రామప్ప శిల్పబంధం ఎన్నో విషయాలు చెప్పిన కొండపల్లి శేషగిరిరావుగారు ప్రపంచం మెచ్చిన ప్రఖ్యాత చిత్రకారులు . ఆయన కుంచె దించిన రంగుల్లో ఒదిగిన ప్రకృతి అందాలు గాని, ప్రబంధ నాయికానాయకులుగాని మనను ముగ్ధులను చేసినవే. ఆయన గీసిన రేఖాచిత్రాలలో దాగిన భారతీయ శిల్పసంపద మన చూపులను కట్టిపడేసేవే.
1940 దశకంలో కొండపల్లివారు విద్యార్థిగా ఉన్నప్పుడే కాకతీయ శిల్ప సంపద వైభవాన్ని , ప్రత్యేకంగా రామప్ప శిల్పకళను రేఖాచిత్రాలుగా చిత్రించి సభ్యసమాజానికందించారు. మారుమూల అడవి ప్రాంతం . జనసమ్మర్ధమైన స్థలకాదు. అంతగొప్ప దేవాలయం అక్కడ ఉన్నదని ఆనాడు ఎవరికీ ఎక్కువ తెలియదు. ఫోటో కెమెరాలు ఇంకా తెలంగాణ లో అడుగుపెట్టని ఆ కాలంలో హైదరాబాద్ లో ఉన్న ఆనాటి సాహితీవేత్తలకూ, సాధారణ ప్రజలకు కొండపల్లి శేషగిరిరావు గారి చిత్రలే రామప్ప శిల్ప సౌందర్యం పరిచయం చేసాయి. వారి రేఖాచిత్రాలు మచ్చుకు కొన్ని మయూఖ పాఠకులకు – మన తెలంగాణ ప్రతికలోని కొండపల్లి శేషగిరిరావు రామప్ప గురించిన వ్యాసం ప్రచురితమైంది.




