17 వ శతాబ్దికి చ ేందిన ఉత్తమ వాగ్గేయకారులలో సదాశివ బ్రహ్మేంద్రరల వారొకరు. వీరి ఋషిత్ులుుల ైన పదాలలో ఆధ్ాుత్మమక , భకిత భవనాలు నేండారి ఉనాాయి. ఎననా యజ్ఞా లు చేసిన పవిత్ర మూరుత లు వీరు. అేంతేకాద్ర, దారుకావన విలాసము, ఉత్సవ మేండపము అనర మేండపములు కట్టేంచిన విత్రణ శీలురు.వీరిది పరసిదిికెకిిన శీీ శివా ద ైైత్ మతానకి చ ేందిన సేంపరదాయేం అయినపపట్కీ సేంగ్ీత్ కచేరీలలో వీరి కీరతనలు పాడడేంవిదాైేంసరలకు అలవాటే.సదాశివ బ్రహ్మేంద్రర ల పెరు చ పపగ్ానే “మానస సేంచరరగ “ అనా కీరతన గురుత కు వసరత ేందిఎవరికెైనా. వీరి కీరతనలలో సగుణోపాసన, నరుేణో పాసన రెేండు భావనలు కనపసరత నాయి. ద్క్షిణ భారత్ేంలో అనేక ఆశ్రమాలలో వీరి కీర్త నలు అక్షర్ బద్ధ ం చేయబడి ర్క్ష ంపబడుతున్నాయి. దాని ఆధార్ంగా వీరు పర యోగంచిన రాగాలు తెలుస్తు న్నాయి. కంతలవరాళి, స్తర్టి,కంభోజి, మోహన, తోడి, ధనశ్రర,ఆనంద్ భై ర్వి మొద్లై న రాగాలను వీరు ఉపయోగంచారు. భగవంతుని నిరాకరునిగా భావించి కీరిత ంచిన కీర్త నలను గాని, సగుణునిగా భావించి కీరిత ంచిన కీర్త నలను గాని గమనించినట్ల యితే వీరి భక్త గాఢత, తతపర్త అర్థ మవుతాయి. పర్మేశ్వరుని పట్ల వీరిక్ గల అపరిమిత విశ్వవసం తెలుస్తు ంది. అయితే కీర్త నల లో ఏ లౌక్కమై న కోరికలు కోరుతునాట్లల కనిపంచదు.నిర్మలమై న భక్త విశ్వవసాలు తపప ఇంకో భావన ఈ కీర్త నలలో గోచర్ం కదు. వీరిది పర్మహంస ముద్ర. మృదువై న భాషతో కూడిన వీరి కీర్త నలు సంగీత చరితర లో ఒక పర తేేక సాథ న్ననిా కల్గి ఉన్నాయి. ఒక ఉదాహర్ణ చూడండి. పలల వి: చింతా న్నస్తు ఖిలం తేషం చర్ణం: శ్మద్మ కరుణా సంపూరాా న్నం సాధు సమాగమ సంకీర్ాన్నం చర్ణం: పర్మహంస గురు పద్ చితాున్నం బర హ్మమ నందా మృత మతున్నం . ఇదీ మన వాగ్గి య కరుల సంక్ష పు చరితర. ఒక్కొకొ వాగ్గి య కరుని గురించి తెలుస్తకోవ లస్తంది ఎంతో ఉంది. వారు మనక ఇచిిన సందేశ్వనిా అర్థ ం చేస్తక్కని ముందుక సాగడం మన కర్త వేం.వారు జనిమంచిన దేశ్ంలో మనం పుట్ట డం ఎంతో అద్ృషట ం. ఈ అద్ృషట నిా మన స్తకృతంగా భావించి కర్త వాేనిా పాల్గంచినట్ల యితే మన జీవితాలు ధనేం అవుతాయి.
వ్యాసాలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆవిర్భావ కారణాలు లింగ వివక్ష , పునరుత్పత్తి హక్కులు , ఉద్యోగం ,ఓటు హక్కు హింస ఇలా అనేక మహిళా సమస్యలే ప్రధానాంశాలుగా ఉద్యమ రూపం దాల్చి తదనంతర పరిణామ క్రమంలో ఏర్పాటయిందీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. తొలుత ఎలాంటి నిర్ణీత తేదీ లేనప్పటికీ వివిధ మార్పులు- చేర్పుల అనంతరం ఐక్యరాజ్యసమితి మార్చి8 ,1977 లో దీన్ని గుర్తించి అంతర్జాతీయ మహిళా సెలవుదినంగా ప్రకటించింది .ఈరోజున వివిధ రంగాలలో మహిళలు చేసిన కృషిని ,విజయాలను గుర్తించి ప్రోత్సహించడం ఒక రివాజుగా మారింది. భారతీయ సంస్కృతి- సంప్రదాయాలలో ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో స్త్రీ మూర్తిదే అత్యంత కీలక స్థానం. ప్రతిరోజూ ఆమె నిర్వహించే పాత్ర ప్రధానమైనదే . మన దేశంలో ఎందరో మహిళామణులు తమ తమ రంగాల్లో అత్యంత ప్రతిభాపాటవాలు ప్రదర్శించి విశ్వవిఖ్యాతినొందారు . వారిలో ఒక మణిరత్నం శ్రీమతి మాలతీ చందూర్ గారు.

‘ప్రమదావనం’లో విరిసన ‘ సిందూర పుష్పం ‘ శ్రీమతి మాలతీ చందూర్. వీరు నూజివీడులో డిసెంబర్ 26,1928 న జ్ఞానాంబ ,వెంకటేశ్వర్లు దంపతులకు జన్మించారు . 8వ తరగతి వరకు విద్యాభ్యాసం నూజివీడులోనే సాగించి తదనంతరం మేనమామ చందూర్ గారి వద్ద ఏలూరులో సెయింట్ థెరీసా స్కూల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యనభ్యసించారు. అప్పుడే డి . కామేశ్వరి ఆనందరామం, శ్రీ శ్రీ , విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్త్రి నండూరి సుబ్బారావు మొదలైన వారిని కలిసే అవకాశం కలిగింది. 1947లో మేనమామ నాగేశ్వరరావు చందూర్ గారితో మద్రాస్ చేరుకుని వివాహానంతరం ప్రైవేటుగా ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేశారు. 1949 నుండి రచనావ్యాసంగంలోకి అడుగు పెట్టారు. అప్పట్లో వారు రేడియోలో రచనలు చదివి వినిపించేవారు. అక్కడే బుచ్చిబాబు , జనమంచి రామకృష్ణ, రాజమన్నార్ , మునిమాణిక్యం నరసింహారావు లాంటి సాహితీస్రష్టలెందరితోనో పరిచయాలు ఏర్పడ్డాయి.
సాధారణ చదువు కలిగిన అసాధారణ ప్రజ్ఞాశాలి. తెలిసింది చెప్పడం అతి తేలిక కానీ అవగాహన లేని అంశాల్ని సైతం కూలంకషంగా తెలుసుకుని ఓర్పుతో నేర్పుగా అర్థవంతంగా అద్భుతంగా వివరించడం ఆమెకే సాధ్యపడింది. తన ప్రతిభాదక్షతలతో ఎన్నో శీర్షికల్ని నిర్వహించారు. ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో 1952 నుండి దశాబ్దాల పాటు ‘ప్రమదావనం’ శీర్షిక నిర్వహించి ‘గిన్నిస్ ‘ రికార్డు సాధించారు. ఈ శీర్షికలో ఆమె స్పృశించని అంశమే లేదు. స్త్రీల సమస్యల పరిష్కారానికి ఎంతో ఉపయోగపడిందీశీర్షిక. ‘వంటలు – పిండి వంటలు’ వంటల పుస్తకం కొత్తగా పెళ్లయిన వారికి ఎంతో ప్రయోజనకారిగా ఉండి 30 సార్లు పునర్ముద్రింపబడింది .
వీరి ‘జవాబులు’ శీర్షికను మగవారు సైతం చదివేవారు.
‘మహిళ ‘ ప్రధానాంశంగా దాదాపు పాతిక నవలలు రచించారు . తెలుగు, తమిళం, ఆంగ్లభాషలపై పట్టున్న ఈమె 300కు పైగా ఆంగ్ల రచనలను అనువదించారు . జేన్ ఆస్టిన్ నుండి అరుంధతీరాయ్ రచనల వరకు ఇలా ఎందరివో అనువదించారు. 1970 నుండి కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా 11 సంవత్సరాలు పనిచేశారు. ఆ క్రమంలో తమిళ సినిమాల కోసం తమిళ భాష నేర్చుకుని అనువాదాలు చేసే స్థాయికి ఎదిగారు. ‘స్వాతి ‘ పత్రికలో ‘పాత కెరటాలు’ శీర్షికన ఆంగ్లానువాదలన్నీ దాదాపుగా
ప్రచురితమయ్యాయి.

వీరి తొలి కథ : ‘ రవ్వల దుద్దులు’
” నవల: ‘చంపకం – చెదపురుగులు’
ముఖ్య రచనలు :- భూమిపుత్రి , ఆలోచించు, హృదయనేత్రి , శతాబ్ది సూరీడు, శిశిర వసంతం మొదలైనవి.
అవార్డులు: 1987 : సమైక్య ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు. (‘హృదయనేత్రి’)
1990: ప్రతిష్టాత్మక భారతీయ
విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్
1992: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (హృదయనేత్రి)
1996: రాజా – లక్ష్మీ అవార్డు
1996: తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు
2005: శ్రీ చందూర్ , యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గార్లు సంయుక్తంగా స్థాపించిన ‘లోక్ నాయక్’ మొట్టమొదటి అవార్డు
2005: పద్మావతీవిశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ మరియు ‘కళాప్రపూర్ణ ‘ బిరుదు ప్రదానం.
జిజ్ఞాస , పట్టుదల , అవిశ్రాంత కృషితో సాహితీప్రక్రియలెన్నింటినో సృజించి సారస్వత శిఖరాలను అధిరోహించి అనేక సన్మానాలు సత్కారాలు పొందిన వీరికి జీవన సహచరుడు అందించిన సహాయ సహకారాలు అసాధారణం . తన పేరుకు చివర చందూర్ గారిని ‘మకుటం ‘ గా దాల్చి విరాజిల్లిన ఈ ‘విద్వన్మణి ‘ఆగస్టు 21, 2013న వాగ్దేవి పాదాల చెంత శాశ్వతంగా విశ్రమించారు. ఈ విజ్ఞానభాండాగారానికి కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించేదేముంటుంది
అక్షరసుమాంజలి తప్ప.
సంక్రాతి సంబరం, సంక్రాంతి మూడు రోజుల పండుగ. మొదటి రోజున భోగి’ , రెండోరోజు ‘మకర సంక్రాతి’, మూడోరోజు ‘కనుమ పండుగ.’! మకర సంక్రాంతినే’ తిల సంక్రమణం’ , ‘ పంటల పండుగ’ ‘ఆమని పండుగ’, అల్లుళ్ళ పండుగ’, జానపదుల పండుగ’ వంటి పేర్లతోనూ పిలుస్తారు. సస్య లక్ష్మిని వెంటబెట్టుకు వచ్చే పండుగ ఇది. సర్వ సాధారణంగా సంక్రాంతి జనవరి 13, 14, 15 తేదీలలోనే వస్తుంటుంది.
‘సంక్రాతి’ అంటేనే ఒక కొత్తదనానికి స్వాగతం పలికే శుభతరుణంగా పేర్కొనవచ్చు. ఏడాదికొకసారి వచ్చే మకర సంక్రాంతి తెలుగు వారి విశిష్ట పండుగ. అన్ని పండుగల మాదిరిగానే ఈ పండుగకూ కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆంగ్ల సంవత్సర ప్రారంభంలోనే వచ్చే మొట్ట మొదటి తెలుగు పండుగ ఈ సంక్రాంతి. మరణానికి సైతం పనికిరాని చేదు కాలంగా భావించే దక్షిణా యుగానికి స్వస్తి పలికి పుణ్య కాలమైన ఉత్తరాయణానికి ‘ మకర సంక్రాంతి’ పండుగే స్వాగతం పలుకుతుంది. ఆ రోజునుంచే మంచి రోజులకు శ్రీకారం. సూర్యుడు పన్నెండు రాశులలో సంచరించే సంక్రమణాను బట్టి ఒక్కో నెల ఏర్పడుతుంది. ఇలా సూర్యుడు ప్రతి రాశిలో ప్రవేశించే ప్రతి సమయాన్ని సంక్రాంతి అనవచ్చు. కాకపోతే వాటిని ‘మాస సంక్రాంతు’లంటారు. ధనుస్సు రాశి తర్వాత వచ్చే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించగానే ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభమైనట్టుగా చెబుతారు.

సంక్రాంతి వచ్చిందంటే చాలు పిల్లలు, యువతీ యువకులు గాలిపటాల సంబరాలు మొదలవుతాయి. పండుగకు ముందు, తర్వాత కొన్నాళ్ల పాటు ఆకాశంలో పగటి నక్షత్రాల్లా పతంగులు విహరిస్తుంటాయి. పతంగులు గాలిలో ఎగరవేసే ఆచారం చాలా కాలంగా వస్తోంది. ఒకప్పుడు ఇది గ్రామీణ క్రీడగానే ఉండేది. కానీ ఇప్పుడు నగరాల్లోనూ, పట్టణాల్లోనూ గాలిపటాల విహంగం అధికమయ్యాయి. గాలిపటాలు ఎగుర వెయ్యటానికి ఇప్పుడు పిల్లలతో పాటు పెద్దలూ ఆసక్తి చూపిస్తున్నారు.
మిగిలిన అన్ని పర్వదినాల మాటెలా వున్నా ఈ సంక్రాంతి తెలుగు ఆడపడుచుల పండుగలా అభివర్ణించవచ్చు. ధనుర్మాస ప్రారంభం నుండే తెలుగు వాకిళ్లు పండుగ సంబరాల్ని సంతరించుకుంటాయి. పసుపు, కుంకుమలు, మామిడాకులు, పూలదండలతో ఇంటి గుమ్మాలని శోభాయమానంగా అలంకరిస్తారు. ప్రతివారి వాకిళ్ళ ముంగిట ”ముత్యాల ముగ్గులు” ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మలు …బంతిపూల అలంకరణలు …గంగిరెద్దుల ఆటపాటలు…హరిదాసు కీర్తనలతో’ సంక్రాంతి లక్ష్మి’ కి స్వాగతం పలుకుతారు.
(తరుణి అంతర్లాజల వారపత్రిక సౌజన్యంతో)
మనదేశంలో యువతీ యువకులలో చాలా మందికి నేరహింసా ప్రవృత్తి పెరుగుతోందని ఆందోళన చెందుతున్నారు. దిగువ మధ్య తరగతి ప్రజల నుంచి వచ్చిన పిల్లలు ఉపాధి అవకాశాల్లేక, పేదరికం నుంచి బయటపడడానికి నేరాలబాట పడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వ్యసనాలకు బానిస లౌతున్నారు. జులాయిలుగా తిరుగుతున్నారు. మధ్య తరగతి ప్రజల పిల్లలు ఉద్యోగాలు సంపాదించినా, చాలీ చాలని జీతంతో కనీస అవసరాలు తీరక, లంచగొండు తెలుగా, అవినీతి పరులుగా మారుతున్నారు. ఎగువ మధ్య తరగతి ధనికుల పిల్లలు చదువుకున్నా, విలాసాలు మరిగి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కొంతమంది డబ్బు సంపాదన యావతో, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ, అక్కడే స్థిరపడి తల్లిదండ్రులకు, దేశానికి దూరంగా, అనుబంధా లకు అతీతంగా గడుపుతున్నారు. భారతదేశ భవిష్యత్తుగాని, సమాజ సంక్షేమంగాని, భావిపౌరులైన బాలబాలికలపైనే ఆధారపడి ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు, భావిభారత సౌభాగ్యానికి పట్టుకొమ్మలు. పిల్లలు బాగా చదువుకోవ డమే కాకుండా మంచి గుణగణాలు అలవరచుకోవాలి. క్రమశిక్షణతో పెరగాలి. కుటుంబం సమాజంపట్ల తమ బాధ్యతలను గుర్తించాలి. కాలాన్ని సద్వినియోగం చేసు కోవాలి. పెద్దలను, సంప్రదాయాలను గౌరవించాలి.
సమాజం నుంచి తాము పొందడంతోబాటు సమాజానికి తానేదో చేయాలన్న భావం కలగాలి. ఇవన్నీ నేటి యువతరానికి ఉన్నాయా? అని ప్రశ్నించుకుంటే చాలావరకు లేవని చెప్పాల్సిరావడం నిజంగా దురదృష్ట కరం. నేటి యువతరంలో క్రమశిక్షణ లేకపోయినా, వారు నేరాలకు, వ్యసనాలకు అలవాటు పడినా, లేకపోతే కుటుంబంపట్ల తమ బాధ్యతలను విస్మరించి తమ స్వార్ధ ప్రయోజనాలకే ప్రాముఖ్యతను ఇచ్చినా, మనం వారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఈ అవలక్షణాలన్నింటిలోనూ తల్లిదండ్రుల బాధ్యత ఎంతగానో ఉంది.
నేటి జీవన విధానంలో తల్లిదండ్రులు ఎవరి పనుల్లో వారు తీరిక లేకుండా ఉండడంతో పిల్లల పెంపకం చాలా క్లిష్టంగా ఉంటోంది. చాలామంది తల్లిదండ్రులకు పిల్లలను ఎలా పెంచాలో సరైన అవగాహన ఉండడంలేదు. దీనికి ప్రజల్లోని నిరక్షరాస్యతే కారణం. బాగా చదువుకున్న తల్లిదండ్రులు కూడా పాశ్చాత్య పోకడలతో పిల్లలను పెంచుతున్నారు. కాన్వెంటు, కాన్సెప్టు, టెక్నో వంటి పేర్లతో నడుస్తోన్న ఇంగ్లీషు స్కూళ్లల్లో చదివే పిల్లలకు మన సమాజంపట్ల సరైన అవగాహన ఏర్పడడంలేదు. పేద పిల్లలకు ప్రభుత్వ పాఠశాల్లో సరైన విద్య లభించడంలేదు. పేద కుటుంబాల పిల్లలు చాలామంది చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులకు పిల్లలతో గడిపే తీరికలేదు. చిన్నప్పుడే పిల్లలను కేర్సెంటర్లలో చేర్పిస్తు న్నారు. వారు పెద్దవుతున్నా వారి స్నేహితుల గురించి, వారు చేస్తున్న పనుల గురించి తెలుసుకోవడంలేదు. చాలా మంది పిల్లలు గంటలకొద్దీ టీవీ ముందు కూర్చోవడం, కాలం వృథాచేసే క్రికెట్ మ్యాచ్లు, హింసాత్మక కార్టూన్లు చూస్తూ కాలం గడిపేస్తున్నారు. వీటివల్ల పిల్లల మానసిక దృక్పథం, వైఖరి ప్రభావితం అవుతున్నాయి.
పిల్లలను పాడుచేస్తున్నాయని ఒక విద్యావేత్త అన్నారు. ఇది అక్షరాలా నిజం పిల్లలు విజ్ఞానం పెంచుకోవడానికి, చదువుకోవడానికి, ఆటలాడుకోవడానికి, వ్యాయామం చేయడానికి, సృజనాత్మక శక్తి వంటి నైపుణ్యాలను పెందు కోవడానికి విలువైన కాలాన్ని టివి ముందు వృథాగా ఖర్చుచేస్తున్నారు. సహజ సిద్ధంగా పిల్లలకు ఆ వయసులో ఉండాల్సిన అమాయకత్వం, ఉత్సాహం, పరుగులుతీసే వేగం ఉండడంలేదు.
పిల్లలకు సహజసిద్ధమైన ఆలోచనలుకాక పెద్దపెద్ద విషయాల గురించి ఆలోచించడం పరిపాటైంది. తల్లిదండ్రులు కొందరు తమ పిల్లల మంచి ప్రవర్తన పట్టించుకోరుగాని చెడును తొందరగా పట్టించుకొని శిక్షిస్తుంటారు. పిల్లల్లోని మంచి లక్షణాలు, నైపుణ్యాలు, బలాలను ఏ మాత్రం గుర్తించరు. గుర్తించినా ప్రోత్స హించరు. పిల్లల్లో చెదులక్షణాలు ఉన్నట్లే మంచివికూడా ఉంటాయి. ఆ లక్షణాలను గుర్తించి వారిని ప్రోత్సహిస్తే పిల్లలు మరింత అభివృద్ధి సాధిస్తారు. రోజులో ఒక్క గంటసేపైనా తల్లిదండ్రులు పిల్లలతో చర్చించాలి. వారి సమస్యల గురించి వాకబు చేయాలి. వారి అలవాట్లు, మానసిక స్థితిని పట్టించుకోవాలి. మన సంప్రదాయం. గురించి, ఉన్నత విలువల గురించి వారికి నచ్చేరీతిలో చెప్పాలి. ఏదైనా చెడుపని చేసినపుడు అది తప్పని నచ్చ: చెప్పగలగాలి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని అతిగా గారాబం చేస్తారు. వాళ్లు అడిగినది ఏదీ కాదనరు. వారి ప్రవర్తన బాగా లేకపోయినా మండలించరు. దానివల్ల అలా పెరిగినవారిలో మొండితనం ఏర్పడుతుంది. గొడవ చేస్తే తాము అడిగింది ఏదైనా సాధించుకోగలమున్న గర్వం ఏర్పడుతుంది. తీరా వీళ్లు పెద్దయ్యాక తమమాట చెల్లక పోయినా, తమమాటను ఎవరైనా ఖండించినా భరించ లేదు. ఇలాంటివారు బయట ఏ అవమానం ఎదురైనా తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఈ మనస్తత్వానికి కారణం వారి తల్లిదండ్రులే, అతిగారాబం వల్ల మంకుపట్టుదల ఏర్పడుతుంది.
మరికొంతమంది తల్లిదండ్రులకు తమ పిల్లలే. ఉత్తి పనికిరానివారుగా, దరిద్రులుగా కన్పిస్తారు. వారిని ఎప్పుడూ శిక్షిస్తూ అవహేళన చేస్తూ అవమానిస్తుంటారు. ఇతరులు ముందు వారి గురించి చులకనగా మాట్లాడు: తుంటారు. ఇలాంటివారికి చిన్నతనం నుంచే తల్లిదండ్రుల మీద ద్వేషం కలుగుతుంది. పెద్దయిన తర్వాత అది. సమాజంపై కసిగా మారుతుంది. దాంతో అలాంటివారు. అందరినీ ద్వేషిస్తూ మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు. లేదా కసితో పెట్రేగిపోయి నేరాలబాట పడతారు. రకరకాల వ్యసనాలకు బానిసలవుతారు. నిజంగా ఈనాడు పిల్లల మనసులకు ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. చదువు కోకపోతే చెడుతిరుగుళ్లు తిరగడం, చదువుకోమంటే బడి ఎగ్గొట్టి షికారులకు పోవడం మనం చూస్తూ ఉంటాం. అలాగే కొంతమంది పిల్లలకు ఆదుకోవడానికి, ఆలోచించడానికి కూడా టైం ఉండదు. బండెడు పుస్తకాలు మోసుకుంటూ సాయంత్రం వరకు జైలుగదివంటి క్లాస్ రూంలో కూర్చోవడం, తర్వాత ట్యూషన్లకు వెళ్లడం, వీటితో అలసిపోయి ఇంటికి వచ్చాక గంపెడు హెూంవర్కు చేయడం ఇదీ దినచర్య దానికితోడు తల్లిదండ్రులు తమ పిల్లల అభిరుచిని కనుక్కోకుండా తమ ఆశలను, ఆశయా లను వారిపై రుద్ది వారిని హింసించడం. చాలామంది. తల్లిదండ్రులు చదవమని గోల పెడుతూ పిల్లలను రచి రంపాన పెడుతుంటారు. వారికి మానసిక ఉల్లాసం కలిగే వీలేలేదు. ఆ కారణంగా వారు చదువును ద్వేషించడం లేదా చదువుతప్ప వేరే ఏ విషయం పట్టించుకోకపోవడం, దీనివల్ల వాళ్లు ర్యాంకుల రేసులో పరుగెడుతుంటారు. అందుకు తగినట్లుగానే – న్యూన్లు, ప్రైవేటు కాలేజీలు కూడా రోజంతా వారిని రుబ్బుతూనే ఉంటాయి. దీంతో చదువనే జాడ్యం తప్ప సమాజంలో బతకాల్సిన తీరు గురించి సాటి మనుషులతో మెలిగే పద్ధతికూడా తెలియకుండా పోతుంది. అందువల్ల వారు ర్యాంకులు తెచ్చుకొని తల్లిదండ్రులకు గుడ్ బై చెప్పి విదేశాలకు వెళ్లిపోతారు. తండ్రిపోయినా, తల్లిపోయినా లేక వాళ్లు ఇక్కడ దిక్కు లేకుండా పోయినా వారికి చీమకుట్టినట్లయినా ఉండదు. అందులో వారి తప్పేమీలేదు. అలా వారిని తయారు చేసిన తప్పంతా తల్లిదండ్రులదే.
అబ్బాయి, అమ్మాయిగాని బాగా చదివి లక్షలు గడించే ఉద్యోగాలు సంపాదించి, మహానగ రాల్లోనో విదేశాల్లోనో స్థిరపడాలని కలలుగని, ఒక ఏ. విషయాలు పిల్లలకు చెప్పకుండా చదువు చదువు అనే మంత్రాన్నే జపిస్తుంటారు. దానివల్ల ఆ పిల్లలకు పెద్ద వారిని గౌరవించడంగాని, తనవారిని ప్రేమించడంగాని, సంప్రదాయాలను గౌరవించడంగాని తెలియకుండా పోతుంది. చాలామంది తల్లిదండ్రులు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు పిల్లలు తమను లెక్కచేయనపుడు లబోదిబోమని కుమిలిపోతుంటారు. ఇలాంటివారిని చూసి కూడా గుణపాఠం నేర్చుకోకుండా తాము కూడా అదే మార్గంలో నడుస్తుండడం చాలా విచారించదగిన విషయం పెద్దలు పిల్లలు చెప్పేది వినాలి. ప్రతి పిల్లవాడికి వ్యక్తిత్వం ఉంటుంది దాన్ని వికసింపచేసుకోవడానికి తగిన ప్రోత్సాహం, ప్రేరణ తల్లిదండ్రులు కలిగించాలి. అలాగే వారిని అతి గారాబం చేసి చెడగొట్టకూడదు. మగపిల్లలు బయట ఏం చేస్తున్నారో గమనించాలి. వారి అలవాట్లను గమనించాలి. క్రమశిక్షణతో మెలిగేలా శ్రద్ద తీసుకోవాలి. పిల్లల ముందే తల్లిదండ్రులు తిట్టుకోవడం, కొట్టుకోవడం చేయకూడదు. తండ్రులు బాధ్యతా రహితంగా ప్రవర్తించడం వారి ముందే తాగడం వంటివి చేయకూడదు. అలాగే వారిముందే తండ్రిని తీసేసినట్టు మాట్లాడడం, ఇరుగుపొరుగువారి గురించి చెడుగా మాట్లాడడం వంటివి చేయకూడదు. ఆడపిల్లలు ఒంటరిగా గదిలో కూర్చుని నెట్లలో గడుపుతుంటే ఏం చేస్తున్నారో గమనించాలి. చాలామంది నెట్లో ముక్కూ మొహం తెలియనివారితో చాటింగులు చేసి ప్రేమలో పడుతుంటారు. సెల్ ఫోన్ విరివిగా మాట్లాడు. కుంటారు. వీటన్నింటినీ గుర్తించి వాటివల్ల కలిగే చెడు ప్రభావాలనుంచి తప్పించే బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలకు స్వేచ్ఛనివ్వకుండా ఉండడం ఎంత తప్పో, అతిగా స్వేచ్ఛనిచ్చి వారిగురించి పట్టించుకోకపోవడం కూడా అంతే తప్పు, పిల్లలకు సారీ చెప్పడానికి తల్లిదండ్రులు వెనకాడకూడదు. అలాగే పిల్లలు వారిమాట నెగ్గించుకోవ దానికి నానాయాగీ చేస్తే వెంటనే వారి కోర్కెలు తీర్చడానికి సిద్ధమైపోకూడదు. తగని విషయాల గురించి పిల్లలు మారాం చేస్తే వారిని మందలించగలగాలి. ముఖ్యంగా చిన్నవాటి నుంచే వారికి క్రమశిక్షణ నేర్పాలి. పిల్లలకు నేర్చేముందు వారి పెద్దవాళ్లు, తల్లి
దండ్రులు క్రమశిక్షణతో ఉండాలి. పిల్లల్ని క్రమశిక్షణలో
పెట్టే ప్రక్రియ ప్రేమపూర్వకంగా ఉండాలి. ఆ ప్రేమలోనే వారలోపాలను కచ్చితంగా సరిదిద్దగలగాలి. పిల్లల్లోని అసంబద్ధప్రవర్తన అనవసర ప్రసంగాలు మంకుపట్టుతో. మొరాయించడం పెద్దలపట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించడం వంటివి ఆదిలోనే తుంచేయాలి. పిల్లలతో చాలా స్నేహంగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా ఒకనాటి పిల్లలే. అని గుర్తుపెట్టుకొని వారిని భయపెట్టకూడదు. వారిని అసహ్యంగా తిట్టకూడదు. వాళ్లను శాంతింపచేయడానికి లంచాలు కానుకలు ఇస్తుంటారు. అది చాలా తప్పు, దాంతో పిల్లలు ఏదైనా ఇస్తామని చెబితేనే మాటవినే పరిస్థితి వస్తుంది. పిల్లల్లో తల్లిదండ్రులు కానుకలిచ్చే అలవాటు చేయడం వల్ల వాళ్లు పెద్దయ్యాక లంచ గొందులుగా మారతారు.
పిల్లలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదని. ఎప్పటికప్పుడు చెబుతుండాలి. అలాగే బహుమానంగా ఏదో ఒకటి ఇచ్చి వారిని మంచి చేసుకోవడం సరైనది. కాదు. చాలా కుటుంబాల్లో ఈ క్రమశిక్షణ భారాన్ని తల్లులకే వదిలేస్తారు. తల్లుల గురించి తండ్రులకు చాడీలు చెప్పి, తండ్రుల గురించి తల్లులకు చెప్పి ఎవరో ఒకరికి దగ్గరై వారినుంచి డబ్బులు, కానుకలు పొందు తుంటారు. ఈ చాడీలను ప్రోత్సహించకూడదు. కొందరు తండ్రులు తల్లి విషయంలో పిల్లలను ప్రోత్సహిస్తుంటారు. అలాగే తల్లులు కూడా. దీనివల్ల పిల్లలకు చాడీలు చెప్పే మనస్తత్వం బాగా అలవడుతుంది. వీడు పెద్దయ్యాక ఎవరో ఒకరిగురించి చెడుగా మాట్లాడుతుంటాడు. పెద్దల్లోనే చాలా లోపాలున్నపుడు పిల్లల్లో లోపాలు అత్యంత సహజం. ఆ లోపాల గురించి వారికి చెప్పాలి. అంతేగాని ఈ లోపంవల్ల నువ్వు దేనికీ పనికిరావని అనకూడదు.
అలాగే మాటవిననివారిని తల్లిదండ్రులు బెదిరిస్తుంటారు.. దీనివల్ల పిల్లల్లో ఒకరకమైన భయం ఏర్పడుతుంది. వారిలో తిరస్కారానికి గురయ్యామన్న భావం కలిగి ఆందోళన చెందుతారు. దానివల్ల వారిలో ఆత్మవిశ్వాసం ఆత్మస్థైర్యం వంటివి తగ్గిపోతాయి.
పిల్లలనుకూడా గౌరవించాలని చెబితే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. చాలామంది వారి పిల్లలను మనం గౌరవించినట్లు మాట్లాడితే “వాడిమొహం వాడు. దేనికీ పనికిరాదనో లేదా దానిమొహం అదొక ఏడుపు గొట్టుది ఎలా బతుకుతుందోనని భయపడుతున్నాం” అని అంటారు. దానివల్ల వారికి తాము నిజంగా పనికిరామన్న భావం కలుగుతుంది. వీటన్నిటి గురించి మనం చర్చించు కొనేటపుడు పిల్లల్ని పెంచడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అనే భావం కలగవచ్చు. తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్త వహిస్తే ఇదేమంత కష్టమైనదికాదు. అలాగని ఎంతో నిర్లక్ష్యంగా ప్రవర్తించే వ్యవహారంకూడా కాదు. పిల్లల పెంపకం అన్నది గొప్పకళ, కొన్ని కుటుంబాల్లో పిల్లలు పెరిగి పెద్దయి ఎంత ప్రయోజనకారులవుతారో వారు ఎంత చక్కగా కుటుంబ పద్ధతులను సంప్రదాయాలను గౌరవిస్తారో చూస్తుంటే ఎంతో ఆనందం వేస్తుంది. అందుకు వారి తల్లిదండ్రులను ప్రశంసించాలి. కాబట్టి మనం ఒక బంగారం ఉంగరం పోగొట్టుకుంటే ఎంతబాధ పడతామో ఆలోచించండి. అలాంటిది మన పిల్లలంటే మనకు నిలువెత్తు బంగారంలాంటివారు. ఆ బంగారా లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపైనా ఉంది. వాళ్లను తమ బంగారాలుగా భావించగలిగితే ప్రతి తల్లితండ్రీ పిల్లల పెంపకంపట్ల మరింత శ్రద్ధచూపి స్తారు. అప్పుడే ఆ పిల్లలు ప్రయోజకులవుతారు.
“కవి శిరోమణి” -“రసస్రవంతి”
“ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్ “
” కావ్యసుధ
“పత్రికొక్కటున్న పదివేల సైన్యము
పత్రికొక్కటున్న మిత్రకోటి
ప్రజలకు రక్షలేదు పత్రిక లేనిచో!!
అని నమ్మిన డా.నార్ల వెంకటేశ్వర రావు పత్రిక సైన్యాధ్యక్షునిగా ఆంధ్ర ప్రభ,ఆంధ్ర జ్యోతి పత్రికలలో ఎడిటర్ గా పనిచేసి పత్రికను పైకి తేవడానికి కొత్త ఒరవడిని ప్రవేశపెట్టి కాగడా,జనవాణి పత్రికల్లో తాపీ ధర్మారావు ప్రారంభించిన వ్యావహారిక భాషా ఉద్యమాన్ని ఆంధ్రప్రభ,ఆంధ్రజ్యోతి పత్రికల ద్వారా సమర్థంగా కొనసాగించిన దిట్ట.
హేతువాది,రాజ్యసభ సభ్యుడు ,సంపాదకుడు అయిన నార్ల వెంకటేశ్వర రావు డిసెంబర్ 1 వతేదీ 1908 సంవత్సరంలో లక్ష్మణరావు,మహాలక్ష్మి దంపతులకు మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించాడు. కృష్ణాజిల్లాలో విద్యాభ్యాసం కొనసాగింది.
మద్దూరి అన్నపూర్ణయ్య ప్రచురించే ” కాంగ్రెస్” పత్రికకు 1928 సంవత్సరం తన 20 సంవత్సరాల వయసులో రాసిన మొదటి ఉత్తరం నార్ల పత్రికారచన వైపుకు దారి తీసింది. మొదట్లో ఉపేంద్ర,రవీంద్ర పేరుతో స్వరాజ్య,జనవాణి,ప్రజామిత్ర పత్రికల్లో వ్యాసాలు రాశాడు.
1938 సంవత్సరంలో సులోచనాదేవితో వివాహం జరిగింది.
1938లో ఆంధ్రప్రభలో న్యూస్ ఎడిటర్ గా చేరి 1942 నుండి 1959 వరకు ఎడిటర్ గా బాధ్యత ను నిర్వహించాడు.
కేవలం ఒక సంపాదకుడి కోసం ఆ రోజుల్లో కె.ఎల్.ఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆంధ్రజ్యోతి పత్రిక 1960 జులై 1 వ తేదీ విజయవాడలో ఆవిర్భవించింది. ఆ సంపాదకుడు నార్ల వెంకటేశ్వర రావు. ఆయన సంపాదకత్వంలో ఆంధ్రజ్యోతి పత్రిక కొత్త పుంతలు తొక్కింది.నిజాయితీకి,నిర్భీతికి మారుపేరు నార్ల.
ఎవ్వరికీ భయపడని ఆదరని బెదరని వ్యక్తిత్వం నార్లది.ప్రజలకు అర్ధమయ్యే జీవ భాషలో సంపాదకీయాలను రాశారు. నైజాం ప్రభుత్వం ఆంధ్రప్రభను నిషేధిస్తే రజాకార్ల దురాగతాలపై ఎత్తిన కత్తి దించకుండా కలం కదిలించిన యోధుడు.
జైల్లో ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య గారు తనకు ఇస్తున్న ఆంధ్రప్రభ దినపత్రిక నానా కత్తిరింపులతో సెన్సార్ చెయ్యబడి వస్తున్నదేమిటి అని నార్ల వారికి ఉత్తరం రాశారు.తన సంపాదకత్వంలో వస్తున్న పత్రికను ప్రభుత్వం కత్తిరింపులతో రాజకీయ ఖైదీలకు అందిస్తున్నందుకు నిరసనగా ఒకరోజు పత్రిక మొదటి పేజీనిండా నల్లగా తారు పూసి విడుదల చేశాడు.అది పత్రికా ప్రపంచంలో చాలా ఘాటైన నిరసన.దానితో ప్రభుత్వం దిగివచ్చి సెన్సార్ చేయడం మానుకుంది.
నార్ల స్వతంత్రుడు.ఏ రాజకీయ నాయకుణ్ణి విమర్శించకుండా వదలలేదు.రాజగోపాలచారిని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని 1946లో మహాత్ముడు నిర్ణయించినపుడు దానికి నిరసనగా నార్ల శరపరంపరగా సంపాదక అస్త్రశస్త్రాలను ప్రయోగించాడు. నచ్చని నాయకుణ్ణి ఎన్నుకోవాలని చెప్పే హక్కు గాంధీజీతో సహా ఎవరికీ లేదు అని తెగేసి చెప్పాడు. ఇందిరాగాంధీ నిరంకుశపాలనను,కుటుంబ వారసత్వ పాలన రాజకీయాలను ద్వేషించాడు.పౌరహక్కులు, మానవ విలువలు కావాలనుకునే వాడు.
ఆధునిక పత్రికా ప్రపంచాన్ని తన సంపాదకీయాల ద్వారా ఉర్రూతలూగించి, పత్రికకు ప్రాణదీపాలుగా మార్చి, సామాజిక సంస్కరణకు వాహికలుగా మార్చిన ఘనుడు లేఖాప్రపంచాన్ని కూడా పరిపుష్టం చేసిన మహనీయుడు.
నార్ల వారిలో ఎంతో సృజనాత్మక దృక్పథం ఉంది.దానిని మించి విమర్శావలోకనం కూడా ఉంది.సమకాలీన కాలంలో ఎంతో మందికి వ్రాసిన ఉత్తర ప్రత్యుత్తరాల వలన ఆయన విమర్శనా దృక్పథాన్ని అవగాహన చేసుకోవచ్చు.
బిరుసైన పండితులనుంచి మొదలుపెట్టి ప్రాథమికావస్థలో ఉన్న సాహిత్య ప్రియులవరకు నార్ల స్వయంగా స్వదస్తూరితో లేఖలు రాసి తమ మనోగతాభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు.
బెంగుళూరు నివాసి అయిన ” హరిహరప్రియ” అని పిలువబడే సాతవల్లి వెంకట విశ్వనాథకు నార్లకు మధ్య సాహిత్య సంబంధాలున్నాయి.
వయోరీత్యా ఆలోచిస్తే నార్ల హరిహరప్రియ కంటె చాలా పెద్దవాడు.చిన్నవాడైన హరిహరప్రియ వ్రాసిన ఎన్నో ఉత్తరాలకు నార్ల ప్రతిస్పందించి ఎంతో ఓపికగా సమాధానాలిచ్చాడు.అది నిజమైన సాహితీవేత్తకుండే సమ్యక్ దృష్టి.ఈ దృష్టి నార్లలో విశాలంగా ఉంది.
నార్ల వ్రాసిన ఉత్తరాలను 50కి పైగా జాగ్రత్తగా భద్రపరచి హరిహరప్రియ ముద్రించి పుస్తకరూపంలో వెలికి తెచ్చాడు.అయితే ఈ ఉత్తరాలన్నీ ఆంగ్లంలో ఉన్నాయి.నార్లకు తెలుగులో ఎంత భావావేశం ఉందో ఆంగ్లంలో కూడా అంతకు రెట్టింపు భావావేశమున్నదని ఈ ఉత్తరాలను లోతుగా దర్శిస్తే తెలిసిపోతుంది.ఉత్తమ విమర్శకునికి ఉండాల్సిన సమ్యక్ దృష్టి ,విశ్లేషణాత్మక, నార్లలో పుష్కలంగా ఉన్నాయి.
“హరిహరప్రియ” కు రాసిన ఉత్తరాల్లో సాహిత్య విషయాలతో పాటు తన కుటుంబానికి సంబంధించిన అరుదైన విషయాలను ప్రస్తావించాడు. చిన్నవాడైన హరిహరప్రియతో తన ఆరోగ్య విషయాలు చర్చించాడు. విషయాలను ప్రస్తావించేటప్పుడు నిర్మొహమాటంగా చెప్పడం నార్ల వారి ప్రధాన లక్షణం.తనకు నచ్చని విషయాలను కూడా నచ్చిన విషయాలతో కలుపుతూ చురకలంటించిన సందర్భాలు చాలా వున్నాయి.వైజ్ఞానిక వ్యవహారాలు,వైయక్తిక విషయాలు,సమకాలికుల ప్రస్తావన, పుస్తకాల ముద్రణ,పుస్తక వ్యవహారాల ఇచ్చిపుచ్చుకోవడాలు ఇలాంటి వెన్నెన్నో అంశాలు నార్ల లేఖలో ప్రస్తావనకు వచ్చాయి.నార్ల రాసిన లేఖలను హరిహరప్రియ భద్రపరచి ముద్రించాలనుకొన్నప్పుడు హరిహరప్రియ నార్ల అనుమతి కోరాడు.తనపై చూపే అభిమానాన్ని ఒకవైపు మెచ్చుకుంటూనే తన మరణానంతరం లేఖలను ముద్రించవచ్చని నార్ల కోరాడు.ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఏ ఉత్తరంలోనైతే నార్ల
ఈ విషయాన్ని ప్రస్తావించాడో ఆ ఉత్తరమే హరిహరప్రియకు చివరిసారిగా వ్రాసిన ఉత్తరమైంది.
కవులు,విమర్శకులు క్రాంతదర్శిత్వం కలవారని చెప్పటానికి ఈ ఉత్తరం ఒక ప్రత్యక్ష తార్కాణం.
నార్ల లేఖలను భిన్నకోణాలనుండి దర్శించి సమీక్షింపవచ్చు.హరిహరప్రియ కు వ్రాసిన ఉత్తారాల్లో చాలావరకు సమీక్షాత్మక లేఖలే అధికం.సరళమైన ఆంగ్ల పదాలతో భావ వ్యక్తీకరణ చేశాడు పదాల పటాటోపం కోసం ప్రాకులాడినట్లు ఎక్కడా కనిపించదు.పరాయిభాష పట్ల వ్యామోహాన్ని ప్రదర్శించే మనస్తత్వం నార్లలో కనిపించదు.అసలు పదాడంబరం అంటేనే నార్లకు అసహ్యం.ఒకచోట నార్ల పదాలపై నా అధికారం చూడు అనేది నా మట్టుకు కవిత్వం కాదు.నీ గుండెపై నా రాజ్యాన్ని చూడు అని చెప్పగలిగిందే కవిత్వం అని అంటాడు. ఈ వాక్యంలో కవిత్వాన్ని ఎంత ప్రస్ఫుటంగా గాఢంగా నిర్వచించాడో తెలుస్తుంది.
హరిహరప్రియకు రాసిన ఉత్తరాల్లో నార్ల తన ఆరోగ్యం గురించి అప్పుడప్పుడూ అక్కడక్కడా ప్రస్తావించాడు. ఆ లేఖలను బట్టి జీవితంలో ఎక్కువభాగం అనారోగ్యంతో బాధపడినట్లు తెలుసుకోవచ్చును.
అనారోగ్యం వలన ఆరోగ్యంగా ఉన్న సమయాలలో కూడా అస్వస్థులుగా కనిపించే వారట.
నార్లలో నిండైన మానవత్వం తొణికిసలాడుతుంది.గర్వం మచ్చుకైనా కన్పించదు.
తాను గొప్పవాడినని భావించినప్పటికీ అదే మోతాదులో ఇతరుల గొప్పతనాన్ని కూడా గుర్తించే హృదయవైశాల్యం కలవాడు.అందుకే
ఆయన నిండైన మానవతావాది.ఇతరులను గౌరవించడం వలన తమ గౌరవం కూడా పెరుగుతుందన్న విశాల దృక్పథం కలిగినవాడు నార్ల.
నార్ల రచించిన ” జాబాలి” ని హరిహరప్రియ కన్నడభాషలోకి అనువదించాడు ఆ సందర్భంలో ముగింపు వాక్యాలను గురించి అనువాదకుడు కొన్ని సూచనలు చేశారు. హరిహరప్రియ చేసిన సూచనలను నార్ల అంగీకరించాడు.దీనిని బట్టి ఆయన హృదయవైశాల్యాన్ని అంచనా వేయవచ్చు.” జాబాలి” కన్నడంలోకి అనువదింపబడిన తర్వాత హరిహరప్రియను ప్రశంసిస్తూ నార్ల ఆయనకు లేఖలు రాశాడు. కన్నడ పాఠకులు తన అనువాదగ్రంథాన్ని ఆదరించాలని దీవించాడు.ఆద్య రచయితగా కన్నడంలో ఆ పుస్తకాన్ని ముద్రించిన తర్వాత తనకు రెండు ప్రతులను పంపించమని నార్ల కోరాడు.చూసే వారికి ఈ కోరిక ఎంత చిన్నదైనా నార్ల ఎంత సంతృప్తిపరుడో తెలుస్తుంది.
అచ్చువేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా నార్ల హరిహరప్రియకు సూచించాడు.దీనినిబట్టి ఆయనలోని భావసౌందర్యమే కాదు రస సౌందర్యం,రూప సౌందర్యం కూడా వ్యక్తమౌతుంది.
జాబాలి కావ్యాన్ని కన్నడంలో డా.పుట్టప్ప చదివి తన అభిప్రాయం తెలిపినట్లు రాశాడు ఉత్తరంలో. అలాగే ఒక కాపీని డా.ఆద్య రంగాచార్యకు అందచేయమని చెప్పాడు.
రామాయణంలోని రెండవ నాటకం సీత జోస్యం ప్రచురణ అయ్యాక నీకు పోస్ట్ చేయిస్తానని రాశాడు. మీ ఇంట్లో అమ్మ నాన్నకు మీ శ్రీమతికి శుభాకాంక్షలు అని రాశాడు.
కన్నడంలోకి ” జాబాలి” అనువదింపబడిన తర్వాత మైసూరు విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్.వి.యెస్.సుందరం జాబాలిపై వ్యతిరేకాభిప్రాయాన్ని వ్యక్తీకరించాడు.ఆయన వ్యక్తీకరించిన అభిప్రాయాన్ని నార్ల ఒకచోట ప్రస్తావిస్తూ ” సుందరం గారి విజ్ఞతకు ఒకవైపు మెచ్చుకుంటూ చురక వేశాడు. మృదువుగా విమర్శించి మౌనముద్ర దాల్చడం నార్లకు పెట్టని భూషణం.
రచయితలు పుస్తక రచనలు చేస్తూ తమకు తాము ప్రచురించుకోవడం సరియైనది కాదని నార్ల అభిప్రాయపడ్డాడు.
ఈ విషయాన్ని హరిహరప్రియకు సూచించాడు కూడా.పుస్తకాలను తమకు తామే ప్రచురించుకోవడం వలన అమ్మడం కష్టమవుతుందని తత్ఫలితంగా విపరీతమైన నష్టాన్ని భరించవలసి వస్తుందని నార్ల అభిప్రాయ పడ్డాడు.పుస్తక ముద్రణ విషయంలో ప్రచురణకర్తలు ప్రోత్సహించాలని కూడా హరిహరప్రియకు సూచించాడు.
నార్ల భౌతిక జగత్తుకు చెందిన మనిషి. ఆయన ఉత్తరాల్లో ఎక్కడా మర్మవాదపు ఛాయలు గోచరించవు.ఆధ్యాత్మిక బోధలు అసలు రుచించవు. ఉత్తరాలను విశ్లేషిస్తే సామాన్యమానవుని జీవితానికి సంబంధించిన నమ్మశక్యంగాని రాయిలాంటి వాస్తవాలు బయటపడతాయి.అది ఆయన ఉత్తరాలలోని ప్రత్యేకత అంతేగాని ఊహాలోకాల్లో తేలిపోవడం అసలే నచ్చదు.
నార్ల చక్కని కుటుంబ జీవి.సాంసారిక సుఖాలను స్వర్గంలా భావించిన విశాల హృదయుడు. ఒక్కొక్కసారి తమ పిల్లల గురించి గొప్పలు చెప్పుకుంటూ నా సంతానమే నా సౌభాగ్యం అని పరవశించిపోతూ ఉండేవాడు.
నార్ల వారి ఉత్తరాల్లో హాస్య చమత్కారాలు మబ్బుచాటున మెరుపుతీగల్లా మెరిసిపోతుంటాయి.
ఐదుగురు కొడుకులు ,కోడళ్ళు,ముగ్గురు కూతుళ్లు, అల్లుళ్లు డాక్టర్లు.అందరూ విదేశాల్లోనే. ఒక కూతురు అల్లుడు మాత్రం ఇక్కడున్నారు మరి నాకేమో రెండు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. మా కుటుంబంలో నా భార్య తప్ప మిగతా వారంతా డాక్టర్లే.ఆమెకు కూడా ఏ విశ్వవిద్యాలయమైనా గౌరవ డాక్టరేట్ ఇస్తే బాగుంటుంది.అప్పుడు మాఇంట్లో అందరూ డాక్టర్లే అవుతారు.ఇంతమంది డాక్టరులున్నా నేనెప్పుడూ పేషేంట్ నే.తలనుంచి కాలుదాకా నేనో రోగాల పుట్టని”. నార్లవారి అరుదైన చమత్కారానికి ఈ ఉత్తరం నిదర్శనం. ఇప్పటి లాగా డబ్బులిచ్చి కొనుక్కునే దొంగ డాక్టర్ డిగ్రీలు ఆనాడు లేవు మరి.
నార్ల ఉత్తరాల్లో ఒకచోట తన వచనశైలికి సంబంధించిన ప్రస్తావన వచ్చింది తాను పాతకాలపు మనిషి అయిన కారణంచేత తన వచనం కూడా పాతదేనని తెగేసి చెప్పాడు. పత్రికారంగంలో ఆంధ్రజ్యోతి సంపాదకునిగా గణనీయమైన స్థానాన్ని సంపాదించిన నార్ల
ఏ పరిస్థితుల్లో దాన్ని వదులుకోవలసి వచ్చిందో హరిహరప్రియకు లేఖద్వారా తెలియచేస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.పత్రికాస్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న యాజమాన్యంపై నార్ల విరుచుకు పడ్డ సందర్భాలెన్నో ఉన్నాయి.
సమకాలీన సాహిత్యాన్ని అధ్యయనం చేయడం నార్లవారికి ఉన్న చక్కని అలవాటు ” తెలుగు విద్యార్థి” వంటి పత్రికలను క్రమం తప్పకుండా చదివి యువరచయితలను అర్థం చేసుకుంటానని హరిహరప్రియకు నార్ల మాట ఇచ్చాడు.ఇతరులు రాసిన ఉత్తరాలకు ప్రత్యుత్తరాలు రాసినపుడు ఆలస్యం జరిగినపుడు క్షమార్పణ చెప్పే మనస్తత్వం కలిగిన వ్యక్తి నార్ల.హరిహరప్రియకు ఎన్నో సందర్భాల్లో క్షమార్పణ చెప్పి తన వ్యక్తిత్వాన్ని పెంచుకున్నాడు.
మిత్రులతో కలిసి భోజనం చేయడమంటే నార్లకు చాలా ఇష్టం.అది ఆయన సంస్కారాన్ని తెలియచేసే విషయం.ఎంతో సంయమనంతో సమకాలికులతో జీవితాన్ని పంచుకోవాలన్న మనస్తత్వం నార్లది.తాను మైసూరు,బెంగుళూరు నగరాలకు వెళ్లినప్పుడు హరిహరప్రియ ఆతిథ్యాన్ని మెచ్చుకుంటూ నార్ల ప్రశంసల వర్షం కురిపించాడు.
నార్ల వ్యక్తిత్వాన్ని తలపింపజేసే ఎన్నో విషయాలు హరిహరప్రియ రాసిన లేఖలో ప్రస్తావనకు వచ్చాయి.ఒక ఉత్తరంలో నార్లను హరిహరప్రియ డా.నార్ల అని సంబోధించాడు. అలా సంబోధించడం వల్ల తన వ్యక్తిత్వం అంతగా పెరగదని నార్లకి, డా.నార్లకి అంత వ్యత్యాసం కనిపించడంలేదని మృదువుగా త్రోసిపుచ్చి భవిష్యత్తులో అలాంటి సంబోధనలు అక్కరలేదని సూచించాడు.అనవసర ఆడంబరాలకోసం ప్రాకులాడడం నార్లకు గిట్టదని ఈ లేఖ ద్వారా విదితమౌతుంది.
నార్ల వ్రాసిన కొన్ని గ్రంథాలు మరాఠీ భాషలోనికి కూడా అనువదించబడ్డాయి.
వీరేశలింగంపై
రాసిన మోనోగ్రాఫ్ గుజరాతీ భాషలో కూడా అనువదించబడింది.ఆయన రచనల గొప్పతనం తెలుగువారికే పరిమితం కాకుండా సమస్త భారతీయులు సైతం అవగాహన చేసుకొనే స్థితికి దిగారు.
నార్లకు సమకాలీన సమస్యలపై చక్కని అవగాహన ఉంది.తన కూతురు వివాహ విషయంలో తాను స్వయంగా కలుగజేసుకొని తన అల్లుడికి వరకట్నం ఇవ్వ ప్రయత్నించినప్పటికీ ఆయన కట్నంలేకుండా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది.ఈ విషయాన్ని హరిహరప్రియతో ప్రస్తావించి ఎంతో మురిసిపోయాడు.సమకాలీన కాలంనాటి వరకట్న సమస్యకు భిన్నంగా తాను మంచిబుద్ధి కలిగిన అల్లుడి ద్వారా అధిగమించానన్న ఆనందాన్ని నార్ల పొందినట్లున్నాడు.
ఇలా నార్ల వారి ఉత్తరాలను విశ్లేషించుకుంటూపోతే ఎన్నో అంశాలు బయట పడ్తాయి. కుటుంబ విషయాలు,మిత్రుల విషయాలు,రచనలకు సంబంధించిన విషయాలు,సాహిత్య విమర్శలు, సమకాలీన సమస్యలపై చర్చలు మొదలగు అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.ఇద్దరు వ్యక్తుల మధ్య సాగిన ఈ లేఖలవల్ల సమకాలీన సమాజానికి పనికి వచ్చే ఎన్నో విషయాలు నిక్షిప్తమై ఉండడం వల్ల సాహితీజగత్తుకు ఈ లేఖలు చక్కని సందేశాన్ని అందించినట్లు తెలుస్తుంది.
సంపాదకీయ వ్యాసాలు,సమకాలీన రాజకీయ పరిస్థితులను ఏ రకంగా శాసించాయో
లేఖాప్రపంచంలోని లేఖలు కూడా సమకాలీన సాహిత్యాంశాలను ఎన్నింటినో ఎత్తి చూపుతూ ఉత్తమ విమర్శకు చక్కని ఉదాహరణలుగా మిగిలిపోయాయి.
నార్ల వెంకటేశ్వర రావు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తూ అనేక ప్రక్రియల్లో రచనలు చేశాడు. నవయుగాల బాట నార్ల మాట అనే మకుటంతో 700 పైగా సందేశాత్మకంగా ఆట వెలది పద్యాలు,బాలలకోసం నీతి పద్యాలు,16 ఏకాంకికల సంపుటి,సాంఘిక,పౌరాణిక నాటకాలు,వ్యాసాలు మొదలైనవి ఎన్నో రాశాడు. ఏది రాసినా సామాజిక ప్రయోజనమే.
ఇంగిలీషులో భగవద్గీతపై విమర్శనాత్మక రచన చేయగా అది పలు విదేశీ జర్నల్స్ లో ప్రచురితమైంది.
నార్ల ఎన్నో కొత్తమాటలు,పదబంధాలు సృష్టించాడు.మాండలికానికి పెద్దపీట వేశాడు.భాషాపరమైన అంశాలలో ప్రయోగాలు ఆయన సొత్తు. ఆయన ఒక కదిలే విజ్ఞాన బాండాగారం.
ప్రశ్న ప్రగతికి మూలం.ప్రశ్నలేని జగత్తు ప్రశ్నార్థకం అని అంటాడు.
” తెలుగులో ఆలోచించి, తెలుగు నుడికారంలో తెలుగుదనం ఉట్టిపడేటట్టు రాయగలిగినప్పుడే తెలుగువారిలో మనం కదలిక పుట్టించగలం” అని ఆనాడే తోటి జర్నలిస్టులకు ఉద్బోధించాడు. నిజాయితీగా,నిర్భీతిగా ఉండాలని కోరే మేటి పాత్రికేయుడు నార్ల.
1981లో “సీత జోస్యం” నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందాడు.1983లో ఎన్. టి. రామారావు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక నార్లను సాంస్కృతిక వ్యవహారాల సలహాదారునిగా నియమించారు.
నిజాయితీయే ఆయుధమై స్వేచ్ఛగా జీవితాన్ని గడిపి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించి, కొన్ని దశాబ్దాల పాటు పత్రికారంగాన్ని శాసించి,పఠితలను ఉర్రూతలూగించిన డా. నార్ల వెంకటేశ్వర రావు 1985 సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన . నార్ల స్వర్గస్తులయ్యారన్న వార్త పత్రికారంగానికి శరాఘాతంగా,తీరని లోటుగా మిగిలింది.
——————————-
డా.చీదెళ్ళ సీతాలక్ష్మి
విశ్రాంత సహాయాచార్యులు
హైదరాబాద్
సినిమా దృశ్య శ్రవ్య ప్రధానమైన వినోదకళ. అలనాటి నాటకానికి సాంకేతిక పొడగింపే సినిమా. తెలుగు సినిమా వెండి తెరపై వెలుగులు చిందడానికి
తెలుగు నాటకాలు మౌలికంగా ప్రధాన భూమిక పోషించాయి. కారణం తెలుగు తొలి టాకి యుగం మొదలు నేటివరకు జన బాహుళ్యంలో ఉన్న నాటకాల
నే తెరకు ఎక్కించారు కాబట్టి,సినిమాకు మూలంగా నిలిచిన నాటక చరిత్రను విహంగవీక్షణంగా స్ప్రశించడం సబబు. రంగస్థలంపై సజీవంగా నటించేది నాటకంలో. కథానుగుణంగా నటీనటులతో నటింపజేసి, సెల్యు లాయిడ్ గా మలచి వెండితెరపైన ప్రదర్శించేది సినిమా.అందుకే దీనిని కదిలేబొమ్మల రూపకం అని, “చలన చిత్రం”( బొమ్మలు చలిస్తాయి కాబట్టి ) అంటారు.
వాస్తవానికి విశ్వ సాహిత్యంలోనే నాటకానికి ఒక విశిష్ట స్థానం ఉంది. సంస్కృతంలో “కావ్యేషు నాటకం రమ్యం… నాటకాంతం హి సాహిత్యమ్” అంటూ నాటక ప్రాముఖ్యతను చాటిచెప్పబడింది.*1 క్రీస్తుశకం నాటికే మనదేశంలో దృశ్యకావ్య ప్రక్రియ అద్భుతంగా అభివృద్ధి చెందింది. దీన్ని శాస్త్రీయంగా సూత్రీకరించిన వాడు ‘భరతుడు’.
. తెలుగు సాహిత్య ప్రక్రియ ప్రారంభమైన కాలం నుంచి క్రీస్తుశకం 1860 వరకు మొదటి కాలం. ఈ కాలంలో వీధి నాటకాలను ఎక్కువ సంఖ్యలో ప్రదర్శించేవారు. ఆ తరువాతి కాలాన్ని ముఖ్యంగా క్రీస్తుశకం 1860 నుండి 1960 వరకు, ఈ వంద సంవత్సరాల కాలం తెలుగు నాటక రచనకు ప్రత్యేక కాలంగా పెద్దలు పేర్కొన్నారు.
ఆధునిక కాలంలో శ్రీయుతులు కోరాడ రామచంద్రశాస్త్రి, కొక్కొండ వెంకటరత్నం పంతులు మరియు పరవస్తు రంగాచార్యుల గార్లను తొలి నాటక కర్తలుగా పేర్కొంటారు. తెలుగులో వెలువడిన మొట్టమొదటి నాటకం ‘మంజరీమధుకరీయం’. ఈ నాటకాన్ని 1860లో కోరాడ రామచంద్రశాస్త్రి గారు రచించారు. ఈ నాటకం ముద్రణ మాత్రం 1903లో జరిగింది. 1871లో కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు ‘నరకాసుర విజయం’ నాటకాన్ని తెలుగులో రచించారు. అదే సంవత్సరం పరవస్తు రంగాచార్యులు గారు కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకాన్ని తెలుగులో రచించారు. మూల నాటకంలోని ప్రాకృత భాషల స్థానంలో తెలుగును ప్రవేశపెట్టిన ఘనత ఈ ఆచార్యుల వారిదే
ఆధునిక తెలుగు నాటక ప్రదర్శన ఆరంభదశలో ప్రథములు కందుకూరి వీరేశలింగం పంతులుగారు. 1880లోనే వీరి రచనలు ‘బ్రాహ్మ వివాహము’, ‘చమత్కార రత్నావళి’ దిగ్విజయంగా ప్రదర్శించబడినవి. తెలుగులో మొదటి సాంఘిక నాటకం ‘నందక రాజ్యం’. 1880లో వావిలాల వాసుదేవశాస్త్రి దీనిని రచించారు. 1883లో వడ్డాది సుబ్బారాయుడు రచించిన ‘వేనీ సంహారం’ సుప్రసిద్ధమైన తెలుగు నాటకంగా నిలిచింది. నాదెళ్ళ పురుషోత్తమకవి గారు 1884- 86 ప్రాంతంలో 32 నాటకాలను రచించి పాత్రోచితమైన సంభాషణలతో నాటకాలను రక్తికట్టించారు. ఉత్తమ శ్రేణికి చెందిన నటులైన ధర్మవరం కృష్ణమాచార్యులు 1887లో ‘చిత్రనళీయం’ 1989లో ‘విషాద సారంగధరము’ మొదలైన 25 స్వతంత్ర తెలుగు నాటకాలను రచించారు. ఆంధ్ర నాటక పితామహ బిరుదాంకితులైన వీరు తెలుగులో విషాద నాటకాలు రచించిన ప్రథములు. నాటకములలో పాటలను ప్రవేశపెట్టిన ఘనత వీరిదే. లక్షకుపైగా ప్రతులు అమ్ముడుపోయిన ‘గయోపాఖ్యానం’ నాటకాన్ని 1889లో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు రచించారు.
. సరిగ్గా ఇదేసమయంలో మనదేశంలో సినిమా అడుగిడింది.1886లో లుమీర్ సోదరు లు భారత దేశంలో మొదటి మూగ సినిమాను ప్రదర్శించారు. తరువాత ఆర్.జి.టోర్నీ అనే విదేశీయుడు 1910లో “భక్త పుండరీక”, 1911లో “రాజదర్బార్” అనే చిత్రాలు నిర్మించాడు. భారత దేశంలో మొదటి మూగ సినిమా నిర్మించిన భారతీయుడు దాదా సాహెబ్ ఫాల్కే. ఈయన 1913 మే 3న రాజా హరిశ్చంద్ర చిత్రాన్ని విడుదల చేశాడు.
తెలుగు నాటక చరిత్రలో విశిష్టమైన సంవత్సరం 1897. ఈ ఏడాదిలోనే వేదం వెంకటరాయ శాస్త్రి గారు ‘ప్రతాపరుద్రీయం’ నాటకాన్ని, గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ నాటకాన్ని రచించి తెలుగు నాటక రంగాన్ని సుసంపన్నం చేశారు.
1901- 1920 కాలంలో విశిష్టమైన చారిత్రాత్మక నాటకరచన కొనసాగింది. కోలాచలం శ్రీనివాసరావు 1907లో ‘రామరాజు చరిత్ర’, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి 1909లో ‘బొబ్బిలియుద్ధం’, ధర్మవరం గోపాలాచార్యులు ‘రామదాసు’ మొదలైన నాటకాలను రచించారు. ఈ కాలంలోనే సోమరాజు రచించిన ‘రంగూన్ రౌడీ’ నాటకం అధిక సంఖ్యలో ప్రదర్శనలు అందుకున్న నాటకం. 1911లో తిరుపతి వేంకటకవులు రచించిన ‘పాండవోద్యోగ విజయములు’, బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి రచించిన ‘సత్యహరిశ్చంద్రీయము’ నాటకాలు ఇప్పటికీ ఘనమైన స్థితిలో కొనసాగుతున్న అద్భుత నాటక రాజములు. స్వాతంత్ర్య ఉద్యమ సమయములో సంఘసంస్కరణ నాటక రచనలలో పేరుగాంచిన వారు కాళ్ళకూరి నారాయణరావు. వీరు 1921లో చింతామణి, 1926లో వరవిక్రయం నాటకాలను రచించారు. ఇలా మరెందరో నాటక రచయిత లు ఉన్నారు . కొన్ని వెలుగు లో కి రావు కొన్ని ప్రసిద్ధి చెందవు. అయితే తెలంగాణ నుండి కూడా చాలా మంది రచయితలు ఆకాలం లోనే అనేక ప్రక్రియలను చేపట్టారు. వారిలో ‘ఒద్దిరాజు సోదరులు‘ అని కీర్తి గాంచిన ఒద్దిరాజు సీతారామచంద్రరావు, ఒద్దిరాజు రాఘవ రంగారావు సోదరులు సాహిత్యం లో ని అన్ని ప్రక్రియల్లో రచనలు చేసారు . 1912 లోనే ” మోహినీ విలాసం” నాటకాన్ని రచించారని వారిపై 2017 లో వచ్చిన పరిశోధన గ్రంథం చదివితే తెలిసింది. 1918 లో సోదరులు రచించి, ముద్రించిన ” రుద్రమదేవి నవల పీఠిక లో ఈ నాటక ప్రస్తావన ఉన్నదని కూడా తెలిసింది. ఈ విషయం ” ఒద్దిరాజు సోదరురుల జీవితం సాహిత్యం అనే” పరిశోధన గ్రంథం లో ఉన్నది . ఇప్పుడు ఈ నాటకం లభించడం లేదు . 1920 లో ఈ సోదరులు రచించిన ” భక్తిసార చరితము” అనే నాటకం ఆనాడు ముద్రించారు మళ్లీ కొత్త గా ముద్రణ కూడా అయ్యింది.‘ తెనుగు‘ పత్రికా వ్యవస్థాపకులూ , సాహితీ వేత్తలు ఒద్దిరాజు సోదరుల పై 2017 న వెలువడిన డా॥ కొండపల్లి నీహారిణి గారి పరిశోధన గ్రంథం ద్వారా తెలియవస్తున్నది.
బహుశః “మోహినీ విలాసం ” నాటకం అనంతర కాలంలో తెలుగులో వెలువడిన” )మోహినీ భస్మాసుర” ( 1966) సినిమాకు మూలం గా భావించాల్సి వస్తుంది. అంతేకాదు 1918 లో ఈ సోదరులు రచించి న ‘ రుద్రమ దేవి‘ నవల పీఠిక లోఈ నాటకం ప్రస్తావింపబడటం గమనించదగ్గ అంశం.
జాతీయ ఉద్యమం ప్రస్థానంలో పాట, నవల, కథ వంటి ప్రక్రియలతో పాటు నాటకం పోషించిన పాత్ర చాలా శక్తివంతంగా నిలిచి పోయింది. స్వాతంత్ర్య ఉద్యమం వైపు చైతన్య దిశగా కదిలించిన తెలుగ నాటకాలు కోకొల్లలుగా వచ్చాయి. పౌరాణిక నాటక ఇతివృత్తాలతో పండిత సుబ్రహ్మణ్య శాస్త్రి ‘సంపూర్ణ మహాభారతం’ ‘ద్రౌపది వస్త్రాపహరణం’ నాటకాలను, ధర్మవరం కృష్ణమాచార్యులు ‘స్వయంవరం’ నాటకాన్ని, మొక్కపాటి వెంకటరత్నం ‘ద్రౌపది మాన సంరక్షణ’ నాటకాన్ని, వేదాంత కవి ‘యుద్ధభూమి’ నాటకాన్ని, కాళ్ళకూరి నారాయణరావు ‘పద్మవ్యూహం’ ఊటుకూరు సత్యనారాయణ ‘భానుమతి’ ధర్మవరం కృష్ణమాచార్యులు ‘ప్రమీలార్జునీయం’ పట్టాభి సీతారామయ్య ‘మాతృ దాస్య విమోచనం’ మొదలైన నాటకాలను రచించారు.
1900లో కోలాచలం శ్రీనివాసరావు ‘సుల్తాన్”, 1921లో కొప్పరపు సుబ్బారావు ‘రోషనార,’ 1932లో ముత్తరాజు సుబ్బారావు ‘చంద్రగుప్త’, 1928లో ప్రభులింగాచారి ‘పల్నాటి వీరచరిత్రము’, 1926లో ఉన్నవ లక్ష్మీనారా యణ ‘నాయకురాలు’,నాటకానికి అంత శక్తి ఉంది.
1921లో మచిలీపట్నానికి చెందిన రఘుపతి వెంకయ్య, తనకుమారుడు ఆర్.ఎస్.ప్రకాష్ దర్శకత్వం, నటనలో భీష్మ ప్రతిజ్ఞ అనే మూగ సినిమాను నిర్మించి విడుదల చేశాడు. 1921 నుండి తొలి టాకీ వరకు (1932) విడుదైలన మూకీలు ,ఆనాటి రంగస్థల నాటకాల ముందు నిలువలేకపోయాయి.
టాకీ యుగం ప్రారంభమయ్యాక నాటకప్రభ సన్నగిల్లింది.
ప్రేక్షకులు కొత్తదనాన్ని వేలంవెర్రిగా స్వాగతించారు
1932 లో హెచ్ ఎం రెడ్డిగారు తెలుగునాట ప్రసిద్ధి చెందిన సురభి నాటక కంపెనీ అధినేత సురభి కమలాభాయి బృందాన్ని, రంగస్థల నటుడు మునిపల్లి సుబ్బయ్యని బొంబాయి తీసుకువెళ్లి, తెలుగు తమిళ భాషలలో ‘భక్త ప్రహ్లాద’ చిత్రాన్ని1932లో తనదర్శ కత్వం లో రూపొందించారు. ఆ తరువాత తెలుగులో తీసిన సినిమాలు అధికశాతంనాటకాలనే మూలంగా చేసుకొని తీశారు.భక్తప్రహ్లాద, పాదుకా పట్టాభిషేకం,చింతామణి, సత్యహరిశ్చంద్ర, వరవిక్రయం ,లవ కుశ సారంగ ధర, శకుంతల,కన్యా శుల్కం ..మొదలైనవి తెలుగునాట విజయభేరిని మ్రోగించిన నాటకాలు.
ఈవిధంగా తెలుగులో తొలినాళ్ళలో నిర్మితమైన సినిమాలకు నాటకాలే మూలద్రవ్యాలను అందించాయి.
*
ఈ నేల ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు. సాహిత్య పవనాలు సమృద్ధిగా కలిగిన ప్రాంతమిది. సృజ నాత్మకతకు, బహుముఖ ప్రజ్ఞకు చిరునామాగా ఎందరో వైతాళికులు ఇక్కడ నడయాడారు. పోరాట తత్వాన్ని, తత్వజ్ఞానాన్ని కలిగి శరీరాన్ని కరిగించి లోకహితం కోసం ధారపోశారు.అలాంటివారు ఎందరో అక్షరమూర్తులు మనకు ప్రాతఃస్మరణీయులుగా ఉన్నారు. వారిలో ఒక మేలిమి రత్నం యజ్ఞ కృష్ణమదాసు.
యజ్ఞకృష్ణమదాసు 1899వ సంవత్సరం మెదక్ జిల్లామారేపల్లిలో, ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు. వారిది పద్మశాలి కుటుంబం. చాలీచాలని వ్యవసాయం ఉన్నప్పటికీ, కొంత నేత పని, కూలి పనులతో రోజులు గడిచేవి. ఆయన బాల్య జీవితం ఎక్కువగా పశువులను కాయటంలోనే గడిచిపోయింది. బడికి పోయి అక్షరాలు దిద్దవలసిన వయసులో ఆయన పశువుల కాపరిగా ఉన్నాడు. అందుకు ప్రభలమైన కారణాలు ఉన్నాయి. ఆ రోజులలో ఉర్దూ ప్రధాన రాజభాషగా కొనసాగింది. ప్రభుత్వ లావాదేవీలన్నీ కార్యాలయ వ్యవహారా లన్నీ ఉర్దూ మాధ్యమంగా జరిగేవి. ఉర్దూ పాఠశాలలు తహతన్య, వస్తేమియా ప్రాథమిక ఉన్నత విద్యగా పిలువ బడ్డాయి. అవి ప్రధానమైన తాలూకా కేంద్రాలలో మాత్రమే ఉండేవి. అవికూడా తాలూకా కేంద్రాలకు వెళ్లి చదువుకోవటం గ్రామీణ విద్యార్థులకు ఇబ్బందికరంగా పరిణమించింది. అందువలన గ్రామంలో అక్కడక్కడ నడిచే ఖాన్గి పాఠశాలలలో కొంత మటుకు విద్యాభ్యాసం మాతృభాషలో జరిగింది. ఇది కూడా చాలా తక్కువ అని మాత్రమే చెప్పాలి.
విద్యా అవకాశాలు తక్కువగా ఉండటం వలన నిరక్షరాస్యత శాతం అధికంగా ఉండేది. ఆ విధంగా ఎందరో విద్యకు దూరం అవుతున్న సందర్భంలో తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం ప్రారంభమైంది. 1901 లో శ్రీకృష్ణదేవ రాయ ఆంధ్రభాషా నిలయం స్థాపించబడటం ఎంతో స్ఫూర్తిదాయకమైంది. తెలంగాణ రాష్ట్రంలో గ్రంథాలయాలు స్థాపించబడ్డాయి. గ్రంథాలయ ఉద్యమం జరుగుతున్న దశలోనే అణాగ్రంధమాల ప్రాచుర్యంలోకి రావటం వలన విద్య పట్ల చదవడంపట్ల అభివృద్ధి పెరిగింది.గ్రంథాలయ ఉద్యమం తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఆలంపల్లి వెంకట రామారావు గారు ఆంధ్ర జన సంఘం ఏర్పడటానికి పాదులు వేశారు.ఈ సంఘటన తరువాత మాతృభాష పట్ల ఆలోచనలు పెరిగాయి. ఆ వెంటనే ఆంధ్ర జనసంఘం స్థాపించటం ఆంధ్ర మహాసభలు ఏర్పడటం చైతన్యకారకాలు. ఈ ప్రేరణతో ఈ ప్రాంతపు కవులు రచయితలు నవతరాలను ఏర్పరచగలిగారు.
వడ్డేపల్లి సోదరులుగా పేరుగాంచిన దేశబంధుపత్రిక నిర్వాహకులు బెల్లంకొండ నరసింహచార్యులు, బెల్లంకొండ వెంకటాచార్యులు మెదక్ సభలో గల జోగిపేట నందు అవధానం చేస్తున్న సందర్భంగా వారికి యజ్ఞ కృష్ణమదాసు పరిచయమయ్యాడు.
బెల్లంకొండ సోదరులు యజ్ఞకృష్ణమదాసులో గల పఠణాభిలాషను తెలుసుకొని ఆయనకు తన 15వ ఏట అక్షరాభ్యాసం చేశారు. సంస్కృతం ఉర్దూ భాషలు నేర్పించారు. తెలుగులో చందస్సు అలంకార శాస్త్రం నేర్పించారు. యజ్ఞకృష్ణమదాసు అక్కడితో ఆగకుండా దేశబంధు సోదరులతో పాటు పత్రికా సంపాదకుల సమావేశానికి హాజరయి, ఆంధ్ర మహాసభలు, ఆర్యసమాజ కార్యక్రమాలు అణాగ్రంథమాలలో పాలుపంచుకునే స్థితి దాకా ఎదిగాడు. హైదరాబాద్ కోటిలో దేశబంధు సోదరులు ప్రతి నెల నిర్వహించే పత్రిక సంపాదకుల సభా నిర్వహణ చేసే స్థాయి దాకా ఎదిగాడు.అక్కడి నుండి ఆయనలో చెప్పుకో తగినంత సాహిత్య పరిణతి కలిగింది.
యజ్ఞకృష్ణమదాసు కవి, కథకుడు, విమర్శకుడు, యక్షగానాలు రచించాడు, పాండవోద్యోగము, శ్రీకృష్ణ రాయబారం, దక్షయజ్ఞము ఆయన రాసిన యక్షగాన రచనలు. వీటితోపాటు జ్యోతిష శాస్త్రాన్ని రచించాడు. ఆయన విస్మృతికి గురైన కవి రచయిత. ఆనాటి పరిస్థితులలో కార్యకర్త. ఆయన కృషిని డా. బెల్లంకొండ సంపత్ కుమార్ వెలుగులోకి తెచ్చారు. యజ్ఞకృష్ణమదాసు కథలను సేకరించి “మెతుకు కతలు”లో ప్రచురించాడు. మలిదశ తెలంగాణ ఉద్యమం అస్తిత్వం ఫలితంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోగల ఎందరో రచయితలు ఈ గ్రంథం ద్వారా పరిచయమయ్యారు. ఈ పుస్తకానికి వేముగంటి మురళీకృష్ణ, డా. బెల్లంకొండ సంపత్ కుమార్ సంపాదకత్వం వహించారు.
వంద సంవత్సరాల కిందట ఆయన రాసిన రచనలు ఇవాళ చాలా అలభ్యంగా ఉన్నాయి. దేశ బంధు పత్రికలలో జీర్ణప్రతులలో కొందరి పరిశోధకుల కృషి వలన ఆయన గురించిన సమాచారం పరిమితంగానే లభ్యమవుతుంది. యజ్ఞ కృష్ణమదాసు కృతజ్ఞతా పూర్వకంగా రాసిన పద్యం ఆయన వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది.
పశువుల కాపరై పద్మశాలిగపుట్టి
కట్టెలేరుకొనియు గడుపు నన్ను
అవధానములు చేయునట్టి సభన జూచి
కడుపేద నైనను కరుణజూపి
సంస్కృతముర్దూయు ఛందస్సులను నేర్పి
నట్టి బెల్లంకొండ నాచార్య సోదర
ద్వయముకంజలి తనువువీడువరకు
యజ్ఞకృష్ణపుదాసు యనెడి నన్ను
తే .దేశ బంధు పత్రిక నాకు దిశనుజూపె
పత్రిక సభల అధ్యక్షు నై పాల్గొనుమని
బెల్లంకొండసోదరులైన వారె నిలను
నొందినఘనులనేమని నుడువువాడ
యజ్ఞ కృష్ణ దాసు కథలు :
యజ్ఞకృష్ణమదాసు మరొక గురువు గణపతిశర్మ. తొలి దశలో గణపతి శర్మ వద్ద అక్షరాలు దిద్దు కున్నప్పటికి కొద్ది కాలానికే విద్యాభ్యాసం ఆగిపోయింది. పశువుల కాపరిగానే వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడటం వలన పరిస్థితులు అనుకూలించక ప్రోత్సాహం లేకపోవటంతో విద్య ఆగిపోయింది.
యాజ్ఞకృష్ణమదాసు అర్థశత కథలు రాసినట్టు బెల్లంకొండ సోదరులు దేశబందులో తెలిపారు. వాటిలో లభ్యమవుతున్నవి నాలుగైదు మాత్రమే. యజ్ఞకృష్ణమ దాసు రాసిన కథలలో ఇంద్రమాలిక కథవైవిద్య భరితమైంది. ఇంద్రమాలిక అనే పేరు కథకు శీర్షిక చేయటం ఎంతో ఔచిత్యవంతంగా ఉన్నది. ఈ కథ ఆనాటి పరిస్థితులను కండ్లకు కడుతుంది.
ఇంద్రమాలిక ప్రజావ్యతిరేక రాచరికన్ని నిలువరించే రచనగా మనకు అర్థమవుతుంది. కల్పవృక్షం కామధేనువు వలె ఇంద్రమాలిక ఒక విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉన్నది. పూర్వగాదా లహరిలో ఇంద్రమాలిక అనే పదానికి అర్థం ఒక కమల మాలిక అని అది ఎన్నడును వాడిపోనిది అని. దీనిని ఎవరు ధరించినను వారిని ఏ ఆయుధములు కూడా తాకలేవు అని. ఈ మాలికను ఇంద్రుడు ఉపరిచర వసువునకు ఇచ్చెను. అనేవి వరం పేర్కొనబడిఉంది.
ఈ కథలో ఆనాటి రాజ్యపాలన ఉన్నది పాలకుల క్రూరత్వం నిరంకుశ విధానాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రజల లోకాల నిరసనలను ఈకథ తెలియజేస్తుంది.
ఇంద్రమాలిక కథలో మంజీర కాదేశం ప్రస్తావన ఉన్నది. మంజీరకాదేశంలో నారయ్య అనే ఒక గృహస్థుడు ఉన్నాడు. అతడు శ్రీ చూర్ణం తిరుమణి కలిగి ఉండి మతభేదములు లేక విభూతి భస్మం ఒక సందూక పెట్టెను ఉంచుకొని దుఃఖితులైన ప్రజలకు దివ్యఔషధాలను ఇస్తూ ఉంటాడు. వారు ఎద్దులను అలంకరించేవారు. వ్యవసాయ శ్రమను నమ్ముకొని జీవించేవారు. నారయ్య తాతదండ్రులు ఇంద్రమాలిక విద్యను నేర్చుకున్నారు. గండర కత్తెరలు తలలు తెంపినా అతికించగల నేర్పరులు వారి తాత తండ్రులు. ఇంద్రమాలిక అనబడేడు కవచం ఒక విద్యగా రచయిత ఈ కథ ద్వారా తెలిపాడు.
కథలో వర్ణనలు ఉన్నాయి. వర్ణనలు కథా శిల్పంలో అమరినట్టు ఉండటం కథలో ఉన్న కొత్తదనం. “ఒక శ్రావణ పూర్ణిమ దినం నవనాడులు జీరములలోనూ కమంజీరకాదేశ స్వరమృత్తికన ఆహ్లాదకర వాయువులు వీచుచుండ ఆజామున ముసళ్ళు నీటి ఉపరితలము మీన నిద్రించుచుండ పవళిని బీద వదనంబున ప్రకృతి విషాదకాంతవలె శంకువు లేరుచు వెన్నెల, మెరుపున ఒలలాడుచున్నది”. పవళిని అనే స్త్రీ పాత్రను కథలో ప్రవేశింప చేయడానికి రచయిత వర్ణనను కథకు తగినట్టుగా అమరిక చేశాడు.
పవళిని రాజ్యపాలకులు వంచించారు. ఆమె కుటుంబం అంతా పాలకులవలన దెబ్బతిన్నది. పాలకుల క్రూరత్వానికి కుటుంబం బలి అయిపోయింది. ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజుకామోన్మాది రాజుగా రచయిత పేరులోనే ప్రజా వ్యతిరేకతను కనబరిచారు. అతని దుశ్చర్యలకు పవళిని కుటుంబం మాత్రమేకాదు ఎన్నో కుటుంబాలు బలైపోయినాయి.
ఆమె నారయ సహాయం తీసుకోవటం కథకి మలుపు. నారయ్యకు ఇంద్రమాలిక విద్యవచ్చును. ఇంద్రమాలిక నిద్రించు వారల మేలుకొలుపునది అని రచయిత కథాంశంలో చెప్తాడు.
ఒకనాటి మాఘ స్నాన ప్రారంభంలో రాజుగర్వానికి అడ్డుకట్ట వేసే సందర్భం ఏర్పడుతుంది. రాజుపల్లకి మోయటానికి బోయిలు వస్తారు. వారు నారదాసుని మామిళ్ళతోట దారిన తీసుకు వెళుతూ ఉన్నప్పుడు నారయ్య రాజు పల్లకిని మోసే బోయిగా ఉంటాడు. ఇక్కడ కథలో ప్రధానమైనమలుపు ఉన్నది. నారయ్య మామిళ్ల తోట వద్ద స్నానం ఆచరించి అలంకారం చేయించుకుంటున్నప్పుడు ఆయన కండ్లకు నారయ ఒక అంజనాన్ని లేపనం చేస్తాడు అంజనం ప్రభావంగా రాజు అపస్మారక స్థితిలోకి వెళ్తాడు. ఆ రాజును బోయిలు దక్షిణ పర్వత శ్రేణిలోకి తీసుకొని వెళ్తారు రాజును బంధీగా చేసి కట్టివేస్తారు. తెల్లారి అతనికి మేలుకో వచ్చి చూసుకుని అయిన విషయాన్ని గ్రహిస్తాడు. రాజు ఇంద్రమాలిక విద్యవలన బంధి అయినాడు. ఈ విషయం తెలిసిన ప్రజలు ఆనందంతో పండుగ చేసుకుంటారు. రాజురాజ్య బ్రష్టుడౌతాడు. ఆ రాజ్యమున ఆకలి అనే మాటలేదు. ఆనాటి నిజాం నిరంకుశ పరి పాలనకు వ్యతిరేకమైన ఆలోచనలు ఈకథలో ఉన్నాయి. ఈ కథ ఆంధ్ర మహాసభల నేపథ్యంలో వచ్చింది.
విమర్శ :
కృష్ణదాసు “భారతీయసాహిత్యము” అనే విమర్శనాత్మక వ్యాసాన్నిరాశాడు. ఈ వ్యాసం దేశ బంధు పత్రిక ప్రమోదూత నామసంవత్సరం పాల్గుణ మాస పత్రికలో ప్రచురించబడింది. పాశ్చాత్యుల సాహిత్య భావనలు భారతీయ సాహిత్య భావనలు వేరుగా ఉన్నాయని రచయిత పరిశీలించాడు. పాశ్చాత్యులు భారతీయ లాక్ష్యనికులు రాసిన గ్రంథాలను అభ్యసనం చేశారని తెలిపారు. సాహిత్యం జీవనపరిధి లోనిది. అందువల్ల పాశ్చాత్య సాహిత్యం భిన్నంగా ఉండటంలో ఆశ్చర్యం లేదని తెలిపాడు. ఈ వ్యాసంలో భారతీయ సాహిత్య వారసత్వం కావ్య స్వరూపంలో ఇహపరలో కసార్ధకత ఏ విధంగా పరిఢ విల్లిందో అదేవిధంగా సాహిత్యం మోక్షగామిగా అనుకూలమైన సందర్భాలను రచయిత పరిశీలించాడు. రామాయణ భారతభాగవతాలను రచించిన వారి జన్మధన్యంగా ఆధ్యాత్మిక చింతన యొక్క ప్రాధాన్యతను తెలిపాడు. భారతీయ లాక్ష్యనికులు చెప్పినకవితా పద్ధతులు వాటి ప్రయోజనం గురించి రచయిత వివరించాడు. కేవలం కావ్యాన్ని స్పర్శించినంత మాత్రాన ఎవరు కవులు కాజాలరు అని చెబుతూ కవికి నిత్యసాధన అవసరమని తెలిపాడు. “దర్శనాద్వర్ణనాచ్చాడరూడాలోకేకవిశ్రుతిః. “రామాయణ రచనలలో వాల్మీకి మొదట కరుణ రసహృదయుడైనాడు తర్వాత రచనామయుడైనాడు” అని యజ్ఞకృష్ణమదాసు తెలిపాడు.
ఆయన కవితత్వాన్ని పరిశీలిస్తూ వస్తువును అగోచరముగా దర్శించిన వాడు ఉత్తమకవి కాజాలడు అన్నాడు. “కమనీయం కావ్యం” కావలెనని ఆ లక్షణాలు రామాయణ భారత భాగవతాలకు ఉన్నాయని పరిశీలిం చాడు.
” సశబ్దో నసన్యాయో నసా విద్యా నసాకళా
జాయతే యన్న కావ్యాంగమతో భారో మహాకవేః ”
సా విద్య పట్ల అవగాహన కలిగి ప్రతిభా పాటవాలు రచన సామర్థ్యం కలిగి ఉన్నవాడు కవి కావటానికి అర్హుడని యజ్ఞ కృష్ణమదాసు చెప్పాడు. ‘సావిద్య’ అంటే చైతన్యం. చైతన్యం అనేది కాల చైతన్యాన్ని తెలుపుతుంది. రచన ఇతివృత్తాల పట్ల సరైన అవగాహన కలిగి ఉండటం, అందుకు ప్రతిభ తోడు కావాలనేది కృష్ణమదాసు భావన. అవి కాకపోయినా పర్వాలేదు కానీ కవిత్వానికి భిన్నంగా అకవిత్వం రాయటం సమంజసం కాదు అని కృష్ణమదాసు ఈ వ్యాసంలో పరిశీలన చేయతలచాడు. యజ్ఞకృష్ణమదాసు వ్యుత్పత్తిలోపం వలన ప్రతిభ నశించిపోతుందని చెప్ప టానికి.
“అవ్యుత్పత్తి కృతో దోషఃశక్తా సంవ్రియతేకవేః
జస్త్వశక్తికృత స్థస్యఝడిత్యే వావ భాసతే “
అని తెలిపాడు. ప్రతిభ గుణసంపదల చేత పరిపూర్ణమవుతుంది. కవి ఈ గుణ విశేషములను పుష్కలంగా కాంచవలెనని యజ్ఞకృష్ణమ దాసు కవితా విమర్శనం చేశాడు.
ఈ విధంగా కృష్ణమ దాసు యక్షగాన రచయితగా పద్య రచయితగా, గ్రంథకర్తగా, కథారచయితగా, విమర్శకుడిగా, పత్రికరంగంలో వడ్డేపల్లి సోదరుల నిర్వహణలో పత్రికా సంపాదకుల సమావేశానికి అధ్యక్షత వహించి సురవరంప్రతాపరెడ్డితో మెప్పుపొందిన మేటిరచయితగా బహుముఖంగా దర్శనమిస్తాడు.
యజ్ఞకృష్ణమదాసు కవి రచయిత మాత్రమేకాదు. ఆయన ఆర్యసమాజ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆంధ్రమహాసభలతో ప్రేరణ పొందాడు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపాడు. నాటి ప్రముఖులతో స్నేహసంబంధాలు కలిగి ఉన్నాడు. ఆయన 1969వ సంవత్సరంతుదిశ్వాస విడిచే వరకు స్ఫూర్తివంతమైన జీవితం గడిపాడు. యజ్ఞ కృష్ణమదాసు వంటి వారి సేవ ఎంతటిదైనా అటువంటి వారి కృషి పట్టుదల ఆదర్శనీయత భావితరాలకు మార్గదర్శకమైంది. అట్టి వారి సేవలను విస్మృతికి గురి కాకుండా కాపాడుకోవాల్సిన అవసరము ఉన్నది.
అని ఓ అమ్మ పిలుపు,బాబూ ఎప్పుడూ ఆటలేనా కాస్త చదువుకోండిరా పరీక్షలు వస్తున్నయిరా అని అదే ఊళ్ళో కిరాయికి వుంటూ ఆ ఊరి ప్రభుత్వ బడిలో పాఠాలు చెప్పే సారు,అమ్మ పిలిచినా రాలేదు ఇంటికి అని కోప్పడే సోదరుడు , ఇంత మంది ఇన్ని తీరులుగ మందలించినా ఆట నుండి అర అడుగు కూడా ముందుకు వేయనివ్వని చిన్నప్పటి ఆటలు మనసును పొరలు పొరలుగా మెలిబెడుతుంటే బాల్యపు బడుద్దాయి చేష్టలు,అల్లరులు,మరి ముఖ్యంగా ఆడిన ఆటలు “అరటాకు లాంటి కాగితంలో ఆరబోయక తప్పదు”.

పక్క పక్కన ఇండ్లు,ఇండ్లను ఆనుకుని గుడిసెలు , అక్కడక్కడ అద్దాల మిద్దెలు అన్నిటిని అనుసంధానం చేస్తూ వాడలు , మధ్య మధ్య సన్నని సందులతో కూడిన పల్లెలు.ఆ పల్లెలో ఇంటికిద్దరు అన్నదమ్ములు ఇంటికిద్దరు అక్కచెల్లెలు.భారము లేని చదువులు,సమయాన్ని లెక్కించని లెక్కలు.
ఇవన్నీ ఆటలకు అనుకూలించే అంశాలు.
“దాగుడు మూతలు దండాకోర్ పిల్లీ ఎలుక భద్రం కోర్ ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చుప్ ” అని గోడ చాటుకు పోయి పది లెక్కపెట్టేసరికి దోస్తులంతా తలుపుల చాటుకు,గడ్డివాముల చాటుకు దాచుకుంటే లెక్కపెట్టినతను దొరకబట్టకుంటే వెనుక నుండి పోయి వీపులో కొడితే వాడు మళ్ళా లెక్కబెట్టాలె”.
” చిర్రా గోనె అనే ఆటలో రెండు వైపులా కొచ్చెగా చెక్కిన చిన్న కర్రనే చిర్ర.గోనె అంటే పొడవాటి కర్ర.ముందుగా చిన్న రంధ్రం ( బద్ది ) తవ్వి చిర్రను బద్దికి అడ్డంగా పెట్టి గోనెతో

చిర్రను లేపి కొడితే అది పైకి ఎగరగానే అదే గోనెతో గట్టిగ కొడితే దానిని అవతలి వాడు పట్టుకుంటే కొట్టిన వాడు అవుటయినట్లు”.
” బొంగరం అయితే అది రయ్యిన తిరుగుతూ కాలాన్ని కూడా తిప్పేది.దానితో నేలతో పాటు అరచేతిలో కూడా తిప్పిన అనుభవాలు”
” నీ నేలంత తొక్కి తొక్కి పాడుచేస్త, రాయి రంగన్న , కట్టెలమోపు అనే హుషారైన ఆట”
” వినవే బాలా నా ప్రేమ గోల”
తొక్కుడు బిళ్ళ ఆడా రావే ” అని హాస్య నటుడు రేలంగి హీరోయిన్ తో పాతాళభైరవి సినిమాలో సరదాగా ఆడుతూ పాడే పాటలోని ఆ తొక్కుడు బిళ్ళ ఆటలో చిన్న’ పెంకాసు’ ను నాలికకు అద్దుకుని ఎనిమిది డబ్బాలు గీసి ఆ పెంకాసును అందులో వేసి దానిని కదిలిస్తూ కుంటుతూ ఆడే ఆట “.
” చింత గింజలతో ఆడే ఓనగుంటల ఆట”
” కచ్చకాయల ఆట “
” గోలీలాట లో రంగురంగుల గోలీలు రకరకాల సైజులతో ఎక్కువగా పిల్లలు ఆడే ఆట అది”.
ఇటువంటి ఎన్నో ఆటలు నాడు పిల్లలకు ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చేవి.ఖర్చు తక్కువతో తల్లిదండ్రులకు భారం కాకుండా,తోటి సమాజానికి హాని జరుగకుండా ఆడిన ఆటలు నేటి పిల్లలకు కూడా నేర్పితే కొంతైనా ఆరోగ్యకరమైన సమాజాన్ని తయారుచేయగలమేమో…


శబరిమలలోని స్వామి అయ్యప్పను దర్శించ టానికి మండల దీక్ష చేసే వారు మెడలో దీక్షా మాలను ధరించడం ఎంతో ముఖ్యం. ఆ మాలను మంత్రయుక్తంగా గురుస్వామి చేతుల మీదుగా ధరించాలి. దీక్షామాల ఎంతో పవిత్రమైనది. మండల దీక్ష ఆరంభించిన అయ్యప్ప భక్తులు, వారికివారే ఆ మాలను ధరించకూడదు. దేవాలయంలో కానీ, భక్తుని గృహంలో కానీ, తన గృహంలో కానీ శిష్యునికి మాలను గురుస్వామి ధరింపచేయాలి. గురుస్వాములు అయిన వారు గురువు లేకపోతే అయ్యప్ప దేవాలయానికి వెళ్ళి అక్కడ అర్చకునినే గురువుగా భావించి అర్చకుని చేత మాలధారణ చేయించు కుని తాంబూలం, పండు, దక్షిణతో ఆయనను సత్క రించాలి అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు శబరిమల దీక్ష పట్టి, స్వామిని దర్శించి గురుస్వామి అర్హత పొందిన అయ్యప్ప భక్తులైన గురుస్వాములు, తమకంటే ఎక్కువసార్లు దీక్షతో శబరిమల యాత్ర చేసిన గురుస్వాముల చేత మాల ధారణ చేయించు కోవాలని ఇంకొందరు చెబుతున్నారు. ఇంకొంతమంది. భక్తులు తమ తల్లి చేతనే మాలను ధరింపచేసుకుంటు న్నారు. మాతృదేవోభవ అన్న సూక్తి ప్రకారంగా వారా విధంగా చేస్తున్నప్పటికీ కొడుకుకు మాల ధారణ విషయంలో తల్లి జోక్యం అభిలషణీయం కాదని ప్రముఖ గురుస్వాములు అంటున్నారు.
అయ్యప్ప దీక్ష మాలధారణ దేవాలయంలో లేదా గృహంలో జరిగినా, గురుస్వామి గృహంలో జరిగినా గురువు ద్వారానే మంత్రం పఠిస్తూ దీక్షా మాలను ధరింపచేసి శిష్యుని ఆశీర్వదించడమన్నది విధాయకం. స్వామివారికి పూజాభిషేకాలు చేసి, స్వామి వారిని హృదయంలో నిలుపుకుని మనో నేత్రాలతో ఆయనను దర్శిస్తూ శిష్యుని మనసులోకి స్వామిని ప్రవేశింపచేస్తాడు గురుస్వామి. తులసి పూసలతో, రుద్రాక్షలతో, స్ఫటికాలతో తయారు చేసిన ఏ మాలనైనా దీక్ష మాలగా ఉపయోగించవచ్చు. మండల దీక్షను స్వీకరించి మెడలో మంత్ర పూర్వకంగా మాలను ధరించిన అయ్యప్ప భక్తులు యాత్ర పూర్తి చేసుకుని గృహానికి చేరుకునే వరకూ మెడలో నుంచి మాలను తీయకూడదు. మాలను ధరించటానికి ముందు రోజున మాలను శుభ్రపరచాలి. మర్నాడు బ్రహ్మీ ముహూర్త సమయము నకు ముందుగానే లేచి కాలకృత్యాలు తీర్చుకుని అభ్యంగన స్నానం ఆచరించి మాల ధరించటానికి సిద్ధపడి ఉండాలి. గురుస్వామి సన్నిధిలో ముందుగా వినాయకుని పూజించి ఆ తర్వాత నైవేద్యం సమర్పించాలి.

అయ్యప్ప దీక్ష సక్రమంగా భక్తితో పాప్తి అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆరోగ్యంగా, ఉత్సాహవంతులుగా కూర… తుంటారు. తెల్లవారు జామున నాలుగు గంటలకు నిద్రలేచి, చన్నీటి స్నానం చేయడం, నుదుట విభూతి, చందనం కుంకుమ ధరించి దీపారాధన చేసి, పూజ, శరణు ఘోష ముగించి ఏదో ఒక దేవాలయానికి దైవదర్శనానికి స్వాములు వెళతారు. ఉదయమే కాళ్లకు చెప్పులు లేకుండా నడచి దేవాలయానికి వెళ్ళి, ప్రదక్షిణలు చేసి దైవదర్శనం చేసుకోవడం వల్ల స్వామి కార్యం, స్వకార్యం పూర్తి అయినట్టు ఉదయపు నడకను భక్తిగా చేసినట్లవుతుంది. అదే విధంగా సాయంత్రం తలకు చన్నీటి స్నానం చేసి, పూజా కార్య క్రమాలు ముగించాక దేవాలయానికి కానీ, భజనలకు గానీ, నడ వెల్లడం వల్ల సాయంత్రపు నడక పూర్తి అవుతుంది.
బ్రహ్మచర్య వ్రతం దీక్షలో ఎక్కువ ప్రాధాన్యం ఉంది. బ్రహ్మ -చర్య వ్రతం పాటిస్తూ నేలపై చాపమీద రెందుకూడా లేకుండా నిద్రించడం వల్ల మెడనొప్పి, నడుము నొప్పి వంటివి దరికి చేరవు.. ఉన్నవారికి నయమవుతుంది. నేలపై పడక మొదట్లో ఇబ్బంది. కలిగించినా, తరువాత చక్కగా నిద్రపడుతుంది. సాత్వికాహారం మేలు చేస్తుంది. ఒక పూట భోజనం, రెండో పూట అల్పాహారం, నియమబద్ధంగా ఆహారం సేవించడం వల్ల ఒంట్లో కొవ్వు తగ్గుతుంది. ఊబకాయం ఉన్నవారు మండల దీక్షతో తెలియకుండానే కొన్ని కిలోలు బరువు తగ్గి, శరీరం తేలిక అవుతుంది. శబరిమల యాత్రకు వెళ్ళి వారు అడవుల్లో చురుగ్గా నడవ గలుగుతారు. చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలకు రాళ్లు వంటివి గుచ్చుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి ఉత్సాహంగా ఉంటారు. అలాగే భజన కార్యక్రమంలో రెండు అర చేతులతో, తరచూ చప్పట్లు కొట్టడం వల్ల చేతిలో వేళ్ల నరాల్లో రక్త ప్రసరణ బాగా జరిగి తెలియని ఆనందాన్ని, తన్మయత్వాన్ని పొందుతారు.
దీక్షలో మాంసాహారం, రోడ్డు పక్క చిల్లర తిళ్ళు వంటివి.తినకపోవడం వల్ల, పొగ తాగడం, మద్యపానం, గుట్కా, కారా , కిల్లీ వంటి దుర్వ్యసనాలకు దూరంగా ఉండటం వల్ల అనారోగ్యం వారి దరికి చేరదు.
తరచూ కర్పూరహారతి ఇవ్వడం వల్ల, సూక్ష్మక్రిములు దరిదాపుల్లోకి రావు. పూజ, భజనానంతరం, సహపంక్తి భోజనాలు భిక్ష, అందరూ నల్ల బట్టలు ధరించి, మాసిన గెద్దాలతో, బికారిగా ఉండటం, సమానత్వ భావన పెంపొందిస్తాయి. కులం, మతం, తేడా , అంతస్తు, గొప్ప, బీద తారతమ్యం మరచి స్వాములు తిన్న ఎంగిరి విస్తరు ఎత్తడానికి పోటీపడి తనలో ఉన్న గర్వం అహంకారాన్ని పక్కన బెట్టి దైవకార్యంగా భావించి పవిత్రంగా చేస్తారు. “అహం బ్రహ్మాస్మి తత్త్వమసి సిద్ధాంతం” అయ్యప్ప దీక్షకు పట్టుకొమ్ము. ప్రతి ఒక్కరిలో అయ్యప్పస్వామిని దర్శించి తనలో కూడా దైవాన్ని సందర్శించడమే ఈ దీక్ష ప్రత్యేకతా మాలధరించి దీక్షలో ఉన్న స్వాములు సాక్షాత్తు అయ్యప్ప స్వామికి ప్రతి రూపాలుగా, భావిస్తారు. ఎవ్వరూ పేరు పెట్టి పిలువకుండా పేరుకు అయ్యప్పని కానీ స్వామీ అని కానీ చేర్చి పిలిచి
శరణం అని నమస్కరించి మాట్లాడుతారు. కొందరు పాదాభివందనం చేసి గౌరవిస్తారు.
” స్వామియే శరణమయ్యప్ప”
రమేశ్వర్ రాజు గారిది గొప్ప అనుశీలనం. అదిత్యుడి కిరణ శక్తి పరిపూర్ణంగా వీరిపై ఉంది. వీరు వైష్ణవ మతానుయాయులు.శ్రీమన్నారాయణ భక్తులు. అది పద్యాలను పరికిస్తే కనపడుతుంది. నేటి పద్యంలో అనుచు నారాయణా….తుంబురు నారదాదలు నంబరమున… ఆ దృశ్యాన్ని కేవలం ఉహించగలం కానీ అనుభవించలేమన్న దృగ్విషయం తేటతెల్లబరిచారు. దేవలోకం లో తుంబురు నారాదులు ఇద్దరు సంగీత విద్వాంసులు. ఇరువురు ముల్లోక సంచారులు. మహావిష్ణువును స్తుతియిస్తూ కీర్తనలు గానం చేసే వారు. నారదుడి వీణ మహతి అయితే తుంబురుని వీణ కళావతి.
అహో దేవర్షార్ధన్యోయం యత్కీర్తిం శార్ ఙ్గ ధన్వనః
గాయన్మాద్యన్నిదం తంత్ర్యా రమయత్యాతురం జగత్!
దేవర్షి నారదుడు బహుధన్యుడు. ఏల అనగా వీణ మ్రోగిoచుచూ
హరి గుణగానం చేయుచూ పారవశ్వము నందుచూ ఈ జగత్తునంతయూ ఆనందింప చేస్తూ సంచరించేవాడు ఆలాగే సూర్యుడు సంచారీ ఆ గాన మాధుర్యం అలపన అద్భుతమైన దృశ్యం వీక్షించిన వాడే సూర్య నారాయణుడు. అన్ని అవతారలకు ఆది అయిన శ్రీమన్నారాయణుడు పరయోగీంద్రులకు దర్శనీయుడు. సకల సృష్టి అవతారాలకు ఆయనే మూలం. ఆది మూల మితడు అని అన్నయ్య కీర్తనలో కొనియాడినాడు.
దేవ్ ఋషియైన నారాదునిగా అవతరించి శ్రీమన్నారాయణుడు సమస్త కర్మల నుండి విముక్తిని ప్రసాదించే పాంచారాత్రమనే వైష్ణవ తంత్రాన్ని తెలియజేశాడు.
మహావిష్ణువు 21 అవతారాలలో మూడో అవతారం నారదుడు. మహాజ్ఞాని.బహుముఖ ప్రజ్ఞాశాలి. గొప్ప వక్త,రాజ నీతిజ్ఞుడు,లోకహితవాది ( భాగవత ప్రథమ స్కంధం) అన్నింటిని మించి భగవద్భక్తుడు. సర్వలోక సంచారీ.అనంత బ్రహ్మాoడములలో ఎక్కడా ఏది జరిగినా ఆయనకు ఇట్టే తెల్సిపోయేది. నారద అన్న శబ్దం లోనే జ్ఞానాన్ని అందించే వాడని అర్థం. ఈ జ్ఞాన బోధకోసమే ఆయన లోకాలు తిరిగేవాడు.అలాగే సూర్యుడూ లోకసంచారియే. ఇరువురి
మార్గాలు ఒక్కటే, స్వరూపాలు నారాయణుడివే. భాగవతాన్ని రచింపమని వేదవ్యాసునికి నారదుడు చెప్పినట్లు భాగవత ప్రథమ స్కంధంలో ఉంది.
వాల్మీకి కి రామాయణం నారదుడు రచింపమనట్లుబాలకాండలో ఉంది. అలాటి అద్భుత భక్తి భావ తత్పరుడు పరమభాగవతోత్తముడు చేసే
దివ్యగానం వినే భాగ్యశాలి సూరుడిని అభివర్ణించడం సహేతుకం. అట్లాంటి నారదుని చూడకున్నా సూర్య నారాయణుడిని సేవిస్తున్నామని రాజు గారు పద్యం లో చెప్పారు.
పరమశివుని డమరుక నాదంలోంచి జన్మించి సంగీతమును విశ్వవ్యాప్తం చేసేందుకు బయలు దేరిన నారద తుంబుర జంటలో ఒకడుగా ప్రసిద్ది పొందినాడు.గంధర్వుడు తుంబురుడు విష్ణుమూర్తి భక్తుడు..పౌరాణిక ప్రసిద్ధి హిందూ పురాణాల ప్రకారం. సూర్యగణంలో సూర్యునికి తోడుగా ప్రతీ ఋతువులో అతని రథంలో ఇద్దరు ఆదిత్యులు,ఇద్దరు ఋషులు, ఇద్దరు గంధర్వులు, ఇద్దరు అప్సరసలు ఇద్దరు రాక్షసులు, ఇద్దరు నాగులు ప్రయాణిస్తారు. చైత్రమాసం ( మధుమాసం)లో ధాత,హేతి,వాసుకి, రథకృతి,పులస్త్య, కృతస్థలి,అనే వారితో పాటు తుంబురుడు రథం లో తిరుగుతాడు. ఈ ఇరువురి ప్రస్తావనతో పద్యానికి నిండుదనం చేకూర్చారు. ఆది దేవా అని,అమరవంద్యుడిని చక్కగా సంబోధించి నిన్ను ఒక్కడిని చూస్తే సకల సౌభాగ్యాలు ఓన గూరుతాయని మంచి పద్యం అందించిన రమేశ్వర రాజుగారికి అభినందనలు.
స్వార్థ రహిత సేవకు నీవే అంటూ ఈ రోజు పద్యానికి శ్రీకారం చుట్టిన రమేశ్వర రాజు గారి కవనాశ్వం సూర్య తేజో విరాజమానంగా సాగుతుంది. మనిషి స్వార్థాన్ని వీడి పరమార్థం వైపుకు అడుగు వేయాలని అందుకు సూర్యుడిని ఉదాహరించారు…ఎటుల బాగుపడునో ఇజ్య దేవ అని చిక్కటి పదప్రయోగం చేశారు రాజు గారు. విష్ణువు సహస్రనామాలలో 446వ నామం ఇజ్య…ఇజ్య దేవుడు అంటే యజ్ఞముల చేత ఆరాధింపబడేవాడు. విష్ణు సహస్రనామo విశ్వం విష్ణుర్…అని మొదలవుతుంది. విశ్వo అంటే విశ్వమంతా తానే అయినవాడు ( నామ రూపాత్మకమై,చిత్రాతి చిత్రమై,వికసించి,విస్తరించి, విరాజిల్లుచు గాన వచ్చు సకల చారా చర జాడ చైతన్య సంహితమగు ప్రపంచమే విశ్వము ) సకల విషయములందు సంపూర్ణమైనవాడు. అంతా భగవంతుడే భాష్యకారుల వ్యాఖ్యానం. విష్ణుః అంతట వ్యాపించి వున్నవాడు. వషట్కారహః వేదమంత్ర స్వరూప, వషట్ క్రియకు గమ్యము ( యజ్ఞం లో ప్రతీ మంత్రం చివర మంత్ర జలమును వషట్ అనే శబ్దంతో వదులుతారు) అంతటిని నియంత్రించి పాలించేవాడు. పరమాత్మ అయిన నేను యజ్ఞ పురుషుడిని,యజ్ఞకర్తను,యజ్ఞఫల స్వరూపుడిని అనిచెప్పారు. కాబట్టి అలాటి ఇజ్య దేవుడిని యజ్ఞం తోనే ఆరాధిస్తారు. యజ్ఞం అనేది అనాదిగా వస్తున్న ఒక హిందూ సంప్రదాయం. వేదం లో యజ్ఞోవై విష్ణుః అని చెప్పబడినది. అనగా యజ్ఞం విష్ణుస్వరూపంగా భావించవచ్చు.యజ్ఞం అను శబ్దం యజ దేవ పూజయామ్ అనే ధాతువు నుండి ఏర్పడింది.దైవ పూజయే యజ్ఞం.యజ్ఞం అంతిమ లక్ష్యం దేవతలను సంతృప్తి పరచడం,వారిని మెప్పించడం. యజ్ఞం అనేది అగ్ని ( హోమం) వద్ద వేద మంత్రాల సాక్షిగా హావిస్సులు స్వాహాకారాల తో సంతృప్తి పరుస్తాం హావిస్సులు అగ్నిలో పడుతున్నప్పుడు పరిపూర్ణ ఏకాగ్రతతో విష్ణవే ఇదం నామమ ఇది విష్ణువు కు సమర్పితం నాది కాదు అని సమర్పిస్తాం.తద్వారా లోక కళ్యాణం జరుగుతుంది. ఇష్ట కామ్యాలు నెరవేరుతాయి. ఈ కవిగారు అక్షర యజ్ఞం చేస్తూ స్వార్థ బుద్ధిని సమాజ పోకడలు మార్చమని సూర్య నారాయణుడి ద్వారా శ్రీమన్నారాయణుడిని వేడుకుంటున్నారు. పరస్పరo భావయన్తహః శ్రేయః పర్మవ్యాప్సధ…. పరమాత్మ తాను సృష్టించిన ప్రజలను.. ఓ ప్రజాలారా ఈ యజ్ఞం ద్వారా మీరు శ్రేయస్సును కాంక్షించి అందరూ లాభం పొందండని యజ్ఞ సూత్రాన్ని గీతలో శ్రీకృష్ణుడు తెలిపాడు. యజ్ఞం చేయడం అంటే సర్వజీవి ఆరాధన చేయడం అనే సత్యం పద్యంలో స్ఫురిస్తుంది. యజ్ఞం లో కూడా చాలా రకాలున్నాయి.మానవ జీవితంలో యజ్ఞాలు చేస్తే పరమాత్మకు ప్రీతి కలుగుతుంది. ఈ యజ్ఞాలు 5 రకాలు బ్రహ్మ యజ్ఞము,దేవ యజ్ఞము, పితృ యజ్ఞము, భూత యజ్ఞము, నృయజ్ఞము. బ్రహ్మ యజ్ఞము అంటే వేదాధ్యయనం చేయడం. జ్ఞాన విస్తరణ చేయటం. దేవయజ్ఞం అంటే కామ్యం ..ఆజ్యాది హోమద్రవ్యాలను వినియోగించి చేసే ప్రక్రియ.పితృ యజ్ఞము అంటే పరలోకంలో ఉన్న తండ్రికి, పూర్వీకులకు శ్రాద్ధ, తర్పణాలు నిర్వహించడం. భూత యజ్ఞము అంటే సకల జీవరాసులకు ఉపయోగపడేలా నడుచుకోవాలి.
నృయజ్ఞము అంటే అతిథి స్వయం విష్ణుః అని ఆదరించి గౌరవించాలి. కనీసం దైవారాధన ,ఐక్యత దానం చేయడం ద్వారా యజ్ఞ పురుషుడిని సంతృప్తి పరుచవచ్చు. మానవ హితాన్ని కోరి రాజు గారు యజ్ఞకర్మల బోధ చేశారు. చక్కటి పద్యం అందించిన మీకు అభినందనలు .
