చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో తరుణ్ అనే ఒక మనిషి ఉండెను. అతను ఒక వ్యాపారి, ఎక్కువ ధనికుడు కానప్పటికి అతను చాలా సుఖంగా జీవించాడు. అతనిది పెద్ద కుటుంబం, సోదరులు, సోదరీమణులు, భార్య మరియు పిల్లలు. అతను వారిని మంచిగా చూసుకున్నాడు. మరియు గ్రామంలోని బీదలకు కూడా చేతనయినంత సహాయం చేసేవాడు. అతను బాటసారుల కొరకు విశ్రాంతి ఇండ్లు కట్టించాడు, మరియు వాటిలో భోజన శాలలు ఉండెను. వాటిలో ఎవరైన వచ్చి మంచి భోజనం చాలా కొద్ది డబ్బుకే తినే వీలుండెను.
ఒకనాడు తన పని నుండి తిరిగి ఇంటికి వస్తున్నపుడు ఒకతను దారిలో ఒక విశ్రాంతి ఇల్లు చూచాడు. దానిలో ఒక వరండా ఉండెను, దానిలో మనుషులు ఆగి విశ్రాంతి తీసుకునేవారు. అక్కడ కూర్చొని, బాగా అలసి పోయినట్లు కల్పించి ఆకలిగా ఉన్న ఒక కొత్తతను ఉండెను. అతను పొడుగాటి మనిషి అతని దుస్తులు ప్రయాణం వలన మాసిపోయినట్లు మరియు అతను చాలా దూరం నుండి వస్తున్నట్లు కనిపించాయి. ఆయన వెంట ఒక గుఱ్ఱం ఉండెను. అది కూడా తన యజమానివలె అలసిపోయి ఆకలిగా కన్పించింది.
వారిని చూడటంతో తరుణ్ హృదయం ధ్రవించిపోయెను, మరియు అతను వారితో మాట్లాడుటకు ముందుకుపోయెను.
ఓ నా సోదరా, నీవు ఎక్కడి నుండి వచ్చావు? అతను అడిగాడు. వేడి భోజనం మరియు కొంత విశ్రాంతి కొరకు లోనికి ఎందుకు రావు?
ఆ మనిషి తనవైపు చూస్తూ చిరునవ్వుతో తిన్నాడు, ఆ విశ్రాంతి ఇల్లు చాలా పేరు గాంచినది. దాంట్లో నాకు రూమ్ లేదు, మరియు భోజనశాల నిండుగా ఉంది. నేను ఇక్కడ కొద్దిసేపు ఎదిరి చూస్తాను. అప్పుడు నేను బయలుదేరుతాను. నాకు రోజు చివరిలో తప్పక భోజనం దొరికే స్థలం దొరుకుతుంది.
తరుణ్ ఆ మాట పట్టించుకోలేదు. ఒకతను అక్కడ భోజనం చేయక, విశ్రాంతి తీసుకోక వెళ్ళిపోవటం అతని మనసుకు బాధేసింది. అతను ఆ బాటసారిని బలవంతపెట్టి తన ఇంటికి తీసుకుపోయాడు. అక్కడ తన కుటుంబంతోపాటు బాటసారిని భోజనానికి ఆహ్వానించాడు. ఆ మనిషికి ప్రేమతో వడ్డించారు, అతను కడుపునిండా భోం చేశారు.
అతను భోజనం చేస్తున్నపుడు తరుణ్ మతిమరుపు మనిషని గ్రహించాడు. అతని మనసులో ఏదో వుండి ఆరాటపడుతుండెను. వారి భోజనం అయిన తరువాత చేతులు కడుగుకని బాటసారి బయలుదేరుటకు లేచాడు. అతను తరుణ్ దయాగుణం కొరకు కృతజ్ఞతలు చెప్పాడు. మరియు అన్నాడు, నేను ఒకటి అడుగుతున్నందుకు ఏమనుకోకండి, మీరు భోజనం చేస్తున్నపుడు ఏదో విచారిస్తున్నట్లు నేను గమనించాను. నాకు తెలుసు, నేను మీకు కొత్తవాడినని, అనుకోకుండా నాతో ఆ సమస్య చెబితే మీ బాధలు కొంతవరకు తగ్గిపోవచ్చు.
కాని తరుణ్ కేవలం ఒక నవ్వు నవ్వాడు మరియు తన తల ఊపాడు.
అప్పుడు ఆ మనిషి అన్నాడు, బహుషా నేను ఎవరినో తెలుపుతే నీ రహస్యాలు నాతో చెప్పుతారు?
మరియు కొన్ని క్షణాల్లోనే అతను మారిపోయాడు. అతను ఇక ముందు అలసిపోయిన బాటసారి కాదు, కాని ఓ దేవుడు, మెరుస్తున్న ప్రకాశవంతమైన దుస్తుల్లో తలపై ఒక కిరీటంతో ఉన్నారు. అతని గుఱ్ఱం దున్నపోతుగా మారింది, మరియు ఆ మనిషి తన పరిచయం చేశాడు, నేను యముడను, మరణాలకు యజమానిని. నీ సమస్య ఏంటో ఇప్పుడు చెప్పగలవా?
ఇది చూసి తరుణ్ దాదాపు మూర్ఛిల్లింది. కొద్దిసేపటికిందనే యముడు అతనితో భోజనం చేశాడు! మి మి మీరు భూమిమీద ఏం చేస్తున్నారు రాజా? తనని రొప్పుతూ అడిగాడు, తడబడుతూ.
యముడు నవ్వాడు మరియు అన్నాడు, ఓహ్ నేను ఎప్పుడో ఒకప్పుడు రావటందుకు ఇష్టపడుతాను, మరియు ప్రతివారు ఏం చేస్తుంటారో చూస్తాను. అందువలన నీకేం బాధ?
తరుణ్ జవాబు ఇచ్చాడు. “మీరు చూడండి, నా వ్యాపారాన్ని పెంచదలచాను, కాని ఈ రోజు నాకు ఆరోగ్యం బాగాలేదు. ఒకవేళ నాకు ఏమన్నవుతె ఎవరు నా పెద్ద కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు?
యముడు తీవ్రంగా తల ఊపాడు. విచారించకు అబ్బాయి’ అని ఓదార్చాడు.
“నీవు చాలా కష్టబోతువు. మరియు దయగల వాడవుగా నిన్ను నేను చూశాను. నీవు నన్ను ఆహ్వానించావు మరియు నీతో భోజనం చేయించావు. కేవలం నన్ను ఒక అలసట చెందిన బాటసరని, నేను ఒకటి చేస్తాను. నీవు భూమి వదలి, అందరివలె ఒకనాడు నాతో వచ్చే సమయాన, నేను హఠాత్తుగా రాను. నేను నీకు ఎన్నో రోజుల ముందు తెలుపుతాను. దాన్నిబట్టి నీవు నాతో వచ్చేముందు వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోగలవు!
తరుణ్ అది విని కృతజ్ఞతా పూర్వకంగా తలవంచాడు, యముడు మాయ మయినాడు.
సంవత్సరాలు గడిచాయి. తరుణ్ ఒక ముసలతను అయినాడు. అతని వ్యాపారం చాలా వృద్ధి చెందింది. అతని పిల్లలు, సోదరులు, సోదరీమణులు (అన్నా తమ్ములు, అక్కా చెల్లెండ్రు) అందరు హాయిగా వున్నారు దేవుని దయవలన. అతనికి ఏ విధమైన చింతలు మిగిలి లేకుండెను.
ఒక రాత్రి అతను నిద్రపోయాడు. నిద్రలో ఓ కలగన్నాడు. అతని ముందు యముడు నిలబడియున్నాడు. యముడు తనవైపు చేయి చూపుతూ సమయం ఆసన్నమైంది, నీవు నాతో వచ్చేందుకు రా, అన్నాడు.
తరుణ్ భయపడిపోయాడు. కాని రాజా, నీవు నా చావుకు కొన్ని రోజులముందు తెలుపుతానని వాగ్దానం చేసియుంటివి గదా! నేను ఇప్పుడే ఎట్లు రాగలవా అకస్మాత్తుగా?
యముని పెదాలమీద చిరునవ్వు కనిపించింది. కాని అబ్బాయి, నేను నీకు హెచ్చరికలు ఇచ్చాను. నేను నీ వెంట్రుకలను తెలుపుగా మార్చాను. నీ వయసును ఒట్టి నీ వెన్నెముక వంగేట్లు చేశాను, నీ పండ్లు ఒకటి తరువాత ఒకటి ఊడిపోయేట్లు చేశాను. వీపు భూమి మీద వుండేకాలం దగ్గర బడుతుందనే సూచన్లు ఇవ్వన్ని.
ఒద్దిరాజు మురళీధరంరావు
అనగాఅనగా చాలా కాలం క్రితం ఒక రాజు వద్ద ఒక అందమైన రామచిలుక ఉండెను. ఆ రామచిలుక తెలివైనది మరియు రాజుతో మాటా్లడుతుఁడేది. రాజుకు ఏదైన తోచనపుడు రామచిలుకను అడిగేవాడు. రామచిలుక తోలూ అని పిలువబడేది. రాజు దరా్బరుకు పోయే ముఁదు ఆ రోజు ఏ విషయం ఎట్లు చేయాలో అడిగేవాడు.
ఒకరోజు తోలూ దర్బారులో కూర్చుంటుండెను. రాజభవన తోటలో ఒకచెటు్టపై రామచిలుకల మంద కనబడెను. తోలూ రాజువైపు లుంగి అనెను. మహారాజా అవి మా జాతివి. నేను పుట్టి పెరిగిన చోటుకు నన్ను ఆహ్వానించేందుకు వచ్చాయి. దయతో నాకు ఒకరోజు శెలవు ఇవ్వండి. నేను నా జన్మభూమికి వెళ్ళి మా తల్లిదండ్రులను మరియు బంధువులను చూచి రాగలను.
“రాజుకు ఆశ్చర్యం అయింది మరియు అతను విచారంలో పడినాడు” తోలూ, నీవు ఒకవేళ అక్కడికి పోతె కొన్ని రోజులు నాకు దినదినం ఎవరు సలహాలు ఇస్తారు, మరియు సహాయపడుతుంటారు. నీవు దూరాన వున్న నీ పుట్టిన స్థలం నుండి త్వరగా రాగలవని ఎట్లు నమ్మగలను అని వాదించాడు.
“రాజా! నేను నమ్మదగిన దానినని నీకు తెలుసు. నేను నా మాట నిలబెట్టుకుంటాను. నేను త్వరగా రాగలనని వాగ్దానం చేయగలను. నేను ఆలస్యం చేయను. నేను తిరిగి వచ్చేపుడు ఒక విచిత్రమైన పండు తేగలను. ఆ పండు సామాన్యమైన పండు కాదు. ఎవరు దాన్ని తిన్నా వారికి మరణం ఉండదు. వారు సజీవుగా ఉంటారు” తోత అన్నది.
రాజు ఆ పండు తిని చిరంజీవిగా ఉండగలనని తోతా వెళ్ళుటకు అంగీకరించాడు.
తోతా తన స్నేహితులతో ఎగిరిపోయింది. తోతా తండ్రి అక్కడి పక్షులన్నిటికి రాజు. అతను మరియు అతని భార్య కొడుకును చూచి చాలా సంతోషించారు.
అతను గొప్ప విందు ఏర్పాటు చేశాడు. తోతాకు మంచి డిన్నరు దొరికింది. తోతా తన జన్మభూమిలో వారం రోజులు ఉన్నాడు. అప్పుడు అతను తన రాజును జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు అతను తన తండ్రితో తను తిరిగి రాజు వద్దకు పోవాలని, రాజు తను వస్తాడని ఎదురు చూస్తుంటాడు. “నా ప్రియమైన కొడుకా, నీవు నీ ఆఫీసుకు నమ్మినవాడివని తెలుసు. దయతో వెళ్ళు. మీ రాజును మరి కొన్ని రోజులు సెలవు అడుగు మరియు మరొకసారి మా వద్దకు రా.
“సరె నాన్నా, నేను అట్లే చేస్తా. ఇప్పుడు నీవు నాకు ఒక సహాయం చేయాలి. నేను రాజుకు సజీవంగా ఉండేందుకు ఒక ఫలము తెస్తావన్నాను, మన దేశంలో పండేది.
ఆ పక్షుల రాజు అట్టి విచిత్రమైన ఫలము తోటాకు ఇచ్చినాడు.
ఆ రామచిలుక తను పనిచేసే స్థలానికి తిరిగి వెళ్ళింది మరియు తన యజమానిని కలిసింది.
“ఓహ్! తప్పక! దాన్ని తిన్నవారికి మరణం రాదు, ఎన్నటికి. నా రాజా! మీరు దయతో దీన్ని గ్రహించండి” ఆ రామచిలుక అంది.
అక్కడి మంత్రులు మరియు కౌన్సిలర్లు పండును చూసి ఎల్లపుడు జీవించి ఉండేందుకు దాన్ని తినాలనుకున్నారు.
ఈ మధ్యలో రాజు స్వయంగా అన్నాడు, తోతా ఈ విలువైన పండును వృధా చేయవద్దు. మనం దీన్ని వాడుదాము. దాని నుండి వచ్చే చెట్టుకు ఎక్కువ ఫలాలు వస్తాయి. దానివలన ఎక్కువ ప్రజలకు లాభం కలుగుతుంది”.
రాజు తోట మాలిని పిలిచి ఆ ఫలాని్న నాటి వచ్చే మొక్కను జాగ్రతగా చూడు.
ఆ తోటమాలి ఆ ఫలాన్ని నాటాడు, దాని నుండి మొలకపెరగటం మొదలయింది. కొంతకాలం తరువాత ఆ చెట్టుకు ఫలాలు రావడం మొదలయింది. ఏ ఫలాన్ని తెంపలేదు. ఒకరోజు ఓ ఫలం కింద పడింది. దానిపై నుండి పాము పోయింది. దాన్ని ఆ పాము నాకింది కాబట్టి అది విషతుల్యమైంది. తోటమాలికి ఏమి జరిగింది తెలియదు. దాన్ని మామూలుగా తీసి బుట్టలో పెట్టాడు. తరువాత దాన్ని రాజుగారికి ఇచ్చాడు.
మొదటి ఫలాన్ని చూసి రాజు సంతోషించాడు. అతను తోతాను మరియు ప్రధానమంత్రిని పిలిచాడు. వారు వచ్చారు.
“ఇది మొదటి ఫలము. నన్ను తిననీయండి” రాజు అన్నాడు.
ప్రధానమంత్రి మధ్యలో మాట్లాడాడు. “మహారాజా! దాన్ని తినకండి. సామాన్యంగా మొదటి ఫలాన్ని దేవునికి అర్పిస్తారు”. రాజు అంగీకరించి దాన్ని గుడికి పంపించాడు. పూజార్లు దాన్ని మధ్యకు కోసి రెండు ముక్కలు చేశారు. ఒక ముక్కను దేవునికి అర్పించారు. మిగతా భాగాన్ని వారు తిన్నారు. వారు గాఢ నిద్రలోకి జారుకున్నారు. వాస్తవముగా వారు ఎప్పుడు తెలివిలోకి రాలేదు.
రాజుగారికి సమాచారము అందించారు. రాజు చాలా విచారపడి తన మంత్రంతో విచారించారు. ఆ శాశ్వత జీవాన్నిచ్చే పండు తిని వారు మరణించవచ్చు అన్నాడు మంత్రి. వెంటనే రాజు తోతాని పిలిపించాడు. మరియు అడిగాడు. “తోతా, ఇదా నేను నీతో ఆశించినది? నీవు ఎవరి కోసం ఆ పండును తెచ్చావు?”
తోతా అన్నాడు, “ఎందుకు సార్? మీ కోసమే దాన్ని తెచ్చాను”.
“నన్ను చంపుటకు గదా? మిమ్ములందరిని ఇన్నాళ్ళు రక్షించాను. నిన్ను ఉచ్చ స్థితిలో ఉంచాను. దాని కోసం బదులు నాకు మరణ నోటీసు తెచ్చావు”.
అట్లు అని కత్తితో చిలుకను నరికేసాడు.
ఆ చెట్టు చుట్టు కంప పాతియ్యమని ఆజ్ఞ ఇచ్చాడు, మరియు పట్నవాసులను అటువైపు వెళ్ళవద్దని ప్రకటించాడు.
ఒకరోజు ఒక చాకలతను జీవితంతో విసిగి ఆ పండు తిన మరణించాలని నిశ్చయించారు. అతని భార్య కొడుకు అతనితో కొట్లాడుతుండేది. ఓ రాత్రి ఆ పండును దొంగిలించి తినేశాడు. తన భార్య, కొడుకుకు గూడా ఇచ్చాడు, వారు కూడా మరణించాలని.
కానీ వారి ఆశ్చర్యానికి వారందరు యువకులైనారు. ఆ ముసలి చాకలి తను చాలావరకు వయసులో ఉన్నట్లు గ్రహించారు. ఆ వార్త అగ్నిలాగా నీటిలో వ్యాపించింది. రాజుకు కూడా వార్త అందింది. అతను తోటమాలిని పిలిపించి మొదటి పండు ఎక్కడి నుండి తెచ్చావని అడిగాడు. తోటమాలి ఆ పండును చెట్టుపై నుండి తెంపలేదు. భూమి మీద పడియున్న పండును తెచ్చాను.
అప్పుడు రాజు ఆ పండు పాము వలన విషతుల్యమైనదని గ్రహించాడు.
రాజు రంథి పడినాడు. అతను తన ప్రియమైన తోతా మరణం గురించి జాలిపడినాడు.
“నా తోతా, ఎంత బుద్ధిహీన పనిచేశాను? నీవు నాకు చాలా మంచి మిత్రుడివి. నేను నిన్ను నమ్మలేదు. నీవు నన్ను క్లిష్ట పరిస్థితులలో రక్షించావు. కాని నేను సరీగ విచారించకుండా నిన్ను చంపేశాను. నేను నిన్ను మరల ఎక్కడ చూడగలుగుతా?” ఆ రాజు చాలా దుఃఖించాడు. అతను గుండె బలిగినాడు.
అప్పటి నుండి అతను ఒక శాసనం తీశాడు. ఆ శాసనం “పాలకులు ఎవరిని కూడా బాగా విచారించకుండా శిక్షించవద్దు. దూషుడు అని నిర్ణయమైన తరువాతే శిక్షించాలి”.
మూలం : Bed time stories the wise Parrot
గీతా, ఎక్కడున్నవు? నా మెడిసిన్ కొరకు నువ్వు మెడికలం షాపుకు త్వరగా వెళ్ళి రావాలి, రా, నా దగ్గరికి, అని గీత తాతగారు గీతను పిలిచాడు. గీత ఎక్కడ ఉండింది? ఆమె ఓ పుస్తకం చదువుతూ బెడ్లో ఉండెను. చాలాసేపు వరకు ఆమె ఏమి విననట్టు నటించింది. ఆ పుస్తకం చాలా ఉద్రేకపరిచేట్టు ఉండెను. దీనికి తోడు బయట చాలా వేడిగా నుండెను, అందుకు ఆమె బెడ్ నుండి కదలదలచుకోలేదు.
గీతా! ఈసారి తన తల్లి మాట కూడా వినవచ్చింది రమ్మన్నట్లు. అమ్మాయి ఒక నిట్టూర్పు తీసి బెడ్ నుండి బయటికి వచ్చి ఏం కావలెనో తెలుసుకోదలచింది. ఆమె తాతగారు కొంత డబ్బు చేతిలో పెట్టి, తనకు చాలా తలనొప్పి బాధ ఉదయం నుండి ఉందని చెప్పాడు. నాకు ఈ మందులు తేగలవా? అన్నాడు.
గీత డబ్బులు తీసుకొని మెడికల్ స్టోర్ వైపు వెళ్లింది. దారిలో ఒక స్పీట్ షాపు పక్క నుండి వెళ్ళుతుండెను. ఓహ్, ఏం చెప్పాలి, ఎంతమంచి గులాబ్ జామున్, లడ్డూలు, జిలేబిలు ఘుమ ఘుమ వాసనలు. ఆమె కొన్ని తీసుకోదలచింది. ఆమెకు చెప్పిన పని మరిచిపోయి షాపులోకి వెళ్ళి స్వీట్లను తీసుకొని తన ఒడిలో పెట్టుకోసాగింది. అప్పుడే ఓ ఫ్రెండు అటు వచ్చి ఈమెతో కలిసింది. ఆ ఇద్దరు అమ్మాయిలు స్వీట్లు తిని చాలాసేపువరకు మాట్లాడుకున్నారు. గీత తన దీన తాతగారి తలనొప్పి గురించి పూర్తిగా మరిచిపోయింది. ఆమె ఇంటి నుండి బయటికి వచ్చిన పని జ్ఞాపకం వచ్చేవరకు మధ్యాన్న నుండి సాయంత్రం అయి మెడికల్ షాపు ఆ రోజుకు మానేశారు. ఆమె ఇంటికి త్వరపడిపోయిందో, తన తాతగారు ఎంతో బాధపడినాడు. ఎప్పుడు పెద్దదానివి మరియు బాధ్యత రాలువు అవుతావు గీతా అని అతను నిట్టూర్చి అడిగాడు.
గీతా వాస్తవంగా చాలా బాధపడింది, కాని తన పద్ధతులు మార్చుకుందా? లేదు. ఆమె ఎప్పటిలాగే మతిమరుపు మనిషి. ఎప్పుడైతే ఆమె తల్లి బయట ఆరేసిన బట్టలు తెమ్మందో, ఆమెకు మరుసటి రోజు ఉదయాన జ్ఞాపకం వచ్చింది. అప్పటివరకు రాత్రంతా కురిసిన వానకు బట్టలు తడిసి ముద్దయినాయి. మరొక రోజు తన చెల్లెలుకు లంచ్ బాక్సు స్కూలుకు తీసుకపోవలసియుండె. దారిలో సర్కస్ డేరాలను చూసింది. ఉదయమంతా సర్కస్ టెంటు చుట్టు తిరుగుతూ జంతువులు తినగా మరియు అవి చేయవలసిన పాత్రలకు జరిగే ట్రేనింగ్ కుతూహలంగా చూస్తూ గడిపింది.
కేవలం తనకు ఆకలి అయినపుడే తన చేతిలోని బాక్సు చూసి తన చెల్లెలు స్కూలులో దినమంతా ఏమీ తినకుండా ఇల్లు చేరి ఉంటుందని అనుకుంది.
ఇంకకసారి తన తండ్రి పనికి పోయే తొందరలో షర్టు ఇస్తే చేయమని గీతకు చెప్పిండు. గీత షర్టు తీసుకని వేడి ఇస్తీపెట్టె దగ్గర పెట్టింది. ఇంతలో బజారులో పెద్దవి రుచికరమైన మామిడి పండ్లు బుట్టలో పెట్టుకుని అమ్మేవాడి కూత వినిపించింది. వెంటనే అక్కడికి వెళ్ళి పండ్లు ఏరడం మదలు పెట్టింది. ఇంతలో షర్టు కాలుతున్న వాసన వచ్చింది. ఆ రోజు తండ్రి చాలా విచారపడినాడు.
ఈ సంఘటన తరువాత కొన్ని రోజులకు స్కూలు నుండి వచ్చి మరుసటి రోజు స్కూలు నుండి పిక్ నిక్ వెళ్ళగలమని చెప్పింది గీత. పిక్ నిక్ కు వెళ్ళేటప్పుడు తలా ఒక అయిటమ్ తీసుకెళ్ళాలని, తను సాంబారు తేగలనని నిర్ణయించింది. తన తల్లి మంచి రుచికరమైన సాంబరు చేస్తుందని తన ఫ్రెండ్సు బాగా సంతోషిస్తారని అనుకుంది. తల్లి పెద్ద కుండలో సాంబరు చేస్తానని ఒప్పుకుంది. గీత రాత్రి సంతోషంగా పడుకుంది, మరునాటి మంచి పిక్ నిక్ రోజు బాగుంటుందని ఊహిస్తూ.
మరుసటి రోజు ఉదయం తల్లి త్వరగా లేచి సాంబారు చేయడం మొదలు పెట్టింది. ఆమె పప్పు ఉడకపెట్టింది. కూరగాయలు, కొబ్బరి మరియు అన్ని మసాలాలు వేసి కుండను మండే స్టౌపై పెట్టింది. గీత బెడ్ లో ఉన్నపుడే మంచి ఘుమ ఘుమ వాసన రాబట్టింది. గీత కదలికలను చూసి, నా ప్రియమైన గీతా లేవమ్మా ఇప్పుడు. చూడు, సాంబారు దాదాపు కావచ్చింది. నేను గుడికి పోతున్నాను, కాబట్టి కొద్దిసేపు అయ్యాక ఐదూ స్పూన్ల ఉప్పు దాంట్లో వెయ్యి. మరిచిపోకు ఇప్పుడు. లేచి త్వరగా తయారుగా అంది.
తిట్లు అనుకుంటూ హడావిడిగా ఆమె వెళ్లిపోయింది. గీత నాయనమ్మ ఎవరైతే వంట గదిలో వుండెనో. అదంతా విన్నది మరియు తనలోనే తానే అనుకుంది, తన కోడలు ఎప్పుడు గీత మతి మరుపు పిల్ల అని తెలుసుకుంటుందో యని. నాకు గట్టి నమ్మకం ఉంది, ఆ అమ్మాయి ఉప్పు వేయడం మరిచిపోతుందని. అప్పుడు అమ్మాయిని ఆమె ఫ్రెండ్సు ఆట పట్టిస్తారు. జాగ్రతగా ఉండటమే మేలు అనుకుంటూ వెళ్ళి కుండలో ఉప్పు కలిపింది.
గీత తాతగారు వరండాలో కూర్చొని వార్తా పత్రిక చదువుతుండేది. అతనికి గీత తన తల నొప్పికి మెడిసిన్ తెమ్మని పంపుతె ఆమె మరిచి పోవడం తను బాగా తలనొప్పితో బాధపడటం జ్ఞాపకం ఉంది. గీత ఏదైన జ్ఞాపకం ఉంచుకోవడమే? అది కాని పని, అని తనలో తానే ్నుకుంటు వంట గదిలోకి వెళ్ళి సాంబరులో ఉప్పు వేశాడు.
గీత చెల్లెలు తల దువ్వుకుంటుండెను. స్కూలుకు పోయేందుకు తయారు అవుతూ ఆమెకు గుతా గీత లంచ్ బాక్సు తేవడం దారిలో సర్కస్ డేరాలు చూస్తూ మరిచిపోయి తను ఆ రోజు ఆకలితో ఇల్లు చేరడం బాగా జ్ఞాపకం ఉండింది. గీత ఉప్పువేయడం తప్పక మరిచిపోయే ఉంటుంది, దానితో తన స్నేహితురాళ్ళు నవ్వుతారు. అనుకుంటూ తను త్వరగా వంటగదిలకి వెళ్ళి ఐదు స్పూన్ల ఉప్పు సాంబరులో కలిపింది.
గీత తమ్ముడు పండ్లు తోముకుంటూ తల్లి తన అక్కకు చెప్పిన మాటలు ఉప్పు గురించి తప్పక మరిచే ఉంటుంది. అతను కిచెన్ లోకి వెళ్ళి కొన్ని స్పూన్ల ఉప్పు కుండలో వేసి వెళ్ళిపోయాడు.
గీత తండ్రి బహు జాగ్రత్తగా తన షర్టును ఇస్త్రీ చేసుకుంటుండెను. అందరి వలె అతను కూడా కిచెన్ లోకి వెళ్ళి సాంబారు కుండలో ఉప్పు వేశాడు.
ఇప్పటికి గీత లేచింది, ఆశ్చర్యంలో ఆశ్చర్యం ఉప్పు వేయడం ఆమెకు జ్ఞాపకం ఉండింది. అందుకు ఆమె కూడా వెళ్ళి ఐదు స్పూన్ల ఉప్పు తల్లి చెప్పినట్లు కలిపింది.
ఇప్పటివరకు తల్లి వచ్చి సాంబారు ఒక కంటే నీరులో పోసింది. దాన్ని తన కూతురుతో పిక్ నిక్కు పంపించింది.
పిక్ నిక్ ప్రాంతంలో పిల్లలు బాగా సంతోషంగా ఆడుకున్నారు కొంతసేపు. కాబట్టి ఇక ఏమి చేయలేక ఆకలితో ఉండిరి. ప్లేట్లు, స్పూన్లు బయటికి తీశారు. కంటెనర్సు పదార్థాలతో నిండి వుండెను. ప్లేట్లలో రైసు, చట్నీలు, కూరలు, పూరీలు, మరియు తీరు తీర్ల మిఠాయిలతో నిండిపోయినవి. అందరు ఎక్కువ ఎక్కువ గీత చేతితో సాంబారు పోయించుకున్నారు. కాని ఒక స్పూను నోట్లో పెట్టుకున్నారో లేదు, హా, హా, నీళ్లు, నీళ్లు అని మొత్తుకోవడం మొదలయింది. ఆశ్చర్యపడింది. గీతకు ఏమైందో తెలుస్తలేదు. అల్లం వాసన రైసం మరియు సాంబరు తన ప్లేటుతో వచ్చిన కూలి. అది చాలా అయిష్టంగా ఉండెను. అది తన తల్లి సముద్రంలోని ఉప్పంతా సాంబరులో వేసినట్లు తోచింది. అప్పుడు గీతకు జ్ఞాపకం వచ్చింది. తన తల్లి ఉప్పు కలుపలేదు, తనే కల్పింది. అయితే ఎక్కడ తప్పు జరిగింది?
ఆ రోజు గీత ఇంట్లో అందరు ఆతురతతో గీత స్కూలు నుండి వచ్చి సంతోషానికి బయటికి వెళ్ళిన సమాచారం కొరకు ఎదిరి చూస్తుండేది. కాని ఇదేమిటి? ఆమె చాలా అలసిపోయినట్లు, ఆమె ముఖం రంధితో మరియు కన్నీరు పెట్టుకున్నట్లు కనిపించింది. ఏం జరిగింది? గీత వారిమీద అరిచింది, ఇంకెవరయిన సాంబరులో ఉప్పు వేశారా?
నేను వేసిన, నాయనమ్మ అంది
నేను వేసిన, తాతగారు అన్నారు
నేను వేసిన తండ్రిగారు అన్నారు
నేను కూడా అన్నాడు తమ్ముడు
మరియు నేను అంది చెల్లెలు.
భయంతో అందరూ ఒకరి ముఖం చూసుకుంటూ కూర్చున్నారు. గీత రంధితో ఉండటం ఆశ్చర్యం కాదు. ఆమె ఫ్రెండ్సు ఆమెను సాంబరులోని ఉప్పు గురించి హేళణ చేసి యుండవచ్చు!
‘’మీరంతా అలా ఎందుకు చేశారు? అమ్మనా ఒక్కతికే గదా చెప్పంది’’ అని ఏడ్చింది గీత.
ఓహో ప్రియమైన గీత, నీకు ఏది చేయమని చెప్పినా మరిచిపోతవు గదా అని, ఈసారి కూడా మరిచిపోతావని, అనుకొని… అందరు విచారం వ్యక్తపరిచారు.
ఇప్పుడు తల్లి గీతను దగ్గరకు తీసుకని కన్నీరు తుడిచి నీవు ఏదైనా నాల్గు సార్లు జ్ఞాపకం చేయండి మరిచిపోగలవని ఇట్లు జరిగింది. ఇక ముందు జాగ్రతగా వుంటానని వాగ్ధానం చెయ్యి. మేమంతా నీవు నీ పనులు సక్రమంగా చేయగలవని నమ్ముతాము.
గీత ముక్కు చీదుకని, సరేనని తల ఊపింది. అటు తరువాత తమ తమ పనులు చాలా జాగ్రతగా చేసుకుంటుండేది. ఎంతో సదిరి చెప్పాక తన ఫ్రెండ్సు తన ఇంటికి ఒక నాడు లంచ్ కు వచ్చారు. తల్లి చేసిన రుచికరమైన సాంబరుతో లంచ్ బాగా ఆరగించి, ఇంత రుచికరమైన సాంబరు అన్నం ఎన్నడు తినలేదని ఒప్పుకున్నారు. అందరూ బాగా ఆనందించారు.
రచయిత రెండు మాటలు
మా నాయనమ్మ క్రిష్ణ, అందరు కిష్టక్క అని పిలిచేవారు. ఆమె చాలా తెలివయినది మరియు చాలా దయగలది. ఆమె కథలు గొప్పగా చెప్పేది కూడా ఆమె మాకు ఎప్పుడూ నీతులు చెప్పేది కాదు. కాని జీవిత విలువలను కథల రూపంలో చెప్పేది. మేము చిన్నపుడు చాలా ఫ్రీగ కుటుంబంలోని తోటి అమ్మాయిలతో మరియు తాతయ్య, నాయనమ్మలతో ఉత్తర కర్నాటకలోని హడావిడి లేని నగరం షిగాన్ (Shiggaon), లో ఉంటిమి. ఏదైన మేమందరం సంతోషంగా పంచుకునేవారము. మా అందరి కలయికకు మా నాయనమ్మే మూలం (Binding force). నాయనమ్మ చెప్పిన కథల ప్రభావం నా మీద ఇప్పటికి ఉంది. ఏవో చిన్న చిన్న మార్పులతో ఈ కథల పుస్తకం వ్రాశాను. కానీ చాలావరకు వాటి ప్రభావమే.
ఎప్పుడైతే నా మనుమరాలు క్రిష్న పుట్టిందో ఆమె నన్ను అమ్మమ్మ స్థాయికి లేపింది. నేను అన్నీటికన్న కథల విలువ ఎక్కువని గ్రహించాను. అవి పిల్లల విజ్ఞానం పెంపుదలలో ఎంతో సహాయపడుతాయి. అందుకే ఈ పుస్తకం.
ఈ కథలు పిల్లలు, తల్లిదండ్రులు, తాతయ్య, నాయనమ్మలు మూడుతరాలవారు ఒకరితో ఒకరు ప్రేమతో కలిసి ఉండేందుకు దోహదపడుతాయి.
పెంగ్విన్ బుక్స్ ఇండియా నా పుస్తకాల ప్రచురణకు ఉత్సాహం చూపుతున్నందుకు ధన్యవాదాలు. నేను సుదేశ్నా షోం ఘోష్ కు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఆయన నాకు గత పదేండ్లలో కథలు రాయడంలో ఎడిటర్ గాక మంచి మిత్రుడయినాడు.
సుధామూర్తి
బెంగళూరు
అనగనగా భాను మరియు వీరు అనే ఇద్దరు సోదరులుండిరి. వారి బాల్యంలోనే వారి తల్లిదండ్రులు స్వర్గస్థులయిరి. భాను తమ్ముడు వీర్ ను ప్రేమతో మరియు జాగ్రత్తగా పెంచెను. భానుకు యుక్తవయసు వచ్చాక భారతిని వివాహం చేసుకున్నాడు. ఆమె చాలా నమ్రత కలది. ఆమె వీర్ ను భర్తను చూచినంత జాగ్రత్తగా ప్రేమతో చూస్తుండేది.
ఎప్పుడైతే వీర్ 20 ఏండ్ల వయసువాడైనాడో, రాజు తన సైన్యంతో సైనికులను భర్తీ చేస్తున్నట్లు తెలుసుకొని రాబోయే యుద్ధంలో చేరదలచాడు. ఓహ్, అన్నా మరియు వదిన తమ వెంటనే ఉండమని ఎంతో నచ్చచెప్పారు. తాము ఎంతో ప్రేమతో పెంచిన అబ్బాయివారి నుండి చాలాదూరం వెళ్ళిపోవడం అనే ఆలోచనే వారు తట్టుకోలేక పోయారు. కాని వీర్, సైనికుడు కావాలనే కోరికను బట్టి వారు ఎంతో మనోబాధతో కన్నీటితో అతడిని పోనిచా్చరు.
చాలా రోజులవరకు అతడి గురించిన వార్తలు తెలియలేదు. రాజు యుద్ధానికి వెళ్ళాడు, తన శత్రువును ఓడించి తిరిగి వచ్చాడు. అతడితో వెళ్ళిన సైనికులు ఇంటికి తిరిగి వచ్చారు. కాని వీర్ గురించి ఏ జాడ తెలియకుండెను. ప్రతిదినం అన్న వదినె అతను ఇంటికి వస్తాడని ఎదిరి చూస్తుండిరి. కాని అతడు రాలేదు. తరువాత ఒకరోజు సైనికుల గుంపు వారి గ్రామంగుండా యుద్ధం నుండి తిరిగి ఇండ్లకు వెళ్ళుతుండిరి. భాను అతని తమ్ముణ్ణి గురించి వారిని అడిగాడు. వీర్ ఓహ్ అవును, చాలా విచారం, అతను చనిపోయాడు మీకు తెలుసా? యుద్ధభూమిలో అని ఒకతను అన్నాడు. తన తల ఆడిస్తూ. కాదు కాదు, అతను గాయపడినాడు, మరియు తేరుకునా్నడు. అతను ఇంటికి రాలేదా? అని ఇంకొకతను అన్నాడు. అతను అనారోగ్యంతో ఇంటిదారి పట్టాడు, అని మూడవతను తెలిపాడు.
ఇటువంటి భయంకర వార్తలు విని భాను చాలా రంధి పడినాడు. అతను తన తమ్ముడి రాక కొరకు ఎదిరిచూస్తూ ఇంటివద్ద వుండలేనని నిశ్చయించుకున్నాడు. అతను తమ్ముడి కొరకు వెతుకుతూ బయలుదేరాలని నిశ్చయించాడు. ఎప్పుడైతే అతని భార్యతో చెప్పాడో భారతి కూడా అతనితో వెళ్ళుటకు నిశ్చయించుకుంది. ఓ రోజు వారిద్దరు కలిసి తప్పిపోయిన వీర్ ను చూచి ఇంటికి తీసుకురావాలని బయలుదేరాడు.
వారు, రాజు యుద్ధభూమిలో ఎక్కడైతే వీర్ ను చివరకు చూచామన్న అతని కంపెనీవారు చెప్పారో అక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. ఆ స్థలం చాలా దూరం. వీరం వెళ్ళిన దారిలో అడవి గుండా, లోయల గుండా, గుటు్టలు మరియు ఎడార్ల గుండా పయనించాలి. వారిద్దరు నడిచారు మరియు నడిచారు, ఎన్నో మైళ్ళు. కాని భారతి తగిన బలం లేకుండెను. ఒకరోజు, దట్టమైన అడవి గుండా నడిచాక వారు ఒక చిన్న కుగ్రామానికి చేరారు. భారతి అలసిపోయి కూర్చుండిపోయింది. అక్కడ అట్లె మరణించింది. అప్పుడు భానుకు తీవ్రమైన మానసిక బాధ కలిగి అతను కూడా అక్కడే ప్రాణం వదిలాడు.
చాలా ఏండ్ల తరువాత ఎక్కడైతే ఆ జంట చనిపోయిందో, ఆ స్థలంలో రెండు చెట్లు మొలిచాయి. ఒకటి చాలా పొడుగాటి చెట్టు మరియు వేరొకటి తీగ, ఆ చెట్టును చుట్టుకుంది. అది భాను మరియు భారతి మరణంలో కూడా కలిసి ఉండిరని తోస్తుంది.
ఈ మధ్య, వీర్, వాస్తవంగా మరణించలేదు. అతను యుద్ధంలో తీవ్రంగా గాయపడి చాలా సంవత్సరాలు కోలుకుంటూ చాలా దూరంలో ఒక చిన్న గ్రామంలో వుండిపోయాడు. ఎప్పుడైతే అతను చివరకు కోలుకున్నాడో అతను, అతని కొరకు తన కుటుంబం ఎంతో ఆవేదనతో ఎదిరి చూస్తున్నారనుకొని అతి త్వరగా తన పాత ఇల్లు చేరాడు.
ఎప్పుడైతే తన ఇల్లు తాళం వేసి వుండెనో మరియు ఎన్నో ఏండ్లు వదిలిపెట్టబడి యుండెనో అతని ఆశ్చర్యానికి అవధులు లేకుండెను. నెమ్మదిగా ఇరుగు పొరుగువారు గుమికూడి భాను తప్పిపోయిన తమ్ముడి కొరకు వెతుక్కుంటూ పోవాలని నిశ్చయించుకొని వెళ్ళిపోయాడు అని చెప్పిరి.
ఆ రాత్రి వీర్ తన ప్రియమైన అన్న మరియు వదిన ఎట్లు ఇప్పుడు పొందగలనని బాగా దుఃఖించాడు. తెల్లవారగానే అతను వారికొరకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అతని అన్న మరియు వదిన వెళ్ళిన దారిలో పయనించాలని వారిని కలిసేందుకు వెంటనే బయలుదేరాడు.
వీర్ ఒక సైనికుడు, కాని చాలా గాయాలతో ఆలస్యంగా కోలుకున్నారు, కాని తగిన బలంగా లేకుండెను. అతనికి భాను మరియు పయనించిన ప్రదేశం చేరుటకు చాలా రోజులు పట్టింది. అప్పుడు అతను ఒకనాడు అడవికి దగ్గరిలో ఒక చిన్న గుడివద్దకు చేరాడు. ఆ గ్రామస్తులు అతనికి విచారకరమైన ఆ గుడికథ చెప్పారు. ఎన్నో సంవత్సరాలకు పూర్వం ఒక జంట ఎన్నోరోజులు నడిచి అలసిపోయి ఇక్కడికి చేరారు. ఒక కథ ఏంటంటే ఆ జంట వారి తప్పిపోయిన తమ్ముడు కొరకు వెళ్లుతుండిరి. వారి కోరిక తీరక ముందే వారిద్దరు ఇక్కడ చనిపోయారు. అదేచోట రెండు ఆశ్చర్యకరమైన చెట్లు, ఎవరికి అంతకుముందు తెలియనివి మొలిచాయి. ఆ ఆకులు మరియు గింజలు ఆ చెట్ల నుండి వచ్చినవి చాలా తీయగా, రుచిగా మరియు తింటే ఉల్లాసం కలిగించేవిగా ఉండేవి. అప్పుడు అక్కడ గ్రామస్తులు ఒక చిన్నగుడి, ఆ స్థలంలో ఆ జంట జ్ఞాపకార్థం కట్టించాలని నిశ్చయించారు. కట్టించారు గూడా.
వీర్ ఆ కథను ఎంతో రంధిగా విన్నాడు. అతను గ్రామస్తులు చెప్పిన జంట తన అన్న మరియు వదినె తప్ప మరెవరు కారని గ్రహించాడు. ఆ వార్తలు విని భరించలేక తను సున్నపు విగ్రహంగా మారాడు.
మీకు తెలుసా, అప్పటి నుండి వారు ఎట్లు జ్ఞాపకం వుంచుకోబడుతున్నారో? ఆ పొడుగాటి చెట్టు పో చెక్క (అరేకానట్లు) తీగ మొక్క ఆకులు తమలపాకులు మరియ విగ్రహం నుండి వచ్చింది సున్నం పేస్టు. ఈ మూడింటిని పాన్ తయారీలో వాడుతారు.
మరియు ఈ తీరుగ ప్రేమ జంట చనిపోయిన తరువాత గూడా తలచుకోబడుతున్నది. వారు ఈ కథ ద్వారా ప్రజలకు ప్రేమ విలువ, కలిసి వుండటం, మరియు ఒకరిపై ఒకరు విశ్వాసం కలిగి వుండటం గురించి తెలిసినది, పాన్ నములుతున్నప్డు జ్ఞాపకం వస్తుంటుంది.
శరణ తల్లి ఈ కథ విని ఆశ్చర్యపడింది. తనకు గూడా పాన్ తయారీలో ఈ మూడు వస్తువులు ఎల్లప్పుడూ పాన్ తయారీలో వాడుతారని తెలియదు.
ఇప్పటి నుండి నీ కథలు వినటందుకు నేను కూడా వస్తామరి.
అయితే పాన్ మాత్రం దంతాలకు హాని చేస్తుందని జాగ్రత పడాలి.
ఈ కథ సుధామూర్తి కథలలో ఒకటి.
మీను చికాకు పడింది. కోపంతో మూతి ముడుచుకొని నాయనమ్మతో మాట్లాడనంది. కాని ఎక్కువసేపు నాయనమ్మతో కోపంగా ఎవరుండగలరు? నాయనమ్మ అందరితో చాలా ప్రేమగా ఉండేది. ఎవరి తప్పులు మనసులో పెట్టుకోకండి.
నాయనమ్మా, మూడురోజులు అయింది. నువ్వు ఒకరాజు కథ ఇంకా చెప్పక అంటూ మీను గులిపింది.
నాయనమ్మ తల ఊపింది, అవును నిజమే, మీనూ. అది నా తప్పే. నీకు రాజు గురించన కథ వెంటనే చెప్పవలసి యుంటిని.
ఇప్పుడు నేను ఒక మంచి రాజు కథ చెబుతాను విను కానీ నాయనమ్మా ఎవరైతే ప్రజలకు మేలు చేస్తాడో, మంచి పనులు ప్రజల కోసం చేస్తాడో, ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెట్టడో, శిక్షలు వేయడో, జైల్లో పెట్టడో, అతని గురించి మాత్రమే చెప్పమని మీను సవరించుకొని కూర్చొని అడిగింది.
మంచిది పాప, ఇక్కడ ఒకరాజు మీరు కోరుతున్నట్లే ఉన్నారు అంటూ నాయనమ్మ కథ మొదలుపెట్టింది.
అమృత్ అనే ఒకరాజు ప్రజలను ప్రేమగా చూచుకునేవాడు, మరియు రాజ్య వ్యవహారాలు కూడా మంచిగా చూచుకునేవాడు. అతని మంత్రి “చందన్” చాలా తెలివైనవాడు, అతను విరామం లేకుండా రాజ్యవ్యవహారాల్లో రాజుగార్కి సహాయ పడేవాడు.
ఒక రోజు రాజు అమృత్ మరియు మంత్రి చందన్ రాజుభవనంపై డాబాలో ఇటూ అటూ నడుస్తుండిది. అక్కడి నుండి దూరం వరకు అన్నివైపుల మంచి దృశ్యాలు కనబడుతుండెను. ఒకవైపున అంగడిలో జనులు కూరగాయలు, పండ్లు, ఫలాలు, అందమైన దుస్తులు వేసుకున్నవారు –కొనేవాళ్ళను, అమ్మేవాళ్ళను చూచి వారి సంతోషాన్ని గమనించి, రాజు చాలా సంతోషించాడు. ప్రజలవద్ద కొనేందుకు చాలినంత డబ్బుఉండటం రాజుకు తృప్తినిచ్చింది. చూద్దామన్నా బీదలు కనిపించలేదు. రాజ్యంలోని సుభిక్షతో రాజుకు ఎంతో తృప్తి కలిగించింది.
ఇతర మంచి పాలకుల వలెనె తన ప్రజలతో తను కూడా ఎంతో సంతోషంగా ఉంటుండేవాడు.
అతను చందనంవైపు చూసి ఇలా అన్నాడు, చూడూ మన ప్రజలు ఎంత తృప్తిగా ఉన్నారో, కాని నేను రేపు స్వయంగా వారితో మాట్లాడి వారి సంతోషానికి కారణం తెలుసుకోదలచాను. రేపు ప్రతి వృత్తివారిని మన దర్బారుకు పిలిపించండి మంత్రిగారు. చందన్ కు రాజు విచిత్రమైన కోరికలు వినడం పరిపాటే, కాబట్టి తల ఊపి రాజాజ్ఞ అమలు చేయడానికి వెళ్ళారు.
మరునాడు రాజు సంతోషంగా కూనిరాగం తీసుకుంటూ దర్బారులోకి వచ్చారు. గుమికూడిన ప్రజలనందరిని చూచి చాలా సంతోషించాడు. గొంతు సవరించుకొని లాశిగా అన్నాడు. మీ అందరిని ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగటందుకు పిలిపించాను. మీ రాజుగా మీరందరూ తృప్తిగా ఉన్నారాయని తెలుసుకోదలచాను. మీ అవసరాలకు చాలినంత ఉందా? మీకు ఎవరైనా సంతోషం లేనివాడు తెలుసా? ప్రజలు ఒకరి ముఖం చూసుకొని నెమ్మదిగా జవాబు చెప్పుటకు ముందుకు వచ్చారు. ఒకరి తరువాత ఒకరు, వారు ఎంతో సంతోషంగా ఉన్నారో చెప్పారు. వారి వంటశాలలో సమృద్ధిగా సరుకులు ఉన్నాయి, వాళ్ళ వ్యపారాలు సజావుగా జరిగిపోతున్నాయి. రైతులు మంచి పంటలు పండిస్తున్నారు. నదులు, చెరువులు చేపలతో నిండి ఉన్నాయి. రాజును కోరవలసినది ఇంక ఏమున్నది?
రాజు ఇది విని ఇంకా చాలా సంతోషించాడు. అతని మంత్రి చందన్ మాత్రం అసంతృప్తితో ప్రజలు చెప్పిన మాటలు విన్నాడు. ఎందుకు అసంతృప్తి ఏం జరిగింది? వెంటనే అతను రాజుగారి దగ్గరకు వెళ్ళి వారి చెవులో ఏమో చెప్పారు. రాజుగారి కనుబొమ్మలు ఆశ్చర్యంతోపైకి లేచాయి. చందన్ మాత్రం మామూలుగానే ఉన్నాడు.
రాజుగారు దర్బారువైపు తిరిగి ఒక విచిత్రమైన ప్రకటన చేశారు. మీరంతా సంతోషంగా ఉన్నారని చెప్పినందుకు నేను చాలా ఉల్లాసంగా ఉన్నాను. కాని నేను దీన్ని పరిరక్షించదలచాను. రేపు ఉదయం సంతోషంగా వున్న ప్రజలందరు అంటే మీరందరు రాజ్యపు రాజుగారి తోటవద్దకు వచ్చి నన్ను కలువాలి. కానీ ఒక నిబంధన (షర్తు), మీరంతా తోట ముఖ ద్వారం నుండి (Main gali) లోపలికి ప్రవేశించాలి. తోటంతా తిరుగుకుంటూ తోట వెనుక గేటు నుండి యటికి వచ్చి నన్ను కలువాలి. మీ కోసం నేను అక్కడ ఎదిరి చూస్తుంటాను. మీరు ప్రవేశించేపుడు మీకు ఒక సంచీ (Bag) ఇవ్వబడుతోంది. తోటలో మీకు నచ్చిన ఫలాలు, పుష్పాలు మీరు తినవచ్చు, సంచల్లో నిండా నింపుకోవచ్చు, గుంపులో అందరూ సంతోషంగా మన రాజు మంచినాతని కేరింతలు గొట్టారు. సామాన్యంగా రాజుగారి ప్రత్యేక తోటలోకి ఎవరికి ప్రవేశం కూడదు. ప్రపంచంలోని అందమైన మరియు విచిత్రమైన చెట్లను ఆ తోటలో పెంచారు.
మరుసటి రోజు నిర్ణయించిన సమయానికి అందరూ తోటముఖద్వారం వద్దకు చేరారు. ఆ సమయంలో తోట గేటు కీపర్లు గేటు తెరిచి అవలా ఒక సంచి ఇచ్చారు. మగవారు, ఆడవారో, పిల్లలు తోటలో అందమైన చెట్టు తీగల చుట్టూ తిరుగనారంభించారు. వారికి సేబులు, దానిమ్మలు, సపోటాలు, మామిడిపండ్లు మొదలుగునవి ఆకర్షణీయంగా కనబడినాయి. రాజుగారి ఆజ్ఞ ఉంది కాబట్టి తిన్నన్ని తిని, సంచుల నిండా నింపుకున్నారో, వారు ఇంతకు ముందు చూడని పూలుచూచి జడల్లో సంతోషంగా తిరుగుతున్నాడు.
అక్కడి నుండి కొంత ముందుకు పోగానే వారికి చెట్లమీద బంగారు సేబులు వెండి మామిడి పండ్లు చాలా ఆకర్షణీయంగా కనబడినాయి. తీగలు వజ్ర వైరుధ్యాలతో చెట్లకు చుట్టుకొని కనబడినాయి. ఇవి చూచి అందరు వారు సహజమైన పండ్లను కింద కుమ్మరించి బంగారు పండ్లతో ఆశ కొద్ది సంచులు నింపుకున్నారో. తోటంతా సహజమైన పండ్లతో నేంతా నిండిపోయి కుళ్ళిపోవునట్లయింది. బంగారం, వెండి, వజ్ర వైఢూర్యాలు ధనం కాలం ప్రజలు ఆశపడినారు.
ఆ బరువైన సంచులతో వెనుక గేటు వద్దకు చేరాడు. అక్కడ రాజుగారు ఉన్నారు. అంతా చూస్తున్నారు. అక్కడి నుండి కొద్దిగా ముందుకు వెళ్ళగానే వారి ఆశ్చర్యానికి అక్కడ వేగంతో ప్రవహించే నీళ్ళ కాలువ ఎదురయింది. అది దాటుటకు పడవలు లేకుండెను. అది వారి బరువైన సంచులతో దాటటం వీలవదని అక్కడనే కాలువపక్కన తలకాయలు గోక్కుంటు ఆగిపోయారు, చాలాసేపు వరకు, ఇంతలకు వారిలో నుండి ఒక యువకుడు పేరు వేణుబాయి. తన సంచీని నది పక్కనే వదిలేసి కొంతదూరం కాలువలో నడిచి తరువాత ఈదుకుంటూ కాలువ దాటాడు.
తరువాత అందరూ కూడా అతడిని అనుసరించారు రంథిగా. వారు జీవితాంతం సుఖంగా ఉండేంత ధనం ఉందనుకున్నారు. ఆ విలువైన సంచులను కాలువ పక్కన వదిలేసి ఈదుకుంటూ నది దాటుతూ వటి్ట చేతులతో అక్కడి నుండి తడిగుడ్డలతో రంధిగా మరియు కోపంగా కాళ్ళు ఈడ్చుకుంటూ రాజు మరియు చందన్ వద్దకు చేరారు. చందన్ ముఖంపై చిరునవ్వు, రాజుమటుకు రంధిలో ఉండెను. ఎప్పుడైతే వారందరూ రాజుగారి ముందు కలిశారో, అతను అన్నాడు, నిన్న అడిగినపుడు మీరంతా సంతోషంగా, తృప్తిగా ఉన్నామని చెప్పారు గదా! కాని ఈ రోజు తోటలోని బంగారు పండ్ల సంచులను వదిలేసి రంధిగా మాములందు నిలబడినారు. వాస్తవంగా మీరు మీ జీవితంలో సంతోషంగా వుంటే మీరు బంగారు పండ్లతో ఎందుకు సంచులు నింపుకున్నాడు, మరియు ఎందుకు ఈ రోజు ఎంతో రంథిగా ఉన్నారు? అందరూ తాము చేసిన పనిపై సిగ్గుతో తలలోంచుకొని నిలబడినారు.
కేవలం తన సంచిని ఏ మాత్రం విచారించకుండా నది పక్కన వదిలేసి నది దాటిన యువకుడు వేణుబాబు మాత్రం మామూలుగా కనిపించాడు. చందన్ ఇతడిని కనిపెట్టి ముందుకు రమ్మనిపిలిచాడు. అతడిని చందన్ అడిగాడు, చెప్పు నీకు నీ విలువైన పండ్ల సంచీ నది పక్కన వదిలేసి వచ్చినందుకు నీకు రంధి అవుతూ లేదా?
ఆ యువకుడు అన్నాడు, “నేను బంగారు ఫలాలు, పుష్పాలు తెంపుకోలేదు. నేను సహజమైన తినే పండ్లకు తృప్తిగా తిన్నాను. ఇంటివద్ద ఉన్న నా కూతురు కొరకు కొన్ని సంచీలో వుంచాను. అమ్మాయి ఈ తీయని మామిడి పండ్లను తిని సంతోషిస్తుందని, కానీ ఎప్పుడైతే నది దాటే వీలు లేదనుకున్నారో, నేను ఏమి విచారించకుండ నా సంచీని నది పక్కన వదిలేశారు. నా చంటిది ఏదైన వేరే చోటు నుండి మంచి రుచికరమైన పండ్లు పొందవ్చు. కాని రాజు మమ్ముల తన ప్రత్యేకమైన తోటలో సంతోషంగా తిరుగటానికి వీలు కలిగించినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. అక్కడ మంచి మంచి వృక్షాలు, మొక్కులు, జంతువులను చూచాను. అతను గొప్ప రాజు, ఇంత అందమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో తిరుగుతూ ఎంతో ఉల్లాసంగా ఉండింది.
చివరగా అమృతరాజు ముఖంపై చిరునవ్వు కన్పించింది. చందన్ రాజువైపు చూచి అంటాడు, ఓ రాజూ, ఇప్పుడు మీరు గమనించియుండవచ్చు, ప్రజల తృప్తి ఆహారం, డబ్బు వుంటే ఉండదు, వారు కూడా మనసులో సంతోష పదాలనుకుంటారు. అప్పుడేవారు ధనం కలిగినా, కోలుపోయినా విచారించదు. ఇదే పాఠం ఎవరికైనా – ఒక రాజైనా, సామాన్యుడైనా గుర్తించుకోవలసింది.
రాజు సంతోషంతో తల ఊపాడు, అతని ప్రజలవలె, పాఠం తొందరలో ఎవరు కూడా మరచిపోరు. వారందరిలో అతిసంతోషి యువకుడు వేణుబాబు.
కథ ఇష్టమైందా మీనూ? రఘు అడిగాడు. ఓహ్ అతను, మీనూ తల ఊపింది. కాని నేను రాజు కన్న మంత్రి ఇష్టపడుతాను. అది నిజమే మీనూ, నాయనమ్మ ఒప్పుకుంది, రాజులకు తెలివైన మంత్రులు అవసరం, సరియైన నిర్ణయాలు తీసుకునేందుకు అక్బరుకు, బీర్బల్, కృష్ణదేవరాయలకు తెనాలి రామకృష్ణుడు ఉండిరి.
రాజులకే కాదు, మనసు కూడా ఎవరైనా తెలివైనవాడు ఉండాలి, మనం తప్పుచేసినపుడు సరియైన వారి చూపేందుకు, మన తల్లిదండ్రులు, తాతలు, నాయనమ్మలు అమ్మమ్మలు కావచ్చు, ఉపాధ్యాయుడు కావచ్చు లేక మంచి స్నేహితులు కావచ్చు. ముఖ్యమైన విషయం అవసరమైనపుడు మనం వారి సూచనలు పాటించడం మంచిది.