Home వ్యాసాలు మా కుంభమేళా యాత్ర  రెండో భాగం

మా కుంభమేళా యాత్ర  రెండో భాగం

by Vijaya Kandala

 ప్రస్తుతం  ఏ న్యూస్ పేపర్ చూసిన  , వార్తా చానల్ చూసిన  ,యూట్యూబ్ ఛానల్ చూసిన కుంభమేళా _నాగ సాధువులు _అఖారాలు ర ప్రముఖుల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు , పిండ ప్రదానాలు , ఆధ్యాత్మిక వాతావరణం మన నలువైపులా  ఆవరించింది .  ఈ సమయంలో ప్రయాగరాజ్ _ హరిద్వార్ _ఉజ్జయిని _ నాసిక్ ప్రాంతాల నదుల్లోకి  అపరిమితమైన పాజిటివ్ ఎనర్జీ వచ్చి చేరుతుంది అని మన పెద్దలు చెప్పారు .  ఆ హరిద్వార్లో పుణ్యస్నానాలు చేయడానికి మేము ఆరుగురం కలిసి  హైదరాబాదులో బయలుదేరి మరునాటి సాయంకాలం హరిద్వార్ చేరుకున్నాం .

ఢిల్లీ రైల్వే స్టేషన్ లోనే  కొంచెం ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి  ,పక్కగా ఉన్న హల్దీ రామ్ వాళ్ళ హోటల్ గమనించి , టిఫిన్ చేయడానికి వెళ్ళాం . స్టేషన్లో లోపల తినలేము అనుకునే వాళ్లకు , నచ్చిన రుచులు కావాలి అనుకునే వాళ్లకు ఇది ఒక మంచి అవకాశం  . టిఫెన్స్ చాలా రుచిగా ఉండినాయి  . చాలా వేగంగా సర్వీస్ ఉంటుంది  .ఎన్నో   రకాలు  మనకు  దొరుకుతాయి  .బాగా రష్ గా కూడా ఉండింది  .టిఫిన్ చేసి కాసేపు సేద తీరి హరిద్వార్ బయలుదేరం.  ఢిల్లీలో చలి ఉంటుందని తెలుసు అయితే అంతకంటే ఎక్కువగా హరిద్వార్లో ఉండింది .  హోటల్లో దిగి ,లగేజ్  పెట్టేసి సాయంత్రం చుట్టుపక్కల తిరిగాము  .

తెల్లవారి  ప్రొద్దున్నే హ రి కి పౌరీ చేరి  అక్కడే స్నానాలు చేశాము . గంగమ్మకు భక్తితో నమస్కరించుకొని  ,నీళ్లలో దిగి పసుపు, కుంకుమ  రాగి నాణ్యాలు వేసి  నమస్కారం చేసుకొని స్నానాలు చేశాము . దగ్గర్లోనే బట్టలు మార్చుకోవడానికి తాత్కాలిక గదులు కూడా ఏర్పాటు చేశారు .

మరో ముఖ్య విషయం   నీటి వేగానికి తట్టుకుని   స్నానం చేయడానికి వీలుగా ఇనుప  గొలుసులు కూడా ఉన్నాయి . చాలామంది  ఒక చేత్తో గొలుసు పట్టుకుని ఇంకో చేత నీళ్లలో మునిగి లేచి స్నానా లు  చేశారు .

స్నానాఘట్టాల వద్ద  రద్దీగా ఉన్నా  చుట్టుపక్కల చాలా శుభ్రంగా ఉంది  .చెత్తాచెదారం  వెంబడి వెంబడే శుభ్రం చేస్తూ వచ్చారు  .పూజా ద్రవ్యాలు అమ్మే షాపులు , రంగురంగుల పూసలు  ,హారాలు  , అలంకరణ సామాగ్రి   ,శివలింగాలు , రుద్రాక్షలు కొనాలనుకుంటే ఎన్ని ఉన్నాయో చెప్పలేను .  కనులవిందు చేసేవి మరి ఇంకెన్నో . మా హోటల్ నదీ తీరానికి  చాలా దగ్గరలోనే ఉండింది . అందువల్ల మళ్లీ  హోటల్ కు  వచ్చి మానసా దేవి మందిరానికి బయలుదేరాం  . ఆ వెళ్లే దారిలో అన్ని ధర్మశాలలే .అవన్నీ  ఎంతో ప్రాచీనమైనవి . కనీసం 50 , 60 ఏళ్ల క్రితం  కట్టిన వాటిలాగా అనిపించేయి .  ధర్మశాలలు అన్నీ కూడా  చాలా పాతవి చక్కటి చెక్క పనితనం కనిపించిండి వాటిలో  . బాల్కనీలు అవి చూస్తే ఎంత ఆనందంగా ఉండిందో చెప్పలేను మన పూర్వుల భక్తి శ్రద్ధ  నైపుణ్యం చూస్తేఆశ్చర్యం తో బాటు ఆనందం  కూడా వేసింది .

మానసా దేవి మందిరం ఎంట్రన్స్ మా హోటల్ కి బాగా దగ్గర  అక్కడ  కొండ మీద  గుడి ఉంది . అలాగే మూడు కొండల మీద మూడు దేవాలయాలు ఉన్నాయి . ఒకటి మానసా దేవి మందిరం , రెండవది చండీ దేవి మందిరం . మూడవది అంజనమాత మందిరం . అలా మూడు ఉన్నాయి వీటిని రోప్ వి ల  పై చూడడం అపురూపమైన అనుభవం .  ఆంజనేయుల గుళ్ళు అనేకం కానీ ఆ తల్లి గుడి ఇక్కడే కనిపించింది . బహుశా నేనే ఇక్కడ మొదటిసారి గమనించి ఉంటాను . ధ్యానం చేసుకోవడానికి ఆ వాతావరణం అనుకూలంగా ఉండింది . ఐదు నిమిషాలు కళ్ళు మూసుకున్న చాలు గొప్ప ప్రశాంతత మన సొంతం   .మానసా దేవి మందిరం , చండీ మందిరం కొద్దిగా కో లాహలంగా ఉంటే ఇక్కడ ఒక అలోకి క వాతావరణం  ,నిశ్శబ్ద సంగీతం నాకు అనుభవంలోకి వఛాయి .

 మూడు చూసుకొని  మళ్లీ బయలుదేరి మా బసకు  దగ్గరలో ఉన్న హోటల్లో భోజనం చేసి కాస్త రెస్ట్ తీసుకుని , గంగాహారతిని చూడడానికి వెళ్ళాము  .ఎంత బాగుందో ఎదురుగా గంగమ్మ గంగకి ఎదురుగా వరుసగా మెట్ల మీద అశేష ప్రజానీకం చక్కటి భజనలు , సామూహిక జయ జయ డ్వానాలూ  కొత్త లోకంలోకి ప్రవేశించినట్లు అనిపించింది  .అందరూ కలిసి మనకు  జీవన ప్రదాతలైన జలసిరులకు మనసా వాచా కర్మణా నమస్కారం చేసే అద్భుత దృశ్యం అక్కడ చూసాం .  ఎందుకంటే మన జీవన విధానం వికసించిందినదీతీరాల్లోనే  . భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినట్లు గంగ భారతీయ ఆత్మ .

ఎంతో తృప్తితో బయటికి వచ్చి మా హొటెలకు బయలు దేరాము.

దారిలో వెచ్చదనాన్ని ఇచ్చే అనేక సాధనాలు  చూసాం. వేడి వేడి సమోసాలు  ,కచోరీలు , పూరీల అమ్మకాలు మరోపక్క  స్వెటర్లు బ్లాంకెట్లు స్కార్ఫ్లు బ్లౌజులు సాక్సులు ఇంకోపక్క డ్రై ఫ్రూట్ షాప్స్ అంతేనా . అంతేకాదు సుమ ఇంకా…

ఖరీదైన రాళ్లు  ,శంఖాలు , రుద్రాక్షలు , స్పటిక రస లింగాలు భగవంతుని పూజకు కావలసినటువంటి అనేకమైన సామాగ్రి  కోరినవన్నీ ఒకే చోట దొరికే కన్జ్యూమర్స్ పారడైజ్ అని చెప్పవచ్చు . ప్రతివారికి అవసరమైన వస్తువు అందుబాటు ధరలో దొరకడం ఇక్కడ ప్రత్యేకత  .షాపులుకూడా బాగా పొద్దెక్కాక తెరుస్తారు . రాత్రి పొద్దు పోయే వరకు పెద్ద పెద్ద బాణలిలో వేడివేడిగా వేగుతున్న సమోసా , రగడ , కచోరీ , గులాబ్ జాములురారమ్మని  అని పిలుస్తూ ఉంటాయి. రోడ్డు మీద నడుస్తూ ఉంటే  దాని నుంచి తప్పించుకోవడం కష్టమే  .ఆ చలికి ఈ వేడివేడి ఆహారం సరి అయిన జవాబు అనిపిస్తుంది చాలాసార్లు  .వాళ్ళు ఎంతో మర్యాదగా మనల్ని ఆహ్వానిస్తారు . షాపులోకి రమ్మని చెప్పే విధానం  బలే బలే నచ్చుతుంది .

రాత్రంతా అలా విహరించి లాడ్జికి చేరి అలసి సొలసి నిద్రపోయాం . తెల్లవారి పొద్దున్నే ఋషికేశ్ బయలుదేరామ్ . హరిద్వార్ పదహారేళ్ల పడుచు పిల్లలాగా చెంగుచెంగున గంతు లేస్తుంటే , అనుభవాల మంద గమనంతో భారంగా నడుస్తున్న మధ్య వయసు స్త్రీ లా కనిపిస్తుంది రిషికేష్  . అయితే హరిద్వార్  ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు  .పెద్ద వాణిజ్య కూడలి . అక్కడ టెక్స్టైల్ పరిశ్రమ విశ్వరూపం కనిపిస్తుంది   .రిషికేష్ లో కూడా త్రివేణి సంగమం ఉందంట . అక్కడికి వెళ్ళాక తెలిసింది . పైన ఉన్న నీలకంఠ మహేశ్వర్ దేవాలయానికి వెళ్ళాం . కొండపైన ఉంది  .ఆ కొండలే మన అహంకారానికి అడ్డు కట్టలు  . పెద్ద ఘాట్రోడ్  .ప్రాచీనమైన మందిరం .  క్రిందికి చూస్తే నయనం  దకర దృశ్యం . కొండనుండి కిందికి వచ్చి ఋషి కేష్ లో  స్నానం చేశాం . అప్పటికే 12:00 అయినట్టుంది అందువల్ల శరీరానికి అంత ఇబ్బంది కలగలేదు  .రోడ్డుకు రెండు వైపులా చిన్నచిన్న దుకాణాలు వాళ్ల కళ్ళల్లో మన పట్ల పెద్ద పెద్ద ఆశలు .

మళ్లీ వ్యాన్ లో కూర్చుని ఒక గంట ప్రయాణం చేసి ఇస్కాన్ వారి రెస్టారెంట్లో భోజనం చేసాం  .మెల్లిగా నడుస్తూ అక్కడి నుంచి పరమాత్మానంద ఆశ్రమం , గీతా ఆశ్రమం చూసుకుంటూ నడుచుకుంటూ జానకి జుల చేరుకున్నాం   . అక్కడ ఫోటోగ్రఫీ నిషిద్ధం  . జానకి ఝులా   ఫోటో  క్రింద ఈఆస్తాను . చూడండి .ఒకప్పుడు లక్ష్మణఝులా  వేరే ఎక్కువగా వినిపించేది . చెక్క వంతెన పై ఇప్పుడు చిన్న కంకర సిమెంట్ లాంటిది కలిపి రోడ్డు లా వేశారు  . చిన్న కదలిక అయినా అనుభవం బాగుంటుంది

ఇక్కడ అంటే రిషికేశ్లో ఒక విషయం గమనించాను . బేరం అనేది ఇక్కడ బాగా తక్కువ . అన్ని షాపుల్లో ఇంచుమించు ఒకే రేట్ చెప్తారు . అయితే ఎన్నిసార్లు అయినా వివరిస్తారు  .ఎన్ని వస్తువులు అయినా చూపిస్తారు  .

 మాయాదేవి మందిరం , దక్షిణేశ్వర్ మహాదేవ మందిరం చూసాము . చాలా బాగుందినవి .ఆరోజు అక్కడ ఎలక్షన్స్ జరుగుతుండె  . మా హోటల్ స్టేషన్ కి దగ్గరే .కానీ  లగేజ్ ఉంటుంది కదా  .సాయంత్రం ఆటో ట్యాక్సీ దొరకడం కష్టమని చెప్పారు చుట్టుపక్కల వాళ్ళు . అందువల్ల చాలా త్వరగా రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయాము . సాయంత్రం నాలుగున్నర గంటలకు బి కానిర్ ఎక్స్ప్రెస్ లో బయలుదేరి కురుక్షేత్ర దిగాము .  ఆ రోజంతా కురుక్షేత్ర  తిరగాలనుకున్నారాత్రి అయిపోయిన అందువల్ల మా  హోటల్ కి దగ్గరలో చుట్టుపక్కల కాస్త చూసుకుంన్నా ము.   ఇక్కడ పొద్దుటి పూట చలి ఎక్కువగానే ఉండింది .మొదలు చిన్న బ్రహ్మసరోవరం చేరుకున్నాం. ఇక్కడే దుర్యోధనుడు జల స్తంభన విద్యతో నీటిలో దాగి  ఉన్నాచోటని చెప్పారు . స్వచ్ఛంగా శుభ్రంగా నీళ్ళు బావుంది  .దానికి ఎదురుగా లక్ష్మీనారాయణ గుడి ఉంది  .అది చూసుకొని మళ్లీ బయలుదేరి పెద్దబ్రహ్మ మానస సరోవరం  వెళ్ళాము .కనుచూపుమేర నీళ్లు చల్లని గాలి అక్కడ   స్థానికులు గోధుమ పిండిని చపాతీ పిండిలా తడిపి పొడి పిండిలో దొర్లించి చిన్న చిన్న  గుండ్రెడ్డి బాల్స్ లాగా చేస్తారు .

ఈ చిన్నది గుండ్రటి బాల్స్ ని  నీళ్లలో విసిరేస్తే  చాలా తక్కువ ఖర్చు తో అపురూపమైన అనుభవాన్ని మన సొంతం చేసుకుంటాం  . నీటిలో మునిగి ముక్కుతో పట్టి గుటుక్కున మింగుతాయిబాతులు . చూడడానికి బాగుంటుంది 

ఆ తరువాత గీతోపదేశం జరిగిన  ప్రదేశానికి  వెళ్ళాము . ఫోటోలు క్రింద ఇస్తాను చూడండి . ఆ ముఖాల్లో హావ భావాలు ఎంత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయో . చివరికి గుర్రాలు కూడా ఓ నిమిషంలో మన మీదికి దుకాస్తయేమో అన్నంత సహజంగా ఉన్నాయి  . కదలికలను  ,వేగాన్ని కళ్ళ ముందర కళ్ళకు కట్టినట్టు నిలబెట్టిన అజ్ఞాత శిల్ప లకు పాదాభివందనాలు  . అంతకుమించి ఇంకేం చేయలేం కదా .

అక్కడే కూర్చుని గీతలో రెండు  అధ్యాయాలు మనసులో చదువుకున్నాను . ఆ తర్వాత జ్యోతి సర్ వెళ్ళాం అంటే పాండవులు ఆయుధాలు దాచిన స్థలం . అక్కడ భారీ ఎత్తున కృష్ణ భగవానుని విశ్వరూప దర్శనం మోడల్ ఉంది . అర్జునుడు  ఏమో కానీ మేము విభ్రాంతులమై అలా నిలబడిపోయాము .  లౌకికమైన అనుభూతికి అందని భావమది .

అక్కడ ఇంకో రెండు అధ్యాయాలు గీత చదువుకుని భీష్మ పితామహుడు అంప శయ్య మీద పడి ఉండిన ప్రదేశానికి వెళ్ళాం  .ఆ పక్కనే అర్జునుడు భీశ్ముని కోసం గంగను తెప్పించిన సంఘటనకు గుర్తుగా పాతది మెట్ల బావి కూడా అక్కడే ఉంది . డాన్ని బాణ గంగ అంటారు . అక్కడి నుంచి భద్రకాళి గుడికి వెళ్ళాము . సాధారణంగా మనం చూసేదానికి భిన్నంగా ఇక్కడ అమ్మవారు  శాంతంగా ప్రసన్న వదనంతో , చిరునవ్వుతో చక్కగా మనల్ని పలకరిస్తున్నట్టుగా , ఒక తల్లి అక్కడ ఎదురు చూస్తోంది మనకోసం అన్నట్టుగా అనిపించింది చూస్తుంటే  . ఆ పక్కనే చిన్న పద్మవ్యూహం టైపులో మెలికలు తిరిగిన దారి ఉంది. అలా తిరుగుతూ వచ్చి దర్శనం చేసుకోవాలన్నమాట  .అక్కడ ఒక చిన్న మంటపంలో పద్మవ్యూహం కూడా చిత్రించబడి ఉంది చివరిలో ఫోటో ఇస్తాను చూసుకోండి

ఒక విషయం నా దృష్టికి వచ్చింది యాత్రను ఇక్కడ ముఖ్యంగాఅంటే  కురుక్షేత్ర చు ట్టు పక్కల ప్రాంతాల్లో కాళీ దేవాలయాలు  ,కాలభైరవ ఆలయాలు చాలా కనిపించాయి  .అయితే ప్రధాన ఆలయం లేక ఉపాలయాల రూపంలో తప్పనిసరిగా ప్రతి గుడిలోనూ కా ళీ లేదా భైరవ ఆలయం కనిపించింది ఆ తృప్తిని గుండెల నిండా నింపుకొని కురుక్షేత్రం నుండి ఢిల్లీకి అక్కడి నుంచి హైదరాబాదు చేరుకున్నాము .

ఇక్కడితో కుంభమేళాలో పుణ్యా స్నానం చేయాలన్న నా పన్నెండేళ్ల కల తిరిగి  తీరింది .

అయితే యాత్ర విశేషాలు ఎప్పుడు సశేషాలే  . ఇదొక అనంత భావ స్రవంతి  .మరో ప్రయాణానికి బయలుదేరే వరకు ఈ విశేషాలు  మనసులో  మల్లెల పరిమళాలను వెదజల్లుతాయి .  తృప్తిగా  మరికొంత కాలం  ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి  .

 ఇక్కడితో  మా కుంభమేళా యాత్ర రెండవ మరియు చివరి భాగం పూర్తయింది  .

మరోసారి మరో మంచి అంశంతో కలిసే వరకు సెలవా మరి

మీ   విజయకందాళ

9912842104

You may also like

Leave a Comment