ఆధారాలున్నాయి. మరణానికి సమీపమవుతున్నామన్న భావన పండు ముసలి నైనా రోదనకు గురి చేస్తుంది. ఎంతటి తాత్వికుని హృదయమైనా వేదనకు లోనవుతుంది. స్మశాన వైరాగ్యాన్ని నిండా నింపుకున్న వాడు కూడా మరణం మాట వింటే నాలుగు కన్నీటి బొట్లను రాల్చకుండా ఉండలేడు.
ఆధారాలున్నాయి. మరణానికి సమీపమవుతున్నామన్న భావన పండు ముసలి నైనా రోదనకు గురి చేస్తుంది. ఎంతటి తాత్వికుని హృదయమైనా వేదనకు లోనవుతుంది. స్మశాన వైరాగ్యాన్ని నిండా నింపుకున్న వాడు కూడా మరణం మాట వింటే నాలుగు కన్నీటి బొట్లను రాల్చకుండా ఉండలేడు.



ఒక దేశం, ప్రాంతం ప్రజల యొక్క జీవన విధానము, వారి యొక్క సంస్కృతి సాహిత్యం ప్రభావితం చేస్తాయి. ఆయా కాలాలలోని ప్రజల ఆచారాలు, వ్యవహారాలు, రాజుల పాలన తెలియాలంటే అప్పటి మౌఖిక, లిఖిత సాహిత్యం ఆధారం, ఒక వెయ్యి సంవత్సరాల సాహిత్యం ప్రజల భాషకు పట్టం గట్టి రాజు ఆస్థానంలోనేగాక ప్రజల నాలుకలపై నడయాడింది. నాటి నుండి నేటికి సాహిత్యంలో విస్మరణకు, వివక్షతకు గురియైన తెలంగాణ: సాహితీ తేజోమూర్తులను వారి సాహిత్యాన్ని, వెలుగులోకి తీసుకవచ్చి వారిని సాహితీ యవనికపై పునర్జికించి. సాహిత్యంలో తెలంగాణ ఉనికిని దశదిశల చాటాలని తెలంగాణ ప్రచురణలు సంస్థ నిర్ణయించడం శుభపరినామం. “చరిత్రకెక్కని చరితార్థులు తెలంగాణ కవులు, రచయితలు”, ఇది అనాదిగా సాగుతూ వస్తున్న తంతు, వలసాంద్ర పాలకులు ఇక్కడి కవులను విస్మరించి, వివక్షతకు గురిచేశారు. ఇది శతాబ్దాలుగా సాగింది. ఈ నేలపై పుట్టిన ఆమహానీయులను గుర్తించి తనకున్న సమాచారం ప్రకారము ముప్పది రెండు మంది కవులను వెలుగులోకి తీసుక వచ్చిన ఘనత ఆచార్య “బిరుదురాజు రామరాజు” గారిది. వారు 1985లోనే కిరార్డు చేయనికె పూనుకున్నరు.
తెలుగు సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు వచ్చినప్పటికీ పద్య ప్రక్రియకు ఉన్న ప్రాధాన్యతనే వేరు. వేమన, సుమతి, కుమారా, కుమారీ, నరసింహ, దాశరథి మొదలైన శతక పద్యాలు నేటికి ప్రజల నాలుకలపై నాట్యమాడుతున్నాయంటే కారణం, ఆ పద్యాలకున్న ధారాశుద్ధి ధారణా శక్తి, ఆ శతక కర్తల రచనా పఠిమ, శైలి గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆధునిక కాలంలో కూడా శతకాలు రాసే కవుల సంఖ్య మరీ తక్కువనేం చెప్పలేము. ఎక్కువ మంది రచయితలు మాత్రం వచన కవిత్వం వైపు మొగ్గుచూపుతున్న మాట నిజం. తెలుగు భాషోపాధ్యాయులు కూకట్ల తిరుపతికి కూడా 2005లో వెలువడిన “మేలుకొలుపు” వచన కవిత్వ గ్రంథమే, మొదటగా కవిగా, రచయితగా మంచి గుర్తింపును తెచ్చింది. ఆ తర్వాత 2006లో పద్య ప్రక్రియలో “శ్రీ చదువులమ్మ శతకము” ను తీసుకొచ్చి, పద్యకవిగా సాహితీ లోకాన్ని మెప్పించారు.
