజీ స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది. ప్రజలు భయంతో ఇళ్లలో తలదాచుకున్నారు. కానీ భికాజీ మాత్రం తన ప్రాణాల్ని పణంగా పెట్టి, రోగులకు సేవ చేసింది. ఆమెకి కూడా ఈ ప్రాణాంతక వ్యాధిరావడంసంక్రమించింది. కోలుకున్నప్పటికీ, విశ్రాంతి కోసం యూరప్ వెళ్ళమని డాక్టర్ల సలహా మేరకు 1902 లో, భికాజీ భారతదేశం నుండి లండన్ కు వెళ్ళింది. ఆమె ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత , భారతదేశపు బ్రిటిష్ వారు భికాజీకి ఒక సందేశం పంపుతూ,”ఒక వేళ భారతదేశం వెళ్లాలంటే స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనకూడదు” అనే షరతు విధించారు. దీనితో భికాజీ లండన్ లోనే ఉండవలసి వచ్చింది.చికిత్స కోసం వెళ్లిన ఆమెని, ఆ యూరప్ భికాజీ జీవితాన్నే మార్చేసింది. యూరప్లో కొత్త దీపం వెలిగింది. ఆరోగ్యం మెరుగయ్యాక భారత్కు తిరిగి రావటానికి ఆంగ్లేయ సర్కారు షరతులు విధించడం,భారత స్వాతంత్య్రోద్యమానికి,బ్రిటన్ వ్యతిరేక చర్యలు చేయనని హామీ ఇస్తే గాని, ఇండియాకు వెళ్ళనీయనని ప్రభుత్వం ఆంక్షలు విధించటం వల్ల, ఆమె ఇక యూరప్లోనే ఉండాలని నిశ్చయించు కున్నారు. వారి మాటలు విని భికాజీ హృదయం మంటలతో రగిలింది. “మన దేశం బానిసగా ఉంటే నేను ఎలా నిశ్చింతగా జీవిస్తాను?”అని.భారత స్వాతంత్ర్య పోరాటానికై తన చర్యలను తీవ్రతరం చేసింది. గళం ఎత్తి గర్జించింది. పత్రికలు, పాంఫ్లెట్లు ముద్రించి, భారతదేశంలో జరుగుతున్న దౌర్జన్యాలను ప్రపంచానికి తెలియజేసింది.
అక్కడున్న భారత స్వాతంత్ర్యోద్యమ కర్త శాంయజీ కృష్ణవర్మ గారి చేత ప్రభావితమై, 1905 లో దాదాభాయ్ నౌరోజీ కి సహాయకురాలిగా ఇండియన్ హోం రూల్ సొసైటీని స్థాపించింది.
భికాజీ ఇంగ్లండ్ వదలి పారిస్ నగరంలో నివాసం ఏర్పరచుకుంది. 1907 ఆగస్టు 22.. జర్మనీలోని స్టుట్గాట్లో అంతర్జాతీయ సామ్యవాద సదస్సు జరిగింది. కమ్యూనిస్టు యోధుడు లెనిన్తో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. భారత్ నుంచి దాదాబాయి నౌరోజీ వచ్చారు. అలాంటి సదస్సులో.. నిండు చీరతో.. తలపై ఒకవైపు కొంగు కప్పుకొని కూర్చుంది ఓ యువతి. భారత్ తరఫున బ్రిటిష్ యూనియన్ జెండాను ఎగరవేయటానికి సిద్ధమవుతుంటే.. వ్యతిరేకించిన ఆ యువతి తన సంచిలోంచి చిన్న త్రివర్ణ పతాకాన్ని తీసి ఎగరేశారు. అంతర్జాతీయ సోషలిస్టు సమావేశంలో వేదికపైకి భారతీయురాలు భికాజీ కామా అడుగుపెట్టింది. ఆమె చేతిలో ఒక జెండా ఉంది. త్రివర్ణ పతాకం. ఆమె గళం మార్మోగింది:
“ఇది బానిసత్వంలో ఉన్న భారతదేశపు జెండా. ఒక రోజు ఇది స్వతంత్ర భారత జెండా అవుతుంది!”అక్కడున్నవారంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఆ క్షణం భారత చరిత్రలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది.ఆ పతాకాన్ని, అప్పటి 8 రాష్ట్రాలకు ప్రతీకగా ఎనిమిది పువ్వులు, హిందూ ముస్లింల ప్రాతినిధ్యంగా కాషాయం, ఆకుపచ్చ రంగులు, స్వాతంత్య్రం కోసం అమరులవుతున్నవారి చిహ్నంగా ఎరుపు రంగులతో, మధ్యలో వందేమాతరం నినాదంతో.. రూపొందించారు.
మనదేశానికొక పతాకం ఉండాలని, దామోదర్ వినాయక్ సావర్కర్ తో కలసి ఒక త్రివర్ణ పతాకాన్ని తయారుచేసి ఆ సమావేశంలో ప్రదర్శించింది. భారత స్వాతంత్య్ర పోరాటానికి మద్దతివ్వాల్సిందిగా సదస్సులోని ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. భారత్లో బ్రిటిష్ అకృత్యాలను, భారత స్వాతంత్య్ర ఆవశ్యకతను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకొచ్చారు. ఆమే బికాజీ కామా. అంతా ఆమెను మేడమ్ కామా అని పిలవటం మొదలెట్టారు. భారత్లో ఇంకా స్వాతంత్య్ర డిమాండ్లే గట్టిగా వినిపించని కాలంలో.. త్రివర్ణ పతాకాన్ని విదేశీగడ్డపై ఎగరేసిన ధీశాలి మేడమ్ కామా.
ఆమె జర్మనీలోని స్టట్గార్ట్లో అంతర్జాతీయ సోషలిస్ట్ సమావేశంలో భారత స్వాతంత్ర్య జెండాను ఎగురవేసిన ఘనత పొందారు. కలకత్తా జెండా ఆధారంగా ఆమె ఈ జెండాను రూపొందించారు, ప్రస్తుత మన జాతీయ పతాకానికి ప్రథమ రూపం భికాజీ కృషే.
లండన్ లో ఆమెకు విప్లవ వాదులు శ్యాంజీ కృష్ణ వర్మ, లాలా హర్ దయాళ్, ఎస్ఎస్ రాణా, వీర సావర్కర్, సేనాపతి బాపత్ లతో పరిచయం ఏర్పడింది. దాదాభాయ్ నౌరోజీలతో కలిపి విదేశాల్లో భారతదేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేయటం మొదలుపెట్టారు. మొదటి ప్రపంచ యుద్ద సమయంలో లండన్ లో ఆమెపై కట్టడి పెరగ్గా, పారిస్ కి మకాం మార్చి, పారిస్ ఇండియన్ సొసైటీ స్థాపించారు. ఐర్లాండ్, ఈజిప్టు, సోవియట్ విప్లవవాదులతో పాటు ఫ్రాన్స్ సోషలిస్టులతో ఆమెకు సత్సంబంధాలుండేవి. లెనిన్, మాక్సిమ్ గోర్కీలాంటి ప్రముఖులు ఆమెను అభిమానించే వారు. భారత విప్లవవాదులకు ఆర్థికంగా కూడా ఆమె సాయం చేసేవారు. సావర్కర్ జైల్లో ఉండగా ఆయన కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే.. మేడమ్ కామానే వారిని ఆదుకున్నారు.
ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరఫున పాల్గొనటానికి ఐరోపా వచ్చిన భారతీయ సైనికులను ఆమె కలుసుకొని వారిని ఆంగ్లేయులపై తిరుగుబాటుకు ప్రోత్సహించారు. దీంతోబ్రిటన్ ఒత్తిడితో పారిస్లోనూ ఆమెపై ఆంక్షలు మొదలయ్యాయి.భికాజీ ఫ్రాన్స్లో నిర్భంధించబడింది. యుద్ధానంతరం ఫ్రాన్స్ లోనే యుండి, మన స్వాతంత్ర్యం కోసం వ్యాసాలు వ్రాస్తూ, ప్రసంగాలు చేస్తుండేది.
సోవియట్ యూనియన్కు వచ్చి ఉండాలని లెనిన్ ఆహ్వానించారు. కానీ ఆమె అమెరికా పయనమై.. అక్కడి ప్రజలకు భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని వివరించారు. భికాజీ కామా ధైర్యాన్ని చూసి బ్రిటిష్ ప్రభుత్వం ఆగ్రహించింది. ఆమెను భారత్లోకి రానివ్వలేదు. సుమారు 35 సంవత్సరాలు ఆమె విదేశాల్లోనే గడిపింది – స్వదేశం కోసం పోరాడుతూ, కలలు కంటూ. చివరికి, వృద్ధాప్యంలో ఉన్న భికాజీకి భారత్ తిరిగి వచ్చే అనుమతి లభించింది. 1935 వరకు అలా ప్రవాసంలోనే గడిపిన కామా ఆరోగ్యం దెబ్బతిని పక్షవాతానికి గురయ్యారు. ఇక ఆమెతో ఎలాంటి ప్రమాదం లేదని గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం భారత్లో అడుగుపెట్టడానికి అనుమతించింది. 1935 లో జన్మభూమికి తిరిగి వచ్చిన 9నెలల తర్వాత, తన 74వ ఏట ఆ విప్లవమాత కన్నుమూసారు. తీవ్రమైన అస్వస్థతకు గురై, 1936 ఆగస్టు 13న మరణించింది. తన యావదాస్తిని ఆవాబాయి పెటిట్ అనాథ శరణాలయానికి దానం చేసింది. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ అనుకుంటే అష్టైశ్వర్యాలను అనుభవించే అవకాశం. కానీ ఆమె వాటన్నింటినీ కాదనుకుంది. భర్తను సైతం వదులుకుంది. ఆంగ్లేయులకు లొంగకుండా భారతావని బానిస సంకెళ్ళు తెంచటంకోసం పరితపించింది. భారత్ లో ఇంకా స్వరాజ్య కాంక్ష మొదలు కాక ముందే 1907 లోనే బోల్ష్ విక్ వీరుడు లెనిన్ తదితరుల సమక్షంలో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసిన విప్లవ మాత భికాజీ రుస్తుం కామా.
భారతదేశంలో ఒక ప్రాంతానికి – Bhikaji Cama Place (భికాజీ కామా ప్లేస్) అని ఆమె పేరు పెట్టినట్టుగా తెలుస్తుంది.ఇంతటి గొప్ప దేశ భక్తురాలి స్మృత్యర్థం ఆమె జన్మ శతాబ్ది సందర్భంగా 1962 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్లను విడుదల చేసింది. 1997 సంవత్సరంలో మన కోస్ట్ గార్డ్ లోని అతివేగపు గస్తీ నౌకను ఆమె పేరు పెట్టారు.
భికాజీ కామా పేరు నేటికీ గర్వంగా పలుకుతారు.ఆమెను“భారత విప్లవ తల్లి”అని పిలుస్తారు.
భారత జాతీయ జెండా రూపకల్పనలో ఆమె పాత్రను ఎవరూ మరువలేరు.ఈ విధంగా భికాజీ కామా గారి జీవితం – ఒక త్యాగం, ఒక కల, ఒక జెండా కథ.
సంగీత జలధిలో మునకలేస్తూ, స్వరాలను శ్వాసిస్తూ, రాగాలను పానంచేస్తూ, పంచప్రాణాలుగా అభిమానిస్తూ, ఆరోప్రాణంగా ఆరాధిస్తూ వన్నె తెచ్చిన స్వరకర్త లెందరో. పలు చరణాలతో కూడిన స్వరకల్పనకి పల్లవి తిరగలి చక్రమై రాగానికి శోభ నిచ్చిన విధంగానే బాలభానుడి లేత కిరణాలైనా, సోముడి వెన్నెల జల్లులైనా ప్రకృతి సోయగమై మనసుకు హాయి గొలుపుతాయి.
సంగీత పరిభాషలో స్వరాల సమూహాన్ని ‘రాగం ‘ అంటారు. ఒక్కొక్క రాగం ఒక్కొక్క మూర్చనను కలిగి ఉంటుంది. ప్రతీ మూర్చన తనవైన స్వరాలను కలిగి ఉంటుంది. స్వరాలేవైనప్పటికీ రాగభావం మాత్రం మాధుర్యభరితమే.
చుక్కలు పరిచిన నీలాల దుప్పటి కవులకు కవితావస్తువై, కావ్యాల్లో సైతం తనదైన ముద్ర వేసుకుంది.
ఎదఎదను రంజింపజేసే సంగీత సుధ దేశకాలాల్ని బట్టి ఏ రూపు సంతరించుకున్నా(కర్ణాటక, హిందుస్తానీ, పాశ్చాత్య), ఏ చోట ప్రవహించినా అంతిమంగా దాని లక్ష్యం అలౌకికానందమే.
సంగీత వీచికతో కూడిన శబ్దాన్ని ‘నాదం ‘ అంటారు. అనంతరాగాల సమన్వితమైన సంగీతం నాదమయం. గుప్పెడు గుండెలో కోటి భావనలు దాగి ఉన్నట్టే, అసంఖ్యాక రాగాలలో ఇమిడి ఉన్న నాదమొక్కటే.
మధురమైన ఆ సుధాగానాన్ని గ్రోలుతూ, ఆ నాద జగత్తులో పరవశిస్తూ, సంగీత సరస్సులో వికసించిన పద్మాలెన్నో.
నారాయణ అయ్యర్, అమ్మిని అమ్మాళ్ దంపతుల తనయగా 08/04/1938 భారతదేశంలోని చెన్నై నగరంలో జన్మించి, సంగీత సరస్సులో ముచ్చటగా మూడోసారి{( పద్మశ్రీ-1984), (పద్మభూషణ్-2004), (పద్మ విభూషణ్-2026)}వికసించి, తన పూదేనియల వెదజల్లిన ఈ పద్మమే ఎన్. రాజం.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన 2026వ సంవత్సరపు పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ పొందిన ఐదుగురు సభ్యుల్లో ఏకైక మహిళగా గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ వాయు లీన విద్వాంసురాలు వయొలిన్ వాద్యంలో (కళల విభాగంలో)సాధించిన ప్రతిభకుగాను ఈ అవార్డును పొందారు.
హిందుస్థానీ సంగీతంలో నిష్ణాతురాలైన వీరు బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సంగీత ప్రొఫెసర్ గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి, నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తమ ఉద్యోగ నిర్వహణలో సంబంధిత విభాగానికి అధిపతిగా, ప్రదర్శన కళల విశ్వవిద్యాలయ విభాగాధిపతిగా తమ సమర్థవంతమైన సేవలు అందించి, పలు పదవులకు వన్నె తెచ్చారు.

వీరంందించిన సేవలకు గాను సంగీత నాటక అకాడమీ (1990) అవార్డు, కేంద్ర సంగీత నాటక అకాడమి అందించే అత్యున్నత గౌరవమైన సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ 2012లో వీరిని వరించింది.
సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడైన తండ్రి వద్ద సంగీత శిక్షణ ప్రారంభించి, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ గారి శిష్యురాలిగా సంగీతంపై పట్టు సాధించారు.
ఘర్(ఇల్లు) అనే హిందీ పదం నుండి ఉద్భవించిన’ ఘరానా ‘ అనే సంగీత ప్రక్రియలో నిష్ణాతులైన హిందుస్తానీ సంగీత గురువు ఓంకారనాథ్ ఠాగూర్ వద్ద రాగవికాసాన్ని నేర్చుకున్నారు.
ఘరానా అనే పదానికి సంగీత వారసత్వం, గురుశిష్య సంప్రదాయం అని అర్థం. ఇది ఒక నిర్దిష్ట సంగీత శైలి. రాగ, గాత్ర వాద్య శైలులను అభ్యసించే విధానాన్ని సూచించే ప్రక్రియ.
వారణాసిలో మహదేవ్ ప్రసాద్ మిశ్రా ఆధ్వర్యంలో ఆ నగరం యొక్క ఠుమ్రీ సంప్రదాయాన్ని కూడా అభ్యసించారు. క్రమంగా వాద్య సంగీతంలోకి అడుగుపెట్టి చివరకు హిందుస్తానీ సంగీతంలో వయొలిన్ విద్వాంసురాలిగా ఖ్యాతి గాంచారు. తండ్రి మార్గదర్శకత్వం లో ‘గయాకి అంగ్ (గాత్ర శైలి)’ అనే ప్రక్రియను అభివృద్ధి పరిచారు. గయాకి అంటే హిందీ, అరబిక్ భాషలలో పాడటం అని అర్థం. ఖయాల్ అంటే హిందీ భాషలో ఆలోచన అనీ, పర్షియన్ భాషలో సాహిత్యం అని అర్థం. సరళంగా చెప్పాలంటే ఖయాల్ గయాకి అనేది నిర్దిష్ట శైలి, వేగం లేని వివరణాత్మక గానకళ. వీరు తమలోని సంగీత పరిజ్ఞానానికి సాధనను జోడించి వయొలిన్ వాద్యంపై మనుషుల స్వరాన్ని పోలిన విధంగా వాయించే విధానాన్ని కనిపెట్టారు. వయొలిన్ భారతీయ సంగీత కచేరీలో, ముఖ్యంగా కర్ణాటక సంగీత కచేరీలో ఉపయోగింపబడే ప్రధాన సహకార తంత్రీవాద్యం. దీనికి ‘ ఫిడేలు ‘ అని మరో పేరు. గాంభీర్యంతో కూడిన మాధుర్యం దీని సొంతం. ఇది పాశ్చాత్య వాయిద్యమైనప్పటికీ, కర్ణాటక సంగీతంలోని అతి సూక్ష్మ గమక విశేషములను కూడా పలికించగల సామర్థ్యం ఉండటంచే ప్రధాన పక్క వాయిద్యంగా, తని వాయిద్యంగా భారతీయ సంగీతంలో సుస్థిర స్థానాన్ని ఆక్రమించుకుంది. కర్ణాటక సంగీత శైలిలో ప్రముఖ వయొలిన్ విద్వాంసుడైన T.N. శేషన్ తోబుట్టువు వీరు. చార్టెడ్ అకౌంటెంట్ ఐన T.S. సుబ్రహ్మణియన్ అనే వ్యక్తిని వివాహమాడి ఒక ఆడపిల్లకు జన్మనిచ్చి, ఆ శిశువుకు సంగీత శంకర్ అని నామకరణం చేశారు. కూతురైన సంగీత శంకర్ గారికి, మనవరాళ్లైన (సంగీత శంకర్ గారి తనయలు) రాగిణి శంకర్, నందిని శంకర్ లను వయొలిన్ వాద్యంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దారు.
మేనకోడలైన కళారాంనాథ్, డా. సత్యప్రకాష్ మెహంతీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఐన ప్రణవ్ కుమార్ వీరి శిష్యులు. కర్ణాటక సంగీత గాయని మరియు సామాజికవేత్త ఐన పద్మా స్వామినాథన్ వీరికి అత్తగారు. దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ప్రముఖ నేపధ్య గాయని ఐన వాణీజయరాం వీరికి వదిన.
సంగీత కుటుంబంలో జన్మించి, ఆ సాగరాన్ని మథించి, అందుండి లభించిన అమృత సుధల్ని వారసత్వంగా తనవారికి పంచడమే కాకుండా, స్వపర భేదాలెంచక అభిమానించి, ఆరాధించిన (సంగీతాన్ని) వారందరికీ వితరణ చేసి, అందులోనే తాదాత్మ్యం చెందిన ఈ సంగీత శిఖరానికి(రాజం గారికి) కైమోడ్పులర్పిస్తూ…..
08-03-2026
సాహితీ వేత్తల సమ్మేళనం
తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాలులో ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అకాడమీ తరఫున నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరము సభను ‘థీమ్’ ప్రకారంగా మూడు సదస్సులుగా విభజించి నిర్వహిస్తున్నామన్నారు. మొదటి సదస్సు “స్త్రీవాద సాహిత్యం దశ – దిశ” రెండవది ‘ఆధునిక యుగంలో స్త్రీల సాధికారత’ మూడవ సదస్సు ‘డిజిటల్ యుగంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సవాళ్లు’ ఇలా మూడు సదస్సులు ఏర్పాటు చేసి, రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖ మహిళలను ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి అన్నారు. మొదటి సదస్సులో పాల్గొన్న జూపాక సుభద్ర మాట్లాడుతూ మహిళలు సాధికారికంగా స్వేచ్ఛగా ఉండాలి. భారతదేశంలో కొందరు మహిళలు అంటరాని కులం లాంటి ప్రాతిపదికనే మహిళా ఉనికి కొనసాగుతుంది. పెద్దపెద్ద కంపెనీలలో ఇప్పటికి ఉన్నత స్థానంలో ఇలాంటి మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది ఆ సంఖ్య పెరగాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆచార్య త్రివేణి మాట్లాడుతూ సమాజంలో స్త్రీలే సృష్టికి మూలం అన్న విషయాన్ని సమాజం మర్చిపోదు. ప్రస్తుతం సమాజంలో గృహింస వరకట్నాలు భ్రూణ హత్యలు లాంటి అనేక అంశాల నుండి స్త్రీలు బయటపడినప్పుడే సాధికారత సాధించినట్లు అవుతుందన్నారు. మరొక అతిథి షేఖ్ హసీనా మాట్లాడుతూ మాతృస్వాతంత్రం నుండి పితృస్వాతంత్ర వ్యవస్థ వచ్చింది. ఇందుకు కందుకూరి, రాజారామ్ మోహన్ రావు లాంటి మహనీయులు చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలన్నారు. మరో కవయిత్రి శిలాలోలిత మాట్లాడుతూ మహిళా సాధికారత ఇంకా సాధించాల్సి ఉంది అన్నారు.దేవనపల్లి వీణావాణి మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య అనంతరం స్త్రీల విద్య కోసం కృషి చేసిన వారు ఎందరో ఉన్నారు. అట్టి వాళ్లలో స్త్రీల విద్యకోసమై కృషి చేర్చినవారిలో పురుషులే ముందున్నారని అన్నారు. సామాజిక రాజకీయ ఆర్థిక రంగాలలో మహిళను ముందుకు తీసుకెళ్లాలని, అందులో వారికి రాజకీయ, ఆర్థిక రంగాలలో తగిన భాగస్వామ్యాన్ని పెంచే దిశగా మహిళలు ముందుకు రావాలని అభిప్రాయపడ్డారు. ప్రముఖ అనువాదకురాలు స్వాతి శ్రీపాద మాట్లాడుతూ విలువైన వస్తువులను ఇంట్లో జాగ్రత్తగా భద్రపరచుకున్నట్లే స్త్రీమూర్తులను కూడా సమాజం భద్రంగా చూసుకున్నప్పుడే స్త్రీల ఆత్మవిశ్వాసము పెంచిన వాళ్ళవుతారని, వారికి స్వేచ్ఛ ఇచ్చినట్లు అవుతుందని అన్నారు. మరోక కవయిత్రి గోగు శ్యామల మాట్లాడుతూ వందల సంవత్సరాలుగా ఎందరో మహనీయులు స్త్రీవాదాన్ని అనేక కోణాలలో ఆవిష్కరించారు. భారతదేశంలో స్త్రీలకు అనేక హక్కులను కల్పించారు. దీనితోపాటు దేశంలో అమ్మ అనే పాత్రకు గొప్ప స్థానం ఉంది. అంటూ అమ్మల యొక్క గొప్పతనాన్ని విశ్లేషించారు. కవయిత్రి శాంతి ప్రబోధ మాట్లాడుతూ అచ్చమాంబ కాలం నుండి స్త్రీ వాద సాహిత్యం ఉందన్నారు. గత కొంతకాలంగా ఈ సాహిత్యంలో మార్పు వచ్చిందన్నారు. రాజకీయ, ఆర్థిక, అస్తిత్వం కోసం, హక్కుల కోసం స్త్రీ సమస్యలపై పోరాటం జరిగిన విషయాలను తెలియజేశారు. బయటి ప్రపంచంలో గుర్తింపు కలిగిన ఎందరో మహిళలకు ఇంటి లోపల గుర్తింపు లేకపోవడం విచారమంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. రెండో సదస్సుగా జరిగిన ‘ఆధునిక యుగంలో స్త్రీల సాధికారత’ అంశంపై సమన్వయకర్తగా కాళోజీ అవార్డు గ్రహీత శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారు పాల్గొన్నారు. ఈ అంశంపై వివిధ రంగాలకు చెందిన మహిళలు వారు సాధికారంగా సాధించిన అనేక విషయాలపై, సమాజ నిర్మాణంలో స్త్రీలకు సమాన అవకాశాలు కలిగి ఉండే మహిళా హక్కులపై, మహిళ విద్యా వ్యవస్థ పై చర్చ జరిగింది. ఈ సదస్సులో అనేక మంది మహిళలు పాల్గొని తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. చివరి సదస్సుగా కవయిత్రి ఉషారాణి అధ్యక్షతన ‘డిజిటల్ యుగంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై ఈ సదస్సు జరిగింది. సదస్సుల అనంతరం నూతనంగా కవిత్వం రాస్తున్న నేటి వర్తమాన కవయిత్రులు, విద్యార్థినిలను ఆహ్వానించి వారితో కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సగిలి సుధారాణి, సమ్మెట విజయ, అరుణ కీర్తి పతాక, సంధ్యా విప్లవ్, బండారు విజయ, పల్లా మాలతి, రంగరాజు పద్మజ, నస్త్రీన్ ఖాన్, జ్వలిత, సమ్మెట ఉమాదేవి, సీతాలక్ష్మి, సరిత సలీమాతో పాటు అనేకమంది వర్ధమాన కవయిత్రులు, తదితర సాహితీవేత్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి అకాడమీ తరఫున మెమొంటో, శాల్వతో ఘనంగా సత్కరించారు.
ఎన్నో జన్మల పుణ్యఫలంతో అదృష్టవశాత్తు లభించిన మానవ జన్మ నిరంతరం భగవన్నామ స్మరణతో సఫంలం చేసుకోవాలే తప్ప భౌతిక మోహాలకు లొంగి వ్యర్థం చేసుకోకూడదనే వేదాంత పరమార్థం తెలియ జెప్పేదే సుయజ్ఞోపాఖ్యానం.ఇహము పరము మధ్యలో కొట్టు మిట్టాడే మనిషి ఆత్మకు పరమాత్మకు అనుసంధానం పొందే విధమైన ఆత్మజ్ఞానం పొందటానికి వేదవ్యాసుడు సమవర్తి అయిన యమధర్మరాజు నోటి వెంట చెప్పించిన తత్వ విచార సారాంశంగా అర్థం చేసుకోవచ్చు.
వేదాలను విభాగం చేసి పంచమ వేదంగా మహాభారతం వ్రాసినప్పటికీ అసంతృప్తి తో వేదన చెందుతాడు బాదరాయణుడు. కారణమేమిటో విచారించిన నారద మహర్షి భగవన్నామ సంకీర్తన లేని కావ్యం అంతగా సంతృప్తి కలిగించిందని చెప్పి పురాణ రచనకు ప్రోత్సహిస్తాడు. అందులో తొలి పురాణంగా వ్యాసుడు వ్రాసింది భాగవత పురాణమే.దానిలో భక్తి,గమ్యం,వైరాగ్యం,తత్త్వం,ముక్తి ఐదు అంశాలను సమపాళ్ళలో నింపి ఇతిహాసాల స్థాయితో తీర్చిదిద్దాడు.విష్ణుమూర్తి తో మూడుజన్మల వైరం కోరుకున్న హిరణ్యాక్షుడిని యజ్ఞావరాహస్వామి అవతారంలో కేశవుడు
సంహరిస్తాడు అసందర్భంగా అంత్యక్రియలు చేయటానికి పూనుకున్న హిరణ్యాక్షుని సోదరుడు హిరణ్యకశిపుడు తన తల్లి దితికి జీవితము కర్మఫలాల గురించి వివరించిన అంశాలలో సప్తమ స్కంధములో సుయజ్ఞోపాఖ్యానం చేర్చాడు.

సుయజ్ఞుడు ఉశీ నగరానికి రాజు.తెలివిగలవాడు,యుద్ధ విద్యలలో నైపుణ్యం గలవాడు.కీర్తి ప్రతిష్టలు కలవాడు.రాజులకు యుద్ధాలు,గెలుపు ఓటములు సహజములు.ఎన్నో సంగ్రామాలలో విజయం సాధించినప్పటికీ ఒక బలహీన క్షణాన యుద్ధంలో ప్రాణాలు కోల్పోతాడు.దేహము తునాతునకలై పోతుంది.రత్నకిరీటం ముక్కలౌతుంది.ఆభరణాలు అక్కడక్కడా పడిపోతాయి.కనుగడ్లు పైకి వస్తాయి.చెవులు తెగిపోతాయి.పెదవులు రక్తసిక్తమైపోతాయి.అందమైన ముఖం అనామకమై చిన్నాభిన్నమై వికారమై భయంకరమై చూడలేకుండా పోతుంది.ఈవిషయం తెలిసి భార్యలు చెప్పలేనంతగా ఏడుస్తుంటారు.వాళ్ళ విలాపానికి బండలు కూడా కరుగుతాయా అనిపిస్తుంది.అతడు బ్రతికిన కాలంలో చేసిన మంచి పనులను వేనోళ్ళ పొగుడుతుంటారు.రాజ్యంలోని ప్రజలు దురదృష్టవంతులని మంచి మహారాజును కోల్పోయారని సానుభూతి వచనాలు వినపడుతాయి.
ఇదంతా గమనించి
యమధర్మరాజు చిన్నపిల్లవాని రూపంలో వచ్చి ఆత్మజ్ఞానం బోధించి
వైరాగ్యం వల్ల కలిగే ఆత్మ శాంతిని వివరించటమే ఈ కథలో ముఖ్యవిషయం.
కథగురించి విచారిస్తే హిరణ్యకశిపుడి ద్వార తల్లి దితికి పదహారు శ్లోకాలలో
ఆత్మజ్ఞానం బోధిస్తూ యమధర్మరాజు నోట
ఇదం శరీరం పురుషస్య మోహజం యథా పృథక్భౌతిక మీయతే గృహమ్ యథౌదకైఃపార్థివ తైజసైర్జనః కాలేనజాతో వికృతో వినశ్యతి
అంటూ ఇరవై మూడు శ్లోకాలో శరీరానికి ఆత్మకు మధ్య ఉండే సంబంధాన్ని వేదవ్యాసమహర్షి సంస్కృత మహాభాగవతం లో వివరిస్తారు.ఇదే అంశాన్ని తెలుగులో బమ్మెర పోతనామాత్యుడు
నీరాగారనివిష్టపాంథులక్రియన్ అంటూ నలభై పద్యాల్లో సుయజ్ఞోపాఖ్యానంలో ఆత్మజ్ఞానం వివరించారు.దీనిలో తొలుత హిరణ్యకశిపుడు తల్లి దితికి , తర్వాత బాలుని రూపంలో యమధర్మరాజు సుయజ్ఞుని భార్యలకు చెప్పిన పరోక్ష కథనాలద్వారా ఆత్మజ్ఞానం వివరణ కన్పిస్తుంది.
హిరణ్యకశిపుడు తల్లి దితితో
అమ్మా!బాటసారులు దారిలో స్నేహం చేసి గమ్యం చేరగానే విడిపోతారు.జీవిత గమనమంతే.కర్మానుసారంగా పుట్టుక,మరణంతో కాయం మాయమవుతుంది.కాని ఆత్మ
వాసాంసిజీర్ణాని యథావిహాయ అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు తనువు వీడి మరో ఉపాధి లో ప్రవేశిస్తుంది.ఆత్మకు మరణంలేదు.శరీరములో ఉన్నంత వరకే సుఖదుఃఖాలు పొందుతుంది.నీరు కదలికలో మన ప్రతిబింబం తిరిగినట్లనిపిస్తుంది.కాని తిరుగదు.అట్లే విషయ వాసనల వలన తిరిగినదని భ్రమిస్తాము అదే ఆత్మ జ్ఞానం అంటు సుయజ్ఞునికథ చెబుతాడు.
సుయజ్ఞుని భార్యలు పరివారం ఏడుస్తున్న వేళ
దండధరుడు బాలుని రూపములో వస్తాడు.
చచ్చిన వాని కేడ్చెదరు చావున కొల్లక డాగ వచ్చునే యెచ్చట బుట్టెనచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికిన్ అంటూ జననము,మరణము రాగ బంధాల నుండి విముక్తుడై మోక్షమార్గం మునకు తరలిపోయే ఆత్మ గురించి ఓపికతో వివరిస్తాడు.
సీసము పాంచ భౌతికమైన భవనంబు దేహంబు పురుషుడు దీనిలో బూర్వ కర్మ వశమున నొక వేళ వర్తించు దీపించు దఱియైన నొకవేళ దలగి పోవు జెడెనేని దేహంబు సెడుగాని పురుషుండు సెడ డాతనికినిం సేటు లేదు పురుషునికిని దేహ పుంజమునకు వేఱుగాని యేకత్వంబు గానరాదు ఆటవెలది దారువుల వెలుంగు దహనుని కైవడి గాయముల చరించు గాలి భంగి నాళలీనమైన నభము చాడ్పున వేఱు తెలియ వలయు దేహి దేహములకు ( పోతన భాగవతం సప్తమ స్కంధం 51 వ పద్యం)
అంటూ శరీరానికి ఆత్మకు దోస పండుకు తీగకు ఉన్నటువంటి బంధంగా విశ్లేషిస్తారు.తల్లిగర్భములోనున్నపుడు కాపాడింది భగవంతుడే.వాడేజీవులన్నింటినీ కాపాడుతాడు.తనలీల కొరకే సృష్టి,స్థితి,లయము చేస్తాడు.ఇది అతని బొమ్మలాట.కర్మ వలన జనన మరణములు కలుగును.ఆత్మకు అంటవు.దేహము,మట్టి,నీరు,తేజస్సు అనేవి పరిణామక్రమము.ఆత్మకు ఆకార వికారములు లేవు.ఆత్మ శరీరము వేరు.సుయజ్ఞుని కళేబరము మీ ముందరే ఉన్నది.అందులో ఉండాల్సిన వాడు లేడు.ఇంకా ఏడ్చు టేల?దేహము లోని ఇంద్రియా లన్నిటికి ప్రాణమే హేతువు.అది ఉంటేనే మాట్లాడుట,వినుట,కనుట.ప్రాణమే లేనిది ఇవేవీ సాధ్యము కాదు.ఆత్మ సర్వవ్యాపకము.ఆత్మశరీరమును త్యజించి పోతుంది.మాయా మోహములకు కష్ట నష్టములకు కర్మ బంధములే కారణము.అందుకే అశాశ్వతమైన శరీరము కొరకు ఏడ్చుట అజ్ఞానము. అంటూ యమ ధర్మరాజొక కథ చెబుతాడు.
ఒక అడవిలో బోయ వాడొకడు పక్షులకు యముని లాంటి వాడు.పిట్టల జంటకు ఎరపెట్టి వల పన్నుతాడు.ఆడపిట్ట వలలో చిక్కుకుంటుంది. దాన్ని విడిపించే శక్తి లేక మగపక్షి విలవిలలాడుతుంది.
పసి కూనలైన పిల్లల రక్షణ బాధ్యత తనకు గుర్తు వస్తుంది. ఈ విచారంలో జాగరుకత కోల్పోయిన మగపిట్టను బోయవాడు బాణంతో చంపుతాడు.భార్య గురించి విచారిస్తూ తన ప్రాణాల మీదికి తెచ్చుకుంటాడు.అందువల్ల సుయజ్ఞుని గురించి మీరెన్నేళ్ళు ఏడ్చినా తిరిగిరాడని బాలుడైన యముడు సముదాయించటంతో భార్యలు,పిల్లలు జ్ఞానులై సుయజ్ఞునికి కర్మకాండలు జరిపిస్తారు.గతంలో జరిగిన ఈ కథ తన కొడుకు హిరణ్యకశిపుని ద్వారా విన్న దితి,హిరణ్యాక్షుని భార్యలకు ఆత్మజ్ఞానం కలుగుతుంది.దుఃఖము నియంత్రించి అంత్యక్రియలు నిర్వహిస్తారు.అందుకోసమే జ్ఞానంతో ఉన్నప్పుడే మానవత్వంతో జీవరాశికి సేవ,హరినామ స్మరణతో మోక్ష మార్గములో పయనించాలని మహా భాగవతములోని సుయజ్ఞోపాఖ్యానం లోకానికి మార్గదర్శనం చేస్తున్నది.
ఉపయుక్తగ్రంథసూచి:
1.వేదవ్యాసమహర్షి రచించిన శ్రీ మహాభాగవతం( సంస్కృతం-తెలుగులిపీ)గీతం ప్రెస్ గోరఖ్ పూర్ వారి ప్రచురణ
2.శ్రీమదాంధ్రమహాభాగవతము( బమ్మెరపోతనామాత్యప్రణీతము)
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ
3.డాక్టర్ దాశరథి రంగాచార్య రచన
భాగవతవ్యాఖ్యానం
1977ముద్రణ
ఈరోజు మకరసంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం పర్వదినం సందర్బంగా నేను మా వారు సత్యమూర్తి,మాఇంట్లోవుండే సీను,రేణుక,దినేష్ తో కలసి కారులో నా జన్మభూమి పుట్టి పెరిగిన ఊరు ఏదులాబాద్ కు ప్రయాణం,
కన్న ఊరు,కన్నతల్లి గొప్పది కదా ఎన్నగా ఎవరికైనా..
ఘటకేశ్వర్ మండలంలో నెలకొన్న
గోదా రంగనాథస్వామి ఆలయంలో గోదా రంగనాథుల కల్యాణం సందర్బంగా పట్నం నుండి పల్లెకు బయలుదేరి ఉదయం 11.30.గంటలకు వెళ్ళాము.
మా ఊరికి వెళుతుంటే నాకు చెప్పలేని ఆనందం,ఉత్సాహం .ఊరికి చేరుకోగానే అభివృద్ధి చెందిన ఊరును, ఎత్తైన భవనాలను చూసి పరవశించిపియాను.

ప్రతి ఇంటిముందు పెండతో చల్లిన నీళ్లతో పచ్చదనం నింపుకున్న వాకిళ్ళు తెల్లని ముత్యాల ముగ్గులు సప్తవర్ణ శోభితమై,గొబ్బెమ్మలు వాకిలి కొప్పులో అలంకరించి పల్లె సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తూ ఆహ్లాదకర వాతావరణం చూస్తుంటే రెండు కన్నుల సరిపోవన్నది సత్యం.
ముందుగా నేను చదువుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చూచి ఆనందంతో గుర్తుగా ఒక ఫోటో తీసుకుని వెళుతూ పెద్ద చెరువు చూసి పరవశించి ఆనాడు బతుకమ్మ ఆట ఆడిన జ్ఞాపకాలను తలచి నెమరువేసుకుంటూ వెళుతున్నాము.
ఎన్నో కార్లు నిలబడి ఉన్నాయి.కిలోమీటరు దూరంలోనే ఆపేశారు పోలీసులు.చాలా మందితో నిండిపోయింది. నాకు వేరే దారి తెలుసు కాబట్టి దారి మళ్లించి
మా ఊరు కాబట్టి ప్రైమరీ బడి పక్కదారిలో నుండి గ్రామపంచాయతీ ఆఫీసు మీదుగా రామాలయం ( మా బాబాయి వాళ్ళది.మా పెదన్నయ్య అందులో పూజలు చేసేవాడు) వెళ్ళాము.చాలా మార్పులు చేస్తున్నట్లు గమనించాము.రామాలయం అంతా తిరిగి చూచి ఫోటోలు దిగాము.మా చిన్నపుడు శ్రీరామనవమి ఉత్సవాలు,సీతారామ కల్యాణం వైభవంగా జరిగేది.మా పెద్దన్నయ్య రాములు పంతులు ఆ గుడిలో చాలా యేండ్లు పని చేసాడు.అప్పుడు కూడా సీతారామ కళ్యాణ ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి.మేము ప్రతి సంవత్సరం రామనవమికి ఊరికి వెళ్ళేవాళ్ళము.
ఇప్పుడు కూడా చాలా వైభవోపేతంగా జరుగుతున్నాయి. కారును వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర పార్కింగ్ చేసి రంగనాథ ఆలయం వెళ్ళాము.
ఇసుక వేస్తే రాలనంత రద్దీ.పల్లె అంతా అక్కడే ఉన్నట్లు అనిపించింది.అంతేకాకుండా హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలనుండి జనం తరలి వచ్చారు.మల్కాజిగిరి MLA మల్లారెడ్డి కుటుంబంతో ,పరివారం తో వచ్చాడు.
.ఆనందం,ఆశ్చర్యం..

లోపలికి వెళుతుంటే తెలిసిన వాళ్ళందరూ పలకరింపులతో పులకించిపోయాను. అక్కడ మేడ్చల్ మల్కాజిగిరి MLA మల్లారెడ్డి గారు కనిపించారు.పలకరించాను.
రంగనాథ గోదాదేవి
దైవ దర్శనం చేసుకున్నాక అమ్మవారిగాజులు ప్రసాదంగా ఇస్తే తీసుకుని కల్యాణం విందు .భోజనం చేస్తుంటే వడ్డన చేస్తున్నవారిలో నాతో కలిసి చదివిన సహాధ్యాయులు కనిపించి గుర్తుపట్టి నువ్వు సీతవేనా? అని అడిగారు.చాలా కాలమైంది చూసి .పాపయ్య,శ్రీరాములు.. ఎన్నో చిన్ననాటి ముచ్చట్లు గుర్తుచేసుకుని మాట్లాడుకున్నాము.అక్కడ నుండి బయటకు వచ్చి వైష్ణవుల యిండ్లు మా చిన్ననాటి స్నేహితులను కలిసి అనుభవాలు పంచుకున్నాము. అట్లా బయలుదేరి .నేను పుట్టిన మా ఊరి నేను పెరిగిన యిల్లు చూచి వారితో మాట్లాడి బయలుదేరి దిడ్డి ( నా చిన్నప్పుడు కూరగాయల మార్కెట్ అన్నమాట) నుండి తిరుమన్నారాయణుని బండ (ఏకశిలా.పెద్దబండ..కింద పెద్దగుహ,గోలకొండకిటకు సొరంగ మార్గం ఉంది అని అంటారు( అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది.ఇప్పుడు.బండపైకి ఎక్కి చిన్నపుడు ఆడుకున్న ఆటలు,తీరుతెన్నులు తలచుకొని బయకుదేరాము.మా ఇంటిపక్కన వుండే మా గురువు రామానుజం పంతులు యొక్క (కొడుకు సత్యం ఈ మధ్య మరణించాడు.బాధగా ఉంది.ఎప్పుడు కలిసినా ఆనందంతో పలకరిస్తాడు) వారిభార్య రాజేశ్వరి ఆమె లేదు.వాళ్ళ పక్కింటి వాళ్లు పెరికె వెంకటేశంకు నేను రచించిన మా అమ్మ గురించి మాతృశతకం జానకీ రాఘవీయం, సీతమాట *ద్విశతి రెండుపుస్తకాలు ఇచ్చాను.ద్విశతి మాగురువుకే అంకితం చేశాను. వాళ్లకు అందజేయమని చెప్పి ఒక ఫోటో తీసుకున్నాను గుర్తుగా.

మా అమ్మకు నాన్నకు,మాకు ఊరితో ఆత్మీయానుబంధం ఎక్కువే.
మర్చిపోయాను చెప్పడం వస్తుంటే తొంటలక్ష్మి కనబడి గట్టిగా పట్టుకుంది.ఎంతో సంతోషించింది.కుడిచెయ్యి గిర్నీలో పడి నలిగిపోయింది.ఎడమ చెయ్యి ఒక్కటే ఉంది.కానీ మా చిన్నప్పుడు ఒక్క చెయ్యితోనే పట్టుకుని తలమీద నీళ్లకుండ ఒకటికాదు కుండమీద కుండ రెండు కుండలు పెట్టుకుని చేద బావినుండి నీళ్లు తోడుకొని తెచ్చిన ఘనురాలు.
అలా ఊళ్ళో అందరిని కలుసుకుని ఎంతో అనుభూతిని ఆనందాన్ని మూటకట్టుకుని హైదరాబాద్ లో ఉన్న మా ఇంటికి ఉప్పల్ భగాయిత్ గుండా బయలు దేరి సాయంత్రం 5.30 కి క్షేమంగా చేరుకున్నాము.






