Home ఇంద్రధనుస్సు శ్రీ యాదాద్రీశ వైభవమ్‌

లోకానీకావనౌకం సకల భువనభు క్సత్ర సంత్రాణ తంత్రం

కారుణ్యార్ణోధినాధం ఘనరవవిలస న్నూపురాసాదపాదం

తాటంకద్యోత కర్ణం విషగళసుషమా తాండవానంద కందం

వందే యాదక్షమాభృత్‌ కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహమ్‌ !

తాత్పర్యం: సమ్తలోకాలను సంరక్షించే ఆశ్రయముÑ సకల భువనా(లోకా)లను లయమొందించేవాడు, నిరంతరము పోషించి రక్షించేవాడుÑ కరుణ అనే సముద్రానికి ప్రభువైన (అధిపతిjైున) వాడుÑ విశేషమైన శబ్దాలను వెలువరించే ప్రకాశిస్తూన్న అందెలను అలంకరించుకున్న పాదము(లు) కలవాడుÑ తాటంకముల (చెవికమ్మల) చేత అందమును సంతరించుకుని ప్రకాశిస్తున్న చెవులు కలవాడుÑ శ్రీకంఠుని పరమశోభాకరమైన తాండవనాట్య సమయంలో కలిగే ఆనందానికి మూల(కారణ)మైనవాడు అయిన శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామివారిని నమస్కరిస్తున్నాను.

విశేషాలు: లోకం అంటే ఇంద్రియగోచరమైన ఈ సమస్త చరాచర స్థావర జంగ మాత్మకమైన, ఎనభై నాలుగు లక్షల జీవరాశికి నిలయమైన, సంపూర్ణ సృష్టి అని చెప్పవచ్చు. సాధారణ మానవుడికి ఇంద్రియ గోచరమైన ఈ లోకం అంతా కలిసి ఒక బ్రహ్మాండంగా పిలవబడుతున్నది. ఋషివరేణ్యుల జ్ఞానచక్షువులకు ఎన్నో కోట్ల బ్రహ్మాండాలు కనిపిస్తుంటాయి.  వాటినే అనేక కోటి బ్రహ్మాండాలని జ్ఞానులు చెప్తుంటారు. (లోకGఅనీకGఅవనGఓకంR) అటువంటి లోకానీకములను, అనేక కోటి బ్రహ్మాండాలను (అవనR) రక్షించటానికి (ఓకంR) చక్కని, ఏకైక ఆశ్రమైనవాడుÑ (సకలGభువనR) సమస్త లోకాలను (భుక్‌R) భుజించటం అంటే మహాప్రళయకాలంలో తనలో లీనం చేసుకునేవాడు విష్ణుమూర్తి! అంతేనా? (సత్రR) ఆ లోకాలన్నిటినీ పోషించి, శరణమిచ్చి, రక్షణ కల్పించి, వాటికి తానే ఆశ్రయంగా నిలిచినవాడు. సత్రం అంటే  తగిన దక్షిణ లిచ్చి సతతము అన్నదానం చేయటం అని కూడ అర్థం! పూర్వం ఋషులు సత్రయాగం చేశారని పురాణాల్లో పేర్కొన్న దీ యాగాన్నే!, ఇంకా (సంత్రాణR) చక్కగా రక్షించటం అనే (తంత్రంR) కుటుంబ భరణ వ్యాపారాన్ని, పనిని, చేసేవాడు శ్రీలక్ష్మీనరసింహస్వామివారు.

సృష్టి, స్థితి, లయ కార్యాలకు మూలమైనవాడు విష్ణుమూర్తియే కదా!Ñ తనను ఆశ్రయించిన, ఆపన్నులైన భక్తజనులను, విపత్తుల నుండి కాపాడి (కారుణ్యGఅర్ణోధినాధంR) దయతో బ్రోచే కరుణాసముద్రానికి అధినాథుడుÑ (ఘనGరవGవిలసత్‌G నూపురGఆసాదGపాదంR) విశేషంగా మంజులనాదాన్ని వెలువరిస్తూ, మిక్కిలి సౌందర్యవంతములైన అందెలచేత (మంజీరాలచేత) అలంకరింపబడిన పాదాలు కలిగినవాడుÑ (తాటంకGద్యోతGకర్ణంR) శోభాయమానములైన చెవికమ్మలచేత ప్రకాశిస్తూన్న చెవులు కలిగినవాడుÑ (విషగళGసుషమాGతాండవGఆనందGకందంR) విషగళుడు శంకరుడు. సకలలోక శుభంకరుడైన శంకరుడు దివసావనాన సమయంలో అంటే సాయంసంధ్యా సమయంలో తాండవ నృత్యం చేస్తూ

ఉంటాడంటారు. (విషగళR) హాలాహల విషాన్ని తన కంఠసీమలో నిలుపుకుని శ్రీకంఠుడనే నామధేయాన్ని సార్థక పరచుకున్నవాడు శివుడు! అందుకే ఆయన శివుడు R మంగళకరుడైనాడు. శివుడు మనోజ్ఞమైన తాండవ నృత్యాన్ని చేస్తూంటే కలిగే ఆనందం ఇంతటిదని చెప్పడానికి వీలు కాదు! దాన్ని ఆనంద తాండవమంటారు. అదే బ్రహ్మానందం కంటే అతీతమైనది. అటువంటి ఆనందం కలగటానికీ, కలిగించటానికీ మూలమైనవాడు శ్రీలక్ష్మీ నరసింహస్వామివారు. శ్రీ యాదగిరిపై నెలకొని తన పటుభుజబలంతో విక్రమిస్తున్న శ్రీలక్ష్మీనరసింహస్వామిని కవి తన సుధామధుర కవితారస ధారాపూరంతో నమస్కరిస్తున్నాడు.

 

శ్రీ యాదాద్రీశ వైభవమ్‌`12

మాకందామంద సానంద మృదుమధు సుధాగాధ మాధుర్యసూక్తిం

అస్తోకాభ్యస్త కస్తూరిక మలయజ సంలిప్త దీప్త స్వరూపం

దేహత్విడ్ధూత మిత్రం స్ఫురదురు స్రగ్ధారణం ముక్తకాయం

వందే యాదక్షమాభృత్కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహమ్‌ !

తాత్పర్యం: మామిడి పండ్ల (రసం) వలె అత్యధికమై, ఆనందభరితమై, మృదువుగానూ మధురంగానూ ఉండే అమృతాయమానములైన ` అగాధములై, మధురములైన సూక్తుల చేత అలరారేవాడుÑ విశేషముగా కలుపబడిన కస్తూరి మరియు గంధములను శరీరముపై లేపనము చేయడము వలన ప్రకాశిస్తున్న స్వరూపం కలవాడుÑ తన దేహకాంతి చేత తిరస్కరింపబడిన సూర్యుడు కలవాడుÑ ప్రకాశవంతమైన గొప్ప మాలికను ధరించినవాడుÑ శరీరబంధము లేనటువంటివాడు యాదాద్రిపై నెలకొని తన బలిష్ఠములైన భుజముల బలపరాక్రమాలను ప్రదర్శిస్తున్న శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని నమస్కరిస్తున్నాను.

విశేషాలు: పండ్లల్లో మామిడి పండు చాలా విశిష్టమైనది. దాని రంగు`రుచి`వాసన అంటే ఇష్టపడని వాళ్ళెవ్వరూ

ఉండరు. అటువంటి మామిడి పండ్ల రసంతో శ్రీలక్ష్మీనరసింహస్వామి (విష్ణుమూర్తి) అవతారగాథల్ని ఉపమిస్తున్నాడు కవి. (మాకందR) మామిడిచెట్టు, దీనినే రసాలము అని కూడా అంటారు. మామిడి పండ్ల రసం వలె (అమందR) అత్యధికమైన ఆనందంతో కూడినవీ ` అంటే మిక్కిలి ఆనందాన్ని కలిగించేవీ (Rసానంద), (మృదు మధుR) మృదుత్వాన్ని కలిగి ఉండటమే కాకుండా అత్యంత మధురంగానూ ఉండేవీ, (సుధాGఅగాధR) అమృతపానం వలె గాఢమైన పరమానందాన్ని కలిగించేవి విష్ణుమూర్తి కథలు! ఆ కథలలో హరి చరిత్రను వర్ణించిన (మాధుర్యR) మధురరసభరితమైన (సుGఉక్తింR) మంచి మాటలు కలవాడు! అంటే అంతటి మృదు మధురమైన సూక్తుల చేత (మంచి మాటల చేత) హరిగాథలు వర్ణింపబడినవి. విష్ణుమూర్తి యొక్క (సూక్తిR) మాటలు కూడా అంతటి మాధుర్యం కలిగినవి అని కూడా చెప్పవచ్చు!

(అస్తోకGఅభ్యస్తR) విశేషముగా శ్రేష్ఠములైన అంగరాగాలను (సుగంధభరితములైన పూతలను దేవతలు, రాజులు మొదలైనవారు అనాదిగా వాడటం మన సంప్రదాయం. ప్రత్యేకంగా విష్ణుమూర్తి అలంకార ప్రియుడు! ‘‘కస్తూరీ తిలకం లలాటఫలకే…. సర్వాంగే హరిచందనం చ కలయన్‌…..’’ అంటూ శ్రీకృష్ణపరమాత్మను వర్ణించారు కదా! (కస్తూరికG మలయజR) కస్తూరి మృగం నాభి నుండి ‘కస్తూరి’ అనే సుగంధ ద్రవ్యం లభిస్తుంది. ఇది పరిమళభరితమైనదే కాకుండా ఎన్నో రకాల రోగాలను దూరం చేయగల ఔషధ ద్రవ్యం కూడా! మలయజం అంటే మలయపర్వతంపై విశేషంగా పెరిగే శ్రీగంధపు చెట్టు. అందుకే మలయపర్వతం వైపు నుండి శ్రీగంధ వృక్షాల మీదుగా వీచే గాలిని ‘మలయపవనా’ లని సుగంధ భరితమైన గాలిగా వర్ణిస్తారు. అటువంటి శ్రేష్ఠములైన కస్తూరినీ, శ్రీగంధాన్నీ కలిపి (సంలిప్తR) చక్కగా శరీరానికి లేపనంగా వాడటం వలన (దీప్తGస్వరూపంR) దేదీప్యమానంగా వెలిగే శరీరం కలిగినవాడు శ్రీలక్ష్మీనరసింహ స్వామి.

(దేహ త్విట్‌GధూతGమిత్రంR) తన దివ్యదేహం నుండి వెలువడే కాంతి (ప్రకాశం) సూర్యకాంతిని కూడ తిరస్కరించే విధంగా ఉన్నదట! చక్కగా సౌందర్యవంతమైన గొప్ప మాల (వనమాల) ధరించాడు స్వామి.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ముక్తకాయుడు. శరీరం అశాశ్వతమైనది. శరీరధారులెవ్వరూ స్థిరంగా ఉండరు. ఏదో ఒకనాడు శరీరత్యాగం చేయక తప్పదు. అవతారమూర్తి అయిన లక్ష్మీ నరసింహుడు అటువంటి అస్థిరమైన శరీరాన్ని (కాయాన్ని) ధరించినవాడు కాదు. శరీరాకృతితో కనిపించేది అతని అపరిమిత తేజోమూర్తి మాత్రమే! అందుకే ఆయన ముక్తకాయుడు! శ్రీ యాదగిరిపై నెలకొని తన అవక్ర పరాక్రమంతో భుజబల ప్రదర్శన చేస్తున్న శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని తన అజరామరమైన కవితా పుష్పాలచేత అర్చించి నమస్కరిస్తున్నాడు కవి.

 

శ్రీ యాదాద్రీశ వైభవమ్‌`13

శ్రీదం మోదం దవాదం నతజనవిహితం చిత్స్రవంతీనగాహం

దారిద్య్రార్తి ప్రవిచ్ఛేదన ఘనకరుణాధీన చేతోంబుజాతం

మేశం కాశప్రకాశం మితవచన మఘక్లేశనాశావకాశం

వందే యాదక్షమాభృత్కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహమ్‌ !

తాత్పర్యం: సంపదలను ఇచ్చేవాడు, తన భక్తులకు సంతోషాన్నీ ` ఆనందాన్ని ప్రసాదించేవాడు, దావాగ్నిని మ్రింగినవాడు, తనను ఆశ్రయించిన భక్తజనులకు విశేషమైన హితాన్ని (మేలును) చేకూర్చేవాడు, తన భక్తులైన సాధకులకు కలిగిన జ్ఞాన (చైతన్య) ప్రవాహాన్ని అడ్డుకునే అజ్ఞానం అనే పర్వతాలను సంహరించేవాడు, దారిద్య్రం వలన కలిగే బాధలను ఛేదించగల గొప్ప కరుణ అనే గుణానికి లొంగిన హృదయపద్మం కలవాడు, లక్ష్మీదేవికి భర్త, రెల్లుపూవువలె తెల్లనైన విశేష ప్రకాశం కలవాడు, మితంగా మాట్లాడేవాడు, పాపం అనే దుఃఖాన్ని నాశనం చేయగలవాడు అయిన యాదగిరిపై నెలకొని తన బలిష్ఠములైన భుజముల బలాన్ని ప్రదర్శిస్తున్న శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని నమస్కరిస్తున్నాను.

విశేషాలు: లక్ష్మీనాథుడైన విష్ణుమూర్తి స్థితి కారకుడు. సమస్త సృష్టికీ అవసరమైనవాటిని అన్నిటినీ సమకూర్చి రక్షించేది  ఆయనే! అందుకే విష్ణువు (శ్రీదంR) శ్రీని ` ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు. అంతేకాదు! (మోదంR) ఆయన అన్నిటికంటే మిక్కిలి గొప్పవైన సంతోషాన్నీ ` ఆనందాన్ని కూడా అనుగ్రహిస్తాడు. ఆనందమే మోక్షం కదా! శ్రీహరి మోక్షస్వరూపి! ముక్తి కంటే భక్తులకు కోరుకోవలసింది ఇంకేముంటుంది? (దవాదంR) దవం అన్నా దావం అన్నా కార్చిచ్చు అని అర్థం. శ్రీకృష్ణావతారంలో ఒక రాక్షసుడు కార్చిచ్చు రూపంలో తనను సంహరించటానికి వస్తుంటే ఆ దావాగ్నిని మ్రింగివేశాడు బాలకృష్ణుడు. అందుకే విష్ణువు దవాదుడు అయినాడు!

విష్ణుమూర్తి భక్తజన పరాధీనుడు! అందుకే (నతజనGవిహితంR) తనను ఆశ్రయించిన భక్తులకు మిక్కిలి హితకరమైన వాటిని మాత్రమే ఆచరిస్తాడాయన! భక్తులు, సాధకులు శ్రీహరి సేవకోసం, ఆయన సాన్నిధ్యం కోసం, ఆయన దర్శనం కోసం నిరంతరం పరితపిస్తూ ఉంటారు. ‘‘జ్ఞానా దేవ హి కైవల్యం’’ అని వేదాంతులు సిద్ధాంతీకరించారు. జ్ఞానసాధనా మార్గంలో ఎన్నో ఆటంకాల్నీ, సమస్యల్నీ నిరంతరం ఎదుర్కొంటూనే ఉంటారు సాధకులు. కాని వారి ప్రయత్నాల్ని విరమించరు. వారికి భగవత్తత్త్వాన్ని తెలుసుకునే ‘జ్ఞానం’ ఉదయించి (చిత్‌Gస్రవంతీR) జ్ఞాన ప్రవాహంగా మారి భగవంతుని వైపు ప్రవహిస్తుంటే మధ్యలో ఆ ప్రవాహాన్ని అడ్డుకోవటానికి (నగR) విఘ్నాల (అజ్ఞానం, మోహం, అరిషడ్వర్గాలు) మొదలైన రూపాలలో (నగాR) పర్వతాల వలె ఎదురుపడి నిరోధిస్తుంటాయి. ఆ విఘ్న పర్వతాల్ని (హంR) నిర్మూలించేవాడు, రాకుండా ఆజ్ఞాపించేవాడు విష్ణుమూర్తి.

‘‘యస్యానుగ్రహ మిచ్ఛామి తస్య విత్తం హరా మ్యహం’’ అన్నాడు శ్రీకృష్ణపరమాత్మ. భక్తుల హృదయాలను పరీక్షించటం కోసం కష్టాలను కల్పించి, వాటిని ఎదిరించి నిలువగల శక్తిని ఇచ్చి, వారికి కావలసిన బుద్ధి పరిపక్వతను కలిగించేవాడూ విష్ణుమూర్తే కదా! చివరికి అడుగడుగునా తన భక్తులకు కలిగిన (దారిద్య్రGఆర్తిR) ఎన్నో రకాల దారిద్య్ర బాధలను, కష్టాలను (ప్రవిచ్ఛేదనR) నాశం చేసి రక్షిస్తాడు. అంతటి (ఘనGకరుణాధీనR) గొప్ప కరుణకు వశమైన (చేతఃGఅంబుజాతంR) హృదయ కమలం కలిగినవాడు శ్రీలక్ష్మీనరసింహుడు! ఆయన (మాGఈశంR) శ్రీలక్ష్మికి ప్రభువు, ప్రాణవల్లభుడు! (కాశGప్రకాశంR) రెల్లుపూవు తెల్లగా, నిర్మలంగా ఉంటుంది. ఆవిధంగానే స్వామి కూడా స్వచ్ఛమైన గొప్ప కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన (మితGవచనంR) చాలా పరిమితంగా మాట్లాడేవాడు. చేయవలసిన పనిని నిరాఘాటంగా సకాలంలో చేసేవాడు. భక్తజనులకు కలిగే (అఘR) తెలిసికాని, తెలియక కాని చేసిన పాపాల వలన కలిగే (క్లేశR) దుఃఖాలను, కష్టాలను (నాశR) నశింపజేయటంలో (అవకాశంR) చొరవను తీసుకునేవాడు. యాదాద్రిపై నెలకొని తన బలీయములైన భుజబలపరాక్రమాల్ని ప్రదర్శించే అటువంటి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని కవిగారు తన మృదుమధుర మంజుల వచః ప్రసూన మాలికతో అర్చించి, నమస్కరిస్తున్నారు.

 

శ్రీ యాదాద్రీశ వైభవమ్‌`14

బ్రహ్మాండోత్తేజమూర్తిం త్రిభువన జనన త్రాణ సంహారమూర్తిం

దేవేంద్రాగణ్యమూర్తిం దివిజ గరుడ గంధర్వ దుర్భేద్యమూర్తిం

శ్రేయ స్సంధానమూర్తిం భృశ విశద యశోవ్యాప్త దిక్చక్రమూర్తిం

వందే యాదక్షమాభృత్కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహమ్‌ !

తాత్పర్యం: ఈ భూగోళానికంతటికీ తన కాంతిచేత వెలుగును అందించే దివ్యమూర్తీÑ మూడు లోకములను (సమస్త సృష్టినీ) పుట్టించి, పెంచి, చివరికి తనలో లయం చేసుకునే మూర్తీÑ దేవేంద్రాదుల చేత కూడ లెక్కించడానికి అశక్యమైన మూర్తీÑ దేవతలు, గరుడగంధర్వాదుల చేత కూడ భేదింపనలవి కాని మూర్తీÑ సకల చరాచర సృష్టికీ శ్రేయస్సు (మేలు)ను కలిగించే మూర్తీÑ తన మేర మీరిన, నిర్మలమైన యశస్సును (కీర్తిని) దశదిశలా వ్యాపింపజేసిన మూర్తీ అయిన ` యాదాద్రిపై వెలసి తన పటుతరమైన భుజబలాన్నీ, విక్రమాన్నీ ప్రదర్శిస్తున్న ` శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని నమస్కరిస్తున్నాను.

విశేషాలు: స్థావర ` జంగమాత్మకమైన ఈ సమస్త సృష్టిలోను (బ్రహ్మాండమంతటా) చైతన్య స్వరూపిjైు ఉండేవాడు పరమాత్మ. ముఖ్యంగా సూర్యుడు, చంద్రుడు, అగ్ని తేజ స్స్వరూపులై సమస్త సృష్టినీ వెలిగిస్తున్నారు. అటువంటి సూర్య చంద్రాదులకు శక్తిదాతjైు, వారిని కర్తవ్యోన్ముఖులుగా చేసేవాడు పరమాత్మ. తైత్తిరీయోపనిషత్తు`ఆనందవల్లిలో ఇదే విషయం ఈవిధంగా ప్రస్తావించబడిరది. ‘‘భీషాస్మా ద్వాతః పవతే, భీషోదేతి సూర్యః, భీషాస్మా దగ్ని శ్చేంద్రశ్చ, మృత్యు ర్ధావతి పంచమ ఇతి’’. ఈ బ్రహ్మము యొక్క భయము వలననే వాయువు వీచుచున్నది. సూర్యుడు ఉదయించుచున్నాడు. ఇతని భయము వలననే అగ్నియు, ఇంద్రుడును తమ తమ విధులను నిర్వర్తించుచున్నారు. ఐదవవాడగు మృత్యువు (యముడు) కూడ ఈ పరమాత్మ భయము వలననే స్వకార్యమును నిర్వర్తించుచున్నాడు. సృష్టిలోని సమస్త శక్తులకు చైతన్య ప్రదాత పరమాత్మ (విష్ణువు) కాబట్టి అతనికి ఆ నియామక శక్తి లభించింది. (బ్రహ్మాండGఉత్తేజGమూర్తి(ం)R) ఈ బ్రహ్మాండానికంతకూ ప్రేరేపక శక్తిగా, ఉద్దీపక మూర్తిగా నిలుస్తున్నాడు శ్రీలక్ష్మీనరసింహస్వామి.

శ్రీలక్ష్మీనరసింహ స్వామి (త్రిభువనGజననGత్రాణGసంహారGమూర్తి(ం)R) ఈ మూడు లోకాలనూ తన సంకల్ప బలంతో సృష్టిస్తాడు. వాటిని పోషించి, రక్షించి, పుష్టిని చేకూరుస్తాడు. కాలం తీరి, శరీరం త్యాగం చేయవలసిన సమయంలో వాటిని సంహరించి తనలో లీనం చేసుకుంటాడు. సృష్టి`స్థితి`లయ కార్యాలను చేసే దివ్యమూర్తి లక్ష్మీనృసింహుడు!

శత్రు సంహారం కోసం అవతరించిన స్వామి (దేవేంద్రGఅగణ్యGమూర్తి(ం)R) దేవతలకందరికీ ప్రభువైన ఇంద్రుడికి కూడ గణింపశక్యం కానటువంటి సర్వశక్త్యతీత శక్తి మూర్తి! అందుకే (దివిజGగరుడGగంధర్వGదుర్భేద్యGమూర్తి(ం)R) దేవతలకు, గరుడ గంధర్వాదులకు కూడ ఎదిరించి, భేదింపశక్యం కానటువంటి శరీరము (స్వరూపము) కలిగిన వాడాయన! తనను శరణుపొంది, ఆశ్రయించిన భక్తజనులకు నిరంతరమూ ఆయన (శ్రేయస్‌GసంధానGమూర్తి(ం)R) సకలవిధ శ్రేయస్సులనూ, శుభాలనూ కలిగించగల కరుణామయమూర్తి! (భృశGవిశదGయశోGవ్యాప్తGదిక్‌Gచక్రG మూర్తి(ం)R) మేరమీరిన, అత్యంత నిర్మలమైన ఆయన కీర్తి దశదిశలా వ్యాపించింది. అటువంటి నిర్మల యశశ్శరీరము కలిగినవాడు శ్రీలక్ష్మీనరసింహస్వామి.

సర్వాతీతమైన, అనంత శక్తిమంతమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మాండానికి ఉత్తేజాన్ని కలిగిస్తూ, సృష్టి`స్థితి` లయకారకుడై, దేవేంద్రాది సమస్త దేవగణాలకు కూడా దుర్భేద్యమూర్తిjైు`అందరికీ సేవింపబడుతూ, అందరిచే సకల శ్రేయస్సులనూ కలిగిస్తూ, తన నిర్మలకీర్తి దశదిశలా వ్యాపించగా ‘‘శ్రీలక్ష్మీ నరసింహుని’’గా యాదాద్రిపై వెలసి, తన బలిష్ఠ భుజబల పరాక్రమాలను ప్రదర్శిస్తూ, భక్తుల మ్రొక్కులందుకుంటున్నాడు. అటువంటి స్వామిని సుందర పద బంధ పాదారవిందాలచే అర్చించి, నమస్కరిస్తున్నాడు కవి.

 

శ్రీ యాదాద్రీశ వైభవమ్‌`15

శోచిష్కేశ ప్రతాప ప్రశమిత మహిమాహస్కరం విష్కిరాశ్వం

భిన్నాభిన్న ప్రసన్నాఖిల కలుషచయం స్విన్న సంఛన్న గండం

ప్రాశస్త్య స్తుత్య వస్త్వంబరమణి కనక ప్రీణిత క్షోణిదేవం

వందే యాదక్షమాభృత్కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహమ్‌ !

తాత్పర్యం: అగ్నిహోత్రుని వలె భరింపరాని తన గొప్ప ప్రతాపము చేత కిరణములనే గుఱ్ఱాలను చెదరగొట్టి సూర్యుని కాంతి మహిమ (గొప్పదనము)ను చల్లార్చిన (తగ్గించిన) వాడు, భిన్నాభిన్నములైన (భేదింపదగిన మరియు భేదింపరాని) సమస్తపాప సమూహములను తన దయచేత అణచినవాడు, చెమటచేత కప్పబడిన చెక్కిళ్ళు కలవాడు, శ్రేష్ఠములైన మరియు మెచ్చుకోదగిన వస్తువులు, వస్త్రములు, మణులు, బంగారము మొదలైన వానిచేత సంతోషపెట్టబడిన బ్రాహ్మణు(డు)లు కలవాడు, శ్రీ యాదాద్రిపై వెలసి తన బలిష్ఠములైన భుజముల పరాక్రమము చేత ప్రకాశించుచున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని నమస్కరిస్తున్నాను.

విశేషాలు: శోచిస్‌ అంటే వెలుగు, ప్రకాశము, కాంతి, జ్వాల మొదలైన అర్థాలున్నాయి. అగ్నికి తన కాంతిమంతములైన జ్వాలలే కేశము (శిరస్సుపై పెరిగే వెంట్రుక) లని చెప్పబడ్డాయి. అందుకే అగ్నికి ‘శోచిష్కేశుడు’ అన్న పేరు కలిగింది. అగ్నికి సర్వభక్షకుడు అన్న పేరు కూడ ఉంది. అగ్నిహోత్రుడు దహింపలేనటువంటి వస్తువు సృష్టిలో లేదు. అతని కాంతి (వేడి) ని ఎవరూ భరించలేరు. కాని జీవులు చేసిన పాపాల సమూహాలను కాని, భక్తజనుల బాధల్ని కాని దహించగల శక్తి మాత్రం ఆ అగ్నిహోత్రుడికి కూడ లేదు. సృష్టిలో సర్వశక్తిమంతుడు శ్రీహరి మాత్రమే! ‘హరి ర్హరతి పాపాని’ అని కదా ఋషివచనం! అంతటి గొప్ప శక్తిశాలి అయిన శ్రీహరి తన అఖండమైన (శోచిష్కేశGప్రతాపR) (ప్రళయకాల) అగ్నిహోత్రముతో సమానమైన తన ప్రతాపము చేత (ప్రశమితGమహిమాGఅహస్కరంR) లోకాలకన్నిటికీ వెలుగునిచ్చే సూర్యుని గొప్పదనాన్ని (అత్యంత ప్రకాశాన్ని) తగ్గింపజేశాడు. సూర్యుని కిరణాలనే అశ్వాలుగా పేర్కొంటారు. అందుకే సప్తాశ్వుడు (సప్తసప్తి ర్మరీచిమాన్‌) అన్నపేరు సూర్యుడికి కలిగింది. సూర్యకిరణంలో (కాంతిలో) ఏడు రంగులున్నాయని విజ్ఞానశాస్త్రవేత్తలు నిరూపించారు. (విష్కిరGఅశ్వంR) అటువంటి సూర్యకిరణాలను (గుఱ్ఱాలను) తన ప్రతాపం చేత చెదరగొట్టినవాడు విష్ణుమూర్తి!

జీవులకు పాప`పుణ్యాలను కలుగజేసేవి వారు చేసే కర్మలే. జీవులు చేసే పాపాలు అనేకాలు. కొన్ని పరిహారం చేసుకోదగినవి (భిన్నాలు), కొన్ని (అభిన్నాలు) పరిహారం లేనివి. సాధారణ పాపాలు పరిహరించగలిగినవి. మహా (పంచమహా) పాతకాలు పరిహారం లేనివి. (భిన్నGఅభిన్నGప్రసన్నGఅఖిలGకలుషGచయంR) పంచమహాపాతకాలతో సహా సమస్తములైన భిన్నాభిన్న పాపసమూహాలను కూడ శమింప (పరిహరింప) జేయగల దయాళువు విష్ణుమూర్తి!

పరమభక్తుడు, బాలుడు అయిన ప్రహ్లాదుణ్ణి రక్షించటం కోసం నరసింహాకారంతో స్తంభం నుండి ఆవిర్భవించాడు విష్ణుమూర్తి. దానవ రాజైన హిరణ్యకశిపువును వధించిన సందర్భంలో ఆ స్వామివారు (స్విన్నGసంఛన్నGగండంR) చెమటచేత కప్పబడిన చెక్కిళ్ళు కలవారిగా దర్శనమిచ్చారు. స్వేదం శ్రమకు చిహ్నం! భక్త రక్షణ దీక్షాదక్షుడైన స్వామి ఎంతటి శ్రమనైన భరించటానికి వెనుకాడడని తన చెమర్చిన చెక్కిళ్ళ చేత లోకానికి తెలియజేస్తున్నాడు.

భక్తపాలనం వరదుని నిత్యకృత్యం! అనన్యచిత్తులైన తన భక్తులు తనను అడిగినా అడుగకున్నా వారి కోరికలన్నిటినీ తీరుస్తాడు స్వామి! కుచేలుడు శ్రీకృష్ణుని భక్తుడు, మిత్రడు. ఆయన తన బాల్యమిత్రుడైన శ్రీకృష్ణపరమాత్మను దర్శించాలని ద్వారకకు వచ్చాడు. శ్రీకృష్ణుని చేత సన్మానింపబడ్డాడు. కుచేలుడు అడగకపోయినా సరే శ్రీకృష్ణుడు అతనికి సమస్తమూ అనుగ్రహించాడు. (ప్రాశస్త్యGస్తుత్యGవస్తుGఅంబరGమణిGకనకR) ప్రశస్తములైన అందరిచేత స్తుతింపదగిన వస్తువుల్ని, విలువైన వస్త్రాలను, మణి మాణిక్యాలను, స్వర్ణరాశులు మొదలైన వాటిని అనుగ్రహించి, (ప్రీణితGక్షోణిదేవంR) భూసురుడైన కుచేలుణ్ణి, సంతోషింపజేశాడు. అదీ భక్తపరతంత్రుడైన విష్ణుమూర్తి గొప్పదనం, కరుణాపూరిత హృదయం! అటువంటి శ్రీలక్ష్మీ నృసింహస్వామి శ్రీ యాదాద్రిపై నెలకొని తన ప్రచండ భుజ పరాక్రమం చేత ప్రకాశిస్తూ అందరి పూజలు అందుకుంటున్నాడు. అటువంటి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి తన అక్షర ప్రసూనార్చన చేత నమస్కరిస్తున్నాడు కవి.

You may also like

Leave a Comment