


పదకిరణకలనం సరియైన జవాబులు పంపినవారు ఉమారాణి నెల్లుట్ల గారు .
మేధస్సును పదును పెడుతూ, మనసును ఉత్సాహపరిచే ఒకానొక సాహిత్య చిక్కుప్రశ్నల సరదా ! మీదే విజయం కావచ్చు !ఇదిగో-మయూఖ పదకిరణకలనం (puzzle) పరిష్కర్త నెల్లుట్ల ఉమానరసింహారావు కు అభినందనలు .
అసూయ
——-
నిన్ను చూసి
ఎదుటివాడు
అసూయపడేలా
జీవించు
కాని
ఎదుటివాడిని చూసి
నువ్వు మాత్రం
అసూయపడకు
—-**——
రాజకీయం
—————
రాజకీయ ప్రయాణంలో
పదవుల పట్టాలు తప్పి
ప్రతిపక్ష పార్టీల
యాక్సిడెంట్లు సహజం –
వాటిని తట్టుకుని
ముందుకు సాగినవాడే
రాజకీయ నాయకుడు
అదే అసలైన
రాజకీయం
ఈ సంచికలో మంచివాళ్ళ మధ్య స్నేహం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అసలు ‘స్నేహం’ ఎలా ఉండాలో భర్తృహరి చెబుతారు.
శ్లో|| క్షీరేణాత్మగతోదకాయ హి గుణాదత్తాః పురాతే౭ఖిలాః
క్షీరోత్తాపమేక్ష్య తేన పయసాస్వాత్మా కృశానౌ హుతః
గన్తుం పావక మున్మన స్తదభవద్దృష్ట్వాతు మిత్రాపదం
యుక్తం తేన జలేన శామ్యతి, సతాం మైత్త్రీ పునస్వ్తీదృశా
సజ్జన పద్ధతిలోని ఈ శ్లోకానికి ఏనుగు లక్ష్మణకవిగారి అనువాదం పరిశీలిద్దాం.
చ. క్షీరము మున్ను నీటికొసగెన్ స్వగుణంబులు దన్ను జేరుటన్
క్షీరము దప్తమౌటగని చిచ్చుఱికిన్ వెతచే జలంబు దు
ర్వారసుహృద్విపత్తిగని వహ్న జారంజనె దుగ్ధ, మంతలో
నీరము గూడి శాంతమగు, నిల్చు మహాత్ముల మైత్రి యీ గతిన్
పాలు తనలో కలిసిన నీటికి తన గుణాలను ఇస్తుంది. తనకు సహాయం చేసిన పాలు కాగిపోతూ అగ్నిలో పడబోతుండగా దానికి నీరు చేరువ కాగా అది శాంతిస్తుంది. సజ్జనుల మధ్య మైత్రీ భావం ఇలానే ఉంటుంది.
మిత్రులైన సజ్జనులు వారిలో ఎవరికి ఆపద వచ్చినా పరస్పరం సహాయం చేసుకొని ఆ ఆపద నుండి బయటపడతారని కవి చెబుతూ పాలు – నీరు దృష్టాంతంతో వివరిస్తున్నారు.
మొదట మనం పాలలో నీటిని కలుపుతాం. అప్పుడు పాలకు నీటితో స్నేహం ఏర్పడుతుంది. అందువల్ల పాలు, స్నేహ ధర్మంతో నీటికి తన మాధుర్యాది గుణాలనన్నింటినీ ఇస్తుంది. ఆ తరువాత వాటిని అగ్నితో వేడి చేసినప్పుడు ఆ వేడికి పాలు బాగా కాగిపోతుంటాయి. తమకు ఆశ్రయమివ్వడమేగాక మాధుర్యాదిగుణాలను కూడా ఇచ్చిన పాలు కాగిపోవడం చూచి, నీరు మైత్రీభావంతో, పాలు ఇంకిపోకుండా తాము ఇగిరిపోతుంటాయి. నీరంతా ఇగిరిపోగానే, ఇఁతసేపు తమతో కలిసి ఉన్న నీరు లేదనే భావనతో పాలు పొంగి నిప్పులో పడబోతూ ఉంటే మళ్ళీ చేరిన నీరు ఆ పాలను పొంగకుండా చేస్తుంది. ఈ నీరక్షీర విధానం మనం రోజూ వంటింట్లో చూచేదే. ఈ రెండింటి స్వాభావికమైన తీరును కవి, మంచివారి స్నేహానికి ఆపాదించి చెబుతున్నారు. పాలు తమ మాధుర్యాది గుణాలను నీటికిచ్చినట్లుగా సంపద ఉన్న మిత్రుడు తన మిత్రునికి సంపదనిస్తాడు. సంపద ఇచ్చిన మిత్రుడు ఆపదలో ఉన్నప్పుడు, పూర్వం సంశయం పొందిన మిత్రుడు ఆ మిత్రునికి సహాయం అందిస్తాడు. మంచి మిత్రులు ఎప్పుడూ ఇలాగే పరస్పరం చేసుకుంటారు.
ఈ విషయాన్నే అబ్దుల్ కలామ్ గారు – ఒక మంచి పుస్తకం వందమంది స్నేహితులతో సమానమంటారు. ఒక మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానమని చెబుతారు. అంటే స్నేహితుడు జీవిత మార్గదర్శిగా నిలుస్తాడని, నిలవాలని వారి అభిప్రాయం. వీరే మరొక సందర్భంలో మంచి స్నేహితులు ఒకరికొకరు సహాయం చేసుకుంటారని, ఆత్మీయ స్నేహితులు ఒకరికొకరు అర్థం చేసుకుంటారని, నిజమైన స్నేహితులు ఎల్లవేళలా , ఎల్లలు దాటినా, ఎల్లప్పుడూ ఉంటారని చెబుతూ స్నేహధర్మాన్నీ, స్నేహ మాధుర్యాన్ని తెలియజేశారు.
మనిషి సంఘజీవి. ఒకరి సహాయం లేనిదే అతని జీవితం, జీవిక సాగదు. అది స్నేహస్పదమైతే మరింత మధురంగా ఉంటుంది. దానికై మనం మనుగడ సాగించాలి. దానితో జీవనం కొనసాగించాలి.
లోకానీకావనౌకం సకల భువనభు క్సత్ర సంత్రాణ తంత్రం
కారుణ్యార్ణోధినాధం ఘనరవవిలస న్నూపురాసాదపాదం
తాటంకద్యోత కర్ణం విషగళసుషమా తాండవానంద కందం
వందే యాదక్షమాభృత్ కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహమ్ !
తాత్పర్యం: సమ్తలోకాలను సంరక్షించే ఆశ్రయముÑ సకల భువనా(లోకా)లను లయమొందించేవాడు, నిరంతరము పోషించి రక్షించేవాడుÑ కరుణ అనే సముద్రానికి ప్రభువైన (అధిపతిjైున) వాడుÑ విశేషమైన శబ్దాలను వెలువరించే ప్రకాశిస్తూన్న అందెలను అలంకరించుకున్న పాదము(లు) కలవాడుÑ తాటంకముల (చెవికమ్మల) చేత అందమును సంతరించుకుని ప్రకాశిస్తున్న చెవులు కలవాడుÑ శ్రీకంఠుని పరమశోభాకరమైన తాండవనాట్య సమయంలో కలిగే ఆనందానికి మూల(కారణ)మైనవాడు అయిన శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామివారిని నమస్కరిస్తున్నాను.
విశేషాలు: లోకం అంటే ఇంద్రియగోచరమైన ఈ సమస్త చరాచర స్థావర జంగ మాత్మకమైన, ఎనభై నాలుగు లక్షల జీవరాశికి నిలయమైన, సంపూర్ణ సృష్టి అని చెప్పవచ్చు. సాధారణ మానవుడికి ఇంద్రియ గోచరమైన ఈ లోకం అంతా కలిసి ఒక బ్రహ్మాండంగా పిలవబడుతున్నది. ఋషివరేణ్యుల జ్ఞానచక్షువులకు ఎన్నో కోట్ల బ్రహ్మాండాలు కనిపిస్తుంటాయి. వాటినే అనేక కోటి బ్రహ్మాండాలని జ్ఞానులు చెప్తుంటారు. (లోకGఅనీకGఅవనGఓకంR) అటువంటి లోకానీకములను, అనేక కోటి బ్రహ్మాండాలను (అవనR) రక్షించటానికి (ఓకంR) చక్కని, ఏకైక ఆశ్రమైనవాడుÑ (సకలGభువనR) సమస్త లోకాలను (భుక్R) భుజించటం అంటే మహాప్రళయకాలంలో తనలో లీనం చేసుకునేవాడు విష్ణుమూర్తి! అంతేనా? (సత్రR) ఆ లోకాలన్నిటినీ పోషించి, శరణమిచ్చి, రక్షణ కల్పించి, వాటికి తానే ఆశ్రయంగా నిలిచినవాడు. సత్రం అంటే తగిన దక్షిణ లిచ్చి సతతము అన్నదానం చేయటం అని కూడ అర్థం! పూర్వం ఋషులు సత్రయాగం చేశారని పురాణాల్లో పేర్కొన్న దీ యాగాన్నే!, ఇంకా (సంత్రాణR) చక్కగా రక్షించటం అనే (తంత్రంR) కుటుంబ భరణ వ్యాపారాన్ని, పనిని, చేసేవాడు శ్రీలక్ష్మీనరసింహస్వామివారు.
సృష్టి, స్థితి, లయ కార్యాలకు మూలమైనవాడు విష్ణుమూర్తియే కదా!Ñ తనను ఆశ్రయించిన, ఆపన్నులైన భక్తజనులను, విపత్తుల నుండి కాపాడి (కారుణ్యGఅర్ణోధినాధంR) దయతో బ్రోచే కరుణాసముద్రానికి అధినాథుడుÑ (ఘనGరవGవిలసత్G నూపురGఆసాదGపాదంR) విశేషంగా మంజులనాదాన్ని వెలువరిస్తూ, మిక్కిలి సౌందర్యవంతములైన అందెలచేత (మంజీరాలచేత) అలంకరింపబడిన పాదాలు కలిగినవాడుÑ (తాటంకGద్యోతGకర్ణంR) శోభాయమానములైన చెవికమ్మలచేత ప్రకాశిస్తూన్న చెవులు కలిగినవాడుÑ (విషగళGసుషమాGతాండవGఆనందGకందంR) విషగళుడు శంకరుడు. సకలలోక శుభంకరుడైన శంకరుడు దివసావనాన సమయంలో అంటే సాయంసంధ్యా సమయంలో తాండవ నృత్యం చేస్తూ
ఉంటాడంటారు. (విషగళR) హాలాహల విషాన్ని తన కంఠసీమలో నిలుపుకుని శ్రీకంఠుడనే నామధేయాన్ని సార్థక పరచుకున్నవాడు శివుడు! అందుకే ఆయన శివుడు R మంగళకరుడైనాడు. శివుడు మనోజ్ఞమైన తాండవ నృత్యాన్ని చేస్తూంటే కలిగే ఆనందం ఇంతటిదని చెప్పడానికి వీలు కాదు! దాన్ని ఆనంద తాండవమంటారు. అదే బ్రహ్మానందం కంటే అతీతమైనది. అటువంటి ఆనందం కలగటానికీ, కలిగించటానికీ మూలమైనవాడు శ్రీలక్ష్మీ నరసింహస్వామివారు. శ్రీ యాదగిరిపై నెలకొని తన పటుభుజబలంతో విక్రమిస్తున్న శ్రీలక్ష్మీనరసింహస్వామిని కవి తన సుధామధుర కవితారస ధారాపూరంతో నమస్కరిస్తున్నాడు.
విజయా సంస్థ నిర్మించిన “జగదేక వీరుని కథ” చిత్రం 1961లో విడుదలైనది. ఆ చిత్రంలోని ఒక పాట.
రారా కన రారా
కరుణ మానిరారా ప్రియతమ లారా ||రారా||
నాలో నాలుగు ప్రాణులనగా
నాలో నాలుగు దీపములనగా ||నాలో||
కలిసిమెలిసి అలరించిన చెలులే ||కలిసి||
నను విడనాడెదరా ||రారా|
మీ ప్రేమలతో మీ స్నేహముతో ||మీ ప్రేమ||
అమరజీవిగా నను చేసితి రే
మీరు లేని నా బ్రతుకేలా ||మీరు||
మరణమె శరణముగా
రారా కనరారా
కరుణ మానినారా ప్రియతమ లారా
ఈ పాటను గాన గంధర్వుడు ఘంటసాల మాస్టారు అద్భుతంగా ఆలపించగా ప్రతాప్ గా నటించిన నందమూరి తారక రామారావు అభినయించారు. మధ్య మధ్య సన్నివేశ ప్రాధాన్యంగా ఇంద్రకుమారి జయంతిగా నటించిన బి.సరోజాదేవి, నాగకుమారి నాగినిగా నటించిన యల్. విజయలక్ష్మి, వరుణకుమారి వారుణిగా నటించిన జయంతి, అగ్నికుమారి మరీచిగా నటించిన బాల కనిపిస్తారు. రసస్పర్శ అంటే ఏమిటో అవగాహనతో, అనుభూతితో ఘంటసాలగారి గళంలో పెండ్యాల నాగేశ్వరరావు తన సంగీత దర్శకత్వంలో “భాగీశ్వరి” రాగంలో మనకు అందించారు.
భూలోకంలోని రాకుమారుడైన ప్రతాప్, తన జీవిత లక్ష్యమైన, తన కలల రూపంలోని నలుగురు దేవకన్యలను వివాహమాడతాడు. కాని ఆ నలుగురు తనను విడిచి ఊహకందని లోకాలకు తిరిగి వెళ్ళిపోయిన సందర్భంలో ఉద్దేశించి కథానాయకుడు పాడిన పాట ఇది.
ఇటువంటి శోకతప్త గీతాలకు సాధారణంగా సింధుభైరవి, ముఖారి, ముల్తానీ, అసావేరి, తోడి, ఘార్జరీ, భాగీశ్వరి రాగాలను వాడతారు. పెండ్యాలవారు ఈ పాటను భాగీశ్వరి రాగంలో ట్యూన్ ని దర్శకులు కె.వి.రెడ్డిగారికి వినిపించారు. ఈ ట్యూన్ లో ఆర్తి, ఆరాధనా భావం బాగా వచ్చాయని కె.వి.రెడ్డిగారు అభిప్రాయపడ్డారు. ఆ మరునాడు మరో రాగంలో ట్యూన్ చేసి కె.వి.రెడ్డిగారికి వినిపించారు పెండ్యాలవారు. ఆ ట్యూన్ కూడా బాగుందనిపించింది కె.వి.రెడ్డిగారికి. కె.వి.రెడ్డిగారు ఈ రెండు రాగాల్లో ఏ ట్యూన్ తో రికార్డింగ్ చేయించాలనే విషయంలో సందిగ్ధంలో పడ్డారు. పాత్రధారి ఎన్టీఆర్ ను రమ్మని కబురు పంపించి, ఈ రెండు ట్యూన్ లలో ఏది బాగుందో తెలియజేయమని, ఎన్టీఆర్ ఏ నిర్ణయం తీసికొన్నా, కట్టుబడి వుంటానన్నారు కె.వి.రెడ్డిగారు. పెండ్యాలవారు చేసిన రెండు స్వర రచనలను రెండుసార్లు పాడి ఎన్టీఆర్ కు వినిపించారు. 5 నిమిషాలపాటు ఎన్టీఆర్ మనసులో తర్జనభర్జన చేసికొని, అరబిక్ మెలోడీలోని ట్యూన్ సాహిత్యాన్ని కొంచెం వెనుకకు నెట్టి ముందుకు దూకుతోంది. సంగీతమే ముందు చెవులను తాకుతుంది. కాని భాగీశ్వరి రాగంలో సంగీత సాహిత్యాలు రెండు కూడా ఒకేసారి మనసును తాకుతున్నాయి. సన్నివేశానికి భాగీశ్వరి రాగం ట్యూన్ నిండుదనం కలిగిస్తుందని ఎన్టీఆర్ తెలిపారు. ఎన్టీఆర్ లోతైన సునిశిత పరిశీలన కె.వి.రెడ్డిగారికి నచ్చింది. భాగీశ్వరి రాగంలో ట్యూన్ చేయబడిన ఈ పాట ఈ రోజువరకు సజీవంగా ఉన్నది. తనకు వచ్చిన కలను నిజము చేసుకునే ప్రయత్నంలో, ఒక రాకుమారుడు చేసిన సాహస కార్యముల గాథ “జగదేక వీరుని కథ”.
గీత రచయిత పింగళి నాగేంద్రరావు కేవలం సినిమా మాటల, పాటల రచయిత మాత్రమే కాకుండా, నాటక రచయిత, పాత్రికేయుడు.
శా|| శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు
యేలోకానాం స్థితి మావహంత్యవిహితాం స్త్రీ పుంసయోగోద్భవాం
తేవేదత్రయమూర్తయః త్రిపురుషాః సంపూజితావస్సురైః
భూయాసుః పురుషోత్తమాంబుఝభవ శ్రీకంధరా శ్శ్రేయసే
ఆదికావ్య నిర్మాత నన్నయ మహాకవి తన తెలుగు భారతములో తొట్ట తొలుత ఈ శార్దూల విక్రీడిత పద్యము రాసినాడు. అది సంస్కృతంలో ఉంది. తెలుగు భారతానికి సంస్కృత స్తుతి ఎందుకు?
సంస్కృతంలో రాయడానికి కారణం దేవభాషా వందనం. సంస్కృతంలో రాసిన కారణం మరొకటి ఉంది.
ఇది త్రిమూర్తి స్తుతి. వీరిని సురలు సంపూజ్యం చేస్తున్నారన్నాడు. సురల భాష గీర్వాణి. అందుకే ఈ గైర్వాణం భావం మనోనేత్రం తెరిపించేంత గొప్పది. ఛందస్సు ఉభయ భాషా ప్రచవితం.
వ్యాసప్రోక్త భారతం సంస్కృతం. తెలుగుభాషకు వెన్నుదన్ను వంటిది. “గాసట బీసటల గాథలు తవ్వుకుంటున్న” తెలుగువారికి పంచమ వేదాన్ని రుచి చూపించబోతున్నాడు ఆదికవి. గాసట అంటే గాథా సప్తశతి వంటి ప్రాకృత భాషా కథలు బీసట అంటే బృహత్కథ వంటి పైశాచీ భాషా కథలు తెలుగువారి తొలి కథా సాహిత్యం… తాను రాయబోయేది సంస్కృత మహాకావ్యగాథ. ధర్మం కావాల్సినవారికి ధర్మం. పౌరాణికులకు పురాణం. తత్త్వజ్ఞులకు తత్త్వశాస్త్రం. కృష్ణభక్తులకు కార్ ష్ణ్యం ఐన అలాంటి కావ్యానికి తొలి ప్రార్థనగా త్రిమూర్తుల వర్ణనగా దేవభాషలో రాసి తన సంస్కృత భాషా, కావ్య, కల్పనా ప్రాగల్భాన్ని పండించినాడు.
లక్ష్మీ సరస్వతీ పార్వతులు వరుసగా వక్షము, ముఖమున, శరీరార్థ భాగమున నిలుపుకొని మూడు వేదముల సారం మూర్తిమత్వం పొందిన సకల భువన రక్షణ ప్రభువులు, ఆద్యులు ఐన హరిహర హిరణ్యగర్భులను పద్మోమా వాణీపతులను నన్నయ ఈ శ్లోకమున స్తుతించినాడు.
నన్నయ తన కావ్యాన్ని లోనారసి చూడమన్నాడు. లోతుల్లో కావ్యకళను నిక్ష్తిప్తం చేసినాడని సూన. పై పద్యం చూద్దాం.
ముగ్గురు మాతలు శ్రీ, వాణీ, గిరిజలు, శ్రీ కావ్యారంభ శబ్దం. సంపద్వంతం. మరి బ్రహ్మతో ప్రారంభించాలి కదా త్రిమూర్తి స్మరణ! ముగ్గురు పరమ పురుషులు. లోకముల సృష్టి, స్థితి, లయలకు కారకులు. స్థితిమంతుడు విష్ణువు బ్రహ్మను బొడ్డు తామరలో సృజించినందున విష్ణువే తొలుత స్మరణీయుడైనాడు. ఆ విషయాన్ని అంబుజభవ శబ్దంతో స్మరించినాడు.
ముగురమ్మలు లేక సృష్టి లేదు. స్త్రీ పుంస యోగములో సృష్టి అని సూచన. మానవ దృష్టికి యోగమంటే సంయోగము. కాని ఈ త్రిమూర్తులు తమ లోకపాలనంలో అనగా స్థితి, సృష్టి లయలలో వక్షోముఖాంగములలో తమ స్త్రీలను స్థిరపరచుకొన్నారట. వక్షస్థలంలో లక్ష్మి, ముఖంలో వాణి, అంగార్థంలో గిరిజనులున్నారు. ప్రేమస్థానం హృదయం వక్షస్థలం, వాగ్రూప స్థానం నోరు, శక్తిస్థానం శరీరం కదా! అలా ఉంచినారు. పైగా అవిహతమ్మని స్థిరంగా, శాశ్వతంగా ఉన్నారని, ప్రతిక్షణం ‘లోకానాం స్థితి’కి కారణమైనారు అని వివరణ.
ఆ ముగ్గురి స్థితి ఏమి? వేదస్వరూపం. వేదాలు మూడు. వేదస్థితి మూడు దశలు. అందుకే వేద త్రయమూర్తులు అన్నాడు. అవి ఋగ్ యజుస్సామాలు. ఇవి పరస్పర అర్థమైత్రి కలవి. లోనారసి చూస్తే ఈ మూడువేదాల అంతమైన సారభూత దశ త్రిమూర్త్యాత్మకం ఐన విశ్వం. ‘ఋచస్సామాని జజ్ఞిరే’ అని, వేదాలు మూడేనని తైతి్తరియోపనిషద్వాక్య ప్రమాణం. “వేదాంతేషు యమాహు రేక పురుషం” అని ఈ ముగ్గురు “ఏక పురుషుడే”ని కాళీదాసుని కవితా నిష్కర్ష. అపుడు ముగ్గురు స్త్రీలు ఏకీకృతమైన శక్తి స్వరూపమైన ముగ్గురమ్మల మూలపుటమ్ముగా మారి లోకస్థితి శక్తిగా నిలిచినట్టు నన్నయ సూచన.
పురుష శబ్దం స్థితికి, భవశబ్దం సృష్టికి, శ్రీ శబ్ద (శ్రీ కంధర = విషకంఠ) మనగా విష శబ్దం లయకు సంకేతాలుగా నన్నయ నిష్కర్ష ‘చిరాయ’ శబ్దంలో సృష్టి వయస్సును నిపతించినాడు.
శ్రీ, వాణీ, గిరిజలను, వక్షో, ముఖా, అంగములలో పురుషోత్తముడు, అంబుజభవుడు, శ్రీ కంధరుడు ఊర్థ్వ, భూలోక, పాతాళ నామ లోక్రతయ రూప విశ్వంలో ఏలుటగా క్రమాలంకారంలో పేర్చినాడు నన్నయ.
దధతః అనగా ధరించినారని విశ్వాన్ని, విశ్వ ప్రజలకు శ్రేయస్సును ఇమ్మని ఆ సురలచే సంపూజితులైన వారిని ప్రార్థించినాడు.
శ్రీతో ప్రారంభించి, విషశబ్దం పరిహార్యం కనుక పర్యాయమైన శ్రీ శబ్దంతో మరియు శ్రేయశ్శబ్దంతో శ్లోకాన్ని ముగిస్తూ కావ్య ప్రపంచ శ్రేయస్సుకు, లోక శ్రేయస్సుకు త్రిమాతృ త్రిమూర్తి వందనం చేసి తెలుగు సారస్వత ప్రపంచాన్ని ప్రారంభించినాడు ఋషి సదృశుడైన ఆదికవి. “ఋషీణాం పునరాద్యానాం వాచమర్ధోను ధావతి” అన్నట్లు త్రిమూర్తి సంకేతంగా మూడు పర్వాలే రాయబోతున్నట్టు చెప్పి, అంతే అనుసృజించి, మహాకవి నిత్యసత్యవచనుడైనాడు.
(ఈ శీర్షికన ఆంధ్రసాహిత్యంలో అనర్ఘ పద్య రత్నాలను ధారావాహికంగా అందిస్తున్నాం. – సంపా.)
అరె ఉత్తమ్ నువ్వా ఎప్పుడొచ్చావ్ . అదేంట్రా ఇలా అయ్యావ్ గుర్తే పట్టలేదు. జుట్టంతా ఏమైందిరా మొత్తం బట్టతల అయింది. రా … రా..అంటూ లోనికి ఆహ్వానించాను . పది రోజులయింది పెద్దమ్మా వచ్చి . మీకు తెలుసుగా నాకున్న సమస్య ఆ పనిమీదే వచ్చాను. పాండమిక్ టైం కదా! UK నుండి వచ్చానని ఇంట్లోనే వుండమన్నారు పద్నాలుగురోజులు. పెదనాన్నతో మాట్లాడదామని వచ్చాను.
నీ కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏమో ! పిచ్చోడిలా తయారయ్యావ్ . పెళ్ళి అయిందగ్గర్నుండి గొడవలే ‘
సాత్వికం సున్నితం అయిన మనుషులంటే ఎందుకింత వివక్షో దేవుడికి. అత్తింటోళ్ళు అందరూ వేధిస్తున్నట్లు పెట్టింది కేసు సుకన్య. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఎన్నాళ్ళుగానో. తల్లిదండ్రులిద్దరికీ ఆరోగ్యం అంతంతే . వీడేమో Uk లో ఏదో జాబ్ చేస్తున్నాడు.
వీడొచ్చిన రెండు మూడు రోజులకే తల్లికి బాలేదట . మరో రెండు రోజులు చూసి నిన్ననే పెద్ద హాస్పిటల్ లో చేర్పించాడట . దూరదేశాల్లో వుండే పిల్లలు తల్లిదండ్రుల మీద ప్రేమతో అవసరం వున్నా లేకున్నా పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో జాయిన్ చేయడం బాగా ఎక్కువైంది.
స్నేహితులుగా విడిపోతే బాగుంటుందన్న సలహా తో .. ఇన్ని సంవత్సరాల విసుగుతో .. సరే నంటూ వెళ్ళిపోయాడు .
ఆహాస్పిటల్ కెళ్ళి తల్లిని చూద్దామంటే చూడనివ్వరట . మంచిగ నేవుంది అంటూ రోజు లక్షల్లోనే ఫీజు వసూలు చేస్తున్నారట . పెరిగి పోతున్న బిల్లు చూసి మేం వేరే హస్పిటల్ కెళ్తాం డిస్చార్జీ రాయమంటే రాయకుండా నువ్వే చూద్దువు రా అంటూ తీసుకెళ్ళి దూరం నుండి ఆమె చెయ్యి లేపి అదిగో నిన్ను గుర్తు పట్టింది మాట్లాడుతున్నది చూడు
చూడు అంటూ బైటికి పంపారట వీడిని. నిజమేనేమో మెరుగవుతున్నదేమో అని సంతోషంగా ఇంటికి చేరి తండ్రికి చెప్పాడట . ఆ సాయంత్రమే ఆమె చనిపోయినట్లు కబురు . హతాశులయ్యారు .
ఆ బిల్లు చూసి ఏడవాలో .. తల్లి పోయిందని ఏడవాలో .. అర్ధం కాని అయోమయ పరిస్థితి . ఇంత బిల్లు ఎందుకయిందనే ప్రశ్నకు కంఠశోశే మిగిలింది.
డబ్బు లేదు .. అమ్మ లేదు .. భార్య లేదు .
విధి ఎంత విచిత్రం ! వీడు రావడమేంటి – తల్లి పోవడమేంటి ఆ పదిరోజులన్నా చూసుకో గలిగాడు. తల్లిని చివరి దశలో ‘ తండ్రిని అక్క దగ్గర వుంచి కొండంత భారంతో తిరిగి వెళ్ళాడు.
తన పేరు…..
మా ఇల్లు టౌన్ అయిపోయాక వెలుపల టౌన్ బయట ఉంటుందీ. ఆఫీస్ టైమ్ కి వెళ్ళే బస్ లో అందరి కంటే చివ్వరగా ఎక్కేది నేనే ఊరి చివ్వర ఉంటాను గదా అందుకని.
బయట ఎవరు ఉన్నారో తెలియనంత రష్ ఉన్నాగానీ అక్కడ బస్ ఆగింది అంటే, అపుడు బస్ ఎక్కేది నేనే అనీ చూడకుండానే రోజూ వచ్చే వారికి తెలిసి పోతుంది. ఆఫీస్ లకు వెళ్ళే టైమ్ కావడం వల్ల, బస్ ఊరంతా దాటినంక నా ప్లేసుకు వచ్చే సరికే బస్ పూర్తీగా నిండి వస్తుంది. నాకు దాదాపు సీటు దొరకదు. ఎక్కడో ఓ చోట సర్దుకొని కుచోవాలి, వద్దు అనుకుంటే నిల్చోవాలి. అలా ఉంటుంది రోజూ.
అదే బస్ లో ఓ పది మంది దాక రెగ్యులర్ గా ఎక్కుతుంటాం. డైలీ ఎక్కే వాళ్ళు అంత మంది ఉన్నా… నేనంటే ఎందుకో తనకు ప్రత్యేకత.
తను మిగితా వారితో మాట్లాడినట్టు కూడా నేను ఎప్పుడూ చూడలేదు. కానీ మేము మాత్రం రోజూ కళ్ళతోనే పకరించుకుంటాం.
నన్ను తన మనిషిలా ఫీల్ అవుతుంది.
నా కంటే ముందే టౌన్ లోనే ఎక్కడో బస్ ఎక్కి ఉంటుంది. నేను ఎక్కీ ఎక్కగానే నాకోసం సీటు సర్దుబాటు చేస్తుందీ. తను కూచున్న సీట్లో ముగ్గురూ నిండి ఉంటే ఇంకెక్కడైనా ఖాళీ ఉందేమో చూస్తుంది. ఉంటే అందులో ఉన్న వాళ్ళను సర్ధుకోమని చెప్పి, ‘ఆడ కుచో మేడం’ అని నాకు పురమాయిస్తుంది. అక్కడ కుచోడానికి ఒకవేళ నేను ఇబ్బంది పడుతుంటే.. “నేను ఆడికి పోతా నీవు ఈడ కూసో మేడం” అని అంటుంది. నేను “పరవాలేదు నేను నిల్చుంటా అని వారిస్తే”, తాను ముందుకి జరిగి నాకూ కాస్త చోటు ఇస్తుంది.
ఇవ్వాళ బస్ లో ఉన్నంత సేపూ మళ్ళా మళ్ళా అనిపించింది ‘ఎందుకు తనకు నేనంటే ఆపెచ్చా…!?’
వయసు దాదాపు 55 వుంటుంది కావచ్చు, మనిషి సన్నగా ఉంటుంది, అంత వయసు లో కూడా జుట్టు మాత్రం నల్లగా ఉంటుంది. ఏదో ఫార్మాలిటీ కోసం అన్నట్టుగా ఆడోటి ఆడోటి తెల్ల వెంట్రుకలు ఉంటాయనుకోండి. సన్నని ఓ అర మూరెడు జడ వేసుకుంటుది. జీవితంలో ఎన్ని భాద్యతలు మోసిందో మరి అవి తెలియజేయడానికా అన్నట్టు మోహం మీద వయసుకు మించిన ముడతలు. పల్చటి చర్మం చూడ్డానికి కాస్త రంగు తక్కువ గానే అనిపిస్తుంది గానీ యవ్వనంలో ఉన్నపుడు ఎరుపు రంగులోనే ఉండి ఉంటుంది. భర్త పోయినట్టుంది. చేతులకు చెరో వైపు రెన్రెండు వన్ గ్రామ్ గోల్డ్ గాజులు వేసుకుంటుది, చిన్న నల్ల టికిలీ బొట్టు పెట్టుకుంటుంది. కళ్ళు పెద్దవే.. కానీ గుంతలు పడి కాస్త ఎర్రగా ఉంటాయి. మామూలు రేటు లో జార్జెట్ చీరలు కట్టుకుంటుంది. బహుశా మోకాలి నొప్పులేమో కాళ్ళు కాస్త వంచి నడుస్తుంది బస్ దిగేటప్పుడు వేసే ఆ రెండు అడుగులు కూడా నెమ్మదిగా వేస్తుంది.*
నేను దిగే స్టాప్ కంటే ముందే తాను దిగి పోతుంది. ఆ ఊర్లో అటెండర్ గా చేస్తోంది అనుకుంటా… బహుశా భర్త చనిపోతే తనకు ఈ జబ్ వచ్చినట్టుంది. సాయంత్రం రిటన్ లో నాకంటే ముందుగాలనే వెళ్ళిపోతుంది.
పక్క పక్కనే కూర్చున్నా నా మటుకు నేను చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటుంటా, తను కూడా మౌనంగా ఏమీ మాట్లాడదు.
మరి ఎందుకు నా పట్ల తనకు ఇంత అపేక్ష, ఆదరం.
నాకూ తనంటే అభిమానం, తను బస్ లో కనబడితే సంతోషంగుంటది.
ఇలా దాదాపు మూడేళ్లుగా సాగుతోంది.
విచిత్రమైన విషయం ఏంటంటే నాకు ఎపుడైనా బస్ మిస్ అయ్యి వెనక బస్ లో ఎక్కితే.. తను కూడా ఆ బస్ లోనే వుంటుంది. కోఇన్సిడెన్స్ గా తనకూ ఆరోజే లేటైయ్యింటది.
నిజంగా విడ్డూరం అనిపించడం లేదూ…?!
ఇక ఇప్పుడు ట్విస్ట్ చెప్పనా… తన పేరేమిటో నాకు ఇప్పటికీ తెలియదు.
భలే ట్విస్ట్ కదా…?!
చాలా సార్లు అనుకుంటా పేరు అడగాలని. కానీ తను ఫీలవుతుందేమో నని అడగలేక పోతున్నా… ఇన్నాళ్ళుగా నా పేరే తెలియదా… అనుకుంటుందేమో నని…
ఇది నా మొహమాటమో.. లేక తను బాధ పడకూడదనో మరి..
చాలా సార్లు అలా జరుగుతుంది కదా…చేయాలనుకుంటున్నా చెయ్యలేము.
ఇంతకీ ఆవిడ పేరు ఏమిటో..
మా మధ్య ఉన్నది స్నేహ భావనా లేక మమకారమా…?
స్నేహ భావన అనుకుందామంటే సమ వయస్కులం కామూ…
మమకారం అనుకుందాం మంటే ఏ సంబంధమూ లేదు.
స్నేహానికి వయసుతో సంబంధం లేదు, స్థాయితో పని లేదు, మమకారానికి రక్త సంబంధము ఉండాలని లేదు, చదువు, హోదా దిగదూడుపు కదా… మనల్ని అన్ కండీషనల్ గా అభిమానించే వారే మనవారు…అలా ఒక్కరిని కలిగి ఉన్నా అది అదృష్టం.
ఇంతకీ ఆ పెద్దావిడ పేరు నాకు ఎప్పటికి తెలిసేనో….?!?
-రూప
22.10.21
ఎంతో విశిష్టతను కలిగిన విద్యను ఎలా సాధించాలో చాణక్య నీతి తెలుపుతుంది
శ్లో|| క్షణశః కణశ్చైవ, విద్మయర్థం చ సాధయేత్
క్షణత్యాగేకుతో విద్య, కణత్యాగే కుతోధనమ్
ప్రతిక్షణమును సద్వినియోగం చేసుకుంటూ విద్యను ఆర్జించాలి. రూపాయి, రూపాయిని కూడ చెడితేనే ధనము పోగవుతుంది. క్షణాన్ని వ్యర్థం చేస్తే విద్య ఎలా వస్తుంది. రూపాయిని పొదుపు చేయకపోతే ధనము ఎలా పోగవుతుంది? అందుకే దేనిని అల్పంగా చూడకుండా, క్షణాన్ని, కణాన్ని కాపాడుకోవాలి. డబ్బు పట్ల ఆసక్తితో ఎలా దాచుకుంటామో, విద్య పట్ల ఆసక్తితో ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యను ఆర్జించాలి అని పై శ్లోకం తెలుపుతుంది.
(సూక్తి ముక్తావళి, మహీవర జగనో్మహనరావు, పేజి. 42, జనవరి 2015)
‘కల అంటే నిద్రలో వచ్చేది కాదు. నిద్రపోనివ్వకుండా చేసేది.’
అని అబ్దుల్ కలాం అంటారు. మన లక్ష్యంవైపు – విద్యను పొందాలి అన్న ఆలోచనవైపు విశ్రమించకుండా పరిశ్రమించడమే; అని కలాం అంటారు. ఆ దిశగా మన పయనం సాగితే దేనికీ లోటు ఉండదు.
పై శ్లోకానికి ధీటుగా, పంచతంత్రం లోని మిత్రభేదం వాక్యాలు మనకు కనిపిస్తాయి.వర్ధమానుని ఇతివృత్తం లో చిన్నయసూరి గారు,’దక్షిణాపథమందు రక్షావతి యను పట్టణము గలదు.అందు వర్ధమానుడను సార్థవాహుడు వాసము చేయుచుండును.అతడు తనకంటె సంపన్నులైన తన బంధువులను జూచి వారికంటె మిక్కిలిగా ధనము సంపాదింప వలెనని యెంచి యిట్లు చింతించెను.
“అర్థము పురుషార్థముల లోపల నుత్తమము.అర్థవంతున కసాధ్యము లోకమందేదియు గానము.కాబట్టి పురుషుడు న్యాయము దప్పక యే యుపాయము చేతనయినను ద్రవ్యము సంపాదింపవలెను.ఇంత సంపాదించితి నింకేలయని తనియరాదు.బుద్ధిమంతుడు జరామరణములు లేని వాని వలె విద్యాధనములు గడియింపవలెనని పెద్దలు చెప్పుదురు”.
ఈ వాక్యాలు విద్యను, ధనాన్ని ఎలా సంపాదించాలో తెలియజేస్తున్నాయి.విద్యాసముపార్జనలోనూ,ధనసంపాదనలోనూ తృప్తి ఉండరాదని తెలుపుతున్నాయి.
ఇక్కడ మనకొక ప్రశ్నరావొచ్చు.పైవాక్యాలకనుగుణంగా బ్రతికితే,అది తృప్తి లేని జీవితం అవుతుంది కదా ! అనే భావన కలగవచ్చు. అందులో ఉన్న లోతైన ఆలోచన మనం గుర్తించాలి.
మన విద్యాసముపార్జన ఎందరికో జ్ఞానజ్యోతి కావాలి.మన ధన సముపార్జన ఎందరికో జీవితాలను ఇవ్వాలి.అందుకోసం మనం అహరహము కృషి చేయాలి.
ఇక్కడ కూడా మనకు ఒక ప్రశ్న ఉదయించవచ్చు.ఎవరికి కావలసింది వారు సముపార్జించుకుంటే సరిపోతుంది కదా ! అని.ఈ సృష్టి లో ప్రతి జీవికి అన్నీ సాధ్యం కావు.ఉదాహరణకు పండించడం రైతుకు మాత్రమే సాధ్యం అవుతుంది.అతడు తన వరకు మాత్రమే పండించడు.మన అందరి కోసం పండిస్తాడు. అలాగే మన విద్యా ధనములు తోటివారికి ఉపయోగపడాలి.అందుకు శక్తి ఉన్నంతవరకు కృషి చేయాలి.
మానవుడు,జీవితం తన కోసమే కాదు.తోటివారందరికోసం అనే సత్యాన్ని గుర్తించాలి.వారి సంక్షేమం అనే సుందర స్వప్నానికి సాకారం కల్పించాలి.

ఆధారములు
****
అడ్డం
***
01. అమ్మ ఆవు నేర్పిన ఓనమాలు (2)
03. జింక (4)
05. మాదిరి రూపం (3)
07. రవి గాలి మోక్షం (4)
09. సమానము నకలు (2)
10. వనిత కాదు అడవి (3)
12. ఒక క్రొవ్వు బెజ్జం (2)
13. పూరి గుడిసె (2)
14. బంధువుల రాకకు ఆకర్షణ సుమతీసూక్తి (3)
16. నిస్పృహకు ముందు తోడు (3)
18. అలంకారం ఓ రసం (3)
19. పక్షిరెక్క అతిశయం (2)
21. అగ్న్యర్ధాంగి హవిర్వచనం (2)
22. కొంతవరకే కమ్మిన చీకటి (2)
23. అవిభాజ్య (4)
24. తండ్రి (2)
25. …. (శ్రద్ధ గలిగి) యిసుమున తైలంబు దీయవచ్చు (3)
27.” …. లక్ష్మణా!” .. బాధలు వెళ్ళబుచ్చే మాట (2)
30. నీచుడు (3)
32. ఇండ్ల ముందు చల్లేది (3)
33. భూలోకం (2)
34. నెమలిపురి గుత్తి (2)
35. ప్రధానేంద్రియం (3)
36. ఇక్కట్లలో నివాసం (2)ఐ
37. జలధి (2)
38. కూసేది కాదు, చేసేది (2)
40. ఉపేక్ష ఓ భాష (3)
41. వీణ వంటి వాద్యం, ప్రక్కగాజు (2)
42. గాలితో నీటిసుడి (4)
నిలువు
***
01. వాస్తవ విషయం (6)
02. ఈ దా కాదు, లాభం మరోభాషలో (2)
03. సంతానవతి (3)
04. చేతికఱ్ఱ అతిమధురం (2)
05. మావ లేని మానవతి నమస్కారం (2)
06. నటీనటుల జీవనక్షేత్రం (5)
08. చెంప క్రింది భాగం బిళ్ళకట్టు చోటు (3)
09. చలిపందిరి (2)
11. కనికట్టులో చూచి (2)
12. జీవశక్తిలో ఆవు కూతురు (2)
13. కోటలో వేసేది (2)
15. హద్దు కొలత (4)
17. ఇవి లేకుంటే చుట్టరికాలు, బాటలు మరుగౌతాయి (5)
18. మృగరాజుతో జరిగిన సంగతులను నెమరువేయు (6)
20. ఆ పూవు కాస్త వెచ్చగా ఉంటుంది (3)
26. వృథా (2)
28. కోతితో గణపతికి ఇష్టమైనది (3)
29. పొందిక (4)
30. నీచం (2)
31. సముద్రం (3)
34. ఊపిరి మ్రింగుట (2)
36. ఒక నాడి నేల ఆవు (2)
37. విరోధం (2)
38. నడుమ తరుగుతో తరుగు యుక్తమైన (2)
*****
