అవసరాలకు పిలిచి మరీ అప్పులిచ్చే జగదీశ్ దురాశతో వడ్డి వ్యాపారం కూడా మొదలుపెట్టాడు. తీసుకున్న అప్పులు సమయానికి తీర్చకుండా ఉంటేనే జగదీష్ ఆత్మశాంతిస్తుంది. ఎందుకంటే నెలవారీ అప్పనంగా వచ్చే వడ్డిలు, చక్రవడ్డిలంటే అతనికి చక్రపొంగలిలా మహారుచిగా ఉంటాయి కాబట్టి.
ఎందుకో అతనికి ధనదాహం రోజురోజుకీ పెరిగిపోతోంది. క్రమక్రమంగా రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించి, అడ్డంగా కోట్లు ఆర్జించాడు. ఈ అక్రమ సంపాదనంతా బ్యాంకుల్లో వేస్తే ఇన్కంటాక్స్ కట్టాలి కదాని, అతి తెలివితో కరెంసీ నోట్లను గోనె సంచుల్లో వేసి కట్టి గోడౌన్ నింపేశాడు.
ఒకప్పుడు ఎకరాల్లో భూమిని కొని, ప్లాట్లు చేసి యాభై రెట్లకి అమ్మి లాభాలు చవిచూశాడు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే పూర్తిగా తారుమరైపోయింది.
హైటెక్ గిరాకీని తట్టుకోవాలంటే కనీసం గజాల్లో కూడా ప్లాట్లు దొరకటం కష్టమైపోయింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో చదరపు అడుగుల్లోనే వ్యాపారం చేయవలసి వస్తోందని తెగ మదనపడిపోయాడు. అందుకే అయితే ఎస్టేట్ మానేసి, వెంటనే కొత్త బిజినెస్ చేయాలని డిసైడయ్యాడు.
అదే సమయంలో జగదీష్కి ఒక సూపర్ ఐడియా ఒకటి ప్లాష్ అయ్యింది. ఇక ఏ మాత్రమూ ఆలస్యం చేయకూడదని, తన ప్లాన్ని అమలు చేయటానికి వెంటనే సైంటిస్ట్ ప్రజాపతి ఇంటికి కారులో బయలుదేరాడు.
* * *
లేక లేక పుట్టిన కొడుకుకి చక్రవర్తి అని పేరు పెట్టుకున్నారు. సాంబయ్య, రంగాబాయి దంపతులు. సాంబయ్య కూలీనాలీ చేస్తూ భార్యను ప్రేమగా చూసుకునేవాడు. చక్రవర్తిని మాత్రం గవర్నమెంటు స్కూలుకి పంపుతున్నారు. ఎందుకంటే ఆ స్కూల్లో ఒకపూట భోజనం పెడుతున్నారు. అలాగే ఉచితంగా క్లాసు పుస్తకాలు కూడా ఇస్తున్నారు. భార్య రంగాబాయికి జ్వరం వచ్చింది. ఎంతకాలమైనా జ్వరం తగ్గకపోగా అది జబ్బుగా మారిపోయి మంచానపడిరది. ఆమె వైద్యం కోసం అప్పులు చేయవలసి వచ్చింది. రాను రాను సరిjైున వైద్యం అందకపోవటంతో హఠాత్తుగా రంగాబాయి స్వర్గస్తురాలయ్యింది.
భార్య తోడు లేకపోవటంతో సాంబయ్యకు ఏదో వెలితిగా ఉండేది. ఎప్పుడూ ఆమె గురించే ఆలోచిస్తూ పరధ్యాన్నంగా ఉండేవాడు. ఆడ దిక్కులేని ఏ మగాడికైనా జీవితం మీద విరక్తి పుడుతుంది అనే దానికి బహుశా ఇదే ఉదాహరణేమో! అదే వైరాగ్యం, బెంగగా మారి తట్టుకోలేని స్థితిలో చివరికి సాంబయ్యకు గుండెపోటు వచ్చి భార్య దగ్గకు వెళ్ళిపోయాడు.
చక్రవర్తి టెన్త్క్లాసు చదువుతూనే చిన్న చితకా పనులు చేస్తూ తన కాళ్ళమీద తను నిలబడ్డాడు. కానీ చిక్కంతా ఇక్కడే ఎదురైయ్యింది. అమ్మ వైద్యం కోసం నాన్న తీసుకున్న అప్పులు తీర్చుమంటూ జగదీష్ అనుచరులు చక్రవర్తిని నిత్యం వేదించసాగారు. ఈ సమస్య చక్రవర్తి చదువుకు బ్రేక్ వేసింది. తండ్రి బాటలోనే కాయకష్టం చేస్తూ జగదీష్కి పదివేలు అప్పు కాస్తా తీర్చేశాడు.
ఉండటానికి ఇల్లు లేదు. కొంతకాలం పాడుబడిన ఇళ్ళల్లోనూ చెట్లకిందా జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. ఆ తరువాత సిమెంట్ పైపుల్లో నివసించసాగారు. అక్కడ కూడా అతనికి చుక్కెదురైయ్యింది. మున్సిపాలిటి వాళ్లు వచ్చి ‘‘ఇక్కడ మేము మంచినీళ్ళ పైపులైన్సు వేయాలి. వెంటనే నువ్వు ఇక్కడ నుండీ ఖాళీ చేయాలి’’ అని చెప్పి చక్రవర్తిని వెళ్లగొట్టారు. అప్పుడే అతని దగ్గరున్న రేడియోలో నుండీ ‘‘పయనించే ఓ చిలుకా ఎగిరిపో! పాడై పోయెను గూడూ’’ పయనించే ఓ చిలుకా! అనే ఘంటసాల మాస్టారు పాడిన పాట వింటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. తన దగ్గరున్న పెట్టెనూ, ఇంజనీర్ సర్ విశ్వేశ్వరయ్య ఫోటోని చేత పట్టుకొని బ్యాగును సర్దుకుని సిమెంట్ పైపుల నుండీ బయటకు వచ్చేశాడు చక్రవర్తి.
చాలీచాలని కూలి డబ్బులతో తన జీవితకాలంలోనే ఇల్లు కట్టటం అసాధ్యమనే ఆలోచనల ఆవర్తనాలలో మునిగిపోయాడు పాపం గరీబు చక్రవర్తి.
* * *
సైంటిస్ట్ ప్రజాపతికి తన ప్లాన్ వివరంగా చెప్పాడు. దానికి తగ్గట్టే ప్రయోగం చేసి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అద్భుతమైన మందును తయారుచేయమని చెప్పాడు జగదిష్. ఇక తప్పనిసరి పరిస్థితులలో ప్రయోగం చేయటానికి ఒప్పుకున్నాడు సైంటిస్ట్ ప్రజాపతి. లేకుంటే చిత్రహింసలకు గురిచేస్తానని బెదిరిస్తున్నాడు.
సైంటిస్ట్ ప్రజాపతి చేస్తున్న ప్రయోగానికి కావలసిన రసాయనాలనూ, ఇతర లేబరేటరీ పరికరాలనూ సిద్దం చేశాడు. జగదీష్ తన గెస్ట్హౌస్లోనే ప్రయోగశాలను ఏర్పాటుచేశాడు. తాను కనిపెట్టబోయే మందుకోసం పగలూ రాత్రీ నిర్విరామంగా ఎన్నో గ్రంథాలు చదువుతున్నాడు. ఇంకా మరెన్నో మెడికల్ మ్యాగజైన్లు కూడా రిఫర్ చేస్తున్నాడు. ఇప్పుడు గెడ్డాలు, మీసాలు బాగా పెరిగిపోయి అసలు ఎవరు గుర్తుపట్టలేనటువంటి వ్యక్తిగా మారిపోయాడు సైంటిస్ట్ ప్రజాపతి.
‘‘ఇంకా ఎంతకాలం ఇలా కాలయాపన చేస్తావ్? అని కోపంతో సైంటిస్ట్ చెంప చెళ్లుమనిపించాడు జగదీష్. ఈ అనూహ్య చర్యకు ప్రజాపతి స్పృహ తప్పి కిందపడిపోయాడు. అతను తిరిగి కోలుకునే సరికి రెండు రోజుల సమయం పట్టింది. మీరు కొట్టిన దెబ్బలు సైంటిస్ట్ మెదడుమీద తీవ్ర ప్రభావం చూపించాయని డాక్టర్ సుధాకర్ నిర్ధారించాడు.
మొత్తానికి రెండు రోజుల తరువాత సైంటిస్ట్ మళ్ళీ చురుకుగా ప్రయోగాలు చేయటంతో, హమ్మయ్యా నన్ను బతికించావు దేవుడా! అని ఊపిరి తీసుకున్నాడు జగదీష్.
ప్రజాపతీ! నేను చెపుతున్నది జాగ్రత్తగా విను. ఇప్పుడు నీవు తయారుచేయబోయే మందు తీసుకున్నవాళ్లకు పూర్తిగా మతిమరుపు వ్యాధి వచ్చేయాలి. దానితోపాటు మందు స్లో పాయిజన్ లాగా కూడా పనిచేయాలి. అది కళ్లెర్ర జేసి బెదిరించటంతో భయపడిపోయాడు పాపం సైంటిస్ట్ ప్రజాపతి. కానీ ప్రభుత్వం నుండీ అనుమతి లేకుండా మరియూ ‘‘ప్రాణ హానికరమైన మందులు తయారుచేయటం చట్టరీత్యా నేరం’’ అని చెప్పినందుకే ప్రజాపతిని చిత్రహింసలకు గురిచేస్తున్నానడు జగదీష్.
సైంటిస్ట్ ప్రయోగాలు చేయటం మొదలుపెట్టి సుమారు సంవత్సరకాలం కావస్తోంది. అందుకే జగదీష్ జుట్టు పీక్కుంటున్నాడు. అసహనంతో రగిలిపోతున్నాడు. చివరికి సైంటిస్ట్ని చిత్రహింసలకు గురిచేయటం ప్రారంభించాడు.
‘‘ప్రజాపతీ! నేను చెప్పినట్లు త్వరగా ఆ మందును, ఫార్ములానూ వెంటనే కనిపెట్టకపోతే నీ తాట తీస్తాను, చంపేస్తాను’’ అర్థమయ్యిందా! అని కోపంతో జగదీష్ ఊగిపోతున్న సమయంలో ప్రజాపతి భార్య ప్రసన్నాదేవి లేబరేటరీలోనికి ఆదుర్ధాగా ప్రవేశించింది.
నీచుడా! నా భర్తను నిర్భంధించి ఇలా చిత్రహింసలకు గురిచేస్తూ ఆయనచేత ప్రాణాంతక ప్రయోగాలు చేయిస్తున్నావా! అంతేకాకుండా ప్రాణాంతకమైన మాదకద్రవ్యాలను, నకిలిమందులను తయారుచేయిస్తున్నావు. నువ్వు సర్వనాశనమైపోతావు. నువ్వొక దేశద్రోహివి. ప్రతీ నెలా నీ మనుషులు మా ఇంటికి వచ్చి ఇచ్చింది ఇలాంటి పాపిష్ఠి సొమ్మా! అంటూ ఉగ్రరూపం దాల్చిన ప్రసన్నాదేవి జగదీష్పై ఆగ్రహంతో విరుచుకుపడిరది.
శభాష్ ప్రసన్నాదేవిగారు! అసలు నేనే మిమ్మల్ని తీసుకురమ్మని చెపుతామనుకున్నాను. కానీ ‘‘వెతకిపోయిన తీగ కాలికి తగిలినట్లు మీరే వచ్చేశారు’’. ఇక్కడున్న దృశ్యాన్ని కళ్ళారా మీరే స్వయంగా చూశారుగా!
వెంటనే అతని అనుచరులు అక్కడున్న సైంటిస్టుని అతని భార్యనూ సీరియస్గా చూస్తూ రివాల్వర్లతో కవర్ చేశారు.
మేడమ్ ప్రసన్నాదేవిగారూ! నాకు కావలసిన మందును, ఫార్ములానూ త్వరగా తయారుచేసి నాకిచ్చేస్తే, అక్షరాల కోటి రూపాయల బహుమానంతో ఇదిగో ఇప్పుడే మీవారినీ మీతోపాటు ఇంటికి క్షేమంగా పంపించేస్తాను ఆవేశంగా అరిచాడు జగదీష్. వెంటనే ఆమెను కూడా బంధించారు జగదీష్ అనుచరులు.
* * *
చక్రవర్తికి కూడా వయసుతో వచ్చే సహజమైన కోరికలు చాలా ఉండేవి. ఒకరోజు అదే పనిమీద రెడ్లైట్ ఏరియాకి వెళ్ళాడు. అక్కడ కూడా చక్రవర్తికి ఎదురు దెబ్బ తగిలింది. పోలీసుల రైడిరగ్లో దొరికిపోయాడు.
ఇదేం న్యాయం? అమ్మాయిల్ని వదిలేసి కేవలం విటులనే అరెస్టులు చేయటం, వారికే శిక్షలు వేయటం ఏమిటి? ఇది ముమ్మాటికి అధర్మం! అని ధర్నా చేశాడు. దాంతో చక్రవర్తికి నెలరోజులు జైలుశిక్ష పడిరది.
అసలు ఈ రోజుల్లో బ్రతుకే ఒక సమస్యగా మారిపోయింది. ‘‘తాను దూర సందు లేదు, మెడకో డోలా!’’ అన్నట్లు ఇక పెళ్లి చేసుకోవటం ఎందుకు? అని డిసైడ్ అయిపోయాడు. తనకు సంసారంతో పనిలేదు కాబట్టి చిన్న ఇల్లు కట్టేద్దాం అని దీర్ఘంగా ఆలోచిస్తూ మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి ఫోటోని చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు చక్రవర్తి. ఎందుకో అతనికి మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారు వంటి గొప్ప ఇంజనీర్ కావాలనే కోరిక చాలా బలంగా ఉంది. మరి ఇంజనీర్ కావాలంటే బాగా చదువుకోవాలి కదా! దానికి ఎంతో డబ్బు కావాలి! ఏం చేస్తాం? నా తల్లిదండ్రులకు కూడా నన్ను విడిచివెళ్లిపోయారు అంటూ నిట్టూర్పుతో ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి ఫోటోని చూస్తూ కన్నీళ్ళు పెట్టుకునేవాడు. అందుకే అమ్మానాన్న ఫోటోలతోపాటు ఆ మహానీయుడి ఫోటోకు కూడా రోజూ నమస్కరించి తన దినచర్యలు ప్రారంభించసాగాడు చక్రవర్తి.
నాకు ఆరు గజాల భూమి కావాలి అని రియల్ ఎస్టేట్ వ్యాపారిని అడిగాడు చక్రవర్తి. ‘‘ఆరు గజాలు భూమి కావాలంటే స్మశానంలో మాత్రమే దొరుకుతుంది’’ అని కోపంతో ఊగిపోయాడు రియల్టర్ రాజబాబు
మీకు కావలిస్తే మార్కెట్ రేటు కంటే డబుల్ ఇస్తాను. నాకు ఆరు గజాల ప్లాటు కావాలని అతనితో గొడవ పెట్టుకున్నాడు. నేనే కాదయ్యా ఈ దేశంలో ఎక్కడికిపోయినా ఆరు గజాల ఇంటి స్థలాన్ని ఏ ఒక్కరూ నీకు అమ్మరు గాక అమ్మరు! అని సూటిగా చెప్పేశాడు రియల్టర్ రాజబాబు.
దాంతో చక్రవర్తి కోర్టును ఆశ్రయించాడు. వ్యాపారం చేసేవాళ్ళు కొనుగోలుదార్లకి కావలసినంత స్థలం అమ్మాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అయినా ఆరుగజాల స్థలంలో నువ్వు ఇల్లు ఎలా కడతావని జడ్జిగారు చక్రవర్తిని ప్రశ్నించాడు.
సార్! మిలార్డ్! నేను కొనుకున్న ఆరు గజాల స్థలంలో మూడు అంతస్తులు కడతాను. మూడవ అంతస్తులో నా బెడ్రూమ్తోపాటు వంటగది ఉంటుంది. రెండవ అంతస్తులో వాష్రూమ్ ఉంటుంది. ఇక మొదటి అంతస్తులో నేను చచ్చిపోతే నా సమాధి ఉంటుంది. నాకు అప్పుడు స్మశానాల సమస్య కూడా ఉండదని చెప్పాడు. ఇక లాయర్కు ఫీజు ఇవ్వలేకే తన కేసును తానే వాదించుకుంటున్నాననీ, అలాగే కట్టబోయే ఇంటి ప్లాన్ కూడా తానే వేసుకున్నాననీ, ఆయనా తాపీ మేస్త్రి చేతనే ఇల్లు కట్టిస్తానని కోర్టుకు సవినయంగా తెలియజేశాడు గరీబ్ చక్రవర్తి.
చక్రవర్తి లాజికల్ రీజనింగ్ని మెచ్చుకొని అతన్ని అభినందించాడు జడ్జ్. అయితే నీ ఇంట్లోనే సమాధి కట్టటం చట్టరీత్యా నేరం అని చెప్పి మొదటి అంతస్తులోనే కిచెన్ కమ్ డైనింగ్ రూముగా కట్టుకో! అని మొట్టికాయలు వేసింది న్యాయస్థానం.
సార్! ఇప్పుడు నేను అమీర్ చక్రవర్తిెనైపోయాను సార్! అని ఆనందంతో కేరింతలు కొడుతూ జడ్జ్గారితో సహా కోర్టులోని వారందరికీ దండాలు పెట్టాడు చక్రవర్తి.
* * *
యాహూ! యురేఖా! యాహూ! నేను సాధించాను. నేను కనుగొన్నాను. ప్రపంచంలో అందరికన్నా నేనే గొప్ప సైంటిస్టుని అంటూ ప్రయోగశాలలో బ్రహ్మానందంతో పరుగులు తీస్తుండగా అప్పుడే లోపలికి వస్తున్న జగదీష్ని ఢీ కొట్టాడు. దాంతో ఆయన కాస్తా బోర్లా పడిపోయాడు.
ఓరి నీ తస్సాదియ్యా! ఇదంతా నీ ఆనందమా! ఇంతకీ ఏం సాధించావో త్వరగా చెప్పి ఆ ఫార్ములా పేపర్లు నాకిచ్చేయ్ అంటూ ఉబ్బి తబ్బిబ్బైపోయాడు జగదీష్.
ఇదిగో ఇటు చూడండి ఇనది యస్.యమ్.టి. అనే మందు. అంటే ‘‘స్మార్ట్ మెడిసన్ టానిక్’’ దీని ఖరీదు లక్ష రూపాయలు. ఈ టానిక్ ఒక బాటిల్ మందును వాడిన వారికి పూర్తిగా మతిమరుపు వ్యాధి వచ్చేస్తుంది. అంతేకాదు ఈ మందు మీరు చెప్పినట్లు స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. మీ దగ్గర అప్పులు తీసుకున్నవారి మీద ఇది ప్రయోగించవచ్చును. వారి ఆస్తులు,డబ్బులు మీ పేరు మీద వ్రాయించుకోవచ్చును అని చెప్పి ఆనందంతో గంతులు వేశాడు సైంటిస్ట్ ప్రజాపతి.
వెంటనే సైంటిస్ట్ చేతుల్లోంచి ఫార్ములా పేపర్లు లాగేసుకుని సైంటిస్ట్ ప్రజాపతిని క్రూరంగా కాల్చి చంపేశాడు కలియుగ రాక్షసుడు జగదీష్!
రక్తపు ధారలతో తడిసిపోయిన ప్రజాప్రతిని సైంటిస్ట్ జగదీశ్ అనుచరులు అతి క్రూరంగా అక్కడి నుండీ ఈడ్చుకుంటూపోయి ట్రక్కులో పడేశారు. పోతూ పోతూ గోడౌన్ నుంచి మూడు గోనె సంచుల డబ్బుల మూటలు కూడా గుట్టుచప్పుడు కాకుండా మోసుకొచ్చి ప్రజాపతి డెడ్బాడీ కనిపించకుండా గోనెసంచులతో కప్పేశారు. ఎందుకంటే తక్కువ జీతం ఇచ్చి అతి కిరాతకమైన వెట్టిచాకిరీ పనులు చేయించుకున్న యజమాని జగదీశ్పై కక్షతో. ‘‘ఒరేయ్! మన బాస్గాడికీ కరెక్ట్గా పవర్ఫుల్ డోస్ ఇచ్చాము కదూ! అని చీర్స్ కొట్టి విస్కీలో మునిగిపోయారు. అయినా మన బాస్కి కావలసిన ఫార్ములా పేపర్లు, రానే వచ్చాయిగా! వీడిని ఇంకా కాల్చటం, పూడ్చటం ఎందుకు? డబ్బులు దండగ! అని అర్ధరాత్రి ఊరి బయటకు తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో పడేసిపోయారు.
అప్పటివరకూ ఊపిరి బిగపట్టి మరణించినట్లు నటిస్తున్న ప్రజాపతికి వెంటనే ప్రాణం వచ్చినట్లయింది. వెర్రిమాలోకాలు నేను చచ్చిపోయాను అనుకున్నారు. అసలు నేను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నట్లు ఈ కుర్ర నాగన్నలకు తెలియదుగా! అని తనలో తానే నవ్వుకుంటూ పైకి లేస్తుండగా, సరిగ్గా అప్పుడే కూతురు సుప్రజ వచ్చి తండ్రిని కారులో ఎక్కించుకుని సురక్షితంగా ఇంటికి తీసుకువెళ్ళింది.
నాన్నా! మరి మీ గుండెల్లోంచి అలా రక్తం ధారగా ఎలా వచ్చింది? అని ఎంతో ఆసక్తితో అడిగింది కూతురు సుప్రజ. చూడు సుప్రజ నేను సైంటిస్ట్ని, పైగా మీ నాన్నని, తెలివైనవాడిని కూడా. రక్తం ధారగా వచ్చేందుకు ఒక కెమికల్ ట్యూబ్ని కన్పించకుండా ఏర్పాటు చేసుకున్నాను. నాకు తెలుసు ఏ క్షణంలోనైనా జగదీష్ నన్ను చంపేస్తాడని! అందుకే తెలివిగా ఈ ప్లాన్ చేశాను! అని అంటుండగా! అందుకే మీరు ఇంకొక జిలేబి తినాలి అంటూ వడ్డించింది భార్య ప్రసన్నాదేవి. ఒకటికాదోయ్ రెండు జిలేబీలు వడ్డించవోయ్ ప్రసన్నా అంటూ ప్రేమతో ఆ రోజు లంచ్ని హాయిగా ఆనందంగా ముగించారందరు.
ఐటి కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సుప్రజ సమాజసేవ చేస్తు ఒకరోజు గరీబ్ బస్తీలో చక్రవర్తికి బట్టలు, దుప్పట్లోతోపాటు ఆహార పదార్థాలు అందజేసింది. ఆ రోజు అతనిని గమనించింది, అతనిలో ఏదో ప్రత్యేకత ఉందని గ్రహించింది. దానికి ముఖ్యమైన కారణం చక్రవర్తి సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటాన్ని చూస్తూ కూర్చోవటమే.
అప్పటి నుండీ చక్రవర్తిని తరచు కలుస్తూ ఉండేది సుప్రజ. అతని ఆలోచనలను, ఆశయాలను అక్షర రూపంలోనికి తీసుకు వచ్చింది. ఎందుకో మరి సుప్రజతో పరిచయం వలన చక్రవర్తి జీవనంలో కొంగ్రొత్త చిగురుటాశలు అంకురించాయి. వారిద్దరి ప్రేమాలతగా వెనకేసుకుపోతోంది.
చక్కూ! కంగ్రాట్స్ లేషన్స్! వచ్చేవారం అమ్మా నాన్న నువ్వు నేనూ అందరం కలిసి ఢల్లీి వెళుతున్నం అంటూ అమితానందంతో చక్రవర్తిని హత్తుకుపోయింది సుప్రజ.
అసలు ఇదంతా ఏమిటీ అంటూ ఉక్కిరి బిక్కిరైపోయాడు చక్రవర్తి. పొల్యూషన్ నివారణకు నీవిచ్చిన పరిష్కార సూచనకు నీకు ప్రధానమంత్రిగారు అవార్డు ఇవ్వబోతున్నారు. అంతేకాదు, నీతోపాటు నాక్కూడా అవార్డు వస్తోంది తెలుసా! అని సుప్రజ చెప్పేసరికి చక్రవర్తి అమితానందభాష్పాలతో ఉక్కిరిబిక్కిరయ్యాడు.
ఒక్కసారిగా అమ్మా నాన్ననూ, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారిని స్మరించుకున్నాడు చక్రవర్తి.
అపరిశుభ్రతో విజృంభించే అంటువ్యాధులు రాకుండా ‘‘స్మార్ట్మెడిసిన్ టానిక్’’ కనిపెట్టిన సైంటిస్ట్ ప్రజాపతిని అవార్డుతోపాటు పదిలక్షల నగదు పురస్కారంలో సన్మానించారు ప్రధానమంత్రి.
పెట్రోల్, డిజిల్ మోటార్ వాహనాలు వాడకంతో వచ్చే కార్బన్మోనాక్సైడను బయటకు రాకుండా ప్రతీ వాహనానికి ఒక సిలెండర్ ఏర్పాటు చేసుకోవచ్చుననే అద్భుతమైన పరిశోధనకు చక్రవర్తిని అవార్డుతోపాటు, పదిలక్షల రూపాయలు నగదు పురస్కారంతో సన్మానించారు ప్రధానమంత్రి.
దోమలను, అంటువ్యాధులను తక్షణమే నివారించటానికి చెత్త, చెదారములను ‘‘ప్రతిరోజు శుభ్రపరచండి, చెత్తను తక్షణమే తరలించండి’’ అనే స్పాట్ పేమెంట్ ప్లాన్ అచరణయోగ్యంగా ఉందని సుప్రజను పురస్కారంతో సన్మానించారు ఆరోగ్యశాఖామంత్రి.
మానవ కళ్యాణానికి కోసం మరియు అభివృద్ధికి మాత్రమే పరిశోధనలు, ఆవిష్కరణలు చేయాలని, అంతేకాని వినాశకర ప్రయోగాలను చేసేవారిని ప్రభుత్వం తప్పకుండా శిక్షిస్తుంది అని ప్రధాని హితవు పలికారు.
జగదీశ్ చేపట్టిన మానవ వినాశకర, దురాలోచన ప్రయోగాలకు రెండు సంవత్సరాలు జైలుశిక్ష పడిరది.
అసలు పెళ్ళే చేసుకోనన్న చక్రవర్తి సుప్రజ ప్రేమలో పడ్డాడు, అలాగే ఆమె వద్ద కడుపునిండా చదువుకున్నాడు.
తన జీవితంలో ఇల్లే కట్టలేమన్న చక్రవర్తి ఇల్లు కూడా కట్టుకున్నాడు, ఒక ఇంటివాడయ్యాడు. చక్రవర్తి సుప్రజల కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. ఇది చాలా అరుదైన, ఆదర్శమైన కళ్యామని ప్రశంసించారు ప్రముఖులు మరియు పెళ్ళివారు.
ఇది ‘‘స్మార్ట్మెడిసన్ టానిక్’’ దీని ఖరీదు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే! ఇది జనరల్ టానిక్. ఆరోగ్యం కోసం అందరూ త్రాగవచ్చు అని చెప్పి టానికి బాటిల్ని అల్లుడు చక్రవర్తికి కానుకగా అందించారు ప్రసన్నదేవి, ప్రజాపతి దంపతులు.
పెళ్ళివారే సాక్షాత్ కళ్యాణదేవతలై సుమాక్షతలతో ఆశీర్వదించారు.
‘‘ప్రజాహితమును కోరినవాడే ప్రజాపతి.’’
ప్రజాపతి
previous post
1 comment
డాక్టర్ కొండపల్లి నివారణి గారికి నమస్కారము
నా కథ ఁపజాపతిని ఁపచురించినందుకు ధన్యవాదాలు. శుభాకాంక్షలతో….
కొండుారి కాశీ విశ్వేశ్వర రావు