విలువ

by Kondapally Neeharini

మయూఖ సంపాదకీయం, నవంబర్ 2023

– డాక్టర్ కొండపల్లి నీహారిణి, మయూఖ సంపాదకులు

వాద ప్రతివాదనలలో నిలిచి ఎగిసిపడే మనుషుల జీవితాలు ఇవి. ప్రతి క్షణం విలువకట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి విషయాలు లెక్కల కు అంతు చిక్కనివి. దేశ ఆర్థిక స్థితిగతుల గ్రాఫ్ లైన్స్ ల లో సాధారణ మానవుల పాత్ర ఎంత అని చర్చించుకోవాల్సి వచ్చే పరిస్థితులు. ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టు దేశ నిర్మాణంలో మనిషి ఎక్కడ కనిపిస్తాడు.మనుగడే ప్రశ్నార్ధకమయ్యే రోజులు కదా!

సమాజం కోసం మనం చేసే పని ఏంటి అని ఆలోచిస్తే జవాబు దొరకని స్థితి ఉండదు. ఒక మాట మాట్లాడినా ఒక పని చేసిన నిబద్ధత ఉండాలి,నిజాయితీ ఉండాలి. విలువలు అనేవి ఎన్నికల విషయం లో ఎలా ఉండాలి అనేది పరిశీలిద్దాం. ప్రజలు రాజకీయాలు తెలియనట్లే కనిపిస్తారు కానీ నిజానికి అన్ని తెలుసు. భారతదేశం గణతంత్ర రాజ్యం. ఒక సమాఖ్య ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగి ఉన్నటువంటి దేశం. అతి పెద్ద రాజ్యాంగం. భారత రాజ్యాంగ ఎన్నికల కమిషన్ సంస్థ ఎన్నికల విషయం చూస్తుంది. ప్రజా ప్రతినిధులను ప్రజలు ఎన్నుకుంటారు. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు ప్రజా జీవనానికి ఎంతో ముఖ్యమైనవి. ప్రతి విషయము రాజకీయాలతో ముడిపడి ఉంటున్న కారణాలు ఎన్నుకోబోయే వ్యక్తి ధర్మబద్ధుడు అయి ఉంటాడా కానీ ఆలోచించాల్సిన బాధ్యత ప్రజలదే. పద్దెనిమిదేళ్ళు దాటిన ప్రతి వ్యక్తి ఓటు అర్హత కలిగి ఉంటారు. లోక్ సభ, విధాన సభలకు

నాయకులను ప్రజాప్రతినిధులు గా ప్రజలే ఎన్నుకుంటారు. ఇలా ప్రత్యక్ష పద్ధతిలో ప్రజలు ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి లోక్ సభను ప్రజల సభ హౌస్ ఆఫ్ ద పీపుల్ అని కూడా అంటాం. ఈ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్, సార్వత్రిక ఎన్నికలు. ప్రతి రాష్ట్రానికి శాసనసభ లేదా విధానసభ ఉంటుంది ప్రజాప్రతినిధులుగా మినిస్టర్లుగా ఎమ్మెల్యేలుగా ఉంటారు. రాష్ట్రానికి సంబంధించిన అంతవరకు ప్రభుత్వ అన్ని అధినేతనే ముఖ్యమంత్రి అని అంటాం .కనీస ఆధిక్యతతో గెలిచిన నాయకుడు ముఖ్యమంత్రి

అవుతాడు. ముఖ్యమంత్రి తన పరిపాలనకు అనుకూలంగా ఉండేలా సహాయ మంత్రులను మంత్రివర్గాన్ని ఏర్పరచుకుంటాడు. ఈ రాష్ట్ర మంత్రి మండలికి ముఖ్యమంత్రి అధిపతి. రాష్ట్ర అంతర్గత భద్రత విషయాలు రాష్ట్ర సర్వతో ముఖ అభివృద్ధి వంటి విషయాలు ప్రముఖమైనవి. ఉత్పత్తి పన్నులు ఆదాయపన్నులు సరిహద్దుల సరైన సుంకాలు, టాక్సులు, శాంతి భద్రతలు వంటి ఎన్నో విషయాలపై రాష్ట్ర కార్యనిర్వాహక అధికార లతో రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి. రాజ్యాంగ యంత్రాంగం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదంతో పనిచేస్తుంది.

ఓటు వేయకుండా ఉండవద్దు. ఓటు ప్రాధమిక హక్కు. విధి నిర్వహణ సరిగా చేసినటువంటి వ్యక్తిని ఎన్నుకొని పరిపాలనాసభకు పంపించాల్సిన బాధ్యత ప్రజలదే. ఈ రాజకీయ నాయకులు అనేవాళ్లు ఎక్కడి నుంచో ఊడిపడరు. తమ మధ్య తిరిగే వ్యక్తులే అధికారం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తారు అనే విషయం అర్ధం చేసుకోవాలి ప్రజలు. ఆకాశానికి నిచ్చెనలు వేసుకుని పగటి కలలు కనడం కాదు రాజకీయాలనేవి. నిజాయితీ గల వాళ్ళను చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖిస్తుంది. చరిత్ర అంటే ప్రజా జీవితమే.ఈ రాజకీయ నాయకుల క్యారెక్టర్ ఎలాంటిదో ఒక గమనింపు తో ఉండాల్సిన బాధ్యత ప్రజలదే. అవినీతిపరులను చెడు బుద్ధి కలవాళ్ళనూ ఎన్నుకుంటే అనుభవించాల్సింది ప్రజలే. గత చరిత్రను తవ్వుకోవాలి, నిజ నిజాలు తెలుసుకోవాలి. ఎంతో విలువైన ఓటును ఎన్నికల్లో

ఉపయోగించేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మరి ఓటు వేయాలి. కొన్ని సందర్భాలలో పార్టీ మీద అభిమానము పోటీలో నిలిచిన వ్యక్తి మీద దురభిమానం ఉండొచ్చు. కొన్ని సందర్భాలలో వ్యక్తి మీద అభిమానము పార్టీ మీద దురభిమానం ఉండొచ్చు. ఈ రెండింటినీ సమన్వయ

పరుచుకుంటూ, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మాటకి విలువ, చేతకు విలువ ఉంటుందని గ్రహించి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఒక్క ఓటు నిర్ణయం చేసి నిలబెడుతుంది. వెలకట్టలేని ఓటు హక్కును దుర్వినియోగం చేయవద్దు.

రాజ్యాలు కూల్చి రాజరికాలనీ కూల్చి ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది మన దేశం! ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర మన దేశానికి మన రాష్ట్రానికీ ఉన్నది. కాలం చెప్పే తీర్పు లో క్షణక్షణాల అక్షర సత్యం లా బతుకు ఉంటుంది. కులం అని మతం అని ప్రాంతం అనే లింగమని జాతి అని భాష అని భేదాలు అభిప్రాయాలు లేకుండా ప్రతి వ్యక్తి ఓటు హక్కును వినియోగించుకొని విలువని కాపాడుకోవాలి. ప్రజాస్వామ్య విధానానికి ఓటు ఒక్కటే పునాది. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఓటు. చూడడానికి రెండు అక్షరాలే కానీ ఎన్నో విలువలను తనలో దాచుకున్నది ఓటు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఓటింగ్ పద్ధతి ఎంపిక విధానానికి గోపిక రూపంతో ఉండే ప్రక్రియ. బ్యాలెట్ బాక్స్ ఎంతో రహస్యంగా జాగ్రత్తగా కాపాడుతారు. దీనికి కారణం ఓట్లు దుర్వినియోగం కావద్దని. గత కొన్నేళ్లుగా ఓటింగ్ యంత్రం ద్వారా ఓటు వేసే విధానం అమల్లోకి వచ్చింది ఓటింగ్ మిషన్ ఎలక్ట్రానిక్ మిషన్ వచ్చిన తర్వాత మరింత జాగ్రత్తగా ఓటును వినియోగించాల్సిన బాధ్యత పౌరుడి మీదనే ఉంటుంది. 80 ఏళ్ల వయోవృద్ధులు కూడా వచ్చి ఓటు వినియోగిస్తున్నారు కానీ యువత ముందుకు రావడం లేదు. యువకులు పావన నవజీవన నిర్మాతలు. యువతరం తలుచుకుంటే సాధించలేని దేవి లేదు. ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలదే. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకున్నప్పుడే సుస్థిరమైన స్వచ్ఛమైన పాలన లభిస్తుంది.

You may also like

Leave a Comment