Home కథలు సిండ్రెల్లా పునః కధనం

సిండ్రెల్లా పునః కధనం

అనగనగా ఒక రాజ్యంలో ఒక ధనికుడు నివసించేవాడు. అతనికి ఒక కూతురు పుట్టాక భార్య మరణించింది. కూతురును అతనే పెంచి పెద్ద చేయసాగాడు. కూతురు ఎంతో అందగత్తె మరియు దయా వృదయం గలది. కొన్నాళ్ళకు మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. కానీ ఆమె సవతి తల్లి కదా! కూతురు సిండ్రెల్లాను ఏమి బగా చూసేది. కాదు తర్వాత ఆమెకిద్దరు కుమార్తెలు పుట్టారు. సవతి తల్లి ఆమె కుమార్తె లిద్దరూ కూడా సిండ్రెల్లాను ఎప్పుడూ ఏడిపిస్తుండే వారు ఇంటి చాకిరీ అంతా చేయించేవారు. కనీసం ఆమెకు మంచి ఆహారం కూడా ఇచ్చేవారు కాదు. తండ్రి ఇదంతా చూసి చాలా బాధపడేవాడు. తాను అనవసరంగా రెండో పెళ్ళి చేసుకున్నానని చింతించేవాడు.
ఒకరోజు వ్యాపార పనుల నిమిత్తం తండ్రి పొరుగూరికి వెళ్ళాడు. తండ్రి కూడా లేక పోవడంతో సవతి తల్లి సిండ్రెల్లాను మరింత బాధ పెట్ట సాగింది. కడిగిన పాత్రల్నే మరల కడిగిస్తూ, ఇల్లంతా శుభ్రం చేశాక చెత్త పడేసి మరల శుభ్రం చేయమని చెప్తూ సిండ్రెల్లాను పని మనిషి గా మార్చేశారు. ఎంతో అందంగా ఉండే సిండ్రెల్లాను మసి బొగ్గు లా తయారు చేశారు. వంటలన్నీ వండినా పారబోసేసి మరల వండమని చెపుతూ పొయ్యి దగ్గరే ఉంచేవారు.
ఇలా ఉండగా ఒకరోజు రాజ భటుడు కరపత్రాలతో వీరింటికి వచ్చాడు. “రాజు గారి కోటలో సంబరాలు జరుగుకున్నాయనీ, వాటి కోసం రాజ్యం లోని యువతులందర్ని ఆహ్వానిస్తున్నారని” చెప్పాడు. అంతేకాక తనకు నచ్చిన యువతితో రాజకుమరుడు నృత్యం చేస్తారనీ, ఆమెనే పెళ్ళిచేసుకుంటాడనీ ఆహ్వాన పత్ర సారాంశమనీ చెప్పాడు.
సవతి తల్లి చాలా సంతోషించింది తన కుమార్తెల కోసం మంచి మంచి బట్టలు, టోపీలు, హారాలు ఎన్నో కొన్నది. రాజకుమారుడు తన కూతుళ్లిద్దరిలో ఎవరినో ఒకరిని వివాహం చేసుకోవాలని ఆశించింది. అప్పుడు సిండ్రెల్లా వచ్చి “అమ్మా నేను కూడా సంబరాలకు వస్తాను కొత్త దుస్తులు కొనవా నాకు ఈ చినిగిన గౌను తప్ప కొత్తవి లేవుకదా” అన్నది. అప్పుడు ఆమె నవ్వుతూ” పనిమనుషులు రాజభవనానికి రాకుడదు నువ్వు ఇక్కడే ఉండు” అంటూ తన కుమార్తెలతో వెళ్ళిపోయింది.
సిండ్రెల్లా మరేమి చేయలేక ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉండిపోయింది. తోటలోని చిలుకలు ఆమెను ఊరడిస్తున్నాయి. అప్పుడు అకస్మాత్తుగా ఒక దేవమాత ప్రత్యక్షమయింది. సిండ్రెల్లా ఆశ్చర్యంగా చూస్తుండగానే “నువ్వు రాజవనానికి వెళతావా” అని అడిగింది దేవమాత “నేను వెళ్ళాలంటే నాకు సరైన దుస్తులు, వెళ్ళడానికి బండి కూడా లెవు కదా” నిరాశగా అంది సిండ్రెల్లా. వెంటనే దేవదూత తన మంత్రదండంతో సిండ్రెల్లాకు మంచి మెరుపుల బట్టలు, నగలు, గాజు చెప్పులు సృష్టించింది. వారి పెరట్లో ఉన్న ఒక గుమ్మడి కాయను రథంగా మార్చేసింది. అక్కడ తిరుగుతున్న రెండు ఎలుకలను గుర్రాలు గా మార్చింది. మరొక ఎలుకను రథ సారధి గానూ, మరొక తొండను ఆమెకు సేవకుడి గానూ మార్చింది.
“ఇప్పుడు నువ్వు రాజభవనానికి వెళ్ళు సిండ్రెల్లా ! కానీ ఒక్క విషయం గుర్తుంచుకో అర్థరాత్రి 12 గంటలలోపు నువ్వు ఇంటికి రావాలి. ఆ తర్వాత నా మాయ పని చెయ్యదు అన్ని మామూలై పోతాయి” అని చెప్పి దేవదూత అదృశ్యమైపోయింది.
సిండ్రెల్లా రాజభవనానికి చేరుకుంది. ఆమె అద్భుత సౌందర్యం చూసి అక్కడున్న అందరూ ఆమె తప్పక రాజుకుమారి అయి ఉంటుందని అనుకున్నారు. రాజకుమారుడు కూడా ఆమె అందానికి ముగ్ధుడై ‘నాతో నాట్యం చెస్తావా’ అని అడిగాడు. సిండ్రెల్లా రాజకుమారుడు నృత్యం చేస్తూ సమయం చూసుకోలేదు హటాత్తుగా సిండ్రెల్లా కు గుర్తువచ్చి ‘నేనిప్పుడే ఇంటికి వెళ్ళాలి’ అని బయటకు నడిచింది. ‘నీపేరు, చిరునామా చెప్పవా’ అంటూ రాజకుమారుడు ఆడుగు తుండగానే ఆమె రథమెక్కి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళేటప్పుడు ఆమె పాదాలకున్న గాజు చెప్పు అక్కడే పడిపోయింది.
సమయానికి ఇంటికి చేరింది సిండ్రెల్లా. సమయం 12 కాగానే అన్ని మాయమై పోయాయి. రాజ భవనంలో సిండ్రెల్లాను ఎలాగైనా గుర్తించాలని. అనుకున్నారు. ఆమె వదిలిన గాజు చెప్పు సాయంలో సిండ్రెల్లాను గుర్తించాలి అనుకున్నారు. వెంటనే అందరి వద్దకూ వెళ్ళి పరీక్షించారు. అoదులో భాగంగా సిండ్రెల్లా ఇంటికీ వచ్చారు. సవతి తల్లి కుమార్తె లిద్దరూ నాదే ఈ చెప్పు అంటూ ఇద్దరూ చెప్పారు. భటుడితో పాటు రాజకుమారుడూ వచ్చాడు అక్కడకు. చెప్పును తొడుక్కుని చూపమనగా ఒకరికి పట్టనేలేదు, మరొకరికి చాలా పెద్దదైంది. అప్పుడు మసి బట్టలతో దూరంగా నిలుచున్న సిండ్రెల్లానూ చెప్పు తొడుక్కుని చూడమనగా ఆమెకు సరిగ్గా సరిపోయింది. అప్పుడు దేవదూత ప్రత్యక్షమై సిండ్రెల్లాకు పూర్వపు దుస్తులను, రూపాన్నీ ఇచ్చింది. రాజు కుమారుడు సిండ్రెల్లాను గుర్తు పట్టాడు ఆమెను తన రథం ఎక్కించుకొని రాజ భవనానికి తీసుకు వెళ్ళాడు. తన భార్యగా చేసుకున్నాడు సిండ్రెల్లా యువరాణిగా ఎన్నో సుఖాలను పొంది ఆనందంగా జీవించింది.

You may also like

Leave a Comment