https://youtu.be/kDb8KZDgBwk?si=hvI0sKg5y6tK-KGx
తరుణి అంతర్జాల మహిళవారపత్రిక నుండి సేకరణ
తరుణి అంతర్జాల మహిళవారపత్రిక నుండి సేకరణ
యాదగిరిగుట్టకు ఒకరోజు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళ్లాను. కార్యక్రమం రచ్చ యాదగిరి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటైంది.
సభలో ఎంతోమంది పాల్గొన్నారు. కవి కాబట్టి రచ్చ యాదగిరి కూడా పాల్గొన్నాడు. కార్యక్రమం బాగా జరిగింది. భోజనాలు కూడా చేశాం మధ్యాహ్నం కాబట్టి.
రచ్చ యాదగిరి గారు నాదగ్గరకి వచ్చి ”మీ ప్రసంగం బాగుంది. మీరెక్కడుంటారు హైదరాబాద్లో” అని అడిగాడు. ”బోడుప్పల్” అని సమాధానమిచ్చాను. వెంటనే నాకు నా అర్ధాంగి ప్రమీల పేరు స్ఫురించింది. కారణమేమంటే ఆమె తల్లిగారి ఇంటిపేరు ‘రచ్చ’ కావడమే.
”నా భార్య రచ్చవాళ్ల ఇంటి ఆడపిల్ల. మీరు రచ్చ వాళ్లు కావడం ఆనందంగా ఉంద”న్నాను.
యాదగిరి గారికి నాతో కొంతసేపు మాట్లాడాలనిపించింది. ”మీ అత్తగారి ఊరేది? మీ మామ ఏ పని చేసేవారు. మీ అర్ధాంగి గృహిణియేనా?” వినయంగా ప్రశ్నించాడు. ”మా మామగారు హైదరాబాదు వాస్తవ్యులు. మెడికల్ డిపార్టుమెంటులో పని చేశారు. ఇప్పుడు నా భార్య లేదు” అన్నాను కళ్లు తుడుచుకుంటూ. యాదగిరి గారు నా స్థితిని అర్థం చేసుకున్నారు. ”మీరు మా ఇంటికి వస్తారా? దగ్గరనే” అని కోరారు. నేను కాదనలేకపోయాను. మా ప్రమీల పుట్టినింటికి వెళ్లినంత ఆనందమైంది నాకు. యాదగిరి ఇంటి వాళ్లంతా పరిచయమయ్యారు. మా ప్రమీల ఏ లోకంలో ఉందోగాని, ఆమె పుట్టిన ఇంటిపేరు ఎంత మహిమగలదో తెలిసింది.
నేను హైదరాబాదుకు తిరిగి వెళ్లడానికి సిద్ధమయ్యాను. ”మీరు రావడంవల్ల మా ఇల్లు పావనమైంది” అంటూ ఇంట్లోంచి ఒక శాలువా తెచ్చి కప్పినారు.
యాదగిరి గారి సౌజన్యానికి ఎంతో మురిసిపోయాను. వారిని చూచినప్పుడు మా మామగారే గుర్తుకు వచ్చారు. మా మామ కూడా నన్నెంతో ఆదరించేవారు. ప్రేమతో పలకరించేవారు.
పుస్తకావిష్కరణ తర్వాత నేను యాదగిరిగుట్టకు ఎన్నిసార్లు వెళ్లానో నాకే తెలియదు. వెళ్లినప్పుడల్లా యాదగిరి గారింటిలో ఆతిథ్యం తీసుకోకుండా రాను. యాదగిరి గారి కుటుంబ సభ్యుల్లో నేనొకడినయ్యాను. యాదగిరి గారు ఆర్.ఎమ్.పి. డాక్టర్ కనుక అప్పుడప్పుడు ఆరోగ్య సంబంధమైన సూచనలు కూడా ఇచ్చినారు. నాకే చిన్న బాధ కల్గినా యాదగిరి గారితో చెప్పుకోవడం పరిపాటి అయ్యింది. వారు నా రచనలు కూడా చదివినారు. అప్పుడప్పుడు పద్యాలు రాసి నా చేత దిద్దించుకున్నారు.
ఒకమాటలో చెప్పాలంటే యాదగిరి గారు ఆత్మబంధువు లయ్యారు. హైదరాబాదుకు వచ్చినప్పుడల్లా నన్ను చూసి వెళ్తారు. ప్రతిరోజు ఫోన్లో తప్పక మాట్లాడుతారు.
యాదగిరి గారికి నాకు ఏమిటో విడదీయరాని సంబంధం కల్గింది. బహుశా మా ప్రమీల ఇంటిపేరు, వారి ఇంటి పేరు ఒకటి కావడమేనా? ఇంటి పేర్లొకటైనంత మాత్రాన ఇంత అనుబంధం ఏర్పడుతుందా?
ఇదంత ప్రమీల ప్రభావమేనని నా మనస్సు పదేపదే గుర్తు చేస్తుంది.
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే తనను తాను నిర్లక్ష్యం చేసుకున్నట్టే ఈ సత్యాన్ని గ్రహించక చాలా మంది విచిత్రం గా ప్రవర్తిస్తారు. కాల చక్రం గిర్రున తిరిగి మళ్లీ వీళ్ళ దగ్గరికే వస్తుందని గ్రహించరా? కాదు అన్నీ తెలుసు అయినా తెలివితక్కువ ఆలోచనలతో అట్లాగే చేస్తారు. ఏదైనా కోల్పోయిన తర్వాత విలువ తెలుస్తుంది. కన్నతండ్రి ని వదిలించుకున్నానుకున్న ఓ కొడుకు కు అతడు చేసిన అన్యాయం అతని వెంట పడ్తుందని అద్భుతంగా చిత్రీకరించారు చిటికెన కిరణ్ కుమార్. ఈ దుర్మార్గాన్ని తండ్రి సహించక ఛీ కొట్టినట్టు ఇచ్చిన తీర్పు పాఠకులను, ప్రేక్షకుల ను తప్పకుండా ఆలోచనలలో పడవేస్తుంది. ఎన్ని బాధలు పెట్టినా కన్నపాశం అంటూ తన సంతానానికే సేవలు చేయడం కన్నా అనాథలు అన్నార్తుల కు చేయూతనివ్వడం మంచిదని ఈ ” ఓ తండ్రి తీర్పు” చిటికెన కిరణ్ కుమార్ రచించిన కథ చెబుతుంది. ఈ కథను లఘు చిత్రం గా నిర్మించి బహుమతి ని కైవసం చేసుకున్న చిత్ర బృందానికి, చిటికెన కిరణ్ కుమార్ కూ అభినందనలు తెలియజేస్తున్నాను
-డాక్టర్ కొండపల్లి నీహారిణి, కవయిత్రి, రచయిత్రి
మయూఖ, తరుణి అంతర్జాల పత్రిక ల సంపాదకురాలు.
https://m.facebook.com/story.php?story_fbid=2499168466923796&id=100004920000278&mibextid=Nif5oz

తరుణి యూట్యూబ్ చానెల్ ను చూడండి, మీరు తప్పకుండా నచ్చుతారు. తొలి ప్రయత్నం ఇది . మీ సహకారం అందించండి. ఈ చానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . లైక్ చేయండి, షేర్ చేయండి !థాంక్యూ – డాక్టర్ కొండపల్లి నీహారిణి, కవయిత్రి, రచయిత్రి, సాహిత్య విమర్శకులు, మయూఖ అంతర్జాల పత్రిక,
తరుణి పత్రిక ల వ్యవస్థాపకులు, సంపాదకులు .
“సు”- మంచి , “లక్ష్య ” – లక్ష్యం
ట్యాగ్ లైన్ – సర్వే సుజనా సుఖినోభవంతు
నేపధ్యం :
2008 – 2013 వరకు వివిధ సేవా కార్యక్రమాలను చేసిన తరువాత ,ఈ కార్యక్రమాలన్నింటిని ఒక గొడుగు కిందికి తీసుకురావాలనుకొని అనుకున్నాం.
మన అభ్యున్నతికి కారణమైన ఈ సమాజానికి కొంతైనా తిరిగివ్వాలనే సదుద్దేశంతో మిత్రులమంతా ఒక బృందంగా ఏర్పడి ఉగాది పర్వదినాన ( ఏప్రిల్ 11 2013 ) న సులక్ష్య సేవా సమితి కి అంకురార్పణ చెయ్యడం జరిగింది. రానున్న ఉగాదికి ఒక దశాబ్దం పూర్తి చేసుకోబోతుంది.

ముఖ్య లక్ష్యాలు – చేపట్టిన కార్యక్రమాలు
అందరికి విద్య – ఈ రోజుకి ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కొరవడుతున్నాయి – ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే స్థోమత చాలా మంది కూలి – నాలి చేసుకునే తల్లితండ్రుల్లో లేదు . దీని వల్ల చాలా మందికి సరైన విద్య అందడం లేదు , కొంత మంది మధ్యలోనే చదువు ఆపేసి ఎక్కడో బాల కార్మికులుగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు .
ఈ పరిస్థితిని కొంతైనా మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు పలు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని, ఆ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం జరిగింది. 1 . 2 లక్షలతో శ్రీ వ్యాస అవాసంలో గ్రంధాలయం ఏర్పాటు చెయ్యడం జరిగింది . 1 లక్ష రూపాయల విలువగల పుస్తకాలను వివిధ ఆశ్రమాల్లో ఇవ్వడం జరిగింది . ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు వారి ఫీజులు మరియు ఇతర అవసారాలకై ఆర్ధిక సహాయం సహాయం చెయ్యడం జరిగింది . వివిధ ఆశ్రమాల్లో స్కూల్ యూనిఫార్మ్స్, వారు చదువుకోవడానికి కావలసిన ఇతర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. వైద్యం – ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు . కానీ నేటి రోజుల్లో చాలా మంది జీవన విధానం వల్ల , ఆరోగ్య అలవాట్ల వల్ల, కల్తీ ఆహరం వల్ల చిన్న వయస్సులోనే అనారోగ్యం పాలైతున్నారు తాము సంపాదించే డబ్బులో ఎక్కువ భాగం వైద్యులకు , మందులకు పెట్టడమే కాక తీవ్ర అశాంతికి గురవుతున్నారు . అందుకే పాఠశాలల్లో , కళాశాలల్లో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయం మీద సదస్సులు నిర్వహించడం జరుగుతుంది .
కరోనా వ్యాధి ప్రబలి ప్రపంచమంతా స్తంభించిందినప్పుడు , ఫ్రంట్లైన్ వారియర్స్ తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా పోరాడారు . వారు చేస్తున్న కృషికి గుర్తింపుగా , వారి ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత దృష్టిలో ఉంచుకుని డాక్టర్లకు , ఆరోగ్య కార్యకర్తలకు,పోలీస్ సిబ్బందికి , పారిశుధ్య కార్మికులకు, మీడియా ప్రతినిధులకు రెండు లక్షల నలభై వేల విలువగల ఆరు వస్తువులతో కూడినటువంటి రెండు వేల సేఫ్ ఎనర్జీ కిట్లను అందివ్వడం జరిగింది .
అలాగే ఒక లక్షా ఎనభై వేల రూపాయల విలువగల మూడువేల పైగా మాస్కులు , శానిటైజర్స్ పంపిణి చేసాము

పర్యావరణ పరిరక్షణ – వృక్షో రక్షతి రక్షితః , మట్టి గణపతులను ప్రతిష్టిద్దాం – పర్యావరణ పరిరక్షణకై పాటుపడడం , ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం – కాలుష్య నివారణకై కృషిచేద్దాం .
వివిధ కారణాల వల్ల పర్యావరణం రోజు రోజుకి వినాశనం అయితున్నది. దీని వల్ల మనం అనేక సమస్యలకు గురవుతున్నాం . ఈ లక్ష్యంలో భాగంగా 1000 కి పైగా మొక్కలను వివిధ పాఠశాలలో , రోడ్లపై నాటడమేకాక వాటిని పెంచడం జరిగింది . అదే కాకా ప్రముఖ పర్యావరణవేత్త , కోటి మొక్కలు నాటిన పద్మ శ్రీ అవార్డు గ్రహీత , వనజీవి దారిపల్లి రామయ్య గారితో అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది.
గత తొమ్మిది సంవత్సరాలుగా ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణి చెయ్యడం జరిగింది . యువత సాధికారత – ఒక వంద మంది యువకులను ఇవ్వండి – భారత దేశాన్ని బలమైన దేశంగా మారుస్తా అని స్వామి వివేకానంద అన్నారు . భారత దేశంలో 65 % జనాభా యువకులే . ఇది మనకు చాలా పెద్ద ఆస్తి . కానీ అనేక మంది యువకులు సరైన అవగాహన లేక , చెడు అలవాట్లకు బానిసై , అవకాశాలు దొరకక , చదువుకునే స్థోమత లేక వారి గమ్యానికి చేరలేకపోతున్నారు .ఇందుకు గాను సివిల్ సర్వీసెస్ మరియు ఇతర పోటీ పరీక్షాలలో విజయం సాధించడం ఎలా , వ్యక్తిత్వ నిర్మాణం, ఒత్తిడిని అధిగమించడం లాంటి వివిధ అంశాల మీద పలు కళాశాలల్లో , పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది .కనీస అవసరాలు తీర్చడం – భారత దేశంలో ఒకవైపు అపర కుబేరులు విలాసవంతమైన జీవితం గడుపుతుంటే , కోట్లాది మంది పేదరికంతో మగ్గుతూ వారి కనీస అవసరాలు తీర్చలేకపోతున్నారు .
నగరంలోని వివిధ ఆశ్రమాలకు నిత్యావసర వస్తువులు వితరణ చేసి తోడ్పాటు అందించడం జరిగింది . చలి కాలంలో నిరాశ్రయులకు , పేదవారికి , అనాధలకు , వృద్ధులకు వెచ్చదనం కల్పించాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు 4 .8 లక్షల విలువైన 2400 బ్లాంకెట్ల్లను నిరాశ్రయులకు మరియు నిరుపేదలకు , అనాధలకు , వృద్ధులకు పంపిణి చెయ్యడం జరిగింది . మేము చేసిన అన్ని కార్యక్రమాల్లో మాకు నిజంగా సంతృప్తిని ఇచ్చింది కరోనా మహమ్మారి ప్రబలినప్పుడు మా సంస్థ ద్వారా చేపట్టిన సహాయక కార్యక్రమాలు. ప్రజలు ఇంటి గడప దాటి బయటకు వెళ్లాలంటేనే భయబ్రాంతులకు గురైతున్న పరిస్థితుల్లో సేవా కార్యక్రమాలు చేపట్టడం అనేది మాకు జీవితాంతం ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే అనుభవాన్ని మిగిల్చింది. ఈ అనుభవంతో ముందు ముందు ఇంకా అనేక సేవ కార్యక్రమాలు చేపట్టే శక్తి మాకు కలగాలని మా ఆశ.

మా లక్ష్యాల్లో ఒకటైన కనీస అవసరాలు తీర్చటం లో భాగంగా గుడిసెల్లో నివసించే పేదవారికి , సంచార జాతులకు ,చెత్త సేకరించే కార్మకులకి , అనాధాశ్రమాలకి , వృద్ధాశ్రమాలకు , వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలిలకి , భవన నిర్మాణ కార్మికులు , పానీ పూరి బండి వాళ్ళు , గుత్తి కోయలకు, నేపాల్ నుంచి వచ్చిన గురఖాలు , అనాధ వృద్ధులు ,దినసరి కూలి కార్మికులు , తదితర వెయ్యి కుటుంబాలకు ఆరు లక్షల విలువగల పదమూడు వస్తువులతో కూడిన నిత్యావసరాల కిట్లను పంపిణి చెయ్యడం జరిగింది.
తమ స్వస్థలాలకు వెళ్లాలనే తలంపుతో ఎర్రటి ఎండలో వందలాది కిలోమీటర్స్ నడుస్తున్న వలస కార్మికుల గోసను దృష్ఠ్టిలో ఉంచుకుని వారికి రెండు లక్షల విలువ్ కల పన్నెండు వస్తువులతో కూడిన మైగ్రంట్ రెఫ్రెషమెంట్ కిట్లను వెయ్యి మందికి పంపిణి చెయ్యడం జరిగింది . అలాగే కొందరికి మా స్వంత ఖర్చులతో వాహన సౌకర్యం ఏర్పాటు చేసి వారి స్వంత రాష్ట్రాలకు పంపించడం జరిగింది .ప్రేమ , వాత్సల్యాలను పంచడం – అనాధ, వృద్ధాశ్రమాల్లో నివసిస్తున్న వారు తమ అనుకున్న వాళ్ళ ప్రేమను నోచుకోక నిరాదరణకు గురవుతుంటారు. వారికి కావలసిందల్లా ఆత్మీయ స్పర్శ , మేమున్నామనే భరోసా , వారితో సరదాగా గడిపేందుకు కొద్ది సమయం .
ఈ ఉద్దేశంతో సమయం దొరికినప్పుడల్లా అనాధాశ్రమాల్లో నివసిస్తున్న పిల్లలతో సమయం గడపడం, సినిమాలకు ( బాహుబలి, ఏషియన్ మాల్ లో ) , విహార యాత్రలకు తీసుకెళ్లడం ( రామప్ప, లక్నవరం, ఖిలా వరంగల్ , వేయి స్థంబాల దేవాలయం, జూ పార్క్ , సైన్స్ సెంటర్ , హైదరాబాద్ లోని వండర్ లా ) , హోటళ్ళకి తీసుకెళ్లి వారికి ఇష్టమైనవి తినిపించడం , ఆట వస్తువులు కొనిపెట్టడం , వారి పుట్టిన రోజులు జరపడం చేస్తుంటాము . వృద్ధాశ్రమాల్లో నివసిస్తున్న వారికి సాంత్వన కలిగించాలనే ఉద్దేశంతో అక్కడ మాతృదినోత్సవాలు , సంగీత విభావరులు నిర్వహించడం నిర్వహించడం జరుగుతుంది .

డిగ్నిటీ అఫ్ లేబర్ – మన జీవనం సాఫీగా సాగుతుందంటే అందులో ప్రతి ఒక్కరి కృషి ఉంటుంది. కానీ డబ్బు , హోదా ఉన్న వాళ్లకు ఇచ్చే మర్యాద , గుర్తింపు కింది స్థాయిలో ఉండదు . అమెరికా లాంటి దేశాల్లో ఆ దేశ అధ్యక్షుడిని ఎలా చూస్తారో , ఒక సామాన్య గుమాస్తాను కూడా అలానే చూస్తారు .
అందుకనే కింది మన పరిసరాలను పరిశుభ్రంగా ఉండడానికి నిరంతరం శ్రమించే పారిశుధ్య కార్మికులు మరియు ఇతర పనులు చేసే వారిని గుర్తించి , సత్కరించి వారికి కావాల్సిన సహాయం అందించడం జరుగుతుంది . సుపరిపాలనకై పాటుపడడం – భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా మన దేశం ఎన్నో విషయాల్లో వెనుకబడి ఉంది . అవినీతి , మత విద్వేషాలు , అవకాశవాద ధోరణి , లాంటి ఎన్నో సమస్యలు మనన్ని పట్టి పీడిస్తున్నాయి . అందుకనే వివిధ పాఠశాలల్లో , కళాశాలల్లో, ఓటు హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం , పౌరుడిగా మన హక్కులు లాంటి వివిధ విషయాల మీద అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది .
భారతీయ సంస్కృతి , సంప్రదాయాలను పరిరక్షించడం – యావత్ ప్రపంచానికి దిక్సూచిగా, దిశా నిర్దేశం చేసిన ఘనత మనది . కానీ యాంత్రిక జీవన విధానం వల్ల , మనం మన పురాణాలను , ఇతిహాసాలను రాబోయే తరాలకు అందివ్వలేకపోతున్నాం , మన చారిత్రిక కట్టడాలను పరిరక్షించుకోలేకపోతున్నాం. అందుకనే విద్యార్థులకు మన ఇతిహాస , పురాణాల గురించి తెలియచేసి , మన చారిత్రక కట్టడాల సందర్శనకు తీసుకువెళ్లడం జరుగుతుంది .
గ్రామీణ భారతంలో పరివర్తన తీసుకురావడం – ఇప్పటికి 65 % కన్న ఎక్కువ ప్రజలు పల్ల్లెలో నివసిస్తున్నారు . పల్లెలే దేశ ప్రగతికి పట్టుకొమ్మలు అని నానుడి . కానీ ప్రపంచీకరణ తో పల్లెల్లో నివసిస్తున్న అన్నదాతలు ,ఇతర వృత్తి నైపుణ్యం గల వారు పొట్ట చేత పట్టుకుని పట్టణాలకు , ఇతర దేశాలకు వలస పోతున్నారు, అక్కడ కూలీలుగా వారి బతుకు బండిని నెట్టుకొస్తున్నారు . దీని వల్ల వారి జీవితాలు చీకటిమయం అవ్వడమే కాకుండా దేశ ప్రగతి కూడా స్తంభించి పోతుంది. అందుకనే పల్లెలకు వెళ్లి వాళ్లకు సేంద్రియ వ్యవసాయం , చేనేత , హస్తకళల లాంటి రంగాల్లో ప్రోత్సాహాం అందించి , వారిలో ఉన్న ఇతర నైపుణ్యాలను వెలికి తీసి వారికి కావలసిన సహాకారం అందించడం జరుగుతుంది .

భవిష్యత్ ప్రణాళిక
“ఎడ్యుకేట్ , ఎంపవర్ , ఎన్ లైటెన్” పేరుతో ఒక కార్యక్రమాన్ని రూపొందించి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో, కళాశాల విద్యార్థుల్లో మరియు యువతలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాము .
మేము చేసే కార్యక్రమాలకు మొదటినుంచి ఆర్థికంగా సహకరిస్తున్న దాతలకు , మా గురించి కధనాలు ప్రచురిస్తున్న మీడియా ప్రతినిధులకు, మా ఆహ్వానాన్ని మన్నించి మా కార్యక్రమాలకు విచ్చేస్తున్న అతిథులకు మా హృదయపూర్వక అభినందనలు .
మాకు పెద్ద మొత్తంలో సరకులను ఇస్తున్న వ్యాపారులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము
మా చిహ్నం




ముఖ్య సభ్యులు :
మండువ సంతోష్ , కౌశిక్ భూపతి. మండువ శివ సంపత్., బొల్లం రాహుల్, దేవులపల్లి జయంత్, కోడం వినయ్, సాయి కిరణ్, విష్ణు.
మరెంతో మంది మిత్రులు మంది మిత్రులు మాకు వెన్ను దన్ను గా నిలుస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నారు .


కుటుంబ నేసథ్యం
పేరు : మండువ సంతోష్
తండ్రి : కీ. శే. మండువ వెంకట రమణ రావు
తల్లి : పసునూరి వెంకట రాఘవ శాంత , విశ్రాంత ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు
తమ్ముడు : మండువ శివ సంపత్ , అమెరికా లో సాఫ్ట్ వెర్ ఇంజనీర్
విద్యార్హత : ఎంబిఏ , మార్కెటింగ్, కాకతీయ విశ్వవిద్యాలయం
సొంత ఊరు : పెగడాపల్లి ,హాసనపర్తి మండలం
ప్రస్తుత నివాసం : శ్రీనగర్ కాలనీ , హన్మకొండ
నిధుల సమీకరణ : మా కార్యక్రమాలను చూసి భాగస్వామ్యం అవ్వదలచిన కొద్ది మంది దగ్గరి మిత్రుల ద్వారానే నిధుల సమీకరించడం జరుగుతుంది . మేము చేసే కార్యక్రమాల వివరాలను మా పేస్ బుక్ పేజీ పేజీ మరియు వెబ్ సైట్ లో పొందుపరచటం జరుగుతుంది .
సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
పల్లవి :
సేవే మార్గంగా ..
సేవే లక్ష్యంగా ..
ముందడుగే వేశారు ..
పదిమందికి జీవనమిచ్చారు
సేవే ధర్మాంగా ..
సేవే వేదంగా ..
మదితోనే చూసారు
సాయానికి ముందుగ నిలిచారు
అణగారిన బతుకుల్లోనా
ఆనందపు వెలుగయ్యారు
అనాధలకు బలమయ్యారు
ఆసరాగా నిలిచారు
సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
బీదజనుల ఆశాజ్యోతి
సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
నిత్యసేవ సుజనా వసతి
సేవే మార్గంగా ..
సేవే లక్ష్యంగా
చరణం 1 :
బడిపిల్లల భవితను మార్చగ
విద్యాబుద్ధులనందించారు
పాఠశాలలను మెరుగు పరచగా
విశ్వాసాన్నిస్తూ కదులుతున్నారు
నవసమాజ నిర్మాణానికై
పట్టుదలగా పయనిస్తున్నారు ..
కూడూ … గుడ్డా .. లేనివారికై
శాయశక్తులా శ్రమిస్తున్నారు
సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
బీదజనుల ఆశాజ్యోతి
సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
నిత్యసేవ సుజనా వసతి
సేవే మార్గంగా ..
సేవే లక్ష్యంగా ..
చరణం 2 :
యువతకు మార్గం చూపిస్తూ
సదస్సులెన్నో నిర్వహిస్తూ
భవిష్యత్తును అందిస్తూ
ముందుకు గమనం సాగిస్తూ
అందరు బాగుండాలని
ఆరోగ్యాంగా బతకాలని
పేదరికం నిర్మూలనకై
కనీస అవసరాలనందిస్తున్నారు
సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
బీదజనుల ఆశాజ్యోతి
సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
నిత్యసేవ సుజనా వసతి
సేవే మార్గంగా ..
సేవే లక్ష్యంగా ..
చరణం 3 :
అనాధ వృద్ధుల బాసటగా
ప్రేమా కరుణ లోగిలిగా
ఆత్మీయంగా పలకరిస్తూ
పలు సంతోషాలను అందిస్తూ
శ్రమైక జీవనాన్ని గుర్తిస్తూ
సత్కారాలను అందిస్తూ
సమానత్వాన్ని పంచేస్తూ
సమాజ శ్రేయస్సు నినదించే ..
సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
బీదజనుల ఆశాజ్యోతి
సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
నిత్యసేవ సుజనా వసతి
సేవే మార్గంగా ..
సేవే లక్ష్యంగా ..
ఆచార్య రవ్వా శ్రీహరి గారిని నేను తొలుత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వారు తెలుగు శాఖాధ్యక్షులుగా ఉన్నప్పుడు, కలుసుకొని నా తొలి గ్రంథం “ముకుంద శతకం” ప్రతిని అందజేసాను. రవ్వా శ్రీహరి గారు, మా మాతామహులు శ్రీమాన్ ఆచి వేంకట నృసింహాచార్యులు గారు దాదాపు 90 ఏళ్ళ క్రితం చదువుకొన్న సీతారాంబాగ్ సంస్కృత కళాశాలలోనే – 60 ఏళ్ళ క్రితం చదువుకొన్నారు. ఆ తరువాత పూర్వ విద్యార్థులైన ఈ ఇరువురే సీతారాంబాగ్ స్వామి వారైన శఠకోప రామానుజాచార్యులు గారి షష్టిపూర్తి మహోత్సవాన్ని వైభవంగా జరిపించారు. ఇది శ్రీహరి గారు నాకు స్వయంగా చెప్పిన విషయం.

రవ్వా శ్రీహరి గారు 1943 సెప్టెంబరు 12 వ తేదీ నాడు ఆనాటి ఉమ్మడి నల్గొండ జిల్లా (ఇప్పటి
యాదాద్రి భువనగిరి జిల్లా) లోని వలిగొండ మండలం, వెల్వర్తి గ్రామంలో ఒక సాధారణ చేనేత కుటుంబంలో జన్మించారు. చిన్న నాడే తల్లి మరణించడంతో, ఆ వయసులోనే ఆయన కుటుంబ బాధ్యతలు చేపట్టవలసి వచ్చింది. వారు తొలుత 1967 లో
ఆంధ్ర సారస్వత పరిషత్తులో లెక్చరర్గా పనిచేసారు. సారస్వత పరిషత్తు విద్యార్థులకు సంస్కృతం, తెలుగు రెండూ బోధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో 1973 లో ఉద్యోగంలో చేరడంతో ఆచార్య బిరుదురాజు రామరాజు సలహాతో తెలుగులో ‘భాస్కర రామాయణం’ మీద పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా పుచ్చుకొన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పదిహేడు సంవత్సరాలు బోధన, పరిశోధనల్ని నిర్వహించారు.
సంస్కృతాంధ్ర భాషలలో అగ్రశ్రేణి పండితులైన శ్రీహరి గారితో తరువాతి కాలంలో .. చాల సభలలో కలిసిన సౌభాగ్యం నాది. మా యువభారతి సభలలో కూడ వారు చాల ప్రసంగాలు చేసారు.
అసమగ్రంగా మిగిలిన మన తెలుగు నిఘంటువులను సమగ్రం చేసే ప్రయత్నంగా నిర్మించిన “శ్రీహరి నిఘంటువు” వారు తెలుగు భాషకు చేసిన ఉత్కృష్టమైన సేవ.
ద్రవిడ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా కూడ బాధ్యతలను నిర్వహించిన శ్రీహరి గారు ఆచార్య సి. నారాయణరెడ్డి గారి “ప్రపంచ పదులు” కృతిని సంస్కృతంలోకి అనువదించి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. గుర్రం జాషువా గారి “గబ్బిలం”, “ఫిరదౌసి” కావ్యాలను కూడ సంస్కృతంలోకి అనువదించారు. వారు ఎంతటి సంస్కృత పండితులో, అంతగా .. అనేక తెలుగు మాండలికాలలో విశిష్టమైన కృషి చేసిన మహా భాషా శాస్త్రవేత్త. ఐదారేళ్ళ క్రితం తెలుగు అకాడమీలో నేను తెలంగాణ భాషా సాహిత్యాలపై చేసిన ప్రసంగాన్ని వారు ప్రశంసించడం నాకెంతో ఆనందాన్ని, తృప్తిని కలుగజేచేసింది.
ఆచార్య శ్రీహరి గారు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి “మహామహోపాధ్యాయ” బిరుదాన్ని స్వీకరించిన ఘనులు. 2011లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ఎడిటర్-ఇన్-ఛార్జ్గా పనిచేశారు.
ఉభయ భారతి, అన్నమయ్య సూక్తి వైభవం, అన్నమయ్య భాషా వైభవం, తెలుగులో అలబ్ధ వాఙ్మయం, సాహితీ నీరాజనం, తెలుగు కవుల సంస్కృతానుకరణలు, వాడుకలో తెలుగులో అప్రయోగాలు, తెలంగాణ మాండలికాలు – కావ్యప్రయోగాలు,
నల్లగొండ జిల్లా ప్రజలభాష వంటి విమర్శ గ్రంథాలు మరియు సిద్ధాన్త కౌముది, అష్టాధ్యాయీ వ్యాఖ్యానం వంటి వ్యాకరణ గ్రంథాలు వీరి ఇతర ప్రధాన రచనలు.
ఆచార్య రవ్వా శ్రీహరి గారు ఎంతటి పండితులో, అంతకు మించిన సహృదయులు. నన్ను పుత్ర సమానునిగా ఆదరించేవారు.
79 ఏళ్ల వయస్సులో రవ్వా శ్రీహరి గారు గుండెపోటుతో హైదరాబాదులో 2023, ఏప్రిల్ 21నాడు పరమపదించారు.
ఆ మహనీయుని మరణం సంస్కృతాంధ్ర భాషలకు తీరని లోటు.
సర్వే భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయా
సర్వే భద్రాణి పశ్యన్తు
మా కశ్చిత్ దుఃఖ భాగభవేత్
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఇది ప్రముఖమైన శాంతి మంత్రము. వేదాలలో ఉపనిషత్తులలో చెప్పబడినది. అందరికీ శాంతి సౌభ్రాతృత్వాలుండాలనే ఆశయంతో ఈ మంత్రము చదువబడుతుంది. భారతదేశ సంస్కృతిలో ఇది ఒక భాగం. ఈ మతం ఆ మతమని లేకుండా విశ్వ జనులందరికీ శాంతి చేకూరాలని ఆకాంక్ష గలిగిన గొప్ప సంస్కృతీ భారతదేశానిది. మునులు ఋషులచే విరచితమై శాంతి మంత్రాలు గొప్ప ఆదరణ పొందినవి. యజ్ఞ యాగాదులలో పూజలలో ఈ మంత్రాలను చదువుతారు.
పై మంత్రం భావార్ధం ‘సర్వే ‘అంటే అందరికీ, ‘భవంతు సుఖినః ‘సుఖంగా ఉండాలని కోరుతున్నాము. ‘సర్వే సంతు నిరామయా ‘అంటే అందరూ నిరోగులవ్వాలని, సర్వే భద్రాణి పశ్యన్తు‘అంటే అందరూ మంచి చూడవలెనని, మా కశ్చిత్ దుఃఖ భాగభవేత్ ‘అంటే ఎవరికీ ఏ విధమైన బాధలు కష్టాలు ఉండకూడదని ఆశయం. ఇది ఏ ఒక్క సమూహానికి సంబంధించినది కాదు. ఇది అందరి గురించి ఆశించినది. పై మంత్రం శాంతి మంత్రాలలో ఒకటి. అందరికీ శాంతి చేకూరాలని ముమ్మారులు జపించబడినది.
ఓం శాంతిః శాంతిః శాంతిః అంటే అన్ని లోకాలలోను శాంతి కలగాలని కోరుతున్నారు.
మనుష్యులకు కాకుండా జంతువులకు పశు పక్ష్యాదులు కూడా ఇది వర్తిస్తుంది. సర్వత్రా అందరికీ మంచి జరగాలనే భావన ఈ మంత్రం వలన తెలుస్తున్నది.
ప్రాచీన కాలంలో సంస్కృతం వాడుకలో ఉండేది. కాబట్టి చాలా వేద మంత్రాలు సంస్కృతంలో రచింపబడినవి. ఈనాటి కాలంలో సంస్కృత భాష వాడుకలో లేదు కాబట్టి చాలా మందికి మంత్రాల అర్థ తాత్పర్యాలు తెలియకపోవడంతో వాటి ప్రభావం కానీ, విలువ కానీ తెలుసుకోలేకపోతున్నారు. మంత్రాల భావార్థాలు తెలుస్తే వాటిని తప్పక ఆచరిస్తారు. వాటిని పూజలలో హృదయపూర్వకంగా చదువుతారు. మంత్రం అంటే మననాటి త్రాయతే ఇతి మంతః అంటే మంత్రాలను మననము చేస్తూ చదివితే జనన మరణాల నుండి విముక్తి లభిస్తుంది. మంత్రం అంటే మరొక అర్థం మనసునకు లభించే ఒక గొప్ప శక్తి. మంత్రాలను ఉచ్చ్చరించడం వలన జీవితానికి గొప్ప పరమార్థముూ సత్యమైన మహత్తు లభిస్తుంది. అన్ని మంత్రాలలో శాంతి మంత్రం ఇంకా గొప్పది. ఎందుకంటే శాంతి మంత్రాలు విశ్వ శాంతిని కోరతాయి. ఈ మంత్రాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా చదువవచ్చు,. ధ్యానం లో కూడా. మంత్రాలు సాధారణంగా గురువుల నుండి నేర్పబడతాయి. ఉచ్చ్చారణ దోషాలు లేకుండా చదవడం చాలా ముఖ్యం. అర్థాలను తెలుసుకొని మంత్రాలను మననం చేస్తే వాటి ప్రభావం, లాభం మనసుపై సరియైన ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ మంత్రం భావార్థాన్ని ఆశయాన్ని తెలుసుకొని దీనిని జపించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారని ఆశిద్దాం.
అయితే ఈ మంత్రం పూర్వకాలంలో యజ్ఞ యాగాలలో నే కాదు ఈ ఆధునిక కాలంలో నూ చాలా మంది చాలా చోట్ల చదువుతున్నారు. దీనికి ప్రధాన కారణం సామాజికం గా ఆలోచించి అందరూ బాగుండాలి అనేదే ఈనాటి యజ్ఞం. కాబట్టి మనమూ ప్రతి రోజూ చదువుకుందాం!
