– డాక్టర్ దాశరథి ,(1976 అక్టోబర్ 9-‘ఆంధ్రప్రభ’ దినపత్రిక,’రాగవల్లరి’)
పరుగెత్తే నది నైనా
బంధించును చిత్రం
అంతటి ఆకాశమైనా
ఇంతవును విచిత్రం
గదిలో నది:-
చిత్రకారుని కుంచే గంగానది నైనా కాన్వాస్ మీద బంధించగలదు. శేషగిరిరావు గారి ‘గంగ’ను చూసినవారికి ఆశ్చర్యం ఆనందం కలుగుతాయి. అన్నీ పోతాయి, కళ ఒక్కటే మనతో ఉంటుంది అన్నారు అంటీన్ డాల్ఫిన్ .
రాజ్యాలు, సింహాసనాలు పోయాయి. అజంతా ఎల్లోరాలు మనకు మిగిలాయి. కాలం పరిగెత్తుతుంది. కళ నిలిచి ఉంటుంది.కదలాడే ప్రకృతి కళలో ఘనీభవిస్తుంది. అర్థం కానిదేదైనా గొప్పది అనే అభిప్రాయం కొందరిలో ఉంటుంది. అయితే కడ కూడా వెర్రి తలలు వేస్తుంది ఒక చిత్రపడా ప్రదర్శనలో ఒక కంచు బొమ్మను ప్రదర్శించారట ఆ బొమ్మని పత్రికలో పొగిడాయట విమర్శకులు మెచ్చుకున్నారట ఆ కాన్స్టయ శిల్పం కింద ఇటాలియన్ భాషలో ఏదో పేరు ఉంది ఇటాలియన్ భాష తెలిసిన వారిని అడిగితే ‘ఏనుగులద్ది’అని అర్థం చెప్పారట!
అర్థం కానిదేదైనా గొప్పది- అనే అభిప్రాయం కొందరిలో ఉంటుంది. క్యూబిస్ట్, సర్రియలిస్ట్, డాడాయిస్ట్, నైరూప్య, అధునాతన చిత్రకళారూపాలను తెగ పొగిడే వారు ఉన్నారు. మనకు అర్థం కాని దల్లా గొప్పది అనుకోవడం ఎంత పొరపాటు అందులో ఏమీ లేదనుకోవడం అంత పొరపాటే .పాశ్చాత్య సంగీతం వినీ వినడంతోనే అందులో శ్రావ్యత లేని లేదు అనేస్తారు కొందరు మరి మన సంగీతం వారికి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి కొంత సంస్కారం కావాలి మరి.
‘ఉత్తమ కళ ఏ కాలంలోనైనా తన కాలాని కంటే ముందు పరుగెత్తుతుంది తన కాలపు సమాజాన్ని ప్రతిబింబిస్తుంది కళ పయనించే వేగాన్ని సమాజం
అందుకోలేదు. కళ నేడు అందుకున్న దాన్ని సమాజం రేపు గాని అందుకొనదు. ఇక్కడే సమాజానికి కళాపధ ప్రదర్శకురాలు అవుతుంది”. అన్నారు ప్రసిద్ధ చిత్రకారులు, విమర్శకులు సంజీవ్ దేవ్ గారు.
” సమాజం కళ ను సజీవ పరుస్తుంది. కళ సమాజాన్ని ఆనందపరుస్తుంది.సమాజం గుప్తపరిచే దానిని కళ వ్యక్తపరుస్తుంది. గుప్తత వ్యక్తత రెండు కూడా జీవన సాఫల్యానికి సమానావసరాలే” అన్నారు ఆయనే! కళను గురించి ఇంతకన్నా స్పష్టంగా చెప్పడం అసాధ్యమేమో! అయితే గుప్తత, వ్యక్తత ఏ పాళ్ళలో ఉండాలన్నదే ప్రశ్న. గుప్తత ఎక్కువైపోయి,వ్యక్తత తగ్గిపోతే సుబోధకత తగ్గుతుంది. కనుక ఆయన చిత్రాలు చాలా వరకు సుబోధకం గా ఉంటాయి.వీరు స్పష్టతను కోరే కళాకారులు. అందులో అయోమయత్వం లేదు. పెన్సిల్ తో గీసినా కలంతో వ్రాసినా, కుంచెలో వాడినా,తైలవర్ణాలు ఉపయోగించినా, లలితములైన జలవర్ణాలు ప్రయోగించినా, ప్రాచీన చిత్రాలు రచించినా, పాశ్చాత్య రీతులను అనుసరించినా శేషగిరిరావు తన చిత్రంలోనే కనబడేలా చేయగల ప్రతిభాశాలి. చిత్రకళానిపుణులు, విమర్శకులు ఇది శేషగిరిరావు గారి బొమ్మ అని ఇట్టే చెప్పగలరు.
శేషగిరిరావు శిల్పులకు ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తి. ప్రపంచంలోని సుప్రసిద్ధ కళాకారులు శిల్పులు ఆయన మిత్రులు. ఆయనది సుకుమార హృదయం. ఉదారమైన మనస్తత్వం. నవాబ్ మెహదీ నవాజ్ జంగ్ కేంద్ర లలిత కళా అకాడమీకి తొలి అధ్యక్షులు.ఊ అలాంటి వ్యక్తి అనురాగం ఆశ్రయాలు, ఉచిత విద్య శేషగిరిరావుకు లభించాయి.శాంతినికేతన్ లోని విశ్వభారతిలో చేరినప్పుడు ఆచార్య నందాలాల్ శిష్యులుగా ఎంతో అనుభవాన్ని పొందారు. ప్రముఖ చిత్రకారులు కుమారిల్ స్వామి వీరికి అక్కడ సహధ్యాయి.
చిత్రకళా నిపుణులు విమర్శకులు అయినా వేలూరి రాధాకృష్ణ గారు, శేషగిరిరావు నందాలాల్ బోస్ గురించి చెప్పిన మాటలు ఈ సందర్భంలో గమనించవలసి ఉంది. నందాల్ లాల్ బోస్ వద్ద నేర్చుకోవడం మూలంగా నాలోని చాలా లోపాలు దిద్దుబాటు చేసుకోగలిగాను.ఆయన వద్ద నేర్చుకోవడం గురుకులంలో మునివర్యుని వద్ద నేర్చుకోవడం వంటిది.” తమకు అదే అనుభవం కలిగినట్లు వేలూరి రాధాకృష్ణ గారు అభిప్రాయపడ్డారు. ఆయన తను చేయు ‘కర్మకు బద్ధుడైన యోగి పుంగవుడు’ అన్నారు నందా బాబును గూర్చి.
పందొమ్మిది వందల యాభైలో హైదరాబాద్ చిత్ర కళాశాలలో శేషగిరిరావు అధ్యాపకులైనారు. బనస్థలి విద్యాపీఠంలో కుడ్య చిత్ర రచనలో తర్ఫీదు పొందిన శేషగిరిరావు ఎన్నో కుడ్య చిత్రాలు రచించారు.భారతీయ పౌరాణిక చిత్రాలు,ప్రకృతి చిత్రాలు రచించడంలో శేషగిరిరావుది అందవేసిన చెయ్యి. పల్లె ప్రజల జీవితాలను వివిధ కోణాల నుండి సున్నిక్షితంగా పరిశీలించి చిత్రాలు రచించడం శేషగిరిరావు లోని మరో విశిష్టత. రోజూ మనం వీధిలో వెళుతూ రకరకాలైన వృక్షాలను చూస్తాం. దాటిపోతాం .తన కుంచెలోని నైపుణ్యంతో శేషగిరిరావు వేసిన వృక్ష చిత్రాలు చూసి ఆగిపోతాం. దాటిపోలేం. ప్రేక్షకుణ్ణి ఆకట్టుకుని ఆగిపోయేలా చేసి, ఆశ్చర్యచకుతునిగా చేసే శక్తి శేషగిరిరావు చిత్రాలలో ఉంది. అతడు వేసిన గుల్మోహర్ చూచి తీరవలసిందే.
ఈయన చిత్రాలల్లో మరో విశేషం ఏమిటంటే రంగులు సామాన్యమైనవిగా ఉంటూ ఎంతో కండ్ల పండువగా గంభీర భావాలను వ్యక్తపరుస్తాయి ఈయన న్యూరల్ పెయింటింగ్స్ లో కంపోజిషన్ అద్భుతంగా ఉంటాయి ఈయన బ్రష్ వర్క్ లో వేగం శక్తి జవం స్పేసింగ్ ఉట్టిపడుతుంటాయి సంతాల్ నృత్యం, వసంతం, కాకులు అనే చిత్రాలకు 1949లో, గేదెలు ,నెమళ్లు ఈ చిత్రాలకు 1953 లోను, సంతాపం, క్షమ అనే చిత్రాలకు బంగారు పతకం, బహుమతి, స్టేట్ హుడ్ అనే చిత్రాలకు కలకత్తా అకాడమీ అవార్డు లభించాయి.
1963 ఏప్రిల్ లో హైదరాబాదులోని ఆంధ్ర సారస్వత పరిషత్తు హాలులో ఈయన పెయింటింగ్స్ ప్రదర్శన చూశాను సాలార్జంగ్ మ్యూజియం డైరెక్టర్ వివాస్కర్ ప్రదర్శనను ప్రారంభించారు ఈ ప్రదర్శనలో ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించినవి నన్ను బుధ్ధిని చేసినవి కొన్ని చిత్రాలు ఇక్కడ ఉదాహరించడం యుక్తమని భావిస్తున్నాను.చేదిత దృమం, గుల్మోహార్, గంగ ,నూతన ప్రభాతం, అడవి కోన, విషాద ప్రకృతి ఒక తరహాకు చెందిన ఉత్తమ చిత్రాలు అయితే, పద్మం, గర్భిణి ,చిత్రాంగద, శకుంతల, అరుంధతి బతుకమ్మ, అహల్య, గాయత్రి, రామానుజ, పార్వతి, దమయంతి మరొక రకమైన ఉత్తమ చిత్రాలు.
శేషగిరిరావు చిత్రాలను స్వదేశంలోనూ, విదేశాలలోనూ ఎందరో కళాభిమానులు కొన్నారు. హైదరాబాదు మ్యూజియంలో, సాలార్జంగ్ మ్యూజియంలోనూ, హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లోనూ, ఢిల్లీలోని వెస్టర్న్ కోర్టులోను, కాబూల్, కైరో , మాస్కో మ్యూజియం లండన్ ఇటలీలలోను శేషగిరిరావు చిత్రాలు ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమీ భవనంలోనూ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లోను ఈయన చిత్రాలు ఉన్నాయి.
అలంకరణ కళ పై శేషగిరిరావు ఒక గ్రంథం వ్రాశారు. ఇది ఇంకా ప్రచురణ కావలసి ఉంది.లేపాక్షి,తాడిపత్రి, హంపి దేవాలయాలలోని శిల్పాల రేఖాచిత్రాలు శేషగిరిరావు రచించారు.వాటి సంపుటమే ‘ సురేఖ’ .ఇది ప్రచురించబడింది .శేషగిరిరావు రచించిన పోతన, తిమ్మరుసు, అల్లసాని పెద్దన,ఉభయపార్వ్శాలలో గల అశ్వారూఢుడైన శ్రీకృష్ణదేవరాయలు, కొంగలు మరపురాని చిత్రాలు.
ప్రముఖ విమర్శకులు వేలూరి రాధాకృష్ణ గారు అభిప్రాయ పడినట్లు అతని రేఖలలో నుంచి జీవం ఉట్టిపడుతూ ఉంటుంది అతని రంగులలో నుంచి తేజస్సు తాండవం మాడుతూ ఆయన చిత్రాలు చూపురులను ముగ్ధులను లను చేస్తవి.పట్టు వస్త్రం పై శేషగిరిరావు గారు చక్కని భారతీయ శైలిలో చిత్రించిన చిత్రాలు కూడా ఎన్నో ఉన్నవి. అన్నింటికన్నా మించినవి అతని నలుపు తెలుపు చిత్రాలు చైనా సిరాలో ‘వాష్’ శైలిలో రచించిన చిత్రాలూను, వాటిలోని వేగం గమనింపదగింది. శేషగిరి రావు గారు తైల వర్ణాలతో కూడా మిగతారీతులలో వలె సులభంగాను చిత్రించగలడు. మన దేశంలోని అనేక ముఖ్య నగరాలలో శేషగిరిరావు తన సొంత చిత్రాల ప్రదర్శనలను ఏర్పాటు చేసి పండిత పామరుల మన్ననలను పొందారు.
సాంఘిక ప్రయోజనం లేని కళను ఆధునికులు హర్శించరు. ఇటీవల హైదరాబాదు నగరంలో జరిగిన బ్రహ్మాండమైన హరిజన మహాసభలలో శేషగిరిరావు గారు చిత్రించి, ప్రదర్శించిన “హరిజనోద్యమం”అని ప్యానెల్ లో సాంఘిక ప్రయోజనం తో పాటు ఆయన చిత్ర విద్యాలయపుణ్యం పరాకాష్ట నందుకు ఉన్నది. అందుకే అశేష ప్రజ్ఞాధురీణుడు శేషగిరిరావు అంటాను.
