
నవతరానికి ప్రతీకగా నవలా సాహిత్యంలోకి మరో కొత్త గొంతుక వచ్చింది, మను నెల్లుట్ల పేరుతో “ జన్య భారతం” అంటూ . కాలం ఎంత వేగంగా పరుగెడుతుంటే యువకుల ఆలోచనలూ అంత వేగంగా పరుగెడుతున్నాయి అనడానికి ఈ “ జన్య భారత” నవల ఒక ఉదాహరణగా నిలిచింది. ఈ నవలను రచించింది మను నెల్లుట్ల , కెనడా దేశంలో నివసిస్తున్నారు.

“జన్య” అనే సంస్కృత శబ్దానికి యుద్ధం , సాధారణ జనులు అనే అర్థాలున్నవి .”మహా “ కాదు ఇది “మామూలు” కూడా ఉంటుందనే భావంతో ఇది జనుల భారతం అనే ఉద్దేశంతో రాసినట్టున్నది నవల. ఈ నవలారచయిత మనోభిరామ్ నెల్లుట్ల ( మను నెల్లుట్ల) నవల పేరు Janya Bharata , క్రింద The War అని రాయడం వలన తెలుస్తున్నది. “ జన్య భారత” నవల ఇంగ్లీష్ భాష లో రాసిన నవల.
మరలనిదేల భారత యుద్ధ కథ అని అనుకోవద్దు . మహాభారత యుద్ధం మొత్తం రాజుల , రాణుల గురించి కురుక్షేత్ర సమరం గురించి ఉంటే ఈ జన్య భారత కథమొత్తం సామాన్యుడు, సామాన్యురాలి గురించి వారి జీవన సమరం గురించి ఉన్నది.
మహాభారత యుద్ధం జరిగింది అని మనమంతా నమ్ముతున్నాం . ఆ యుద్ధంలో కేవలం రాజులే ఉన్నారా? వేరే సాధారణ ప్రజలు లేరా ?అంటే, ఉన్నారు . ఆనాటి ఆ యుద్ధం లో ఎందరో పాల్గొన్నారు.వారిలో ఉస్త్రకర్ణిక అనే పేరుతో పిలువబడే గిరిజనులు ఆ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన నిలుచుని యుద్ధం చేశారు.
కల్పనాచాతుర్యంతో రచయిత ఈ గిరిజనుల ప్రతినిధిగా మిత్రాజిత్ అనే అతను భారత యుద్ధానికి వెళ్ళినట్లు, వెళ్ళేముందు వెళ్ళిన తర్వాత ఏర్పడిన పరిస్థితులు, అతని కుటుంబము వారి జీవన విధానమూ చిత్రీకరిస్తూ కథను అల్లడం చూస్తాం. ఈ నవల లో యుద్ధం మొదటి
రోజు ఏమైంది?రెండో రోజు ఏమైంది?ఈ సైనికుల పరిస్థి ఏమిటి? ఖడ్గ విద్యలో నిష్ణాతుడైన ఈ కథానాయకుడు మిత్రాజిత్ కు ఏం జరుగుతుంది? అతని కుటుంబమేమయ్యిందనేది ఈ నవల చదివితే తెలుస్తుంది.ఈ “జన్య భారత” నవల అమెజాన్ లో దొరుకుతుంది. భారత దేశంలో ఉన్నవాళ్ళు e Book , కిండిల్ ఎడిషన్ గా తీసుకోవచ్చు.
e Book , పేపర్బాక్, హార్డ్కవర్ వంటి వాటిద్వారా అమెరికా,కెనెడా,ఆస్ట్రేలియా ,ఇంగ్లాండ్ దేశాలవారు కొంటున్నారు.
మను నెల్లుట్ల MPT , MA(Edu), MBA చేసాడు. ఇండియా , రువాండా( సెంట్రల్ ఆఫ్రికా) లో 13 ఏళ్ళు ఫిజియోథెరఫీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేసాడు.ప్రస్తుతం అమెజాన్ లో job చేస్తున్నాడు.అమెజాన్ లో చేరడానికి ముందు కెనెడా లో Actsafe Safety Association కు CEO గా జాబ్ చేసాడు. మను నెల్లుట్ల ఒక మంచి గాయకుడు. సింగర్. ప్రాడ్ కాస్ట్ హోస్ట్ podcast host (Manu Tho Muchatlu) కూడా! Facebook lo సింగర్ మను N గా వెతికితే కనిపిస్తాడు.
270 పేజీలలో 65000 పదాలతో సులభంగా చదవగలిగే ఇంగ్లీష్ తో ఉన్న నవల “జన్య భారత” నవల. ఈ నవల ముఖచిత్రాన్ని అంజన చేపూరి , USA చిత్రించారు.
ఎక్కడెక్కడైతే సంస్కృత శబ్దాలు ప్రయోగాలు చేసాడో ఆ కఠిన పదాలకు అర్థాలను ఇచ్చారు.
“ జన్యభారత ద డెల్యూజ్” అనే పేరుతో దీని కంటిన్యూయేషన్ కూడా రాస్తున్నారు మను .
మహాభారతం చదివిన వారికి ‘ ఔనుకదా వీళ్ళను గురించి ఈ సామాన్యులను ఎవరూ పట్టించుకొని రాయలేదుకదా అని ఈ నవలలోని పల్లెజనుల బ్రతుకు గాథ లను చదివి తప్పకుండా మన మనసులో అనుకొనితీరుతాం.
మను నెల్లుట్ల కు శుభాకాంక్షలు .
ఈ పుస్తకం—
https://lnkd.in/gKi_A99b (Amazon Canada)
https://lnkd.in/gE8FT_HK (Amazon US)
https://lnkd.in/gTC-YFzS (Amazon India) (Ebook version only)
ఈ లింక్ లలో లభిస్తుంది. మనమంతా చదువుదాము!!


ఆధారాలున్నాయి. మరణానికి సమీపమవుతున్నామన్న భావన పండు ముసలి నైనా రోదనకు గురి చేస్తుంది. ఎంతటి తాత్వికుని హృదయమైనా వేదనకు లోనవుతుంది. స్మశాన వైరాగ్యాన్ని నిండా నింపుకున్న వాడు కూడా మరణం మాట వింటే నాలుగు కన్నీటి బొట్లను రాల్చకుండా ఉండలేడు.


ఒక దేశం, ప్రాంతం ప్రజల యొక్క జీవన విధానము, వారి యొక్క సంస్కృతి సాహిత్యం ప్రభావితం చేస్తాయి. ఆయా కాలాలలోని ప్రజల ఆచారాలు, వ్యవహారాలు, రాజుల పాలన తెలియాలంటే అప్పటి మౌఖిక, లిఖిత సాహిత్యం ఆధారం, ఒక వెయ్యి సంవత్సరాల సాహిత్యం ప్రజల భాషకు పట్టం గట్టి రాజు ఆస్థానంలోనేగాక ప్రజల నాలుకలపై నడయాడింది. నాటి నుండి నేటికి సాహిత్యంలో విస్మరణకు, వివక్షతకు గురియైన తెలంగాణ: సాహితీ తేజోమూర్తులను వారి సాహిత్యాన్ని, వెలుగులోకి తీసుకవచ్చి వారిని సాహితీ యవనికపై పునర్జికించి. సాహిత్యంలో తెలంగాణ ఉనికిని దశదిశల చాటాలని తెలంగాణ ప్రచురణలు సంస్థ నిర్ణయించడం శుభపరినామం. “చరిత్రకెక్కని చరితార్థులు తెలంగాణ కవులు, రచయితలు”, ఇది అనాదిగా సాగుతూ వస్తున్న తంతు, వలసాంద్ర పాలకులు ఇక్కడి కవులను విస్మరించి, వివక్షతకు గురిచేశారు. ఇది శతాబ్దాలుగా సాగింది. ఈ నేలపై పుట్టిన ఆమహానీయులను గుర్తించి తనకున్న సమాచారం ప్రకారము ముప్పది రెండు మంది కవులను వెలుగులోకి తీసుక వచ్చిన ఘనత ఆచార్య “బిరుదురాజు రామరాజు” గారిది. వారు 1985లోనే కిరార్డు చేయనికె పూనుకున్నరు.
తెలుగు సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు వచ్చినప్పటికీ పద్య ప్రక్రియకు ఉన్న ప్రాధాన్యతనే వేరు. వేమన, సుమతి, కుమారా, కుమారీ, నరసింహ, దాశరథి మొదలైన శతక పద్యాలు నేటికి ప్రజల నాలుకలపై నాట్యమాడుతున్నాయంటే కారణం, ఆ పద్యాలకున్న ధారాశుద్ధి ధారణా శక్తి, ఆ శతక కర్తల రచనా పఠిమ, శైలి గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆధునిక కాలంలో కూడా శతకాలు రాసే కవుల సంఖ్య మరీ తక్కువనేం చెప్పలేము. ఎక్కువ మంది రచయితలు మాత్రం వచన కవిత్వం వైపు మొగ్గుచూపుతున్న మాట నిజం. తెలుగు భాషోపాధ్యాయులు కూకట్ల తిరుపతికి కూడా 2005లో వెలువడిన “మేలుకొలుపు” వచన కవిత్వ గ్రంథమే, మొదటగా కవిగా, రచయితగా మంచి గుర్తింపును తెచ్చింది. ఆ తర్వాత 2006లో పద్య ప్రక్రియలో “శ్రీ చదువులమ్మ శతకము” ను తీసుకొచ్చి, పద్యకవిగా సాహితీ లోకాన్ని మెప్పించారు.