Home అనువాద సాహిత్యం రోమియో మరియు జూలియట్‌

ఇటలీ దేశంలో వెరోనా అనే పట్టణం. అక్కడ ధనికులైన క్యాపులెట్లు మరియు మోన్‌ ట్యాగో కుటుంబాలు ఉండేవి. వారి ఇద్దరి మధ్యన చాలా వైరం ఉండేది. వారే కాదు, వాళ్ళ నౌకర్లు కూడా ఒకరినొకరు సహించేవారు కాదు. వారు తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరిగేది.

క్యాపులెట్ల కుటుంబంలోని ఒక అందమైన అమ్మాయి జూలియట్‌. మొంటాగ్‌ కుటుంబంలోని రోమియో అనే అబ్బాయి.

లార్డు క్యాపులెట్‌ ఒక పార్టీ ఏర్పాటు చేసి అందరిని ఆహ్వానించమని నౌకర్లతో చెప్పాడు. అప్పుడు మారువేషంలో ఉన్న రోమియో కూడా పార్టీలో చేరాడు. అక్కడ అతను ఒక మూలన కూర్చున్న అందమైన అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆమె కూడా అతణ్ణి ఇష్టపడుతుంది. ఆమే జూలియట్‌.

వారి వివాహానికి మత సభ్యుడు (ఫ్రియర్‌) సరే అంటాడు. దీనితో ఆ రెండు కుటుంబాల మధ్య వున్న వివాదం కూడా సమసిపోగలదని అనుకొని వారి వివాహం చేసేందుకు ఒప్పుకున్నాడు. ఆమె నౌకర్ల సహాయంలో రోమియో తోటలోకి దూకాడు. ఆమె బంగ్లా పైనుండి చీర కిందికి జార విడిచింది. అది పట్టుకొని అతడు బంగ్లా పైకి ఎక్కి ఆ రాత్రి వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు. అది ఎవరికి తెలియదు. ఒకరి కొరకు ఒకరు తపించేవారు. అయితే జూలియట్‌ తండ్రి ఆమె వివాహం పారిస్‌ అనే అబ్బాయితో నిశ్చయించాడు. కాని ఆ సంబంధం తప్పించుకునేందుకు ఫ్రయర్‌ సహాయం కోరారు. జ్యూలియట్‌ మరియు రోమియో లది స్వచ్ఛమైన గ్రహించిన ఫ్రయర్‌ ఒక ఉపాయం చెప్పాడు.

జూలియట్‌ తండ్రి వీరి పెండ్లి కొరకు గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాడు. తీరా పెండ్లిరోజు ప్రయర్‌ సలహా ప్రకారం ఆమె చనిపోయినట్లు ఉండేందుకు నిద్రగోలీలు వేసుకొని పడుకుంటుంది. ఆమెను స్మశానం గొయ్యిలో పడుకోబెడుతారు. అప్పుడు ఫ్రయర్‌ సలహా ప్రకారం ఆమెకు నిద్ర నుండి తెలివి వచ్చేవరకు రోమియో వచ్చి ఆమెను లేపి తీసుకుపోవాలి. కానీ ఈ సలహా లేఖ అతనికి అందలేదు. ఎందుకంటే అతడు తన మిత్రుడు మెరికూషియోన్ను టైబాలుటు చంపినందుకు అతడిని రోమియో చంపేశాడు. అందుకు అక్కడి రాకుమారుడు ఎస్‌ క్యాలస్‌ రోమియోను దేశ బహిష్కరణ చేశాడు. అందువలన ఫ్రయర్‌ వేసిన ప్లాన్‌ అతనికి అందలేదు. అయినా ప్రపంచంలో చెడువార్తలు త్వరగా చేరుతాయి మంచివాటికన్నా ముందు. జూలియట్‌ మరణవార్త తెలిసి రోమియో ఆమె సమాధి వద్దకు వెళుతున్న సమయంలో పారిస్‌ అడ్డుపడుతాడు. ఇద్దరి మధ్య కొట్లాట జరిగి పారిస్‌ చనిపోతాడు. ప్రాణం పోయే చివరిథలో తనను జూలియట్‌ దగ్గరిలో పడుకోబెట్టమని కోరుతాడు. అట్లే చేశాడు రోమియో. రోమియో జూలియట్‌ మరణించి గొయ్యిలో పడివున్న దాన్ని చూసి మానసిక బాధ భరించలేక విషం తాగి చనిపోయాడు. ఇంతలో జూలియట్‌ మెలకువ వచ్చి ప్రక్కన ఉన్న శవాలను చూసి తీవ్రమైన బాధతో రోమియో బాకుతో తననుతాను పొడుచుకొని చనిపోతుంది.

ఎస్‌ క్యాలస్‌ రెండు కుటుంబాలను శాంతింప చేశాడు. అందువలన వాళ్ళ మధ్య వైరం పోయి స్నేహం ఏర్పడింది. మోన్‌ ట్యాగులు బంగారంతో జూలియట్‌ విగ్రహం మరియు క్యాపులెట్లు రోమియో బంగారు విగ్రహం ప్రక్కపక్కన నిలబెడుతామని వాగ్ధానం చేశారు.

”ఇటువంటి విషాధ ఘటన కథ జూలియట్‌ మరియు రోమియోలది, బహుశా ఇంతకుముందు ఎక్కడ జరగలేదేమో అని” రాకుమారుడు ఎస్‌ క్యాలస్‌ ప్రకటించాడు.

షేక్స్‌ పియర్‌ ఆంగ్లంలో 22 పేజీల్లో రచించిన కథ 2 పేజీల్లో తెలుగులో దాని సారాంశం ఇది. ఇక షేక్స్‌ పియర్‌ గురించి కొంత తెలుసుకుందాం.

You may also like

Leave a Comment