Home బాల‌సాహిత్యం మట్టి గణపతే మహాగణపతి

మట్టి గణపతే మహాగణపతి

by mayuukha

అనగనగా ఒక ఊరిలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు వారు రాము, గౌతమ్,రాజేష్ ఈ ముగ్గురు మంచి మిత్రులు ఒకరోజు రాజేష్ మిగతా ఇద్దరు మిత్రుల దగ్గరకు వచ్చి వినాయక చవితి దగ్గరకు వచ్చింది. చెందాకు తిరుగుదామా అన్నాడు. వారు సరే రేపటి నుంచి తిరుగుదాం అన్నారు. మరుసటి రోజు పొద్దున్నే లేచి ముగ్గురు స్నేహితులు స్నానాలు చేసి చందా వసూలు చేయడానికి బయలుదేరారు. అలా కొన్ని రోజులు చందా వసూలు చేశారు. వినాయక చవితి ముందు రోజు ముగ్గురు స్నేహితులు పందిరి వేసి డెకరేషన్ చేశారు. గౌతమ్ వాళ్ళ నాన్న ట్రాక్టర్ ని తెచ్చాడు. ట్రాక్టర్లో మట్టి గణపతిని తీసుకొని వచ్చారు. గణపతి బప్పా మోరియా అనుకుంటూ పందిరిలోకి తెచ్చారు. గణపతికి కొబ్బరికాయ కొట్టారు. పూజారిని పిలిచి పూజ చేశారు. ప్రసాదం నైవేద్యం పెట్టారు. అందరినీ పిలిచి ప్రసాదం పెట్టారు. సాయంత్రం అయ్యింది. కాళ్లు చేతులు కడుక్కొని దేవుని పందిరిలోకి వచ్చారు. రాత్రి దేవుని పందిరిలోనే పడుకున్నారు. మరుసటి రోజు రాము వచ్చి మిగతా ఇద్దరి మిత్రులతో మనం అన్నదానం చేద్దామా అన్నాడు. మిత్రులు సరే అన్నారు. మూడు రోజుల తర్వాత రాము రాజేష్ గౌతమ్ ముగ్గురు మిత్రులు కలిసి అన్నదానం చేశారు. తొమ్మిది రాత్రులు గడిచాయి. పదవరోజు పులిహోర తయారు చేశారు. వినాయకున్ని ట్రాక్టర్లో పెట్టి ఎగురుకుంటూ చెరువు దగ్గరకు వచ్చారు. వినాయకున్ని చెరువులో నిమజ్జనం చేశారు.

నీతి. చెరువులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాలను చెరువులో వేస్తే నీళ్లు కలుషితం అవుతాయి.నీటిలో ఉండే జీవులు చనిపోతాయి. కాబట్టి మట్టి వినాయకులనే పూజిద్దాం.
యెన్. చక్రి,
8 వ తరగతి,

అనగనగా ఒక ఊరిలో కిరణ్,గౌతం అనే ఇద్దరు యువకులు ఉండేవారు.19 యేళ్లు గౌతంకు 20 యేళ్లు .వారిద్దరూ మంచి మిత్రులు ఒకరోజు వీరు కాలేజీ కీ వెళ్లేటప్పుడు దారిలో ఒక తెల్లటి కారు కనపడింది. కారు చాలా బాగుంది.కిరణ్ గౌతంలు దాన్ని చూసి ఆశ్చర్యపోయారు.మా నాన్న ను ఇలాంటి కారు కొనివ్వమంటాను అని గౌతం అన్నాడు.అప్పుడు కిరణ్ కూడా నేను మా నాన్న ను కొనివ్వమని అడుగుతానన్నాడు.కాలేజి ముగిసాక ఇద్దరూ ఎవరిండ్లకు వారు వెళ్లారు.
కిరణ్ వాళ్ల నాన్న తో ఇలా అన్నాడు నాన్న నాన్న ఈరోజు నేను కాలేజీ వెళ్లే దారిలో ఒక తెల్లటి అందమైన కారును చూశాను.అది నాకు కొనివ్వమని అడిగాడు.అప్పుడు కిరణ్ వాళ్ల నాన్న నా దగ్గర అంత డబ్బులు లేవు నేను రోజు కష్టపడి పనిచేస్తే మన కడుపు నిండుతుంది మనకు అంత స్తోమత లేదు అనగానే కిరణ్ సరే నన్నాడు.మరునాడు గౌతం కూడా వాళ్ల నాన్న తో ఈ కారు గురించి చెప్పి కొనివ్వమని అడగ్గానే గౌతం తండ్రి నీకన్న నాకు ఏదీ ఎక్కువ కాదు అని కారు కొనవచ్చాడు.
మరుసటి కిరణ్ గౌతం లు కాలేజి కీ వెళ్లేటప్పుడు గౌతం వాళ్ల నాన్న తనకు కారు కొనిచ్చాడని తెలిపాడు.కిరణ్ మా నాన్న కొనివ్వలేదని చెప్పాడు.ఆ తర్వాత కొద్దిరోజులకు కాలేజీలో పరీక్షలు జరిగాయి.ఆ పరీక్షల్లో కిరణ్ మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు.కాని గౌతం ఫేల్ అయ్యాడు.కిరణ్ వెంటనే వాళ్ల నాన్న దగ్గర కి వెళ్ళి తాను పాసయ్యానని ఉద్యోగం కూడా వచ్చిందని జీతం డబ్బుల తో కారు కొంటానని వాళ్ల నాన్న తో చెప్పగ వాళ్ల నాన్న ఎంతో సంతోషించాడు. గౌతం వాళ్ల నాన్న గౌతం ను నీవు పాసయ్యవా అని అడిగాడు.అప్పుడు గౌతం నేను ఫేలయ్యానని చెప్పగనే గౌతం తండ్రి నేను ఎంతో కష్టపడి నీకు ఫీజు కట్టి అడిగిందల్లా కొనిచ్చి చదివిస్తే ఫెలవుతవా అని కోపంతో మందలించారు.కిరణ్ తెల్లటి కారులో కుటుంబ సభ్యుల తో తిరుగుతూ సంతోషంగా జీవితాన్ని గడిపాడు.
నీతి బాగా చతువుకుంటే బాగుపడతారు
బాగా చదువుకోక పోతే జీవితాంతం బాధపడతారు
రచయిత. వి.చక్రి
7వ తరగతి

అనగనగా ఒక ఊరిలో బాలు,రాజు, చందు సుధీర్ అని నలుగురు స్నేహితులు ఉండేవారు. మీరందరూ ప్రాణ స్నేహితులు ఒకరినొకరు కలిసిమెలిసి ఉండేవారు సుధీర్ కి 11 సంవత్సరాలు చందు రాజు మరియు బాలుకు కూడా11 సంవత్సరాలు ఒకరోజు ఈ నలుగురు ఆడుకుంటూ ఉండగా ఒక పెద్ద ఏనుగు పరిగెత్తుకుంటూ అటువైపు వచ్చింది.దాన్ని చూసి ఆ నలుగురు పరుగు తీశారు. పరిగెత్తుతూ పరిగెత్తుతూ సధీర్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. ఆ ఏనుగు వెళ్ళాక వచ్చి ఆడటం మొదలుపెట్టారు ఆ మరుసటి రోజు సుధీర్ పుట్టినరోజు పుట్టినరోజున మిగతా ముగ్గురూ మిత్రులు పొద్దున్నే లేచి సుధీర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అందరూ కలిసి పాఠశాలకు వెళ్లారు మిత్రులందరికీ మిఠాయిలు పంచారు ఆ తర్వాత రోజు నుంచి పరీక్షలని తరగతి ఉపాధ్యాయులు చెప్పారు. మళ్లీ ఇంటికి వచ్చి చదువుకొని ఉదయం పాఠశాలకు వెళ్లారు వారం రోజుల్లో ఎగ్జామ్స్ పూర్తయ్యాయి ఫలితాలు వచ్చే రోజు రానే వచ్చింది .ఆ నలుగురిలో చందు కు మంచి మార్కులు వచ్చాయి మిగతా మిత్రులకు తక్కువ మార్కులు వచ్చాయి. ఆ ముగ్గురు చాలా బాధపడ్డారు చందు వాళ్ళని ఓదార్చాడు ఈసారి పోతే మళ్ళీ ఒకసారి బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోండి అని చెప్పాడు.ఏదైనా ప్రయత్నిస్తేనే ముందుకెళ్తామని చెప్పాడు. చందు సరే మిత్రమా మరోసారి ప్రయత్నిస్తాం అని మిగతా ముగ్గురు మిత్రులు చెప్పారు ఇప్పుడు వాళ్లు ఏడవ తరగతికి వచ్చారు ఈ సంవత్సరమైనా మంచి మార్కులు తెచ్చుకుందామని అనుకున్నారు ఆటలాడడం తగ్గించి చదవడం మొదలుపెట్టారు. ప్రతిరోజు పాఠశాలకు క్రమం తప్పకుండా వెళ్లారు పాఠశాల నుంచి వచ్చాక సాయంత్రం వేళల్లో ట్యూషన్ కు వెళ్లారు. సెలవు రోజుల్లో కూడా సమయం వృధా చేయకుండా పెండింగ్ హోంవర్క్ ను పూర్తి చేశారు. చదువుకున్నారు. ఏడవ తరగతి వార్షిక పరీక్షల్లో అందరు విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు అందరూ చాలా ఆనందించారు
సూక్తి కష్టపడితేనే ఫలితం ఉంటుంది
యం.సహనశ్రీ
8,వ తరగతి

సహకారం
అనగనగా ఒక ఊరిలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వారు ఎప్పుడు కలసి మెలసి ఉండేవారు. ఆ ముగ్గురి పేర్లు సోను, చీకు, బంటి ఒకరోజు వీరిలో సోనుకు ఒక ఆపద వచ్చింది. అది ఏమిటంటే ఆ ముగ్గురు ఒకరోజు అనంతసాగర్ గ్రామంలోని సరస్వతి దేవాలయానికి వెళ్లారు. అక్కడ జాతర జరుగుతుంది. సోను జ్యూస్ తెచ్చుకుంటాను అని చెప్పి వెళ్ళాడు. అక్కడ చాలామంది జనాలు ఉన్నారు. జ్యూస్ తెచ్చుకోవడానికి వెళ్లిన సోను ఇంకా రాలేదు. రెండు గంటలు అయింది. అయినా అయినా కూడా ఇంకా రాలేదు. చీకు బంటి చాలా కంగారు పడ్డారు. ఎక్కడికి వెళ్ళాడో అని చీకు బంటితో సోను జాడ కోసం వెతుకుదామని అడిగాడు. కానీ బంటి సహకరించకుండా ఇంటికి వెళ్లిపోయాడు. కానీ చీకు తన మిత్రుడు సోనుని వెతకడానికి వెళ్ళాడు. అన్నిచోట్ల వెతికాడు. చివరకు సత్రంలోకి వెళ్లాడు. అక్కడ సోను కనిపించాడు. చీకు చాలా సంతోషముతో సోను దగ్గరికి వెళ్లి సోనుని తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ సంతోషంగా జ్యూస్ తాగి ఇంటికి వచ్చారు
నీతి ఆపదలో ఆదుకున్న వాడే నిజమైన మిత్రుడు
యం.సహన శ్రీ
7 వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
మర్రి చెట్టు

అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ మర్రి చెట్టు కింద పిల్లలు పెద్దవారు అందరూ విశ్రాంతి తీసుకునేవారు ఒకరోజు అక్కడికి ఆ ఊరి సర్పంచ్ గారు వచ్చి ఇలా అన్నాడు ప్రజలారా నేను ఈ చెట్టును నరికేపిస్తున్నాను అప్పుడు ఆ మాటలు విన్న ఒక వ్యక్తి చెట్టును నరక వద్దు ఇది ఎన్నో సంవత్సరాలుగా మనకు గాలి నీడను ఇస్తుంది ఈ చెట్టుపై పక్షులు గూడు కట్టుకొని నివసిస్తున్నాయి చెట్ల వలన మనకు వర్షాలు కురుస్తాయి అని చెప్పాడు ఆ మాటలు విన్న గ్రామ సర్పంచ్ గారు తన నిర్ణయాన్ని మార్చుకొని ప్రజలారా నేను ఈ చెట్టును నరికేయను మన గ్రామంలో ఇంకా అనేక మొక్కలను నాటి నాటింపజేస్తాను అని చెప్పాడు అప్పుడు ప్రజలందరూ ఎంతో సంతోషించారు అప్పటికే చీకటి అయింది అందరూ అక్కడి నుంచి ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయారు ఏ అందరూ వారి వారి ఇండ్లమందు మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నారు భోజనం చేసి పడుకున్నారు

నీతి.చెట్లను నరికేయవద్దు ప్రకృతిని నాశనం చేయవద్దు.
నరెడ్ల.భార్గవ్
6 వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

అనగనగా ఒక ఊరిలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వారి పేర్లు సురేష్, రాము,నరేష్ ఒకరోజు ముగ్గురు స్నేహితులు జాతరకు వెళ్లారు. కానీ అనుకోకుండా ఆ జాతరలో రాము తప్పిపోయాడు. సురేష్ నరేష్ ఇద్దరూ చాలాసేపు రాము కోసం వెతికారు. కానీ రాము దొరకలేదు అప్పుడు ఆ ఇద్దరు స్నేహితులు ఎంతో బాధ పడ్డారు. ఈ విషయం వారి తల్లిదండ్రుల కు చెప్పారు.మరుసటి రోజు కూడా వెతికారు అయినా కానీ రాము దొరకలేదు.పోలీసుల కు కూడా చెప్పారు.ఇట్లా నెలరోజులపాటు వెతికారు అయినా రాము జాడ లభించలేదు. మిగతా ఇద్దరూ స్నేహితులు రాము కోసం ఆలోచిస్తూ చాలా రోజులు బాధపడ్డారు. స్నేహితులిద్దరూ పెరిగి పెద్దవారయ్యారు నరేష్ కి 16 సంవత్సరాలు సురేష్ కి కూడా 16 సంవత్సరాలు నరేష్ సురేష్ లు ఒకరోజు నరేష్ పుట్టిన రోజు సందర్భముగా అనాథ ఆశ్రమంలోని వారికి పండ్లు దానం చేయడానికి వెళ్లారు. అక్కడ వాళ్ల మిత్రుడు అన్నం తింటూ ఉండగా నరేష్ సురేష్ లకు గుర్తుపట్టారు. అప్పుడు చాలాకాలంగా తప్పిపోయిన తమ మిత్రుడు రాముని గుర్తుపట్టారు.చాలా ఆనందించారు. ఆ రోజు జాతరలో ఎలా తప్పి పోయాడో ఇక్కడికి ఎలా చేరుకున్నడో అడిగి తెలుసుకున్నారు. రాముని అక్కడి నుంచి తీసుకొనిఇంటికి వారి తల్లిదండ్రుల దగ్గర కు తీసుకొని వెళ్లారు.
జి.చైత్ర
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
రేగులపల్లి

స్నేహం విలువ
అనగనగా ఒక ఊరిలో ఆరుగురు స్నేహితులు ఉండేవారు. వాళ్లు అందరూ ఒకే తరగతి వాళ్ళు. అందరూ కలిసి ఎప్పుడు బడికి వెళ్లేవారు. వాళ్లు చాలా బాగా కలిసి ఉండేవారు. ఒక అమ్మాయి కుటుంబం వేరే ఊరికి వలస వెళ్లింది. ఇక ఐదుగురే మిగిలారు మళ్లీ ఒక అమ్మాయి వాళ్ళ నాన్నకు పని దొరికిందని వాళ్లు కూడా వలస వెళ్లారు. ఇంకో అమ్మాయి చదువుకోవడానికి హాస్టల్ వెళ్ళింది, ముగ్గురే మిగిలారు వాళ్లు చాలా బాధపడుకుంటూ ఉన్నారు అందులో ఒక అమ్మాయి ఇలా అన్నది మన స్నేహితులు అందరూ వెళ్ళిపోయారు అని అన్నది. ఇంకో అమ్మాయి నాకు వాళ్లతోనే ఉండాలని అనిపిస్తుంది అని అన్నది మళ్లీ ఒక అమ్మాయి ఏం చేస్తాం మన రాత ఇలా ఉంది వాళ్ల రాత అలా ఉంది. మనం వాళ్లు విడిపోవాలని ఉంది కావచ్చు.ఇలా ఉండగా ఒకరోజు మార్కెట్ కి వెళ్ళగా అక్కడికి హాస్టల్ కి వెళ్లిన అమ్మాయి వచ్చింది. అప్పుడే ఇంటి దగ్గరే చదువుతున్న అమ్మాయి చూసి ఆమె దగ్గరకు వెళ్ళింది. ఎప్పుడు హాస్టల్ నుంచి వచ్చావు అని అడిగింది. ఆమె నేను మొన్ననే వచ్చాను అని చెప్పింది ఎలా ఉన్నావ్ నువ్వు హాస్టల్ కు ఎందుకు పోయావు. అని అడిగింది. అప్పుడు ఆ అమ్మాయి ఇలా అన్నది మా నాన్న చాలా తాగుతూ అమ్మని కొడుతుండేవాడు. ఇంట్లో సరుకులు తెచ్చేవాడు కాదు. తినడానికి ఏమీ లేవు. చేయడానికి పని లేదు ఇంట్లో పరిస్థితులు బాగా లేవు అందుకే వెళ్ళా అని అన్నది. తర్వాత రోజు ఆ ముగ్గురు బడికి వెళ్లారు ఆ అమ్మాయి జరిగినదంతా మిగతా ఇద్దరితో చెప్పింది అందులో ఒకరు ఇలా అన్నారు పాపం వాళ్ళ నాన్న అలా చేయకపోతే మన దోస్త్ మనతోనే ఉండేది. కొన్ని రోజులు బాగానే ఉంది ఒకరోజు వలస వెళ్లిన అమ్మాయి ఫోన్ చేసింది తాను చాలా ఏడ్చింది. నేను వస్తా ఏడవ తరగతి అయిపోయాక అని అన్నది. అలా కొన్ని రోజులు గడిచాయి అందరిదీ ఏడవ తరగతి పూర్తి అయింది. ఎనిమిదవ తరగతికి మిగతా ముగ్గురు మిత్రులు వచ్చారు అందరూ సంతోషించారు ఆ ఆరుగురు మిత్రులు కలిసిమెలిసి ఉన్నారు.ఎక్కడికి వెళ్లినా అందరూ కలిసి వెళ్లేవారు
మాళవిక
8వ రతగతి
ZPHS REGULAPALLY
M.BEJJANKI
DIST.SIDDIPET
నీతి. స్నేహం ఎంతో మధురమైనది

అనగనగా ఒక ఊరిలో రాజు గౌరమ్మ అనే దంపతులు ఉండేవారు వాళ్లకు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉండేవారు వాళ్ల పేర్లు గోపి అమల సిరి అయితే రాజు ఒక రోజు వేరే ఊరికి పోయి వస్తుండగా యాక్సిడెంట్ లో కాలు విరిగి మంచాన పడ్డాడు అప్పటినుంచి ఆ పిల్లలకు తల్లి అయినా తండ్రి అయినా వాళ్ళ అమ్మ గౌరమ్మనే అలా కొన్ని రోజులు గడిచాయి వాళ్ళ పెద్ద కూతురు అయిన అమలకు చదువుకునే వయస్సు వచ్చింది. కానీ వాళ్ళ నాన్న పరిస్థితి బాగాలేదని వాళ్ళ అమ్మ తనతో చీపుర్లు అమ్మడానికి తీసుకుపోయేది. అలా కొన్ని రోజులు గడిచాయి. సిరికి కూడా చదువుకునే వయస్సు వచ్చింది. కానీ సిరిని కూడా తనతో పాటు చీపుర్లు అమ్మడానికి తీసుకుపోయింది. కానీ సిరికి మాత్రం ఒక్క కోరిక ఉండేది.
ఆమె మంచి చదువులు చదివి డాక్టర్ కావాలని అలా ఇద్దరు కూతుళ్లు వాళ్ళ అమ్మతో చీపురులు అమ్మడానికి వెళ్లేవారు అలా కొన్ని రోజులు గడిచాయి గోపికి చదువుకునే వయసు వచ్చింది .వాళ్ళ అమ్మ గోపిని మాత్రం బడికి పంపించింది. ఒకరోజు గౌరమ్మ ఉదయమే లేచి చీపురు కట్టలు కడుతూ గోపిని బడికి తయారు చేస్తుంది. దాన్ని అమల ఇంకా సిరి గమనిస్తూ ఇలా అన్నారు అక్క మన తమ్ముడిని బడికి పంపిస్తున్నది అమ్మ కానీ మనల్ని మాత్రం చీపుర్లు అమ్మడానికి తనతో పాటు తీసుకుపోతుంది అని అన్నది సిరి అప్పుడు తల్లి గోపి మంచి చదువులు చదివి దేశాన్ని ఉద్ధరిస్తాడు అన్నది గౌరమ్మ కొడుకుని తయారు చేసింది .తల్లి కూతుర్లు తలపైన చీపురు కట్టలు పెట్టి ఊళ్లోకి వెళ్లారు బడి దగ్గరికి వచ్చి కొడుకుని బడిలో దింపి కూతుర్లను చీపురులు అమ్మడానికి తీసుకుపోయింది. ఇక్కడ జరిగిన సంఘటనంతా ఒక దుకాణం దగ్గర కూర్చొని ఉన్న ఒక వ్యక్తి చూశాడు .ఆ వ్యక్తి తన పక్కన ఉన్న వ్యక్తితో ఇలా చెబుతున్నాడు ఆడపిల్లలు చదువుకోవడం తప్పా అని అన్నాడు అప్పుడు ఆయన పక్కన ఉన్న వ్యక్తి ఇలా అన్నాడు ఇప్పుడు ఎవరు ఇలా చేస్తున్నారు ఆడపిల్లలైనా మగ పిల్లలైనా సమానంగా చూస్తున్నారు అని అన్నాడు ఎలాగైనా వాళ్లకి సహాయం చేయాలనుకున్నాడు ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మతో ఇలా అన్నాడు నీ ఇద్దరు కూతుర్లలో ఒక కూతురుని దత్తతకు ఇస్తావా అని అడిగాడు అయితే గౌరమ్మ ముందు వెనక ఆలోచించకుండా చిన్న కూతురైన సిరిని దత్తత ఇచ్చింది దాన్ని చూసి అమల ఎంతో బాధపడ్డది అయితే ఒకరోజు అమల అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ తమ్ముడితో నన్ను బడికి పంపించు అని అడిగింది అప్పుడు గౌరమ్మ ఆడపిల్లవు నీకు చదువు ఎందుకు అని అన్నది పాపం అమలు చాలా ఏడ్చింది అయితే అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు గౌరమ్మ చీపురులు అమ్మడానికి వెళుతున్న సమయంలో అప్పుడే దత్తతకు తీసుకున్న వ్యక్తి వచ్చే నీ కూతురిని నేను ఉన్నత చదువులు చదివించి ఒక మంచి డాక్టర్ని చేశాను అని అన్నాడు అప్పుడు గౌరమ్మ తన మనస్సులో ఇలా అనుకుంది మంచిగా చదువుకొని దేశాన్ని ఉద్ధరిస్తాడు అనుకున్న కొడుకు తాగుబోతుగా మారి ఊర్లో తిరుగుతున్నాడు కదా అని అనుకున్నది తన తప్పును తెలుసుకొని ఎంతో బాధపడింది
నీతి .ఆడ మగ ఇద్దరినీ సమానంగా చూడాలి
యం.సాత్విక
7 వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
రేగులపల్లి.

అబల కాదు సబల

అనగనగా ఒక పల్లెటూర్లో ఒక కుటుంబం ఉండేది సోమయ్య అతని పేరు అతనికి ఒక కొడుకు మరియు ఒక కూతురు.
అతడు కూలీ పని చేస్తూ వాళ్ల కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు.అతడు కొడుకును,కూతురునీ బడికి పంపుతుండేవాడు అతనికి కొడుకు అంటే చాలా ప్రేమ కూతురిని చిన్న చూపు చూసేవాడు ఆమె చాలా బాధపడే ఎప్పుడు తమ కూతురిని తిట్టేవాడు.అన్ని బాధలను ఓర్చుకోలేక ఒక్కోసారి చనిపోవాలని అనుకుందికూతురు. కానీ తన లక్ష్యాన్ని తాను చేరుకోవాలని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని రాత్రింబవళ్లు కష్టపడి చదివేది. అలా కాలం గడిచిందిఆమె పదవ తరగతి కూడా పూర్తి చేసింది.
ఆమె తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంటర్ విద్యను కూడా పూర్తి చేసింది. వాళ్ళ అమ్మ నాన్నలకు తెలియకుండా ఆమె ఆర్మీ కోర్స్ శిక్షణ కోసం హైదరాబాదుకు వెళ్లి అక్కడ ఆర్మీ కోర్సులో శిక్షణ తీసుకుంటుంది కొద్దిరోజుల తర్వాత వాళ్ళ నాన్న ఫోన్ చేసి ఆడపిల్లవు నీకు అటువంటి ఉద్యోగాలు ఎందుకు అనీ,ఆడపిల్లవు ఇంట్లో ఉండి పని చేసుకోక పట్నం వెళ్లి చదవడం ఎందుకు అని అన్నాడు అప్పుడు కూతురు ఆడపిల్ల అంటే వంటింటి కుందేలు కాదని ఆడది అంటే అబల కాదు సబల అని నిరూపించి వాళ్ళ నాన్న కళ్ళు తెరిపించాలని అనుకుంది. అలా ఆమె ఎంతో కష్టపడి ఆర్మీ శిక్షణ పూర్తి చేసుకొని పరీక్షలు రాసి ఆర్మీలో ఉద్యోగం తెచ్చుకొని తన లక్ష్యాన్ని సాధించి ఆడది అబలకాదు సబల అని నిరూపించింది.
అప్పటినుండి వాళ్ళ ఊరి ప్రజలందరూ ఆడపిల్లల్ని చిన్నచూపు చూడకూడదని అనుకొని ఆడపిల్లంటే తక్కువ కాదు మగ పిల్లవాడు ఉంటే ఎక్కువ కాదని తెలుసుకొని అప్పటినుండి ఆడపిల్లల్ని బడికి పంపించడం మరియు ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టారు
నీతి ఆడది అంటే అబల కాదు సబల
యం. జ్యోత్స్న
9.వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

అనగనగా ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉండేది ఆ కుటుంబ పెద్ద పేరు రాంబాబు తన భార్య పేరు లక్ష్మి ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు .ఆ ఇద్దరు కొడుకులను పదవ తరగతి వరకు చదివించారు. అక్కడితో తమ చదువులు ఆపేశారు కూతురిని మాత్రం ఎనిమిదవ తరగతి వరకే చదివించారు. ఒకరోజు కూతురు తన తండ్రి వద్దకు వెళ్లి నేను చదువుకుంటా అని అడిగింది అయితే వాళ్ల నాన్న నువ్వు ఆడపిల్లవి నీకు చదివు ఎందుకు వద్దు చదవడం ఆపేసి ఇంటి పని చేయు అని తిట్టాడు. అప్పుడు ఆమె అనుకుంది అందరూ చదువుకుంటున్నారు నేనే ఎందుకు చదువుకోడం లేదు అని. ఇలా బాధపడితే ఏం వస్తది.మంచిగా చదువుకొని వాళ్ళ నాన్న ఆలోచనలో మార్పు తీసుకు రావాలనుకుంది. అప్పటినుండి ఆమె ప్రొద్దున్నే ఇంటి పనులు చేసి తర్వాత పాఠశాలకు వెళ్లి ఆ తర్వాత వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ ఇంట్లో పనులు చేస్తూ ఎంతో కష్టపడి తన కష్టార్జితంతో చదువుకుంది. ఆమె పదవ తరగతి పూర్తి చేసింది. మంచి మార్కులతో పాసయ్యింది పరీక్షలు అయిపోయాక సెలవుల్లో బట్టలు కుట్టడం నేర్చుకుంది ఆమె కష్టపడి దాచుకున్న పైసలతో బట్టల మిషన్ కొనుక్కుంది అలా కాలం గడుస్తుండగా ఆమె చాలా డబ్బులు సంపాదించింది తర్వాత తన పోలీసు లక్ష్యం పైన పట్టుదలతో ఉన్నది. ఆమె తన లక్ష్యం చేరుకోవడానికి వేరే గ్రామం వెళ్లి అక్కడ చదువుకోవాలని అనుకుంది. ఇంట్లో చెబితే అమ్మానాన్నలు ఒప్పుకోరని ఆమె ఇంట్లో చెప్పకుండా వేరే ప్రాంతానికి వెళ్లి అక్కడ కష్టపడి పని చేస్తూ పోలీస్ శిక్షణ తీసుకుంది. ఒకరోజు వాళ్ళ అమ్మానాన్నలు ఈమె గురించి తెలుసుకొని ఆమెకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని అడిగారు ఆమె ఇంటికి వెళ్తే తన ఆశయం కోల్పోతాను కావచ్చు అని అనుకొని అక్కడే ఉండి పోలీస్ శిక్షణ తీసుకుంది. ఇంటికి వెళ్లలేదు కొన్ని రోజుల తర్వాత ఆమె పోలీస్ శిక్షణ పూర్తి పూర్తి చేసింది ఆ తర్వాత పోలీస్ ఉద్యోగానికి సంబంధించిన పరీక్షలు రాసేటప్పుడు ఎలాగైనా బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించి మా అమ్మానాన్నల కళ్ళు తెరిపించాలని అనుకుంది. అనుకున్నట్టుగానే మంచి మార్కులు సాధించి పోలీస్ ఉద్యోగాన్ని సంపాదించి ఉద్యోగంతో వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అప్పుడు వాళ్ళ అమ్మానాన్న బయటకు వచ్చి ఆశ్చర్యంగా చూశారు. తమ కూతురు. ఆమె తన టోపీ తీసి వాళ్ల నాన్న తలపై పెట్టింది వాళ్ళ నాన్న కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి ఆమె వాళ్ళ అమ్మానాన్నలతో ఇలా అన్నది అమ్మ నాన్న ఆడదంటే అబల కాదు సబల అని చెప్పి వాళ్ళ అమ్మానాన్నలకు కళ్ళు తెరిపించింది ఆమె చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ఇటు తన కోరిక నెరవేరినందుకు అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించినందుకు ఇలా అప్పటినుండి అందరూ తమ కొడుకుల్ని ఒకలా తమ కూతురిని ఒకలా చూడడం కాకుండా ఇద్దరినీ సమానంగా చూసే చూశారు.
యం.రోషిణీ
9.వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
గ్రా.రేగులపల్లి

అనగనగా ఒక ఊరిలో రాము ఇంకా సోము అనే స్నేహితులు ఉండేవారు. రాము వాళ్ళ కుటుంబం చాలా పేద కుటుంబం కానీ సోము వాళ్ళు చాలా ధనవంతులు సోము బడికి వాళ్ళ నాన్న కారులో వెళ్లేవాడు .అదిచూసి బడి దగ్గర ఉన్న పిల్లలకు చాలా ఆశ్చర్యం వేసేది. రాము కాలినడకన బడికి వెళ్లేవాడు బడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత చాలా చక్కగా చదువుకునేవాడు కానీ సోము ఇంటికి వచ్చిన తర్వాత బ్యాగ్ తీసి ఫోన్ తీసుకొని వీడియో గేమ్స్ ఆడేవాడు. బడిలో వారి టీచర్ ఇచ్చిన హోంవర్క్ ను చేసేవాడు కాదు. రాము వాళ్ళ నాన్న పనిచేస్తుంటే సహాయం చేసేవాడు. ఒకరోజు రాము వాళ్ళ టీచర్ పిలిచి రాము ఇంకో రెండు రోజుల్లో స్కూల్ ఫీజు కట్టకపోతే నిన్ను బడికి రానివ్వను అని అంటుంది. వాళ్ల టీచర్ బడిలో జరిగిన సంగతంతా వాళ్ళ నాన్నతో చెప్పాడు. వాళ్ళ నాన్న ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకొని వచ్చి రాము స్కూల్ ఫీజు కట్టాడు. కానీ ఆ వ్యక్తి నాకు మూడు నెలల తర్వాత అప్పు వడ్డీతో సహా ఇవ్వాలి అని చెప్పాడు. తర్వాత ఒకరోజు సోము వాళ్ళ నాన్న ఒక పని మీద వేరే ఊరికి పోవలసి వచ్చింది అయితే సోము రాముతో బడి నుండి ఇంటికి వస్తున్న సమయంలో రాము ఇలా అన్నాడు సోము ఈరోజు మీ నాన్న ఎటు వెళ్ళాడు అని మా నాన్న ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్ళాడు అని చెప్పాడు సోము. అంతలో రాము వాళ్ళ ఇల్లు రాగానే ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్లేసరికి ఇంటి ముందు అప్పు ఇచ్చిన వ్యక్తి వచ్చి గొడవ చేస్తున్నాడు. అయితే రాముకి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు రాము మనస్సులో ఒక ఆలోచన వచ్చింది ఒక పది రోజులు బడికి వెళ్లకుండా వాళ్ళ అమ్మానాన్నలతో వ్యవసాయ పనులకు వెళ్లాలి అనుకున్నాడు ప్రతిరోజు పనులకు వెళ్లేవాడు ఆ తరువాత ఆ అప్పును తీర్చాడు. తీర్చిన మరుసటి రోజు నుంచి రామ బడికి వెళ్ళాడు అప్పుడు సోము వాళ్ళ నాన్న ఊరి నుంచి ఇంకా తిరిగి రాలేదు అయితే సోము రాముతో ఇలా అన్నాడు రాము మా నాన్న బెట్టింగ్ యాప్ లో మా కారు ఇంకా ఇల్లు తాకట్టు పెట్టాడు. ఇంకా చాలా డబ్బు పెట్టి ఎంతో నష్టపోయాడు అని చెప్పాడు ఆ మాటల విన్న రాము సోము నీకు ఒక మంచి మాట చెబుతాను విను ఇది మా నాన్న చెప్పిన మాట వేగంగా వచ్చే బండి వేగంగా వచ్చే డబ్బులు ఎప్పుడో ఒకప్పుడు అవి మనని కింద పడేస్తాయి. అని అన్నాడు అలా రోజులు కొద్ది రోజులు గడిచాయి సోము వాళ్ళ నాన్నకు బెట్టింగ్ యాప్ లో చాలా నష్టం వచ్చి ఆర్థికంగా చాలా దెబ్బ తిన్నాడు. డబ్బులు అన్ని పోయాయి. అలా ఆ కుటుంబం కష్టాల పాలయింది. కానీ రాము వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా ఉంది
నీతి.దరాశ దుఃఖానికి కారణం
యం.సాత్విక
8 వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
రేగులపల్లి

అనగనగా భైరవాపురం అనే గ్రామంలో నరసయ్య అనే రైతు ఉండేవాడు అతని భార్య లచ్చవ్వ చాలా పిసినారిది ఆ దంపతులకు ఒక కొడుకు ఇద్దరు కూతుళ్లు అలా పెద్ద కూతుర్ని అమ్మ చదువుకోనివ్వలేదు చిన్న వయసులోనే పెళ్లి చేసింది వాళ్ల కొడుకుని మాత్రం చదివిస్తుంది వాళ్ల చిన్న కూతురికి కూడా పెళ్లి చేయాలని చూస్తుంది కానీ ఆమె వాళ్ళ నాన్న సాయంతో చదువుకుంది ఆమె అలా చదువుకుంటుండగా వాళ్ళమ్మ తనతో ఇలా అంది నీకు కూడా పెళ్లి చేస్తే మా భారం మొత్తం దిగిపోతుంది అని అంటుంది అప్పుడు ఆమె ఇలా అంటుంది అమ్మ నువ్వు అక్కకు చదువుకోకుండానే పెళ్లి చేశావు కానీ నేను ఇంత తొందరగా పెళ్లి చేసుకోను అంటుంది వాళ్ళ అమ్మ అంతా విని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవు అని తిడుతుంది. అప్పుడు ఆమె అమ్మ నువ్వు కూడా ఆడదానివే కదా ఎందుకు పెళ్లి అని విసిగిస్తావు అని అంటుంది అలా కొడుకు 10వ తరగతి పూర్తి చేస్తాడు కూతురు కూడా పట్టుదలతో చదివి పదవ తరగతి పూర్తి చేస్తుంది పదవ తరగతిలో కూతురికే ఎక్కువ మార్కులు వస్తాయి ఇంకా ఉన్నత చదువులు చదువుతా అంటే వినకుండా వాళ్ళమ్మ పెళ్లి చేస్తుంది వివాహం అయిన తర్వాత ఆమె తన భర్తను తాను చదువుకుంటానని ఎంతో ప్రాధేయపడుతుంది దానికి అతడు సరే నువ్వు ఎంత చదువుకుంటే అంత చదువుకో అని అంటాడు కానీ అత్తింటి వారు ఒప్పుకోరు కానీ భర్త అవేవీ పట్టించుకోకుండా వేరే ఊరికి తీసుకెళ్లి చదివిస్తాడు ఆమె బాగా చదివి పేజీ చేసి టీచర్ ఉద్యోగం కోసం ట్రై చేస్తుంది కానీ వాళ్ళ అన్న మాత్రం పదవ తరగతి పూర్తికాగానే చదువు మానేసి ఏ పని లేకుండా జులాయిగా తిరుగుతూ ఉంటాడు కానీ ఆమెకు మాత్రం ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చాక తల్లి దగ్గరికి వెళ్లి అమ్మ నువ్వు నన్ను ఇక్కడ చదువుకోనివ్వలేదు కానీ నేను నా భర్త ప్రోత్సాహంతో చదివి ఎప్పుడూ ఉద్యోగం చేస్తున్నాను అని అంటుంది అప్పుడు తన తల్లి తప్పును తెలుసుకొని ఎంతో బాధపడుతుంది కన్న కొడుకు మాత్రం ఉద్యోగం లేక ఖాళీగా తిరుగుతూ ఉంటాడు అందుకే కూతురు ఇలా అంటుంది ఇప్పటికైనా ఆడపిల్లలని చిన్నచూపు చూడకుండా బాగా చదివించాలని తల్లితో చెబుతుంది.

యం.హాసిని
8 వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
రేగులపల్లి

గంజాయి మత్తులో జీవితాలు చిత్తు
అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే మధ్యతరగతి కుటుంబం జీవిస్తూ ఉండేది. అతనికి ఒక కొడుకు ఒక కూతురు అతడు వ్యవసాయదారుడు. వ్యవసాయ పనులు చేస్తూ మొదట్లో కుటుంబంతో హాయిగా జీవినం గడిపేవాడు. కానీ ఒకరోజు స్నేహితులతో బయటకు వెళ్ళాడు వారు అతనికి గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు చేశారు దాంతో రామయ్య గంజాయి కి అలవాటు పడ్డాడు. తండ్రిని చూసి చదువుకోవాల్సిన కొడుకు కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. నాన్నను అన్నను చూసి చెల్లి చాలా బాధపడింది. తను వాళ్ళ నాన్నను అన్నను మార్చాలని అనుకొని బాగా చదివి ఏ కలెక్టర్ పోలీసో కావాలని అనుకుంది. వాళ్ళ అమ్మ కూలీకి వెళ్లి ఎండలో కష్టపడి కూతురిని చదివించింది. తను ఏమీ తినకుండా చాలా కష్టపడి వీళ్ళకు మాత్రం తిండి పెట్టేది. నాన్న కొడుకు ఇద్దరూ కలిసి మాదక ద్రవ్యాలకు పూర్తిగా బానిస అయ్యారు. వాళ్ల చెల్లి మాత్రం తాను కలెక్టర్ అయ్యి వాళ్ల నాన్న లాంటి మాదక ద్రవ్యాలకు బానిస అయిన ఎందరినో మార్చాలని నిర్ణయించుకుంది.అనుకున్నట్టుగానే బాగా కష్టపడి చదివి కలెక్టర్ అయింది. ఇలాంటి వాళ్ళ పరిస్థితిని వివరిస్తూ ప్రభుత్వానికి లేఖ రాసింది. అలాగే ఆలేఖను చుట్టుపక్క గ్రామాల్లోకి కూడా పంపించింది .శ్వాస సమస్యలు,ఊపిరితిత్తుల సమస్యలు,ఆకలి.మందగించడం,తలనొప్పి.మైకము మొదలైనటువంటి హానికారక ప్రభావాలపై మాదక ద్రవ్యాల వాడకం ఒక కరపత్రం రూపొందించి, అన్ని ఊర్లలో పంచింది. మత్తు పదార్థాల అమ్మకాలను నిషేధించాలనీ ప్రభుత్వానికి లేఖ రాసింది ప్రజల్లో వవిధ సామాజికమాధ్యమాల ద్వారా అవగాహన కల్పించింది. ఇలాంటి అనేక ప్రయత్నాల వలన తాను అనుకున్నట్టుగానే వాళ్ళ నాన్న అన్న మత్తు పదార్థాలు సేవించడం మాని మేలుకొని ఎప్పటిలాగే వ్యవసాయం చేస్తూ హాయిగా బ్రతికేలా చేయగలిగింది.వాళ్ల చెల్లి అనుకున్నట్టుగానే మాదక ద్రవ్యాల అమ్మకాన్ని నిషేధించింది. నిషేధించడంతోపాటు వాళ్ళ నాన్న అన్న లాగా ఇతర గ్రామాలలో ఇలాంటి మాదక ద్రవ్యాలకు బానిస అయిన వారిలో మార్పు తెచ్చింది.ఊరూరా మాదక ద్రవ్యాల వాడకం వలన కలిగే సమస్యల పోస్టర్లు అతికించి అవగాహన కల్పించి వారు వారి పనులు చేసుకుంటూ కుటుంబంతో సంతోషంగా ఆరోగ్యంగా జీవించేటట్లు చేసింది.
నినాదాలు
మాదక ద్రవ్యాలను మానేద్దాం మోదము గా జీవిద్దాం

మాదక ద్రవ్యాలను మానండి ఆరోగ్యాలను కాపాడుకోండి

మాదక ద్రవ్యాల కు నో చెబుదాం రోగాలను తరిమికొడదాం
నీతి
మత్తు పదార్థాలు జీవితాలను చిత్తు చేస్తాయి.
యం.జ్యోత్స్న
9వ

ఉపకారం
అనగనగా ఒక ఊరిలో అంజయ్య అనే అతను ఉండేవాడు. అతడు కట్టెలు కొడుతూ జీవనం సాగిస్తుండేవాడు. అతడు రోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని పట్నం తీసుకువెళ్లి అమ్మేవాడు .అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు కట్టెలు కొట్టే దగ్గరలో ఒక బావి ఉంది అందులో గొర్రె మరియు ఆవు పడ్డాయి. ఆవు మరియు గొర్రె బాగా అరుస్తున్నాయి. అతడు తన పని తాను చేస్తుండగా అరుపులు వినిపించాయి. కానీ ఆ అరుపులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. అతడు చాలా భయపడ్డాడు. అతనికి చాలా దాహం వేసి నీళ్లు తాగడానికి బావి వద్దకు వెళ్లాడు ఆ అరుపులు ఆ బావిలో నుండి వస్తున్నాయని అతనికి అప్పటి వరకు ఏమాత్రం తెలియదు. అతడు బావిలోకి తొంగి చూశాడు. ఆవు మరియు గొర్రె బావిలో పడి ఉన్నాయి. వాటిని ఎలాగైనా కాపాడాలని అనుకున్నాడు. వెంటనే అతడు తను కట్టెలను తీసుకువెళ్లడానికి తెచ్చిన తాడును బావిలోకి వేసి వాటిని కాపాడాలనే ఉపాయం వచ్చింది. వెంటనే తాడును బావిలోకి వేసి ఆవు మరియు గొర్రెలను కాపాడాడు .అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఎప్పటి లాగానే కట్టెలు కొట్టడానికి అడవిలోకి వెళ్లాడు. కట్టెలు కొడుతూ ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయాడు .అప్పుడే అక్కడికి గొర్రె వచ్చింది కానీ గతంలో తనకు చేసిన సహాయాన్ని మరిచిపోయి అహంకారంతో అతనికి సహాయం చేయకుండా వెళ్ళిపోయింది. మరికొద్ది సేపటికి అక్కడికి ఆవు వచ్చింది. అతనికి దగ్గరగా వెళ్లి ఎవరా అని చూసింది అతడు తనను గతంలో ఆపద నుండి రక్షించిన అంజయ్యని గుర్తించింది. పక్కనే ఉన్న వాగు దగ్గరికి వెళ్లి నోటితో నీళ్లను తీసుకొని వచ్చి అతని మొఖం పైన చల్లింది .అప్పుడు అతనికి మెలకువ వచ్చింది.ఎదురుగా ఉన్న ఆవును చూశాడు.ఎంతో సంతోషించాడు. ఆవును తన వెంట తీసుకువెళ్లి ప్రేమగా పెంచుకున్నాడు.
నీతి
మనకు మేలు చేసిన వారిని ఎప్పటికీ మరిచిపోకూడదు

యం .జ్యోత్స్న
9వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
రేగులపల్లి

You may also like

Leave a Comment