Home వ్యాసాలు చారిత్రక నవలాచక్రవర్తి ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్!

చారిత్రక నవలాచక్రవర్తి ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్!

by Achyutuni Rajasri


భారతీయ ఆర్ష సంస్కృతి ,భారత చరిత్ర ను పరిశోధించి దేశం ధర్మంకోసం నేటికీ రచనలుచేస్తున్న పుంభావసరస్వతి శివప్రసాద్ గారు.ఆపరేషన్ సిందూర్ కి సంబంధించిన సిందూరం ప్రచురించి చైతన్యంతెచ్చారు.23.12.1940లో తాడికొండలో జననం,ఎం.ఎ.పి.హెచ్.డి చేసిప్రొఫెసర్ గాతెలుగుశాఖలో 2000లో రిటైరైనా జోష్ గా మాట్లాడుతూ శ్రోతలలో దేశ భక్తి రగిలించే దిట్ట ఆయన! డాక్టర్ ఉమాదేవి భార్య.ముగ్గురు సంతానం.చారిత్రక నవలాసమ్రాట్ నవలావిరించి శివ కవీంద్ర,అభినవ పాల్కురికి,అభినవధూర్జటి ,వేదవిజ్ఞానఖని మొదలైన బిరుదులతో పాటు స్వర్ణ గండపెండేరం,స్వర్ణ కంకణాలు,దేశ విదేశాల్లో సత్కారాలు రేడియో టి.వి.ప్రసంగాలతో శ్రోతలని ఉర్రూతలూగించిన గంగాఝరి ఆయన!1100సార్లు భువనవిజయం ప్రదర్శించారు.కృష్ణాపత్రికలో సంపాదక వర్గంలో సేవలందించారు.ఉత్థాన(కన్నడ)వైదిక భాస్కర్,హిందీమిలాప్(హిందీ)సియాసత్( ఉర్దూ) జాగృతి ఆంధ్రభూమి,ఆంధ్ర ప్రభ,ఆంధ్ర జ్యోతి ఈనాడు,తానామాసపత్రిక, అమెరికా తెలుగుజ్యోతిలో టిటిడి సప్తగిరిలో పుంఖానుపుంఖాలుగా వేలాది వ్యాసాలు కవితలుప్రచురింపబడినాయి.
భారతీయ సాహిత్య పరిషత్ సంస్థాపక సభ్యుడు,ఆచార్య శిప్రమునిపీఠం సంస్థాపక అధ్యక్షుడు,ఉమాదేవిమెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడుగా ఆయన సేవలు నిరుపమానం. ఈయన గ్రీక్ భాషపై విశేష పరిశోధన చేశారు.అమెరిక జర్మనీ,బ్రిటన్,సింగపూర్,దుబాయ్ మొదలైన దేశాల్లో పర్యటించి 25వేలపైగా ఉపన్యాసాలిచ్చారు.

తమ పూర్వీకుల గూర్చి ఆయన ఇలాచెప్పారు,” మాపూర్వీకులుకాశ్మీర్ నుంచి వచ్చి గణపతిదేవుడు,రుద్రమదేవికాలంలో ఓరుగల్లులో రాజగురువులుగా స్థిరపడ్డారు.మాతామహస్థానం ఒంగోలు,తాడికొండ పితామహస్థానం,వరంగల్ ముదిగొండ వారి గురుపీఠం.మానాన్నగారుమల్లికార్జునరావు బి.ఎస్సీ.చదివి భ్రమరి అనే పత్రిక ఎడిటర్ గా వక్తగా పేరుగాంచారు .” శివ ప్రసాద్ గారిచదువు ఇసుకను ఓనమాలు రాయడంతో ప్రారంభమైంది.5వక్లాసుతర్వాత పెన్సిల్.నాటి మెట్రిక్ నేటి ఎం.ఎ.తో సమానం.ఆరోజుల్లో ఎం.ఎ.లెక్చెరర్ జీతం 16రూపాయలు.100నోటు చూసి ఎరగరు. బడిఫీజు అర్ధరూపాయి.ఈయన బడిపై యూనియన్ జాక్ జెండా ఎగిరేది.ఆనాడు కులమతవర్ణ వర్గ వివక్షత లేకుండ పిన్నీ బాబాయి వదినె అని పిలిచేవారు. ఆనాటి మన భారతీయులు,”మంగళమనరే” అని బ్రిటిష్ పాలకులకు జైకొడుతుంటే హిట్లర్ సుభాష్ చంద్ర బోస్ తో” మీ భారతీయులకు బానిసత్వం ఇష్టం “అని అన్నాడుట. ఇలాంటి విషయాలు తనగురువులు చెప్పి దేశ భక్తిని నూరిపోశారంటారు శ్రీముదిగొండవారు.ఆరోజుల్లో ఈయన ప్రభావితంచేసిన పాటల్లో గరిమెళ్ల సత్యనారాయణ గారి”మాకొద్దీ తెల్లదొరతనం” కాశీనాధుని, ముట్నూరి, ఉన్నవ,దుగ్గిరాల మొదలైన మహామహుల్ని చూశారు శివ ప్రసాద్ గారు.బాల్యంలో సినిమాలు తెగచూసేవారు. ఆరోజుల్లో 100గ్రామాలకి కల్పి ఒకటే హైస్కూల్ తాడికొండ లో ఉండేది.శరత్ సాహిత్యం,ఆంగ్లానువాదాలు,చదివి ఇంటర్ లో రచనలు చేయటం ఆరంభించారు.తనను బాగా ప్రభావితం చేసిన వారు విశ్వనాథ సత్యనారాయణ గారు,నోరినరసింహశాస్త్రిగారు అనిచెప్పారు.ఎన్నికల టైంలో పాటలు పద్యాలు రాయటం ప్రారంభించిన ఆయన వాల్తేర్ యూనివర్శిటీ ఎం.ఎ.లో కాంపిటేషన్ లో ఫస్ట్ ప్రైజ్ పొందటం సాహిత్య వేత్తగా ఎదగటానికి బీజంవేసింది అంటారు.ఈయన దివాకర్లవెంకటావధానిగారి ప్రియశిష్యులు.

ఇక తనపై ఆధ్యాత్మిక ప్రభావం తనతాతగారైన కొంపల్లి జ్వాలయారాధ్యులవారివల్లనే అని చెప్పారు.నిరంతర శివ పూజలు చేసేవారాయన.బాబాయిరామలింగశాస్త్రి గారు ఆధ్యాత్మిక భావాలు గుప్పించారు.భారతీయ ధర్మ ప్రచారంచేయాలని దివాకర్లవారు చెప్పేవారు.ఇక నేటి సాహిత్యం గూర్చి ఆయన అభిప్రాయాలు ఇవి” మనకి బుక్ కల్చర్ తగ్గి లుక్ కల్చర్ పెరిగింది.మనదేశచరిత్ర పూర్తిగా వక్రీకరించబడింది. విదేశీయుల్ని పొగిడే చరిత్రలు పాఠాలుగా వచ్చాయి.కాలడీ ఆదిశంకరాచార్యులవారు నేషనల్ హీరో!మతప్రవక్త కాదు.దేశమంతా ఒక్కటే హైందవీయసంస్కృతి కి మూలస్థంభం ఆయన! వేదాల్ని ఎగతాళి చేయవద్దు.గౌరవించండి.చరిత్రను వక్రీకరించవద్దు.పరాజయం నుంచి పాఠాలు నేర్చుకోవాలి.సమాజానికి సరైన చరిత్ర చెప్పాలని చారిత్రక నవలలు శోధించే రాశాను. రాయటం చదవటం కూడా కష్టం.కానీమన భారత దేశ చరిత్ర పవిత్రత ఆధ్యాత్మికత అందరికీ తెలియాలి.మానాన్న 1940లోనే ఎర్రజెండా పట్టుకున్న వామపక్షంవాడు. నేను ఆధ్యాత్మిక చారిత్రక ప్రాధాన్యత ను తెలియజెప్పాలి అనే ఉద్దేశంతోనే రాశాను,రాస్తున్నాను.” నిజంగా మన ఆర్షధర్మం సంస్కృతి అసలు సిసలు చరిత్ర తెలియాలంటే శ్రీముదిగొండ శివ ప్రసాద్ గారి పుస్తకాలు ప్రతి బడిలో కాలేజీలో ఉండితీరాలి

You may also like

1 comment

Leave a Reply to Larry1930 Cancel Reply