శ్లో. ఆచార్యాత్ పాదమాదత్తే
పాదం శిష్యః స్వమేధయా
పాదం సబ్రహ్మచారిభ్యః
పాదం కాలక్రమేణ చ
జ్ఞానమనేది నాలుగో వంతు గురువు గారి ద్వారా,మరో నాలుగో వంతు విద్యార్థి తన సొంత మేధస్సు ద్వారా,మరో నాలుగోవంతు తోటి మిత్రుల ద్వారా మరో నాలుగో వంతు లోకపరిశీలన ద్వారా లభిస్తుంది.అందుకు విజ్ఞాన విహారయాత్రలు దోహదం చేస్తాయి.చారిత్రక, ఆధ్యాత్మిక, విజ్ఞాన ప్రదేశాలను ప్రత్యక్షంగా దర్శించడం ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటారు. పాఠశాల లో పుస్తకాలలో చదివిన విషయాలను ప్రత్యక్షంగా చూడడం అనుభవించడం ద్వారా అనేక విషయాలు బాగా అవగతమౌతాయి. ఆనాటి చారిత్రక,సాంస్కృతిక, సాంఘిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయి. అందులో భాగంగనే 8 వ తరగతి తెలుగు పాఠ్యాంశం సముద్ర ప్రయాణం లో భాగంగా మా విద్యార్థుల చేత వారి విజ్ఞాన విహారయాత్రలు,వ్యక్తిగతంగా వివిధ ప్రదేశాల సందర్శన విశేషాలను రాయించడం జరిగింది.ఈ విజ్ఞాన విహారయాత్రలు పిల్లల కు విజ్ఞానంతో పాటు వినోదాన్ని ఉల్లాసాన్ని కూడా కలిగిస్తుంది.
వీటిని చదివి మా విద్యార్థులకు అభినందనలు ఆశీస్సులు,సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నాను
జి.లింగేశ్వర శర్మ
SA తెలుగు
జి.ప.ఉ.పాఠశాల రేగులపల్లి
చరవాణి.9603389441
సిద్దిపేట
నా ప్రయాణ అనుభవాలు
మేము అందరం రాత్రి పాఠశాలకు వచ్చాము. అంత లోపు టీచర్లు బస్సు తీసుకొని వచ్చారు. సామగ్రి సదిరి బస్సు ఎక్కించారు. అందరం పడుకున్నాము. మా బస్సు బయలు దేరింది. ఉదయం లేచేసరికి భద్రాచలం చేరుకున్నాము.భద్రాచలంలో ఆలయ మెట్లు ఎక్కి సీతారాముల దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత బస్సు ఎక్కి పాపికొండలకు వెళ్లి పడవ ఎక్కినాము పడవ ఎక్కిన తర్వాత పాటలు పెట్టారు.ఆటలు ఆడించారు. సరదాగా అల్లరి చేసుకుంటూ వెళ్ళాం. మధ్యలో ప్రాచీన శివాలయం ఉంది.కాలువలో కాళ్లు కడుక్కొని శివాలయంలో శివుడిని దర్శనం చేసుకుని పడవ ఎక్కాం. పడవలో ఆహారం పెట్టారు. తర్వాత పడవ ప్రయాణం మొదలైంది పాపికొండలు వచ్చాయి. అందరికీ కొండలు చూపించారు. తిరిగి ప్రయాణం చేశాం. ఈ ప్రయాణం ఒకరోజు పట్టింది. బస్సు ఎక్కి మేడారం వచ్చాము. మేడారంలో సమ్మక్క సారలమ్మ ల దర్శనం చేసుకొనేసరికి రాత్రి అయింది. మళ్ళీ బస్సులో రేగులపల్లికి బయలుదేరాము అర్ధరాత్రి పాఠశాలకు చేరుకున్నాం. మా సామగ్రినంత సర్దుకున్నాము.టీచర్లు తల్లిదండ్రులకు ఫోన్ చేశారు.వారు వచ్చి మమ్మల్ని ఇండ్లకు తీసుకొని వెళ్లారు.
యం.రమేష్
8 వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
గ్రా.రేగులపల్లి
మండలం బెజ్జంకి
మాభాగ్యనగర ప్రయాణ అనుభవాలు
మేము వేసవి సెలవుల్లో హైదరాబాద్ వెళ్ళాము ఆరోజు పొద్దున్నే లేచి స్నానం చేసి అన్నం తిని రేగులపల్లి నుంచి బయలుదేరాము. బస్టాండ్లో నిలుచున్నాము. పక్కన దుకాణంలో చిప్స్ ప్యాకెట్ కొనుక్కున్నాము. బస్సు రానే వచ్చింది. బస్సు ఎక్కినాము సీట్లు ఖాళీ లేవు.నిలుచున్నాము.బస్సులో ఎక్కువమంది సిద్దిపేటలో దిగేవాళ్లే. మాకు దేవుని దయవల్ల సిద్దిపేట లో సీట్లు దొరికినాయి. మధ్యాహ్నం మూడు గంటల 35 నిమిషాలకు హైదరాబాదులో దిగాము. ఇక్కడ ఆటో ఎక్కి మా బాబాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ అన్నం తినుకుంటూ సినిమా చూశాము. అక్కడ పది రోజులు ఉన్నాము. దాని తర్వాత దమ్మాయిగూడ వెళ్లాం. అక్కడ మా బాబాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ బజ్జీలు కొనుక్కొని ఇంటికి వెళ్ళాము. అక్కడ ఒక మూడు రోజులు ఉన్నాము. తర్వాత చార్మినార్ వెళ్ళాం. అక్కడ మొత్తం తిరిగాను. అక్కడ నేను చెప్పులు కొనుక్కున్నాను. ఆ తర్వాత మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ ఐదు రోజులు ఉన్నాము. ఆ తర్వాత ఆదివారం రోజున మా ఇంటికి బయలుదేరా అక్కడ బస్సు ఎక్కిన బస్సులో మక్క కంకి అమ్మే వాళ్ళు వచ్చారు. కంకి కొనుక్కొని తినుకుంటూ ప్రయాణం అయ్యాము. సిద్దిపేటలో దిగినాము.అక్కడ మాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఆటో ఎక్కి మా ఇంటికి చేరుకున్నాం. బి ప్రకాష్
8వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రేగులపల్లి
మండలం. బెజ్జంకి
హామీపత్రం .ఈ కథనం మా విద్యార్థి స్వీయరచన
ప్రయాణ అనుభవాలు
ఉదయం 3 గంటల 30 నిమిషములకు మా మామయ్య కారులో వచ్చాడు. మేము తయారు అయ్యాం. తయారైన తర్వాత బట్టలు సర్దుకున్నాం. బట్టలు సదురుకొని కారులో ఎక్కి బయలుదేరాము. కరీంనగర్లో ఆగాము. అక్కడ మా కారులో వచ్చిన కొందరు . కరీంనగర్లో దిగినారు వాళ్ళు దిగిన తర్వాత మేము కారుకు సిఎన్జీ కోసం తిరిగాము అక్కడ ఒక పెట్రోలు బంకులో సిఎన్జి ఉంది కానీ అక్కడ పనిచేసే వారు ఇంకా లేవలేదు. ఇంకొక పెట్రోల్ బంకులో సిఎన్జి ఉంది అక్కడ కూడా పనిచేసేవారు ఇంకా లేవలేదు. ఇంకొక పెట్రోల్ బంక్ లో సీఎన్జీ ఉంది వాళ్ళు ఒక అర్ధగంట ఆగి రమ్మన్నారు అంతలోపు మేము చాయ్ తాగి పెట్రోల్ బంకుకు వెళ్ళాం వాళ్ళు లేవలేదు వాళ్లను లేపి సీఎన్జీ కొట్టించాం. తర్వాత అక్కడి నుండి బయలుదేరిన తర్వాత కరెక్టుగా గంటన్నరకు గోదావరిఖనికి చేరుకున్నాం. అక్కడి నుంచి శ్రీరాంపూర్ వెళ్లేసరికి అర్థగంట అయింది. అక్కడి నుంచి భీమారం చేరే వరకు ఉదయం 6:00 అయింది అక్కడ పాల ప్యాకెట్లు, టిఫిన్ కొనుక్కొని వెళ్ళాము అక్కడి నుండి మా డాడీ కారు నడిపాడు. అక్కడ నుండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లినంక బ్రెష్ వేసుకొని ముఖం కడుక్కొని చాయ్ తాగిన తర్వాత రోజు పోచమ్మకు కోడి కోసాము. కోడిని కోసి వండుకొని తిన్నాం. తర్వాత రోజు సంఘంల పైసలు కట్టి మళ్లీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా తాత బండి నడిపాడు. తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం.మా మామ తోని వాళ్ళ ఇంటికి వెళ్లాను. తర్వాత రోజు మా తల్లిదండ్రులు వచ్చారు. ఇంటికి చేరుకున్నాం ఇలా మా ప్రయాణం జరిగింది
యన్.అన్వేష్
8 వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రేగులపల్లి మండలం బెజ్జంకి

1 comment
https://shorturl.fm/v96kl