అరె ఉత్తమ్ నువ్వా ఎప్పుడొచ్చావ్ . అదేంట్రా ఇలా అయ్యావ్ గుర్తే పట్టలేదు. జుట్టంతా ఏమైందిరా మొత్తం బట్టతల అయింది. రా … రా..అంటూ లోనికి ఆహ్వానించాను . పది రోజులయింది పెద్దమ్మా వచ్చి . మీకు తెలుసుగా నాకున్న సమస్య ఆ పనిమీదే వచ్చాను. పాండమిక్ టైం కదా! UK నుండి వచ్చానని ఇంట్లోనే వుండమన్నారు పద్నాలుగురోజులు. పెదనాన్నతో మాట్లాడదామని వచ్చాను.
నీ కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏమో ! పిచ్చోడిలా తయారయ్యావ్ . పెళ్ళి అయిందగ్గర్నుండి గొడవలే ‘
సాత్వికం సున్నితం అయిన మనుషులంటే ఎందుకింత వివక్షో దేవుడికి. అత్తింటోళ్ళు అందరూ వేధిస్తున్నట్లు పెట్టింది కేసు సుకన్య. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఎన్నాళ్ళుగానో. తల్లిదండ్రులిద్దరికీ ఆరోగ్యం అంతంతే . వీడేమో Uk లో ఏదో జాబ్ చేస్తున్నాడు.
వీడొచ్చిన రెండు మూడు రోజులకే తల్లికి బాలేదట . మరో రెండు రోజులు చూసి నిన్ననే పెద్ద హాస్పిటల్ లో చేర్పించాడట . దూరదేశాల్లో వుండే పిల్లలు తల్లిదండ్రుల మీద ప్రేమతో అవసరం వున్నా లేకున్నా పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో జాయిన్ చేయడం బాగా ఎక్కువైంది.
స్నేహితులుగా విడిపోతే బాగుంటుందన్న సలహా తో .. ఇన్ని సంవత్సరాల విసుగుతో .. సరే నంటూ వెళ్ళిపోయాడు .
ఆహాస్పిటల్ కెళ్ళి తల్లిని చూద్దామంటే చూడనివ్వరట . మంచిగ నేవుంది అంటూ రోజు లక్షల్లోనే ఫీజు వసూలు చేస్తున్నారట . పెరిగి పోతున్న బిల్లు చూసి మేం వేరే హస్పిటల్ కెళ్తాం డిస్చార్జీ రాయమంటే రాయకుండా నువ్వే చూద్దువు రా అంటూ తీసుకెళ్ళి దూరం నుండి ఆమె చెయ్యి లేపి అదిగో నిన్ను గుర్తు పట్టింది మాట్లాడుతున్నది చూడు
చూడు అంటూ బైటికి పంపారట వీడిని. నిజమేనేమో మెరుగవుతున్నదేమో అని సంతోషంగా ఇంటికి చేరి తండ్రికి చెప్పాడట . ఆ సాయంత్రమే ఆమె చనిపోయినట్లు కబురు . హతాశులయ్యారు .
ఆ బిల్లు చూసి ఏడవాలో .. తల్లి పోయిందని ఏడవాలో .. అర్ధం కాని అయోమయ పరిస్థితి . ఇంత బిల్లు ఎందుకయిందనే ప్రశ్నకు కంఠశోశే మిగిలింది.
డబ్బు లేదు .. అమ్మ లేదు .. భార్య లేదు .
విధి ఎంత విచిత్రం ! వీడు రావడమేంటి – తల్లి పోవడమేంటి ఆ పదిరోజులన్నా చూసుకో గలిగాడు. తల్లిని చివరి దశలో ‘ తండ్రిని అక్క దగ్గర వుంచి కొండంత భారంతో తిరిగి వెళ్ళాడు.
ఇంద్రధనుస్సు
తన పేరు…..
మా ఇల్లు టౌన్ అయిపోయాక వెలుపల టౌన్ బయట ఉంటుందీ. ఆఫీస్ టైమ్ కి వెళ్ళే బస్ లో అందరి కంటే చివ్వరగా ఎక్కేది నేనే ఊరి చివ్వర ఉంటాను గదా అందుకని.
బయట ఎవరు ఉన్నారో తెలియనంత రష్ ఉన్నాగానీ అక్కడ బస్ ఆగింది అంటే, అపుడు బస్ ఎక్కేది నేనే అనీ చూడకుండానే రోజూ వచ్చే వారికి తెలిసి పోతుంది. ఆఫీస్ లకు వెళ్ళే టైమ్ కావడం వల్ల, బస్ ఊరంతా దాటినంక నా ప్లేసుకు వచ్చే సరికే బస్ పూర్తీగా నిండి వస్తుంది. నాకు దాదాపు సీటు దొరకదు. ఎక్కడో ఓ చోట సర్దుకొని కుచోవాలి, వద్దు అనుకుంటే నిల్చోవాలి. అలా ఉంటుంది రోజూ.
అదే బస్ లో ఓ పది మంది దాక రెగ్యులర్ గా ఎక్కుతుంటాం. డైలీ ఎక్కే వాళ్ళు అంత మంది ఉన్నా… నేనంటే ఎందుకో తనకు ప్రత్యేకత.
తను మిగితా వారితో మాట్లాడినట్టు కూడా నేను ఎప్పుడూ చూడలేదు. కానీ మేము మాత్రం రోజూ కళ్ళతోనే పకరించుకుంటాం.
నన్ను తన మనిషిలా ఫీల్ అవుతుంది.
నా కంటే ముందే టౌన్ లోనే ఎక్కడో బస్ ఎక్కి ఉంటుంది. నేను ఎక్కీ ఎక్కగానే నాకోసం సీటు సర్దుబాటు చేస్తుందీ. తను కూచున్న సీట్లో ముగ్గురూ నిండి ఉంటే ఇంకెక్కడైనా ఖాళీ ఉందేమో చూస్తుంది. ఉంటే అందులో ఉన్న వాళ్ళను సర్ధుకోమని చెప్పి, ‘ఆడ కుచో మేడం’ అని నాకు పురమాయిస్తుంది. అక్కడ కుచోడానికి ఒకవేళ నేను ఇబ్బంది పడుతుంటే.. “నేను ఆడికి పోతా నీవు ఈడ కూసో మేడం” అని అంటుంది. నేను “పరవాలేదు నేను నిల్చుంటా అని వారిస్తే”, తాను ముందుకి జరిగి నాకూ కాస్త చోటు ఇస్తుంది.
ఇవ్వాళ బస్ లో ఉన్నంత సేపూ మళ్ళా మళ్ళా అనిపించింది ‘ఎందుకు తనకు నేనంటే ఆపెచ్చా…!?’
వయసు దాదాపు 55 వుంటుంది కావచ్చు, మనిషి సన్నగా ఉంటుంది, అంత వయసు లో కూడా జుట్టు మాత్రం నల్లగా ఉంటుంది. ఏదో ఫార్మాలిటీ కోసం అన్నట్టుగా ఆడోటి ఆడోటి తెల్ల వెంట్రుకలు ఉంటాయనుకోండి. సన్నని ఓ అర మూరెడు జడ వేసుకుంటుది. జీవితంలో ఎన్ని భాద్యతలు మోసిందో మరి అవి తెలియజేయడానికా అన్నట్టు మోహం మీద వయసుకు మించిన ముడతలు. పల్చటి చర్మం చూడ్డానికి కాస్త రంగు తక్కువ గానే అనిపిస్తుంది గానీ యవ్వనంలో ఉన్నపుడు ఎరుపు రంగులోనే ఉండి ఉంటుంది. భర్త పోయినట్టుంది. చేతులకు చెరో వైపు రెన్రెండు వన్ గ్రామ్ గోల్డ్ గాజులు వేసుకుంటుది, చిన్న నల్ల టికిలీ బొట్టు పెట్టుకుంటుంది. కళ్ళు పెద్దవే.. కానీ గుంతలు పడి కాస్త ఎర్రగా ఉంటాయి. మామూలు రేటు లో జార్జెట్ చీరలు కట్టుకుంటుంది. బహుశా మోకాలి నొప్పులేమో కాళ్ళు కాస్త వంచి నడుస్తుంది బస్ దిగేటప్పుడు వేసే ఆ రెండు అడుగులు కూడా నెమ్మదిగా వేస్తుంది.*
నేను దిగే స్టాప్ కంటే ముందే తాను దిగి పోతుంది. ఆ ఊర్లో అటెండర్ గా చేస్తోంది అనుకుంటా… బహుశా భర్త చనిపోతే తనకు ఈ జబ్ వచ్చినట్టుంది. సాయంత్రం రిటన్ లో నాకంటే ముందుగాలనే వెళ్ళిపోతుంది.
పక్క పక్కనే కూర్చున్నా నా మటుకు నేను చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటుంటా, తను కూడా మౌనంగా ఏమీ మాట్లాడదు.
మరి ఎందుకు నా పట్ల తనకు ఇంత అపేక్ష, ఆదరం.
నాకూ తనంటే అభిమానం, తను బస్ లో కనబడితే సంతోషంగుంటది.
ఇలా దాదాపు మూడేళ్లుగా సాగుతోంది.
విచిత్రమైన విషయం ఏంటంటే నాకు ఎపుడైనా బస్ మిస్ అయ్యి వెనక బస్ లో ఎక్కితే.. తను కూడా ఆ బస్ లోనే వుంటుంది. కోఇన్సిడెన్స్ గా తనకూ ఆరోజే లేటైయ్యింటది.
నిజంగా విడ్డూరం అనిపించడం లేదూ…?!
ఇక ఇప్పుడు ట్విస్ట్ చెప్పనా… తన పేరేమిటో నాకు ఇప్పటికీ తెలియదు.
భలే ట్విస్ట్ కదా…?!
చాలా సార్లు అనుకుంటా పేరు అడగాలని. కానీ తను ఫీలవుతుందేమో నని అడగలేక పోతున్నా… ఇన్నాళ్ళుగా నా పేరే తెలియదా… అనుకుంటుందేమో నని…
ఇది నా మొహమాటమో.. లేక తను బాధ పడకూడదనో మరి..
చాలా సార్లు అలా జరుగుతుంది కదా…చేయాలనుకుంటున్నా చెయ్యలేము.
ఇంతకీ ఆవిడ పేరు ఏమిటో..
మా మధ్య ఉన్నది స్నేహ భావనా లేక మమకారమా…?
స్నేహ భావన అనుకుందామంటే సమ వయస్కులం కామూ…
మమకారం అనుకుందాం మంటే ఏ సంబంధమూ లేదు.
స్నేహానికి వయసుతో సంబంధం లేదు, స్థాయితో పని లేదు, మమకారానికి రక్త సంబంధము ఉండాలని లేదు, చదువు, హోదా దిగదూడుపు కదా… మనల్ని అన్ కండీషనల్ గా అభిమానించే వారే మనవారు…అలా ఒక్కరిని కలిగి ఉన్నా అది అదృష్టం.
ఇంతకీ ఆ పెద్దావిడ పేరు నాకు ఎప్పటికి తెలిసేనో….?!?
-రూప
22.10.21
ఎంతో విశిష్టతను కలిగిన విద్యను ఎలా సాధించాలో చాణక్య నీతి తెలుపుతుంది
శ్లో|| క్షణశః కణశ్చైవ, విద్మయర్థం చ సాధయేత్
క్షణత్యాగేకుతో విద్య, కణత్యాగే కుతోధనమ్
ప్రతిక్షణమును సద్వినియోగం చేసుకుంటూ విద్యను ఆర్జించాలి. రూపాయి, రూపాయిని కూడ చెడితేనే ధనము పోగవుతుంది. క్షణాన్ని వ్యర్థం చేస్తే విద్య ఎలా వస్తుంది. రూపాయిని పొదుపు చేయకపోతే ధనము ఎలా పోగవుతుంది? అందుకే దేనిని అల్పంగా చూడకుండా, క్షణాన్ని, కణాన్ని కాపాడుకోవాలి. డబ్బు పట్ల ఆసక్తితో ఎలా దాచుకుంటామో, విద్య పట్ల ఆసక్తితో ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యను ఆర్జించాలి అని పై శ్లోకం తెలుపుతుంది.
(సూక్తి ముక్తావళి, మహీవర జగనో్మహనరావు, పేజి. 42, జనవరి 2015)
‘కల అంటే నిద్రలో వచ్చేది కాదు. నిద్రపోనివ్వకుండా చేసేది.’
అని అబ్దుల్ కలాం అంటారు. మన లక్ష్యంవైపు – విద్యను పొందాలి అన్న ఆలోచనవైపు విశ్రమించకుండా పరిశ్రమించడమే; అని కలాం అంటారు. ఆ దిశగా మన పయనం సాగితే దేనికీ లోటు ఉండదు.
పై శ్లోకానికి ధీటుగా, పంచతంత్రం లోని మిత్రభేదం వాక్యాలు మనకు కనిపిస్తాయి.వర్ధమానుని ఇతివృత్తం లో చిన్నయసూరి గారు,’దక్షిణాపథమందు రక్షావతి యను పట్టణము గలదు.అందు వర్ధమానుడను సార్థవాహుడు వాసము చేయుచుండును.అతడు తనకంటె సంపన్నులైన తన బంధువులను జూచి వారికంటె మిక్కిలిగా ధనము సంపాదింప వలెనని యెంచి యిట్లు చింతించెను.
“అర్థము పురుషార్థముల లోపల నుత్తమము.అర్థవంతున కసాధ్యము లోకమందేదియు గానము.కాబట్టి పురుషుడు న్యాయము దప్పక యే యుపాయము చేతనయినను ద్రవ్యము సంపాదింపవలెను.ఇంత సంపాదించితి నింకేలయని తనియరాదు.బుద్ధిమంతుడు జరామరణములు లేని వాని వలె విద్యాధనములు గడియింపవలెనని పెద్దలు చెప్పుదురు”.
ఈ వాక్యాలు విద్యను, ధనాన్ని ఎలా సంపాదించాలో తెలియజేస్తున్నాయి.విద్యాసముపార్జనలోనూ,ధనసంపాదనలోనూ తృప్తి ఉండరాదని తెలుపుతున్నాయి.
ఇక్కడ మనకొక ప్రశ్నరావొచ్చు.పైవాక్యాలకనుగుణంగా బ్రతికితే,అది తృప్తి లేని జీవితం అవుతుంది కదా ! అనే భావన కలగవచ్చు. అందులో ఉన్న లోతైన ఆలోచన మనం గుర్తించాలి.
మన విద్యాసముపార్జన ఎందరికో జ్ఞానజ్యోతి కావాలి.మన ధన సముపార్జన ఎందరికో జీవితాలను ఇవ్వాలి.అందుకోసం మనం అహరహము కృషి చేయాలి.
ఇక్కడ కూడా మనకు ఒక ప్రశ్న ఉదయించవచ్చు.ఎవరికి కావలసింది వారు సముపార్జించుకుంటే సరిపోతుంది కదా ! అని.ఈ సృష్టి లో ప్రతి జీవికి అన్నీ సాధ్యం కావు.ఉదాహరణకు పండించడం రైతుకు మాత్రమే సాధ్యం అవుతుంది.అతడు తన వరకు మాత్రమే పండించడు.మన అందరి కోసం పండిస్తాడు. అలాగే మన విద్యా ధనములు తోటివారికి ఉపయోగపడాలి.అందుకు శక్తి ఉన్నంతవరకు కృషి చేయాలి.
మానవుడు,జీవితం తన కోసమే కాదు.తోటివారందరికోసం అనే సత్యాన్ని గుర్తించాలి.వారి సంక్షేమం అనే సుందర స్వప్నానికి సాకారం కల్పించాలి.
పదకిరణ కలనం-4

ఆధారములు
****
అడ్డం
***
01. అమ్మ ఆవు నేర్పిన ఓనమాలు (2)
03. జింక (4)
05. మాదిరి రూపం (3)
07. రవి గాలి మోక్షం (4)
09. సమానము నకలు (2)
10. వనిత కాదు అడవి (3)
12. ఒక క్రొవ్వు బెజ్జం (2)
13. పూరి గుడిసె (2)
14. బంధువుల రాకకు ఆకర్షణ సుమతీసూక్తి (3)
16. నిస్పృహకు ముందు తోడు (3)
18. అలంకారం ఓ రసం (3)
19. పక్షిరెక్క అతిశయం (2)
21. అగ్న్యర్ధాంగి హవిర్వచనం (2)
22. కొంతవరకే కమ్మిన చీకటి (2)
23. అవిభాజ్య (4)
24. తండ్రి (2)
25. …. (శ్రద్ధ గలిగి) యిసుమున తైలంబు దీయవచ్చు (3)
27.” …. లక్ష్మణా!” .. బాధలు వెళ్ళబుచ్చే మాట (2)
30. నీచుడు (3)
32. ఇండ్ల ముందు చల్లేది (3)
33. భూలోకం (2)
34. నెమలిపురి గుత్తి (2)
35. ప్రధానేంద్రియం (3)
36. ఇక్కట్లలో నివాసం (2)ఐ
37. జలధి (2)
38. కూసేది కాదు, చేసేది (2)
40. ఉపేక్ష ఓ భాష (3)
41. వీణ వంటి వాద్యం, ప్రక్కగాజు (2)
42. గాలితో నీటిసుడి (4)
నిలువు
***
01. వాస్తవ విషయం (6)
02. ఈ దా కాదు, లాభం మరోభాషలో (2)
03. సంతానవతి (3)
04. చేతికఱ్ఱ అతిమధురం (2)
05. మావ లేని మానవతి నమస్కారం (2)
06. నటీనటుల జీవనక్షేత్రం (5)
08. చెంప క్రింది భాగం బిళ్ళకట్టు చోటు (3)
09. చలిపందిరి (2)
11. కనికట్టులో చూచి (2)
12. జీవశక్తిలో ఆవు కూతురు (2)
13. కోటలో వేసేది (2)
15. హద్దు కొలత (4)
17. ఇవి లేకుంటే చుట్టరికాలు, బాటలు మరుగౌతాయి (5)
18. మృగరాజుతో జరిగిన సంగతులను నెమరువేయు (6)
20. ఆ పూవు కాస్త వెచ్చగా ఉంటుంది (3)
26. వృథా (2)
28. కోతితో గణపతికి ఇష్టమైనది (3)
29. పొందిక (4)
30. నీచం (2)
31. సముద్రం (3)
34. ఊపిరి మ్రింగుట (2)
36. ఒక నాడి నేల ఆవు (2)
37. విరోధం (2)
38. నడుమ తరుగుతో తరుగు యుక్తమైన (2)
*****
1960లో వచ్చిన ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’లో ఆత్రేయ వ్రాసిన ‘ఎవరో అతడెవరో’ పాట ఒక రసాత్మక గీతం. బృందావన సారంగ రాగంలో పెండ్యాల నాగేశ్వరరావు దీనిని స్వరపరచారు. ఘంటసాల, సుశీల పాడిన యీ పాటను ఎన్టీఆర్, సావిత్రి లపై చిత్రీకరించారు దర్శకులు పి.పుల్లయ్య.
పల్లవి : ఎవరో అతడెవరో, ఆ నవ మోహను డెవరో, నా మానస చోరుడెవరో, ||ఎవరో||
తొలి చూపులలో వలపులు చిలికి దోచిన మగసిరి దొర ఎవరో ||తొలి||
అరయక హృదయమునర్పించితినని, ఆదరించునో ఆదమరచునో ||ఎవరో||
వల రాజా? కలువల రాజా? కాడే కన్నుల కగుపడినాడే!
అకలంకుడే…. హరిణాంకుడు కాడే ||అక||
మరి ఎవరో ఏమరినానో ||ఎవరో||
శ్రీ మహావిష్ణువు శ్రీనివాసునిగా లక్ష్మిదేవి పద్మావతిగా అవతరించారు. పద్మావతి శ్రీనివాసుని చూచినప్పటి నుండి తన హృదయాన్ని అర్పించింది. శ్రీనివాసుడే శ్రీ మహావిష్ణువని తెలియక ‘ఎవరో అతడెవరో’ అని పాడుకున్నదని ఆత్రేయగారి వాదన. అంటే మానవ రూపంలో అవతరించిన లక్ష్మీదేవికి శ్రీనివాసుడు నవమోహనుడిగా, తన మానస చోరుడిగా అగుపించాడు. తన హృదయాన్ని అర్పించినది. అతడు కూడా తన కోరికను మన్నిస్తాడో లేదో అని బాధపడుతుంది. పైగా తాను ఇష్టపడిన శ్రీనివాసుడు మన్మథుడా (వలరాజా) దేహం లేని మన్మథుడైతే మరి తన కళ్ళకు కనపడుతున్నాడే! చంద్రుడా (కలువల రాజా), జింక చిహ్నం మచ్చగా గల చంద్రుని (హరిణాంకుడు) లాంటివాడు కాదే, మచ్చలేనివాడు (అకలంకుడు) (హరిణాంకుడు) లాంటి వాడు కాదే, మచ్చలేనివాడు (అకలంకుడు) కదా తాను ఇష్టపడినవాడని పద్మావతి ఊహించుకొన్నదని భావుకుడైన ఆ్రతేయగారి ఆలోచన. కాని ఆలోచిస్తే శ్రీ మహావిష్ణువుని ఆత్రేయగారు అతని కంటె స్థాయిలో చిన్నవారైన మన్మథునితోను, చంద్రునితోను పోల్చడం, విష్ణువు గుండెలపై ఉన్న శ్రీవత్స చిహ్నం(మచ్చ) గురించి ఆమె మరచిపోయి అకలంకుడు అని భావించడం, ఇతరులు విమర్శించడానికి అవకాశం ఇస్తుంది.
‘చలువలు కురిసే జాబిలి !
చెలి కలతను తెలిసీ కలుగద జాలి
కరుణ చూపి కబురు తెలిపి రమ్మనవా నను చే కొమ్మనవా’
తన మనోగతాన్ని చందమామకు తెలిపి, నీవు చల్లని వెన్నెల కురిపించే వాడివి– “ఆతడు నా బావని నీకు తెలిసినప్పటికి నా మీద జాలి కలగడం లేదా ? నాపై దయ చూపి, శ్రీనివాసుని నేను ప్రేమిస్తున్నాననే కబురు ఆయనకు చెప్పి ” తనను పెళ్ళి చేసుకొమ్మని చెప్పమని రాయబారిగా వెళ్ళమని చంద్రుణ్ణి, పద్మావతి బ్రతిమాలుతుంది.
‘కరుణ చూపి కబురు తెలిపి’
చరణంలో ఉర్దూ పరమైన
‘ కబురు ’ _ తాను ఉపయోగించినందుకు ఈ పాట రికార్డింగు పూర్తయ్యాక, ఆత్రేయగారికి గుర్తొచ్చి, బాగా బాధపడ్డారట. వెంటనే తనకు గురు సమానుడైన రచయిత మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి వద్దకు వెళ్ళి, తన మనసులోని బాధను చెప్పారట ఆత్రేయ. అందుకు మల్లాదివారు ‘ఏం ఫర్వాలేదు. ఆ కాలంలో బీబీ నాంచారి కూడా ఉన్నది. ఆమె ముస్లిం కదా, బాధపడవద్దని ఆత్రేయగారిని ఊరడించారట. అంటే ఎవరూ కూడ పసిగట్టలేనటువంటి ప్రయోగాన్ని ఉపయోగించినందుకు ఆత్రేయగారు బాధపడిన తీరు చూస్తుంటే ఆయన నిజాయితీ తెలుస్తుంది. ఇక్కడ ఊరడించిన మల్లాది వారి ప్రతిభ , సాహిత్య విశ్లేషణ శక్తి , ఆ రోజుల్లో ఎందరికో ఆయన పెద్ద దిక్కైన గొప్పతనమూ గమనించవచ్చు.
పద్మావతి తన బాధను చందమామతో వెల్లడించిన సమయంలోనే శ్రీనివాసుడు కూడ
‘ఎవరో తానెవరో ఆ నవమోహిని ఎవరో నా మానస హారిణి ఎవరో ||ఎవరో||
నందన వనమున నానందములో తొలిసారిగ పూచిన పూవో
||నందన||
తొలకరి యవ్వన మొలికిన నవ్వో మనసిచ్చినదో నను మెచ్చినదో
ఆ జవ్వని ఎవరో తానెవరో ఆ నవ మోహిని ఎవరో నా మానస హారిణి
ఎవరో ఎవరో తానెవరో ’ అని తన మనో గతాన్ని వ్యక్తపరచాడు. ఆత్రేయగారి భావనలో పద్మావతి, శ్రీనివాసుడు ఇద్దరు కూడా ‘Both are Sailing in the same boat’ ఒకే విధమైన అనుమానంతో ఆందోళన తో ఉన్నారు.
పద్మావతి : నవ మోహనుడు అంటే శ్రీనివాసుడు : నవమోహిని అంటున్నాడు. ఇంకా ఇంకా
మానస చోరుడు : మానస హారిణి
తొలి చూపులలో : నందన వనముననానందములో తొలి పూవో …
వలపులు చిలికి దోచిన తొలిసారిగ పూచిన పూవు
మగసిరి దొర : మనసిచ్చినదో,
నను నర్పించితినె : ఆదరించునో
మెచ్చినదో : ఆదమరచునో
ఆత్రేయగారి ఆలోచన, అంతర్మథనం, అంతర్ముఖత్వం మనకు ఈ పాటలో స్ఫురిస్తున్నాయి. కనుకనే 60 స.లు గడిచిపోయినప్పటికి ఈ పాట సాహితీ మర్యాదను అందుకుంటున్నది.
– ఏలూరు అశోక్ కుమార్ రావు, హైదరాబాద్
ఆచార్య ఆత్రేయ (కిళాంబి వేంకట నరసింహాచార్యులు)
తన గోత్రాన్ని కలం పేరుగా పెట్టుకొని సినీరంగ ప్రవేశం చేశాడు ఆత్రేయ . నాటక రచయిత, సినిమా మాటల, పాటల రచయిత, దర్శకుడు 1961 సంవత్సరంలో వాగ్దానం సినిమాను నిర్మించారు. తెలంగాణ మహాకవి దాశరథి ని మద్రాసు పిలిపించుకొని
“నా కంటిపాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా “పాటను వ్రాయించుకున్న కవిప…
చంచ న్మాయాప్రపంచ స్థితి లయకరణాద్యంత తంత్రస్వతంత్రం
కంబాలాభప్రతాపం కపటపటు పటాలంబిత ప్రాఙ్నితంబం
రంగజ్జంఘాల జంఘాయుగ మపరిమితానందనందాభివంద్యం
వందే యాదక్షమాభృత్కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహమ్ !
తాత్పర్యం: అస్థిరమైన ఈ మాయా ప్రపంచం యొక్క ఉనికికీ, మహా ప్రళయంలో లయమై పోవటానికీ, సమస్త సృష్టి పరిరక్షణకూ, పోషణకూ, ఆదినుండీ అంతమువరకూ అన్నింటికీ కారణభూతమైన స్వతంత్ర చిద్రూపుడూÑ అపార పరాక్రమశాలిjైున ఆంజనేయునితో సముడగు ప్రతాపశాలీÑ తన మాయాబలంతో వస్త్రంవలె తూర్పుపర్వతాన్నంతా కప్పివేసినవాడూÑ ప్రకాశిస్తూ శీఘంగా కదలగల బలిష్ఠములైన రెండు పిక్కలు కలవాడు, తనయుని బాల్య చేష్టావిశేషాల చేత అంతులేని ఆనందాన్ని పొందిన నందునిచేత నమస్కరింపబడినవాడూ అయిన ` యాదగిరిపై నెలకొని తన బలిష్ఠములైన భుజముల బలపరాక్రమాలను ప్రదర్శిస్తున్న ` శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని నమస్కరిస్తున్నాను.
విశేషాలు: ‘‘య ద్దృశ్యం త న్నశ్యం’’ అని వేదాంతులు నొక్కి వక్కాణించారు. ఇంద్రియ గోచరమయ్యే ప్రతిదీ నశించిపోయేదే అని దీని భావం! సమస్త చరాచర సృష్టినీ తనలోని అంతర్భాగంగా చేసుకుని అంతా తానుగా కనిపించే ఈ ప్రపంచం (చంచత్GమాయాGప్రపంచంR) కదులుతూ ఉన్నట్లుగా కనిపించే మాయాప్రపంచమే! ఈ ప్రపంచం యొక్క ఉనికి (స్థితిR) అంటే జన్మించినట్లుగా కనిపించి, ఇదంతా నిజమేనని భ్రమింపజేసి, (లయR) కొంతకాలం అందరినీ మాయలో ముంచి, శోక`మోహాదులకు గురిచేసి, నశించిపోతున్నట్లుగా అనిపించి, చివరికి మహాప్రళయ సమయంలో సమస్తాన్నీ తనలో కలుపుకునే మహాసముద్రంగా కనిపించి, ఈ (జన్మలయల) మధ్య కాలంలో (కరణR) రక్షింపబడుతూ, వృద్ధి చెందుతూ ఉన్నట్లుగా అందరినీ భ్రమింపజేసే ఈ మాయా ప్రపంచం (స్థితిGలయGకరణGఆద్యంతGతంత్రGస్వతంత్రంR) పుట్టుకకూ, వృద్ధికీ, నాశానికీ తానే మూలకారణమైన సర్వతంత్ర స్వతంత్రుడు ఆ లక్ష్మీనరసింహస్వామి!
బమ్మెర పోతన మహాకవి కూడ భాగవతంలో ఈ విషయాన్ని ఈ విధంగా పేర్కొన్నాడు ` ‘‘ఎవ్వనిచే జనించు జగ, మెవ్వని లోపల నుండు, లీనమై యెవ్వని యందు డిరదు, పరమేశ్వరుడెవ్వడు, మూలకారణం బెవ్వ, డనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానjైునవాడెవ్వడు, వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్’’ అంటూ ఆ పరమేశ్వరుణ్ణి వేడుకున్నాడు.
(కంGబాలGఆభGప్రతాపంR) ‘క’ అనే ఏ కాక్షరానికి ఉన్న నానార్థాలలో వాయుదేవుడు అన్న అర్థం కూడ ఒక్కటి. వాయుదేవుని బాలుడు (కుమారుడు) ఆంజనేయస్వామి. బాలశబ్దానికి చిన్న శిశువు అన్న అర్థం కూడ ఉంది. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే ఆంజనేయుడు ఉదయిస్తున్న సూర్యుణ్ణి పండుగా భావించి, మింగటానికి పైకెగిరిన విషయం తెలిసిందే కదా! అంతటి పరాక్రమశాలి ఆంజనేయుడు. సీతజాడ తెలిసికొని వచ్చిన ఆంజనేయుణ్ణి, అతని పరాక్రమాన్ని మెచ్చుకున్న సుగ్రీవుడు లక్ష్మణునితో ఇలా అంటాడు ` ‘‘కార్యసిద్ధి ర్మతి శ్చైవ తస్మి న్వానరపుంగవే, వ్యవసాయ శ్చ వీర్యం చ శ్రుతం చాపి ప్రతిష్ఠితమ్, జాంబవా న్యత్ర నేతా స్యా దంగద శ్చ మహాబలః హనూమాం శ్చా ప్యధిష్ఠాతా న తస్య గతి రన్యథా’’ ‘‘వానశ్రేష్ఠుడైన ఆ హనుమంతునిలో కార్యసిద్ధి, తెలివితేటలు, పట్టుదల, పరాక్రమము, విద్య అన్నీ నెలకొన్నాయి. ఏ పనిలో జాంబవంతుడు, మహాబలుడగు అంగదుడు నాయకులుగా ఉంటారో, హనుమంతుడు తోడుగా ఉంటాడో ఆ పని వేరు విధంగా కాదు. అంటే తప్పకుండా జయప్రదం అవుతుంది’’ అని అంటాడు.
తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు. ఇంద్రుడు సమస్త దేవతాగణానికీ, దేవలోకానికీ అధిపతి కూడా! దైత్యదానవుల తాకిడి నుండి ఇంద్రుణ్ణీ, దేవలోకాలను రక్షించేవాడు శ్రీహరి! వాళ్ళు పన్నే చిత్ర విచిత్రములైన మాయోపాయాలన్నిటినీ ఛేదిస్తూ ` అనంతమైన, అభేద్యమైన కవచంగా నిలిచేవాడు విష్ణుమూర్తి! (కపటGపటుGపటGఆలంబితGప్రాక్GనితంబంR) రాక్షసుల దాడి నుండి సురలోకాన్ని కాపాడటం కోసం (కపటR) తన విష్ణుమాయ అనే (పటుGపటR) దృఢమైన వస్త్రంతో (ఆలంబితGప్రాక్GనితంబంR) కొండ మధ్య భాగం వలె స్థిరమైన సురలోకాన్ని కప్పి, రక్షిస్తున్నాడు. నితంబం అంటే కొండ (పర్వతం) యొక్క నడిమి భాగం అని అర్థం. విష్ణుమాయ నిరంతరం దుర్మార్గుల బారి నుండి (ప్రాక్GనితంబంR) దేవ లోకాలను కాపాడుతూ ఉంటుందని భావం!
పిక్కల్లో బలం ఉంటే కాని శత్రువులను ఎదిరించి పోరాడి విజయం సాధించలేము. యుద్ధంలో (రంగత్GజంఘాలG జంఘాయుగంGఅపరిమితGఆనందGనందGఅభివంద్యంR) తన బలపరాక్రమాలను ప్రదర్శించాడు శ్రీకృష్ణావతారంలో శ్రీహరి. దానిని చూడటం వలన అపరిమితమైన ఆనందం కలిగింది నందగోపుడికి. భక్తితో శ్రీకృష్ణపరమాత్మను (శ్రీహరిని) స్తుతించి నమస్కరించాడు నందుడు.
అనంత మహిమాన్వితుడై, యాదాద్రిపై నెలకొని తన బలిష్ఠములైన భుజముల బలమును ప్రదర్శించుచున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని కవి భక్తి ప్రపత్తులతో స్తుతించి నమస్కరిస్తున్నాడు.
తేడా
——-
ఆకాశంలో
మిణుకు మిణుకుమంటూ
మెరిసే కోటానుకోట్ల
నక్షత్రాల కన్నా…..
జిగేల్ న మెరిసే
ఒక జాబిల్లి మిన్న
పదవి పట్టాన్ని వరించి
వాగ్దానాల నూకల్ని విసిరే
నాయకుల కన్నా
జాతిని ఒక త్రాటిపై నడిపే
ఉద్యమకారుడు మిన్న
—-**——
రాజకీయం
—————
రాజకీయ ప్రయాణంలో
పదవుల పట్టాలు తప్పి
ప్రతిపక్ష పార్టీల
యాక్సిడెంట్లు సహజం –
వాటిని తట్టుకుని
ముందుకు సాగినవాడే
రాజకీయ నాయకుడు
అదే అసలైన
రాజకీయం
కె.హరనాథ్, 9703542598
క్రిందటి సంచికలో విద్య యొక్క ఆవశ్యకతను తెలుసుకున్నాం. ఈ సంచికలో విద్యకు చెందిన మరొక రేఖను చూద్దాం.
శ్లో|| దుర్జనః పరిహర్తవ్యో విద్యయాలంకృతో పిసన్2 పిసన్ !
మణినా భూషితస్సర్పః కి మసౌ న భయంకరః?
అని భర్తృహరి దుర్జన పద్ధతిలో చెబుతాడు.
విద్య ఎంతో గొప్పదైనా అది ఎవరి వద్ద ఉన్నదో, వారినిబట్టి మాత్రమే ఫలితం ఉంటుంది. మంచివారి వద్ద ఉన్న విద్య ఎంత లోకహితము. వారినే మనం ఆశ్రయించాలి. విద్య ఉన్నది కదా అని దుర్మార్గులను మనం చేరదని తెలిపే పై శ్లోక తాత్పర్యానికి ఏనుగు లక్ష్మణకవి సులువైన తెలుగు చేశాడు.
తే. విద్యచే భూషితుండయి వెలయుచున్న
దొడరి వర్జింపనగుజుమీ దుర్జనుండు
చారు మాణిక్య భూషిత శస్తమస్త
కంబయిన పన్నజిి గము భయంకరముగాదె!
పాము తలపై ఎంత విలువైన మాణిక్యం ఉన్నప్పటికీ మనం ఎలా దూరంగా ఉంటామో, దుర్మార్గుని వద్ద ఎంత గొప్ప విద్య ఉన్నప్పటికీ అతని దరికి మనం చేరరాదని భావం.
విలువ కలిగిన మణి ఉన్నది కదా! అని పాము తన సహజ స్వభావాన్ని ఎలా మార్చుకోలేదో, అలాగే దుర్జనుడు ఎన్ని గొప్ప చదువులు చదివినప్పటికీ తన స్వభావాన్ని వదులుకోలేడు. విద్య, మనిషిని చెడు నుండి మంచివైపుకు మరల్చాలి కదా! అనే సందేహం మనకు కలగొచ్చు. కాని, అతడు నేర్చిన విద్యను, అతని దుష్టస్వభావమే బలీయమైనపుడు, విచక్షణ కోల్పోతాడు. పాములాగానే ప్రవర్తిస్తాడు అని గుర్తించాలి.
అతనికే సమాజంలో వ్యక్తులతో మనం తగు జాగ్రత్తలతో మెలగాలని కవులు మనకు బోధిస్తున్నారని గ్రహించాలి.
స్వామి వివేకానందగారి ప్రసంగాలలో లభించిన ఆణిముత్యాలను ఈ సందర్భంగా మనం గుర్తుచేసుకుందాం.
‘ధనం కాదు, కీర్తి ప్రతిష్టలూ కాదు, విద్వత్తు (పాండిత్యం) కాదు. సౌశీల్యం ఒక్కటే కష్టాలనే దుర్భేధ్యమైన అడ్డుగోడలను చీల్చుకని పోగలిగినది. దీనిని జ్ఞప్తిలో ఉంచుకోండి.’
అన్న మాటల్లో విద్య కన్నా విచక్షణ ముఖ్యమని, సౌశీల్యమే గొప్పదని, అది మాత్రమే సమాజంలోని అడ్డుగోడల్ని కూల్రదోయ గలదని ఆయన అభిప్రాయము.
ఆట పాటల్లో, వేషభాషల్లో, సుఖదుఃఖాల్లో అన్ని దైనందిన అలవాట్లలో నీతి తప్పని ధీరులై, జీవించండి. అలాంటి ఆదర్శంతో, జీవితాన్ని నిర్మించుకుంటే ఇతరులు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు.’
అన్న మాటల్లో బాహిరమైన వేషధారణే కాదు. అంతరమైన భావజాలం కూడా ఆదర్శపూరితంగా ఉండాలన్నది అర్థమవుతూంది. మనోవాక్కాయ కర్మలయందు ఎవరు పవిత్రులై ఉంటారో వారు మాత్రమే సత్ పురుషులుగా కీర్తింపబడతారని మనం గుర్తించాలి.
ఇటువంటి పెద్దల వాక్యాలు మనల్ని మరింత పరిపూర్ణులుగా తయారుచేస్తాయి. ఎప్పటికప్పుడు మనల్ని మనం తీర్చిదిద్దుకోడానికి ఉపయోగపడతాయి.
దర్భశయనం శ్రీనివాసాచార్యులు గారు ఈ కవితను 6.1. 2012 వ తేదీన రంచించారు . 27.2.2012 ఆంధ్రప్రభ దినపత్రిక లో మొదటిసారి అచ్చయింది. శ్రీనివాసాచార్యులు గారు ఈ కవితను , వారు రామప్పను స్వయంగా దర్శించినప్పుడు అక్కడ వీరికి రామప్పను గురించిన విశేషాల్ని గోరెంట్ల విజయ్ కుమార్ అనే గైడ్ కు అంకితం చేసానని చెప్పారు . వరంగల్ జిల్లా లోని అద్భుత శిల్పసౌందర్యం , శిల్పి నైపుణ్యం రామప్ప విశేషాలను ప్రపంచానికి తమ ‘ఉలికళ’ కవితద్వారా తెలియజేయాలని ఎన్నో వేదికలపైన చదివాను అని అన్నారు . మయూఖ లో మీకోసం.



