Home పుస్త‌క స‌మీక్ష‌ రంగరాజు పద్మజ అందించిన జయలక్ష్మి సాహితి భక్తి భండారి

రంగరాజు పద్మజ అందించిన జయలక్ష్మి సాహితి భక్తి భండారి

by Sammeta Vijaya

   పరిశోధనాత్మకంగా చేసిన వీరి రచన డేంకణి  కోట కీర్తిశేషులు శ్రీమతి జయలక్ష్మి గారి గురించిన రచన.  భక్తి భంఢారి  సాహిత్య సంభారి శీర్షికలోనే జయలక్ష్మి గారు ఒక భక్తి   భండారమని సూచించారు . శ్రీ జిఎస్ స్వామి మంగళాశీర్వచనంతో  ఆచార్య వెలుదండ నిత్యానంద రావు గారి నిర్మల చరితం పేరుతో చక్కని సమీక్షతో ప్రారంభమైంది వీరి రచన.  ఆచార్య వెలుదండ  నిత్యానంద రావు గారు అన్నట్లు రంగరాజు పద్మజ గారు ఎంతో ప్రతిభ పూర్వకంగా ఔచిత్యం, ఆంతర్యం, సారం  ఏమాత్రం చెడకుండా సుదీర్ఘ వర్ణనలను కుదిస్తూ సరళా కృత వ్యవహారికానువర్తనం చేసి విద్వజ్జనుల ఆమోదం పొందారని చెప్పిన వాక్యాలు అక్షర సత్యాలు.

    డాక్టర్ సూరం శ్రీనివాసులు గారు ఏ యే ప్రకరణాన్ని  రంగరాజు పద్మజ గారు ఎలా పరిచయం చేశారో వివరిస్తూ పాఠకులకు వడ్డించిన విస్తరిలా రచించారని ప్రశంసించారు. చక్కని శైలి అవసరానికి మించని వ్యక్తికరణలతో జీవిత సాహిత్య గ్రంథ రచనలకు మార్గదర్శకంగా సాగిన గ్రంథమని ఆదర్శవంతమైన అనుశీలన అని  అభివర్ణించారు.

    ఆచార్య ఇ సత్యనారాయణ గారు ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు  రచించిన ముందు మాటలు డేంకణి కోట తాముండే కుప్పం దగ్గరలోని అని చెబుతూ ఈ రచన ద్వారా బడిలో పెద్దగా చదవని జయలక్ష్మి గారు చేసిన వేలాది రచనలు మనకు తెలిసేలా రంగరాజు పద్మజ గారు చేశారని ఆనాటి సామాజిక కట్టుబాట్ల మధ్య మహిళా సాధికారికత  సాధించిన మహిళ జయలక్ష్మి అన్న విషయం తెలిసిందని అన్నారు.

    అయినంపూడి శ్రీలక్ష్మి గారు అక్షరయాన్  వ్యవస్థాపక అధ్యక్షురాలు రచించిన ముందుమాటలో అసలు ఎవరు ఈ జయలక్ష్మి అంటూ ఒక పరిశోధక విద్యార్థిలా  జయలక్ష్మి గారి గురించి వివరాలు సేకరించి రచించారని ఎన్నో సంవత్సరాల క్రితం ప్రారంభమైన కథని అనేక విషయాలు తెలుసుకొని కష్టపడి రచించిన రచన అని ఆ సామర్థ్యం రంగరాజు పద్మజ గారిలో పరిపూర్ణంగా ఉండడం వల్లనే అక్షరయాన్  మాతృ వందనం పురస్కారంతో సత్కరించామని అన్నారు.

జయలక్ష్మి గారి సంతానం కూడా తల్లిని గురించిన మనోభావాలను ముందుమాటలో పంచుకుంటూ హైదరాబాద్ నుంచి హోసూర్ కు వచ్చి మా తల్లి గారి గురించి వివరాలు సేకరించి క్రోడీకరించి రాయడం పట్ల ముగ్గులై రంగరాజు పద్మరాజు గారి శైలికి ధారణా శక్తికి  ఆశ్చర్య పడుతూ పుస్తకం తీసుకురావడంలో తోడ్పడిన అయినంపూడి  శ్రీలక్ష్మి గారికి సహకారం అందించిన శ్రీ అరుణ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.  రంగరాజు పద్మజ గారు ప్రచురించిన అక్షరాలు జయ లక్ష్మమ్మకు స్వర్గ కానుకలు గా భావించారు.

డా కొండపల్లి నిహారిణి  తన ముందు మాటలో  పుస్తకం శ్రద్ధగా చదివి ఆనందిస్తూ తరిగొండ వెంగమాంబ మంజరి ద్విపద లో రాసిన ఆ లక్షణాలను వీరి రచనలో చూడవచ్చు అన్నారు  భక్తి దారుల్లో పయనించిన రంగరాజు పద్మజ గారు  భక్తి బండారి 300 పైగా పేజీలతో జీవిత చరిత్ర నా నవలనా  అని ఆసాంతం  చదివింపజేసే రచనగా రచించారని అదే రంగరాజ పద్మజ గారి గొప్పతనం అని అన్నారు.70 వ దశకం లో వీరి ఈ  రచన తప్పక చదవాలని సూచించారు

    ఆప్త వాక్యం పలుకుతూ రంగరాజు పద్మజ గారు ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక రచయిత్రి ఆత్మకథ దీనిని ఆ భగవంతుడే నా చేత రాయించాడని అన్నారు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

    పుస్తకం లోపలికి ప్రవేశిస్తే ఇది మొత్తం ఆరు ప్రకరణాలుగా రూపొందించబడింది మొదటి ప్రకరణంలో జయలక్ష్మి గారి జీవితం గృహిణి ధర్మం జీవితంలో ఒడిదుడుకులు సాహిత్య రచనపై ప్రవేశం కలిగించిన అంశాలున్నాయి రెండవ ప్రకరణంలో ద్వాదశి మణిమాలలను గురించి రాశారు అప్పటికి తెలుగు రాక తమిళ లిపిలో రాసుకున్నవి కూడా కొన్ని ఉన్నాయి. మూడవ ప్రకరణంలో జయలక్ష్మి గారు రచించిన ఖండకావ్యాలు శ్రీరామ కథామృతం శ్రీమద్ భాగవత ఆణిముత్యాలు పరిచయం ఉంది నాలుగవ ప్రకరణములు రంగరాజు పద్మజ గారు జయలక్ష్మి గారు రచించిన అనుభవాలు వారి కుమారులు చెప్పిన అనుభవాలను వివరించారు ఐదవ ప్రకరణంలో ఆ అనుభవాలు కొనసాగిస్తూ వీరి కుమారులు చెప్పిన అంశాలను ఎక్కువగా ప్రస్తావించారు ఆరవ ప్రకరణంలో శ్రీమతి జయలక్ష్మి గారి సాహిత్య జీవనం సమీక్షాత్మకంగా రచించారు.

    డేంకణి కోట  కోట జయలక్ష్మి గారు 1923 లో జన్మించారు సరిగా 102 సంవత్సరాల అయింది 27 లో స్వర్గస్తులయ్యారు 94

    సంవత్సరాల నిండు జీవితం బాల్యంలో పదేళ్ల నుంచి గో సేవ పాలు కాయడం పెరుగుచిలకడం వెన్న తీయడం పిడకలు చేయడం ఇల్లు అలకడం వాకిలి చిమ్మి ముగ్గులు వేయడం వంటివి ఆ కాలంలో అందరి స్త్రీల వలి చేశారు కానీ ఇదే నా జీవితం ఇంకా ఏదో ఉందని అనుకున్నారు అలా అనుకోవడమే ఈరోజు మనం ఆమె గురించి ముచ్చటించుకునే దశకు చేరుకుంది.

      ఆ కాలంలో ఉన్న మహిళలలో అరుదుగా కనిపించే విదుషీమణి జయలక్ష్మి గారు.  ఈ పుస్తక రచన రంగరాజు పద్మజ గారు రాయడానికి ఎందుకు పూనుకున్నారంటే  మనలో కొందరు కవిత్వం రాస్తారు కొందరు నవలలు కొందరు పద్యాలు కొందరు నాటికలు కానీ అన్ని ప్రక్రియలను సృజించిన కవయిత్రి  జయలక్ష్మి  గారు.

ఆమె జీవిత చరిత్ర ద్వారా రచయిత్రి రచనా కాలంలో సామాజిక గమనం పరిణామాలు స్త్రీలు వంటగదికే పరిమితమయ్యే కాలంలో అనేక రచనలు చేసిన మహిళా మణి గురించి రాయడం వల్ల ఈ రచన ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆశాభావంతో రంగరాజు పద్మజ గారు ఈ రచన చేశారు .

     జయలక్ష్మి గారి తల్లిదండ్రులు వెంకటరమణ అయ్యగారు లక్ష్మీ గారు జయలక్ష్మి గారి కుమారులు శ్రీరామమూర్తి గారు శ్రీ శ్రీనివాసన్ గారు వీరి కుమార్తె రమామని గారు జయలక్ష్మి గారు సింగమనే గ్రామంలో తిరువన్నామలైకు దగ్గరలో ఉన్న గ్రామంలో అమ్మమ్మ గారింట జన్మించారు. జయలక్ష్మి గారు ఉన్నది తమిళనాడులో . అక్కడ గ్రామ పాఠశాలలో మూడవ తరగతి అవగానే బడి మాన్పించారు అంతకుమించి వయసుగల వారిని బడికి పంపరాదు అని నియమం.

 అప్పటి కాలంలో చిన్న వయసులోనే వివాహాలు జరిగేవి. తనలో ఒక భావన వెంకటేశ్వర స్వామి తన భర్తని దానికి తగినట్లు ఆమెకి చూసిన సంబంధం వరుడు వెంకట రామయ్య గారు వారు చదివింది ఎస్.ఎస్.ఎల్.సి చివరికి తన భర్తని వెంకటేశ్వర స్వామి అనుకున్నారు జయలక్ష్మి గారికి నలుగురు సోదరీమణులు. అక్కడ పేదరికంతో పెరిగి మెట్టినింట కూడా అదే కొనసాగి అత్తింటి ఆరళ్లతో అనారోగ్యం పాలయ్యింది. జయ లక్ష్మీ గారి భర్త ఇంట వారి దూరపు బంధువు అమ్మాళమ్మ గారు భర్త మరణించి వీరింట చేరారు.  మరో బంధువు సుందరయ్య కూడా వారింట ఉండేవారు. భర్త వెంకటరామయ్య గారి కుటుంబంలో వారి తల్లిదండ్రులు రామక్కమ్మ వెంకటసుబ్బయ్య గార్లు.. వారికి నలుగురు కొడుకులు ముగ్గురు కూతుర్లు అందులో పెద్ద కొడుకు  వెంకట రామయ్య గారు వారి భార్య జయలక్ష్మి గారు. వెంకటసుబ్బయ్య గారి పెద్ద కూతురు లక్ష్మికి ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుర్లు .ఐదవ సంతానం 15 రోజుల బిడ్డగా ఉన్నప్పుడు లక్ష్మీ గారు మరణించారు వారంతా వెంకటసుబ్బయ్య గారి ఇంట్లో చేరారు.  రెండవ కూతురు అన్నపూర్ణమ్మ ఇద్దరు కొడుకులు ,ఒక కూతురు . ఆమె కూడా కూతురు జన్మించాక మరణించారు.  ఆ పిల్లల పోషణ కూడా వీరిదే సరిగ్గా జయలక్ష్మి గారి వివాహమై కోడలుగా వచ్చాక ఆ ఇంట్లో ఐదుగురు మేనల్లుళ్లు ,ముగ్గురు మేనకోడళ్ళు ,తన వయసున్న ఆడపడుచు తనకన్నా పెద్దవారైనా ఇద్దరు మరుదులు అత్తగారు మామగారు ఇంతకు పూర్వం మనం చెప్పుకున్న అమ్మాళమ్మ, సుందరయ్య వెరసి 17 మంది. మీరు కాకుండా వచ్చే పోయే బంధువులు. అన్ని పనుల భారం తన మీద పడేది. చెప్పుడు మాటలు విని భర్త కూడా ఆమె మనసును గాయపరిచేవారు . ఎవరికోసం బతకాలి అనే ఆలోచన మారేగానపల్లెలో అనుకొని గడిపారు జీవితం.

 భర్త అక్కడ నుంచి బెంగళూరులో ఉపాధ్యాయులుగా చేరారు. భర్త అక్కడ భార్య ఇక్కడ చాకిరీ చేస్తూ వారి ఇంట్లో ఉన్న అమ్మాళమ్మ గారు జయలక్ష్మి గారిని చెంగం  గ్రామానికి వెళ్లి సాకమ్మ రామాయణం రాసుకోమన్నారు అమ్మాళమ్మ ,  సుబ్బాలమ్మ ఇద్దరి వద్ద సాకమ్మ రామాయణం నేర్చుకున్నారు జయలక్ష్మి గారు. అక్కడ భార్య శ్రమను గుర్తించి వెంకట రామయ్య గారు జయలక్ష్మి గారిని బెంగళూరుకి తీసుకొచ్చారు.  అది చిన్న ఇల్లు దేవుడి గదిలేక వంటగది గోడకి బొట్టు పెట్టి అదే దేవుడిగా భావించే ఆమె అది చూసి వారి బంధువు ఒకతను రాముల వారి పటం తెచ్చి ఇచ్చాడు. అదే ఈనాటికీ వారి కుటుంబం పూజిస్తున్నారు. ఒక స్నేహితుడు వచ్చి భర్త మనసు మార్చి జయలక్ష్మి గారిని బాధింప చేయగా తాను ఆత్మహత్యకు కూడా పూనుకొనే  ప్రయత్నం చేశారు అని తెలిపారు రంగరాజు పద్మజ గారు.

   సాకమ్మ జయలక్ష్మి గారి బంధువే ఈ కథనాలు లో సాకమ్మ  వృత్తాంతం ఉంది తనకు నిద్రలో సరస్వతి దేవి నాలుక మీద రాసిందని సాకమ్మ చెప్పగా అందరూ సాకమ్మని గొప్ప దానివవుతామని భావించారు వీరి యక్షగానంలో ద్విపదలు పాటలు కీర్తనలు, పద్యాలు, భజనలు ఉంటాయి మచ్చుకి ఒక ఘట్టం హనుమంతుడు ఉంగరం అందుకుంటున్న ఘట్టాన్ని మనం గమనించినట్లయితే..

ఉంగరమా ఉంగరమా ముద్దుటుంగరమా !
ఓ తరుణీ నిన్నెడబాయనని పలుమారు బాసచేసెనే
ఉంగరమా ముద్దుటుంగరమా!
ఏక పత్నీవ్రతుడ నేను
ఏలా వగపు నీకు అనెనే
ఉంగరమా ముద్దుటుంగరమా అంటూ గమ్మత్తుగా సాగుతుందీ యక్షగానం.

   ఈ పుస్తకంలో జయలక్ష్మి గారి అందమైన చూచి రాతతో తాను స్వయంగా రాసిన పేజీలను జోడించడం పుస్తకానికొక వన్నె తెచ్చింది . సాకమ్మ యక్షగానం రామాయణం అంకితం వివరాలను కూడా పొందు పరిచారు.

    జయలక్ష్మిగారు భరించిన కష్టాలలో కొన్ని ఇంట్లో ఉన్న అమ్మాళమ్మగారు తన కూతురు మనవరాళ్ళు మరణిస్తే జయలక్ష్మి గారి రాక వల్లే ఇలా జరిగిందని ఆడిపోసుకున్నారు. ఆమె మానసికంగా చాలా కృంగి పోయారు . తన మూడవ కూతురు జన్మించి కొన్ని నెలలకే చనిపోవడంతో ఆ బాధలు మరింత పెరిగాయి. అయినా ఇంటిల్లిపాదికీ సేవలు చేసారు. 95 ఏళ్ల వరకు చైతన్య వంతంగా గాన మాధుర్యంలో తేలిపోతూ జీవించారు తళి అనే గ్రామంలో ఈ సమీపంలో వేణుగోపాల స్వామి శ్రీరాముని గుడులు ఉండేవి అక్కడకు వెళ్లి పద్యాలు కీర్తనలు పాడితే విజయలక్ష్మి గారికి పిచ్చి పట్టిందని అనుకున్నారంతా భూతవైద్యాన్ని పిలిపించి వైద్యం చేయించారు కూడా ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండగా పక్కన ఉన్న డేంకణి కోటకు బదిలీపై వచ్చారు. అక్కడ ఆమె భర్త ఇద్దరు కూతుర్లతో జీవనం గడపగా క్రమంగా ఆమె ఆరోగ్యం మెరుగైంది .1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడే ఆమె బాధలకు విముక్తి కలిగిందని రచయిత్రి చెప్పడం ఔషధంగా అనిపించింది.

   తన దైనందిక దినచర్యను రంగరాజు పద్మజ గారు చాలా స్పష్టంగా తెలియజేశారు పనివారు లేకుండా సమస్తము చేసుకుంటూ మధ్య మధ్య యక్షగానాలు ఆలపించే వారిని అందరికీ తన పాటలతో మేలుకొలుపులు పాడేవారని సూర్యుడికి , వీరుడికి  మేలుకొలుపులు తులసికి మేలుకొలుపులు కూడా పాడేవారు.

కరిమిప్ప బృందావనం ఎవరింట్లో ఉన్నాను
లేచి మొక్కిన వారి పాపములు పోవును
తులసమ్మ మేలుకొనవే తులసమ్మ మేలుకొనవే
కృష్ణ తులసి మేలుకొనవే
రామ తులసి మేలుకొనవే
లక్ష్మీ తులసి మేలుకొనవే
మేలుకొనవమ్మా తులసమ్మ మేలుకొనవే !

   ఉదయం లేవగానే తన పక్కన ఉన్న నోట్ బుక్కులో ఆల్వారులు,  రుక్మిణమ్మ,  అయ్యంగార్లు కొందరినీ స్మరించుకునేవారు. ఆఖేట వెంకటేశ్వరుని పూజించేవారు పండుగలు పూజలు వ్రతాలు చేసేవారు పది రోజులలో పూర్తి రామాయణం పారాయణం చేసేవారు.  త్యాగయ్య పురందరదాసులు రచించిన కీర్తనల మాదిరిగా తాను ఆఖేట  వెంకటేశ్వరునిపై  కీర్తనలు రాయడానికి పూనుకున్నారు.  అలా రాసిన ఓ భాగం…

రవితేజడు నీవని రామానుజల పలుకు
ఆదినారాయణడని హనుమంతుని పలుకు
వాసు దేవుడవు నీవని వైద్యుని పలుకు
డేంకణీ  ధరుడవు  నీవని జయ విజయులు పలుకు
మేలుకో శ్రీ బేటనాథా  మేలుకో!

     ఒక ప్రవాహంలా  ఉండేది జయలక్ష్మి గారి రచనలు భర్త సహకారం జయలక్ష్మి గారికి ఉండేది ఆమె తమిళంలో రాసిన వాటిని వెంకట్రామయ్య గారు తెలుగులో చేతితో రాసేవారు తన చేత్తో ఆ బేటనాథుని సుప్రభాతాన్ని రాసి అందరికీ పంపి సమీక్షించమని వారు ఒక కుమ్మరి పిల్లవాడు కూడా తెలుగులో ఆమె రచనలు రాసేవాడు జయలక్ష్మి కుమారులు కూడా కొంత భాగాన్ని తెలుగు లిపిలో రాశారు రకరకాల ఛందస్సు ఉపయోగించి పద్యాలను రచించారు తల్లిని అనుసరించి కూతురు రమామణి గారు ప్రహేళికలు ద్విపద పద్యాలు రచించారు.  ఆమె సోదరులు తల్లి రచనలను విశ్లేషించి ఎన్నో పుస్తకాలు ముద్రించారు జయలక్ష్మి గారు రచించిన కీర్తనలను బంధువుల ఇంట్లో ఇళ్లలో మహిళలు నేర్చుకొని పాడేవారు ఇంత గొప్ప సమాచారం అంతా మొదటి ప్రకరణలో అమర్చారు. రంగరాజు పద్మ గారు ఆమె జీవితం తెలుసుకుంటే ఆ తర్వాత ఆమె కృషి మనకు మరింత సునాయాసంగా అర్థమవుతుందని వారి ఆశాభావం

రెండవ ప్రకరణంలో జయలక్ష్మి గారు రచించిన వివిధ కీర్తనలతో పాటు ఛందస్సు తెలుసుకొని 108 కి పైగా పద్యాలు రచించారు ఎక్కువ భాగం కందపద్యాలే. కందం రాయడం కష్టమైన పని అంటారు కానీ జయలక్ష్మి గారు సులువుగా రచించారు.

   పద్యాలను 108 కూర్చి 12 శతమని మాలలను ద్వాదశ శతకమని పేరుతో గ్రంథం గా తయారు చేశారు అరవిందమనే ప్రథమ శత మణి మాల కల్యాణోత్సవ ఉయ్యాల పాట గమనించినట్లయితే

  కుందనంపు కాళ్ళ చప్పరమందు
  పొందినటి నీలముల గొలుసుతోను
  అందమగు వజ్ర వేదిక మీద
  ఆఖేట నాథా నీవు ఉయ్యాలలూగు
అని  రచించారు .ఈ విధంగా ఒక్కొక్క శతమణి మాలకు ఒక్కొక్క పేరు అరవింద ,కదంబ ,నీలోత్పల ,కుండము ,చందూరము, వకుళ మాలిక,  మాలతీ మాల, మాధవి మాల, చంపకమాల సేమంతీక మాల ,పారిజాతమాల, తులసిమాల అనే ద్వాదశ శతమణి మాలలను ద్వితీయ ప్రకరణములో  పొందుపరిచారు.

    హృదయ ప్రకరణంలో ఖండకావ్యమని కొమ్మలు భాగవత ఫలాలు , అంతర్యామి అలసితి సొలసితి, సృష్టి సాకే నటరా మధురైన అంశాలను వివరించారు ఈ ప్రకరణంలో అంతర్యామి అలసితి సొలసితిలో   14 – 8 డా- 2017 న చివరి దశలో ఆమె పక్కన శ్రీనివాసన్ ,నరసింహన్ కుమారులు ఉన్నారని తెలియజేశారు.

     చతుర్ధ ప్రకరణములు అనుభవాలు జ్ఞాపకాలు పిల్ల తెమ్మెరలు

వరుసగా వివిధ సందర్భాలలో జయలక్ష్మి గారి అనుభవాలను వేంకటేశ్వరుని సాక్షాత్కారమును వెలుగు రేఖ కనిపించడం వంటి వాటితో విషాద పరిచారులలో రమామని రామమూర్తి శ్రీమతి ఉషా రామమూర్తి జానకి నరసింహ వీరంతా కుటుంబ సభ్యులు తమ అనుభవాలను పంచుకున్నారు ఏ విధంగా నడుస్తున్న చరిత్రలో వ్యాసం ప్రచురింపజేసారో వివరించారు.

    ఐదవ ప్రకరణంలో పట్టి కలలో వచ్చిన పుస్తక ఆవిష్కరణల వార్తలు జయలక్ష్మి గారిని ప్రశంసిస్తూ వచ్చిన కథనాలు పద్య పుష్పాంజలి శతజయంతి సంచిక శ్రీరామ కథామృతం జయలక్ష్మి గారి ఇంటర్వ్యూలు అన్ని పత్రికలలో వచ్చిన వాటి వివరాలను పొందుపరిచారు చేతిరాతతో రాయించి పుస్తకాలు ముద్రించి వేయ ప్రయాసలతో పుస్తకావిష్కరణలు చేయించారు ద్వాదశ శతమణి మాల సిడిలను ఆవిష్కరించారు.

    అస్వస్థులై 25 -1 – 2006న వేంకట రామయ్య గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు తర్వాత ఈ పుస్తకంలో ఇదే ప్రకరణలో జయలక్ష్మి గారి వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించారు.

     షష్ఠమ ప్రకరణంలో ఆసక్తి కలిగించే అంశం ఆ కాలంలో అది తమిళనాడు తెలుగులో డిటిపి అందుబాటులో లేదు తమిళ మాధ్యమంలో చదివిన సంతానానికి రెండవ కుమార్తె రమామని పెద్ద కుమారుడు రామమూర్తిలకు మాత్రమే తెలుగు చదివారు 1988లో శ్రీ పెరంబదూర్ ఆది కేశవ పెరుమాళ్ దేవాలయ జీయర్ గారు దేనికని కోట ప్రవచనాలు చేయడానికి ఆకీట వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చి కొడుకు నరసింహాని చూపించిన జయలక్ష్మి గారి రాతప్రతి  చదివి పుస్తకం ప్రచురించినప్పుడు స్వయంగా ముందుమాట రచించడం ఇది గొప్ప ఆశీర్వచనం.

     నడుస్తున్న చరిత్ర పత్రికలో  తిరువళ్లిన్నేణి  మహత్మ్యం  అని వ్యాసం ప్రచురించబడింది. డేంకణి  కోట వెంకటేశ్వర స్వామి సుప్రభాతం తమిళం తెలుగు సంస్కృత భాషలలో టీకా తాత్పర్య సహితంగా ముద్రించబడింది.2007 లో ఆఖేట వేంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి అది దేవాలయంలో ఆవిష్కరణ జరిగింది సుప్రభాతం సిడి సౌమ్య అనే గాయని చేత పాడించి సిడి రూపంలో విడుదల చేశారు 2018లో నిహాల్ స్వరంలో అష్టోత్తర శతనామావళి ఆడియో విడుదల  చేశారు ఆంధ్రజ్యోతిలో వీరి గురించి ముఖాముఖి వచ్చింది.

     జయలక్ష్మి గారి రచనలు మొదటి గ్రంథం ద్వాదశ శతమణి మాలలు 12 శతకమణులు  సంపుటి దీని ప్రత్యేకత ఏమిటంటే ప్రథమ తృతీయ దశమ ఏకాదశ ద్వాదశ శతమణులు కీర్తనలు . ద్వితీయ పంచమ, షష్ఠమ,  సప్తమ ,నవమ శతమణులు తెలుగు పద్యాలు శతమణి మాల పాశురము అనే తమిళ భాష రూపంలో ఉంది.

    మరొక ప్రత్యేక రచన శ్రీరామ కథామృతం 2019లో వెలువడింది మధ్య పుష్పాంజలి అనే పుస్తకం వందలాది కవీశ్వరులు జయలక్ష్మి గారి రచనలను అభినందించి వ్రాసిన పద్యాలు.

         ఈ విధంగా 39 సంవత్సరం నుండి రచనలు చేయడం ప్రారంభించిన జయలక్ష్మి గారు  12 శతకాలు ఐదు కావ్యాలు శ్రీరామ కథామృతం 30 ప్రబంధాలు కథనాలు 600 వరకు కీర్తనలు సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి , మంగళ శాసనం కరావలంబ స్తోత్రం మొదలైనవి రచించారు.  స్థల చరిత్ర సంక్షిప్తంగా పద్యాల రూపంలో సమగ్రంగా వచనంలో రచించారు.

    మరొక విశేషం తెలుగు భాషలోనే కాదు సంస్కృతం తమిళ కన్నడ భాషలలో కొన్ని కీర్తనలు పద్యాలు సెయ్యుళ్ళు  రాసారు. విశేషమైన వీరి కృషిని ఈ రకంగా దేనికని కోట కీర్తిశేషులు శ్రీమతి జయలక్ష్మి గారి గురించి భక్తి బండారి సాహిత్య సంబారి అనే శీర్షికతో ఒక పరిశోధనాత్మక గ్రంథానికి ఏ మాత్రం తీసుకోకుండా తమిళనాడు ఉన్న తెలుగు దేశాన్ని ఆమె సాహితీ సంపత్తిని మన ముందుకు తీసుకువచ్చారు రంగరాజు పద్మజ గారు .

   ఆమె శైలి సులభంగా అలతి అలతి పదాలతో అలవోకగా ఆద్యంతం చదివింపజేసింది.  తీసుకున్న ఇతివృత్తం ఎవరికి తెలియని ఒక విజ్ఞాన ఖనిని  అక్షరార్చనతో మన ముందు నిలబెట్టింది జయలక్ష్మి గారి రచనల  జాబితా లెక్కలేనంత ప్రింట్ లో ఆరు పేజీల వరకు ఉంది.

    ఆమె చేసిన సాహితీ కృషి అనన్యం అద్వితీయం అటువంటి మహత్తర మనిషి జీవితాన్ని రచనలను వెలుగులోకి తెచ్చిన రంగరాజు పద్మజ గారు అనే అనేక అనేక అభినందనలకు పాత్రులు ఈ పుస్తకం వెలికి తెచ్చిన కుమారులు పుస్తకం ఆవిష్కరణ అధ్యక్షత బాధ్యతలను చేపట్టి రంగరాజు పద్మజ గారిని గౌరవించిన అక్షర అధినేత్రి అయినంపూడి శ్రీ లక్ష్మీ గారికి మన పూర్వక అభినందనలు. వారి కుటుంబ సభ్యులకు శుభాభినందనలు. ఆశీస్సులు.

   మనం నిత్యం అనే కానేక సమస్యలతో సతమతమవుతూ ఉంటాం సమస్యలు లేనిది ఎవరికి ? కొందరికి కొంచెం. మరికొందరికి పుట్టెడు. ఎన్ని ఉన్నా మన సంకల్పంతో తాను దైవాన్ని నమ్మి 95 సంవత్సరాలు యక్షగానాలతో కీర్తనలతో పద్యాలతో సుప్రభాతాలతో,  అష్టోత్తరాలతో , రామ గానామృతంతో అనేక రూపాలుగా తన హృదయం తన అక్షరం పరిపూర్ణం చేసుకొని మనందరికీ ఆదర్శప్రాయంగా స్ఫూర్తిదాయకంగా నిలిచిన డేంకణి  కోట కీ.శే. శ్రీమతి జయలక్ష్మి గారికి  స్మృత్యంజలి  ఘటిద్దాం.

   .

You may also like

3 comments

Destiny892 November 25, 2025 - 11:43 pm Reply
Alexis3779 November 27, 2025 - 6:53 am Reply
Peyton1319 November 27, 2025 - 2:35 pm Reply

Leave a Reply to Alexis3779 Cancel Reply