ఎర్నీ అనబడే ఒక బాలుడు పరిశోధన కథలు (డిటెక్టివ్ స్టోరీలు) చదవడం ఇష్టపడేవాడు. కాని మీరు అతను డిటెక్టివ్ కావాలని ఊహిస్తున్నారా? ఆ అవకాశం లేదు. అతను ఒక దొంగ కావాలని నిశ్చయించుకున్నాడు. ప్రపంచంలో ఇది తప్ప అతడిని వేరే ఏ వృత్తి ఆకర్షించలేదు. ఆయన ఎదిగిన వెంటనే ఒక పయతాప ముఖానికి పెట్టుకొని, జేబులో ఒక బొమ్మ పిస్టల్ దూర్చుకొని ఒక బ్యాంకుని దోచుకుందామని బయలు దేరాడు. ఒక బ్యాంక్ లోకి వెళ్ళి క్లర్కును నత్తి వలన హ, హ, హాండ్స్ అప్ అని అరిచాడు, పిస్టల్ చూసిస్తూ. కానీ వెంటనే అలారం మోగటం మొదలయింది.
ఎర్నీ ఏం జరుగుతున్నదో తెలుసుకోక ముందే, పోలీసులు అతడిని అరెస్టు చేశారు. బ్యాంకు దోపిడీ ప్రయత్నం చేసినందుకు జైల్లో వేశారు. వాస్తవంగా బ్యాంక్ దోయడం తన వంటి అనుభవం లేనివాడు మొదలుపెట్టడం కష్ట కార్యమే. నేను చాలా సామాన్యమైన ప్రయత్నాలే చేయాలి అనుకున్నాడు కాబట్టి ఆయన జైలు నుండి విడుదల అయినాక ఒక పెద్ద షాపు బంగ్లా కిటికీ పగులగొట్టి లోనికి దూరాడు. అక్కడ అతనికి ఏది చేతికందితే అది తన బస్తాలో వేసుకున్నాడు. కానీ అతను కిటికీ గుండా బయటకు వెళుతున్నపుడు పట్టుబడి రెండవసారి జైలులో వేయబడినాడు. అక్కడ విడుదలయ్యాక ఒక ఖాళీ ఇంట్లోకి దూరాడు. అక్కడ అతను బీరువాలు వగైరా వెతికాడు, కాని అక్కడ ఏమీ దొరకలేదు.
కానీ దారిలో దొంగల ముఠాకు పట్టుబడి బాగా దెబ్బలు తిన్నాడు. తను తెచ్చుకున్నది కూడా వాళ్ళు తీసేసుకున్నారు. కారణం ఆ ఇల్లు వాళ్ళ ప్రాంతం.
ఎప్పటివలనే నేర పరిశోధకులు తన వేలి ముద్రలు ఖాళీ ఇంట్లో బీరువాలపై ఏర్పడిన వాటిని గమనించి మరల జైల్లో వేయబడ్డాడు.
ఎప్పుడూ ఇదే తంతుగా జరుగుతున్నందుకు జైలుశిక్ష ఎక్కువ కాలం పడుతుండేది.
చివరకు దొంగతనాల కన్నా వేరే మంచి వృత్తులు ఉంటాయని గ్రహించి, స్థానిక జంతు ప్రదర్శన శాలలో ధృవ ప్రాంత ఎలుగుబంట్లకు మేత వేసే ఉద్యోగం సంపాదించాడు. అప్పుడప్పుడు వాటికి తను నేరాలు చేస్తున్నపుడు జరిగిన విషయాలు చెప్పేవాడు.
దొంగతనాలు చేయడం కన్నా, చిన్న ఉద్యోగమే మేలు అనుకున్నాడు, కష్టమైనా.
ఒద్దిరాజు మురళీధరంరావు
ఒకానొకప్పుడు ఓ ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్లు మంచి పెయింటర్లు. వాళ్లలో ఒకతను మంచి మనిషి బొమ్మలు వేసేవాడు. రెండవతను వాటికి మంచి ముఖాలు చేసేవాడు. మూడవ తమ ఆ బొమ్మల్లో ని ఇళ్ళూ , చెట్లు అందంగా పెయింట్ చేసేవాడు. అలా వాళ్ళు ముగ్గురూ కలిసి పెయింట్ చేసిన పటాలు చాలా అందంగా ఉండేవి. ఎంతో మంది ఆ పటాలను చూసి సంతోషంతో కొనుక్కొని వెళ్లేవారు. దాంతో ఆ సోదరులు తృప్తిగా ఉంటుండేవాళ్ళు.
కానీ కొన్నాళ్ల తర్వాత పెద్దతను తను వేస్తున్న మనిషి బొమ్మలు చాలా అందంగా ఉండడం వల్లనే ఈ పటాలన్నీ అమ్ముడుపోతున్నాయి అనుకుంటూ…
“నేను అనవసరంగా నాకు వచ్చే డబ్బులు ఇద్దరు సోదరులకు ఇస్తున్నాను కదా ! కాబట్టి నేను వేరుగా బొమ్మలు వేసి పెయింటింగ్ లను తయారు చేయడం మంచిది’ అనుకొని అలా మొదలుపెట్టాడు.
రెండవతను ఆ బొమ్మలకు తను పెయింట్ చేసిన అందమైన ముఖాల వల్లనే పెయింటింగ్స్ అందంగా ఉండి అవన్నీ బాగా అమ్ముడుపోతున్నాయనుకొంటూ,
” నేను ఒక గొప్ప పెయింటర్ను !నాకు అర్థం అవడం లేదు…. నేను ఇద్దరు సోదరులకు ఎందుకు డబ్బు ఇస్తున్నానో !! ఇప్పటినుండి నేనే స్వయంగా ముఖాలు పెయింట్ చేస్తే సరి. ముఖాలు మనిషిలోని భావాలను తెలిపేవి. ఆ పెయింటింగ్ లకు మంచి గిరాకీ ఉంటుంది” అనుకొని తను విడిగా పెయింటింగ్ వేయడం మొదలుపెట్టాడు.
ఇక మూడవ తను కూడా తను పెయింటింగ్ చేసే ఇల్లు చెట్లు ఉండడంతోనే ఆ పెయింటింగ్ లకు సంపూర్ణత వచ్చి ఎంతో అందంగా ఉంటున్నాయి, ఆదర్శనీయంగా ఉంటున్నాయి, దాని వల్లనే ఎక్కువగా అమ్ముడుపోతున్నాయని అనుకొని, తను విడిగా ఇల్లు చెట్లు వేస్తూ పెయింటింగులు వేయడం మొదలుపెట్టాడు.” తన గొప్పతనానికి వచ్చే డబ్బు అనవసరంగా ఇద్దరు సోదరులకు ఇవ్వడం మూర్ఖత్వం” అని అనుకున్నాడు
ఇలా విడివిడిగా ఉన్న పెయింటింగ్ లను చూసి ఎవ్వరు ఇష్టపడక కొనేవాళ్లు రాలేదు. ఇట్లా ముగ్గురు అన్నదమ్ములు విడివిడిగా ఉండి అసంపూర్ణమైన పెయింటింగులను వేయడం వల్ల రాబడి లేక ముగ్గురికీ ఇల్లు గడవడమే ఇబ్బంది అయిపోయింది .
కొన్నాళ్ల తర్వాత ఈ పద్ధతి ఏమీ బాగోలేదు ముగ్గురం కలిసే ముందు లాగే ఒక్క పెయింటింగ్ లో ముగ్గురి నైపుణ్యత చూపించడమే మంచిదని నిర్ణయానికి వచ్చారు. అప్పటినుండి మళ్లీ వాళ్ల పెయింటింగులు బాగా అమ్ముడుపోవడం మొదలై రాబడి పెరిగింది.
అప్పుడు వాళ్లకు అర్థమైంది కలిసి ఉంటే కలదు సుఖం అని,
United we stand, divided we fall అని!!
ఒక జంతు ప్రదర్శన శాల (జూ,zoo)లో ఏనుగులు, మొసళ్ళు, రైనోసిరస్ లు (ఖడ్గమృగాలు) ఇంకా ఎన్నో ఎన్నో వేరే జంతువులు చాలా ఉన్నాయి. అక్కడ ఒక గొరిల్లా కూడా ఉన్నది. అది చూడటానికి చాలా భయంకరంగా ఉన్నది. దాన్ని చూసి అందరూ భయపడేవాళ్లు. ఆ గొరిల్లా ఎవరితో కూడా స్నేహం చేయలేదు. దాని పేరు పీట్ ( Pete) అని ఎవరికీ చెప్పలేదు. ఒకరోజు ఒక చిన్న పాప వాళ్ళు ఈ జూ కు వచ్చారు. ఆ పాప పేరు జోసఫైన్. జోసఫైన్ తన తల్లి తో కలిసి గొరిల్లా బోను(cage) దగ్గర ఆగింది, వెళ్దాం రమ్మంటే అక్కడ నుండి కదలనే కదలని అన్నది.
” రా డియర్ వెళ్దాము” అని తల్లి పిలిచినా వెళ్లలేదు.
“మనం ఇంకా బ్యూబన్లను(Baboons), కంగారులను ( Kangaroos),జిరాఫీలను ( Giraffes) చూడాలి అని ఎంతగానో పిలిచింది. కానీ జోసెఫ్ తలను అడ్డంగా ఊపింది. “గొరిల్లా అన్నింటికంటే ఆహ్లాదకరమైంది.నాకు ఇతనితో … ఈ గొరిల్లా తో ఆడుకోవడమే ఇష్టం”అని అన్నది . గొరిల్లా ఈ మాటలు విన్నది. దాని మనసు ఈ చిన్న అమ్మాయి వైపు తిరిగింది.
మర్నాడు ఉదయం జూ కాపరి గొరిల్లా వెళ్లిపోయిందని తెలుసుకున్నాడు.అది మామూలుగా బోను ద్వారాన్ని నెట్టి తెరిచి జూ గోడ ఎక్కింది, అలా టౌన్ లోకి వెళ్లి పోయింది. వెంటనే అలారం మోగింది. అగ్నిమాపక దళం నిచ్చెనలతో బయటకు బయలుదేరింది.పోలీసులు వాళ్ళ లాఠీలతో, సైనికుల గుంపులు ట్యాంకులతో, కొద్దిమంది మిలిటరీ డాక్టర్లు, పశువుల డాక్టర్లు అందరూ గొరిల్లాను కనిపెట్టాలని బయలుదేరారు.
వెంటనే లౌడ్ స్పీకర్ వ్యాన్లు బజార్లో పెద్ద సంగీత ధ్వనులతో బయలుదేరాయి.
“ఎవ్వరూ ఇండ్ల నుండి బయటికి రావద్దు! జాగ్రత్త!! బయట భయంకరమైన గొరిల్లా తిరుగుతున్నది. ఎవరైనా చూస్తే వెంటనే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయాలి ” అని అనౌన్స్ ఇది విని బలహీనమైన గుండె ఉన్న అమ్మాయిలు కొందరు మూర్ఛిల్లిపోయారు.ఎక్కడి వారు అక్కడనే భయపడిపోయారు.
కొందరు ఔత్సాహికులైన గొప్ప వేటగాళ్లు ఇండ్ల మీదికి గుండ్లు నింపిన రైఫిల్స్ తో ఎక్కారు. కానీ ఎక్కడా గొరిల్లా జాడలేదు. అది గాల్లో ఎగిరిపోయిందా అన్నట్లు అనిపించింది వాళ్ళ కు.
ఓ ఐదారు గంటలు గొరిల్లా కొరకు వెదికారు. కానీ అది ఎక్కడ కనిపించలేదు అప్పుడు ఒక జనరల్ కు ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది.
AI. ఆల్సేషన్ ( శునకం, కుక్క) . అది ఎప్పుడైనా వాసన చూసి పసిగట్టేదొక దాన్ని తెప్పించారు.అది గొరిల్లా ఉంటున్న బోను వాసన చూసి, కాసేపు మొరిగింది.వెంటనే పరిగెత్తడం మొదలుపెట్టింది. దాని వెంట శాశ్వత సైనిక విభాగ సైనికులు ఒక ప్లాటూన్ పోలీసులు,ఇంకా ఒక అగ్నిమాపక దళం , ఎవరైతే వాళ్ల నిచ్చెన్లను దారిలో పోగొట్టుకున్నారో వాళ్లంతాను పరిగెత్తారు.
AI . ఆల్ సెషన్ వాసన పసిగట్టి ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ దగ్గరికి చేరింది.వెంట ఉన్న డాక్టర్లు,పశు వైద్యులు అందరూ దాన్ని వెంబడించారు.ఈ శునకాన్ని పట్టుకున్న పోలీస్ ట్రైన్డ్ కేర్టేకర్ భయపడుతూ కుక్క చూపిన ఒక ఇంటి డోర్ బెల్ కొట్టాడు,అది మొరగడం ఆపింది. పోలీసు వాళ్ళు వాళ్ళ కర్రలతో రెడీగా… గట్టిగా పట్టుకొని నిలబడ్డారు.
జోసఫైన్ డోర్ తెరిచి అల్లరి చేయవద్దని పెదవులపై వేలు పెట్టుకుంది. అతి నెమ్మదిగా ” నేను ఇప్పుడే ఒక కథ చెప్పి నిద్రపుచ్చాను. ఎవరు మీరంతా ? ఆగండి” అన్నది.
పోలీసులు, సైనికులు ,అగ్నిమాపక దళాలు అందరూ 475 మంది మెట్లపై ఇరుక్కుని నిలబడ్డారెందుకో గ్రహించి ,
అమాయకపు గొరిల్లాను నిద్ర నుండి లేపి,
జోసఫైన్ గొరిల్లాతో ” నేను రోజు వచ్చి కలుస్తాను నిన్ను.. ఇప్పుడు వాళ్లతో వెళ్ళు “అని మెల్లిగా వివరించింది. అలా ప్రతిరోజు వెళ్లి దాన్ని కలుస్తానని వాగ్దానం చేశాక అది అల్లరి చేయకుండా నెమ్మదిగా వాళ్ళ వెంట జూకు తిరిగి వెళ్ళింది.
గ్యాస్ కోయిన్ కు ఐదుగురు పిల్లలు. అతని భార్య అంటుండేది…” వీళ్లు ఆశ్చర్యం కలిగించే ఒక రకమైన మొసలి లాంటి జంతువులు” అని. ఆమె చెప్పేది వాస్తవమే.( కథల్లో ఆశ్చర్యానికి ఈ మొసలి పేరు వాడుతుంటారు).
ఈ ఐదుగురు పిల్లలు
ఉదయం నుండి చాలా రాత్రి వరకు బయట కీచులాడుతూ, కొట్లాడుతూ, బొడుపులు గాయాలు చేసుకొని తల్లికి చూపించేందుకు ఒకరి తరువాత ఒకరు ఏడ్చుకుంటూ ఇల్లు చేరుతుంటారు. ఈ విషయం గురించి తల్లి చేతులు జాడించుకుంటూ ,” తనకు ఒక్క క్షణం కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు ఈ దురుసు పిల్లలు త్వరలోనే నా తల నరాలు చిట్లిపోవడంలో సందేహం లేదు ” అని అనేది.
ఆమె అన్నదంతా వాస్తవమే అని ఆమె భర్త అంగీకరించాడు. ఆ అంగీకారం ఆమెకు మనసుకు ఎప్పటికన్నా ఎక్కువ బాధ కలిగించింది.
” అలా కూర్చొని తల ఊపకుండా బయటికి వెళ్లి ఏదైనా ఉపాయం చెయ్యి” అంది చికాకుగా.
ఇంట్లో పిల్లల అల్లరి, భార్య గులుగుడు భరించలేక భర్త ఏదైనా చేయాలనుకుని బయటికి వెళ్ళాడు.
ఆరోజు ఆయన అనుకోకుండా ఒక మిత్రుని కలుస్తాడు. పాపం ఆ మిత్రునికి పిల్లలు లేరు, ఉద్యోగం లేదు. ఆయన ఉద్యోగ వేటలో తిరుగుతున్నాడు. అతన్ని చూడగానే గ్యాస్ కోయిన్ మనసుకు ఒక ఆలోచన తట్టింది.
“ఒక ప్రత్యేకమైన బిల్డింగ్ కట్టించి గ్రామస్తుల పిల్లలందరిని కనీసం సగం రోజైనా దాంట్లో కూర్చోబెట్టి తన మిత్రుడిని అక్కడ పిల్లలను జాగ్రత్తగా చూసుకునేందుకు ఎందుకు ఏర్పాటు చేయకూడదు? పిల్లలు విసుగు చెందకుండా నా మిత్రుడు వాళ్లకు ఏదో బోధించవచ్చు. మధ్య మధ్యన చదివించడం, రాయించడం , సంగీతం బోధించడం చేయవచ్చు. అది పిల్లలకు చాలా ఉపయోగకరం అవుతుంది కూడా ! ” అనుకున్నాడు. ఆ తీరుగా అదే ప్రథమ పాఠశాల గా మొదలైంది. ఆ టౌన్ పిల్లలకు అతనే ప్రథమ ఉపాధ్యాయుడు అయినాడు. అందరికీ పిల్లలతో సమస్య లేకుండ అయింది. కానీ గ్యాస్నోయన్ ఐదుగురు చిచ్చర పిడుగులను అదుపులో ఉంచడంతో ఆ ఉపాధ్యాయుని తల త్వరలోనే నెరిసిపోయింది.
ఈ విధంగా మొదటి పాఠశాల అనే విశాల భావం గ్యాస్ కోయిన్ తెలుసుకున్నాడు. ( How Mr.Gascoyne invited school?
Internet కొత్త విషయాలను ఆవిష్కరిస్తుంది.)
అనగా అనగా ఒక ఊరు, ఆ ఊరి చివర్లో ఒక చిన్న ఇల్లు. ఆ ఇంట్లో నెల్ అనే మేక తన కూతురు నెల్లితో ఉంటుండేది.
ప్రతిరోజు నెల్ క్యాబేజీ కొనడానికని దుకాణానికి వెళుతూ ఉండేది. ఆమె బయటికి పోయినప్పుడు నెల్లీ తో ” నువ్వు నేను వచ్చి తలుపు కొడితే తప్ప ఎవ్వరికీ తలుపు తీయవద్దు నెల్లీ” అని చెప్పేది.
నెల్లి తలుపు బోల్ట్ పెట్టేసి తల్లి తిరిగి వచ్చేవరకు ఎదురుచూస్తూ ఉండేది.
ఒకరోజు తోడేలు వచ్చి ” తలుపు తెరువు నా ముద్దుల మేకపిల్ల నేను నీ తల్లి నెల్ ను” అన్నది.కాని, నెల్లికి ఆ గొంతు కొద్దిగా వేరుగా అనిపించి తలుపు తెరవలేదు.
మర్నాడు కూడా తోడేలు అలాగే మళ్ళీ వచ్చింది. ఈసారి కీచు గొంతుతో దాదాపు మేక గొంతు లాగానే మాట్లాడుతూ
” పాపా! తలుపు తెరువు .ఇది నేనే! నేను ఇంటికి క్యాబేజీ తెచ్చాను.” అన్నది. నెల్లీ బోల్ట్ తీసి తలుపు తెరిచింది. వెంటనే ఒక నల్ల తోడేలు పంజా తలుపు నెట్టి లోపలికి రాబోయింది.
” నువ్వు నా తల్లివి కాదు”అని అరిచి నెల్లీ తలుపును గట్టిగా మూసేసింది. అలా అప్పుడైతే ప్రమాదం తప్పించుకుంది.
నెల్ ఇంటికి రాగానే ఆ చిన్న పాప నెల్లి జరిగిందంతా తల్లితో చెప్పింది.
‘ కొద్దిగా ఆగు పాడు బుద్ధి ముసలి తోడేలా’ అని తల్లి మనసులో అనుకున్నది తల్లి నెల్.
మర్నాడు ఆమె ఇంటి దగ్గరే ఉండి, ఎదురు చూస్తూ ఉన్నది.
ఒక మధురమైన గొంతు ” లోనికి రానివ్వండి” అని అన్నది.
ఎప్పుడైతే మేక పిల్ల తలుపు కొద్దిగా తెరిచిందో తోడేలు తన పిండి పడిన రెండు పంజాలు పాపను మోసం చేద్దామని లోపలికి చాపింది కానీ అది లోపలికి పోయే ప్రయత్నం చేయకముందే తల్లిమేక ఒక దుడ్డు కర్ర చేతిలో పట్టుకొని ఎట్లా కొట్టిందంటే…..
మేక పిల్లను తినేసి తన ఆకలి తీర్చుకుందామనుకున్న సంగతే తోడేలు మరిచిపోయింది, పరుగులెత్తింది.
అల్లెన్ అనే వడ్ల గిర్నీ యజమానికి విలియం అనే ఒక కుమారుడు పుట్టాడు. కొడుకు చంటివాడుగా తొట్లెలో ఉన్నప్పటినుండి చూస్తూ తన ఏకైక వారసుడని సంతోష పడుతుండేవాడు. నువ్వు పెద్ద పెరిగాక మిల్లు యజమానివి అవుతావు నావలనే. నేను మా తండ్రి దగ్గర నుండి ఈ వృత్తిని తీసుకొన్నాను.వడ్లు పట్టే గిర్నీ వృత్తి వాళ్ళం అయ్యాము అని అనుకుంటుండేవాడు.
అల్లెన్ చాలా కాలం నుండి గిన్నివాడని పిలువబడుతుండేవాడు.కానీ విలియం కర్ర పనిని ఇష్టపడేవాడు. అప్పటినుండి ఎప్పుడూ ఒక కత్తి పట్టుకొని కర్రను చెక్కడం ఇష్టపడేవాడు అతను పెరిగాక కర్ర పని తప్ప వేరే ఏదీ చేయనని అనేవాడు. అతని తండ్రి అలా అయితే ఇంటి నుండి వెళ్లగొడతానని భయపెట్టేవాడు. ఆ మాట ప్రభావం పడినప్పుడు ఎన్నో రకాలుగా ఆశపెట్టాడు అయినా ఆ బుజ్జగింపులు పనిచేయలేదు అప్పుడు తండ్రి మన వృత్తి మారిపోతుందని కొడుకును బాగా తిట్టాడు. తండ్రిని మెప్పించే కన్నా తను ఇష్టపడిన వడ్రంగి వృత్తినే అవలంబించాడు విలియం.అతని మాట విననందుకు గిర్నీ నుండి కొడుకును తీసివేశాడు. నువ్వు అన్నీ బయట ప్రపంచంలో నేర్చుకుంటావు అని బాగా దుర్భాషలాడాడు. విలియం బయటికి వెళ్లాడు తన గ్రామంలో కార్పెంటర్ పని వంటివి బయట కూడా దొరుకుతుందని తను తన కత్తితో బయటికి వెళ్లిపోయాడు.
ఆ రోజు నుండి అల్లెన్ ముందు లాగా పని చేసే శక్తి క్రమంగా కోల్పోయాడు. వెంటనే అతను పని చేసి సంపాదించి దాచవలసిన అవసరం కూడా లేదనుకున్నాడు. అందువల్ల మిల్లు పనిపై శ్రద్ధ తగ్గించేశాడు.దానివల్ల మిల్లు కు ధాన్యం తెచ్చేవాళ్ళు తగ్గిపోయారు ఇంతే కాకుండా ఆ మిల్లుకు కొంత దూరంలో ఇంకో మంచి మిల్లుకు వెళ్లిపోయేవారు అల్లెన్ తాగుడుకు కూడా అలవాటు పడ్డాడు.అందుకే మిల్లు అధ్వాన్నమైపోయింది.
అప్పటినుండి అల్లెన్ చేతకాకుండా అయిపోయినాడు.అతడు దేశమంతా తిరిగాడు. కానీ ఎక్కడా ఏ పని దొరకలేదు. అతని గుడ్డ సంచి ఎప్పుడు ఖాళీయే! అంతే కాదు, అతని చేత కర్ర బిచ్చగాని చేత కర్రలా అయింది. దయగల వారు పెట్టినప్పుడు మాత్రమే తినగలిగేవాడు.అలా అతని జీవితం దుర్భరమైంది. తిరిగి తిరిగి అతను రాష్ట్ర రాజధాని చేరాడు ,ఏదైనా పని దొరుకుతుందోనని! చివరకు ఒక పెద్ద కర్ర పని చేసే కొట్టు ముందుకు చేరాడు.
ఆ కర్ర మిల్లు దగ్గర చాలామంది పనివాళ్ళు పని నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. అందమైన వస్తువులు కర్రతో చేసినవి అక్కడ కనిపించాయి. వాటికి మంచి గిరాకీ కూడా ఉన్నది .అక్కడ వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా ఉన్నది.
అక్కడి యజమాని ఈ ముసలతని చూశాడు.ఇతడు ఓ ముద్ద అన్నానికి నేల ఊడుస్తానని అంటూ కన్నీరు పెట్టుకొని తన రెండు చేతులను ముందుకు చాచాడు. “నాన్నా నన్ను గుర్తు పట్టలేదా మీరు,?”అని తన చేతులు బోర్లా ముందుకు చాపాడు.
“మీరు ఇక్కడ, మీ ఇంటి ముందు ఉన్నారు” అన్నాడు .అప్పుడు ఆ ముసలి వాడు అల్లెన్ తన కొడుకు ముందే ఉన్నానని గ్రహించాడు.
” నా మీద కోపం లేదా విలియం” అని అడిగాడు .”నా ఇంటి నుండి నిన్ను వెళ్ళగొట్ట లేదా ?
“అదంతా చాలా కాలం క్రితం “అని కొడుకు జవాబు ఇచ్చాడు. “కానీ నన్ను మీరు క్షమించాలి కూడా! నాకు తెలిసింది ‘మనిషి తనకు ఇష్టమైన పనే చేయాలి.అప్పుడే అతను ఆ పనిలో రాణించగలడు’. అన్నాడు విలియం.
” కానీ నేను ఇక్కడ ఏమి పని చేయాలి?” అని ముసలి తండ్రైన అల్లెన్ రంధి గా అడిగాడు.
“మీకు చాలా పని ఉంది.” అని ఆ కార్పెంటర్, అల్లెన్ కొడుకు విలియం అంటూ,” నాకు ముగ్గురు కొడుకులు.అంటే మీకు ముగ్గురు మనుమలు. బహుశా వారిలో ఒకడిని మీరు మిల్లర్ను చేయవచ్చు”.
_ ఒక బిచ్చగాడు బిచ్చం యాచిస్తూ బజారులో పోతుంటాడు. అతని ఎదురుగా బ్రహ్మాండమైన ఒక రథంపై మహారాజు వస్తుంటాడు. ఆ చక్రవర్తి ని చూసి
అతను తనకు కావలసినంత బిచ్చం దొరుకుతుందని చాలా ఉల్లాసపడిపోయాడు బిచ్చగాడు.
కానీ, బిచ్చగాడు ఆశ్చర్యపోయేట్టు, ఖంగుతినేట్టు నువ్వు నాకేమిస్తావన్నాడు చక్రవర్తి. ఇదంతా ఏలిన వారు ఆడుతున్న పరాచకమనుకుంటాడు బిచ్చగాడు. నెమ్మదిగా,
జాగ్రత్త గా తన జోలె నుండి ఒక జొన్న గింజ ముక్కను తీసి చక్రవర్తి చేతిలో పెడతాడు .
ఆ సాయంత్రం బిచ్చగాడు తన జోలెలో చిన్న జొన్న గింజ ముక్కంత మెరుస్తున్న బంగారు బిళ్ళ ను చూస్తాడు. బాగా ఏడుస్తాడు. అతను తన జోలె లోని మొత్తం బిచ్చాన్ని చక్రవర్తి కి ఇచ్చేస్తే బాగుండేదనుకొని ఎంతో అనుకుంటూ బాధపడ్తాడు, దుఃఖిస్తాడు.
నిజానికి ఆ చక్రవర్తి భగవంతుడు.
తీసుకునే దానికంటే ఇవ్వడమే గొప్ప అని తెలిపే కథ ఇది. ఇదే ప్రపంచం లో అన్నింటి కంటే అందరినీ ఆకట్టుకునే గొప్ప గుణం. మనిషి తత్త్వాన్ని తెలిపే ఈ కథ రవీంద్రనాథ్ టాగూర్‘ గీతాంజలి‘ లోని 50 వ పద్యం. విశ్వకవి రవీంద్రుడు 1913 లో రచించినది.
ఇది భగవంతుడు భక్తుల ను విచిత్రం గా పరీక్షించే మార్గం
పూర్వం ఒక క్రూరమైన మారుతల్లి. ఆమె భర్తపేరు మ్యాలెట్. ఆమెకు ఇద్దరు కూతుర్లు. రోజీ ఆమె స్వంత కూతురు. జానీ ఆమె చనిపోయిన సవతి కూతురు. పొద్దున్నే ఆమె కూతురు రోజీకి కడుపు నిండా రుచికరమైన కోడి కూర, మాంసముతో నింపబడిన పావురము తినడానికి ఇచ్చింది. ఏదో మిగిలింది చాలీ చాలనిది జానీకి ఇస్తుండేది.
రోజీ ఏ చిన్న పని కూడా ముట్టుకోకపోయేది. మొత్తం ఇంటిపని ఉదయం నుండి సాయంత్రం వరకు జానీతో చేయించేది మారుతల్లి. అయినా మెచ్చుకోకపోయేది.
రోజీ ఎప్పుడు మంచి సిల్కు మరియు ఖరీదైన వులన్ దుస్తులు ధరించేది. జానీకి మాత్రం మామూలు కాటన్ దుస్తులు ఉండేవి.
అది జనవరి మాసం. బయట మొత్తం మంచు, విపరీతమైన చలి. చాలా మటుకు అందరు చలికి తాళలేక మంటల దగ్గర కూర్చునేది. ఒకసారి మారుతల్లి బయటికి తొంగి చూసేవరకు చలికి ముక్కు ఎర్రబడింది.
ఎంతో ప్రేమ నటిస్తూ నోట్లో పంచదార ఉన్నట్లు ఓ నా ముద్దుల జానీ అని పిలిచి నాకు మన ఇంట్లో టేబుల్పై గాజు వేజులో లిల్లీ పూల సువాసన ఆనందించాలని ఉంది. నీవు వెళ్ళి అడవి లోయలో పూసే లిల్లీ పూలు తీసుకరా అని అంది. అందుకు జానీ అమ్మా ఇది జనవరి మాసం, ఇప్పుడు లిల్లీలు వుండవు కదా. ఆ మాట పట్టించుకోకుండా జానీని డోర్ తీసి బయటికి నెట్టి వెనుక నుండి డోరు ఢబీల్న మూసేసింది. విధిలేక జానీ ఆ చలిలో అడుగుపెడితే జారే మంచుపై, అతి కష్టంగా నడుస్తూ అడవిలోకి చేరింది. ఆ అడవిలో ఆమె పన్నెండు మంది యువకులను చూసింది. వారు వేసవికాల దుస్తుల్లో వున్నారు. ఒకడు మాత్రం మేకతోలు కోటు వేసుకొని ఉన్నాడు. అతనే వారి లీడరు. వాళ్ళు ఈ అమ్మాయిని చూసి ఆశ్చర్యపడి జాలితో ఎక్కడికి వెళ్తున్నావని అడిగారు. ఆమె కథంతా వాళ్ళకు చెప్పింది. అప్పుడు వారిలో ఒకతని జేబు నుండి లిల్లీ పూలు తీసి ఇచ్చాడు. అవి పట్టుకొని ఇల్లు చేరింది. మారుతల్లికి ఈమె తిరిగి వచ్చినందుకు కోపమే కాని లిల్లీలు తెచ్చిందని లోనికి రానిచ్చింది.
మరుసటి రోజు ఎంతో ప్రేమను నటిస్తూ నా ప్రియమైన జానీ, నాకు బాస్కెటు నిండా స్ట్రాబెర్రీసు అడవి నుండి తీసుకురా అంది మారుతల్లి. దాదాపు కన్నీరు పెట్టుకుని జానీ అంది, అమ్మా అవి జనవరిలో అవి పండవు కదా. నోరు ముయ్యి అని గద్దించింది మారుతల్లి. నీవు లిల్లీసు తెచ్చినవు గదా. అదే మాదిరిగ స్ట్రాబెర్రీసు తే అని జానీని బయటికి నెట్టి తలుపు మూసేసింది. పాపం అమ్మాయి మోకాళ్ళ మటుకు మంచులో, చలి గాలిలో మామూలు దుస్తుల్లో అడివికి చేరింది. అక్కడ ఆ పన్నెండు మంది యువకులు కలిశారు. వారితో ఆమె తన మారుతల్లి చెప్పిన విషయం చెప్పింది. ఆ యువకులకు కోపం వచ్చింది. మేకతోలు కోటు వేసుకున్నతను సరే నీకు స్ట్రాబెర్రీసు ఇస్తాను, కాని నీ మారుతల్లి జాగ్రత్త పడాలి. అతను తనవారిలో ఒకతనితో అమ్మాయి బ్యాగ్ నిండా రుచికరమైన స్ట్రాబెర్రీసు నింపమన్నాడు. నింపినాక వాటిపై అతను ఊదాడో, అదేంటో తెలియదు కానీ ఇది నీ మారుతల్లిని బాగు చేస్తుందన్నాడు. జానీ వారికి కృతజ్ఞతలు తెలిపి ఇల్లు చేరింది. ఆమె దారిలో వెచ్చదనం అనుభవించింది. మారుతల్లికి జానీ తిరిగి రావడం ఇష్టంలేక కోపించింది, కానీ స్ట్రాబెర్రీసు బాగా ఇష్టమైనవి. వాటిని తీసుకుని ఆమె, ఆమె కూతురు రోజీ గబగబా ఒక్క పండు మిగలకుండా తినేశారు. జానీకి పాపం ఒక్క పండు కూడా ఇవ్వలేదు. కానీ తల్లి బిడ్డ ఆ రాత్రి వానరాళ్ళు తిన్నట్లు చాలా కడుపునొప్పితో బాధపడ్డారు.
మరునాడు ఉదయం రోజీ మరియు ఆమె తల్లికి కొంత ఆరోగ్యం బాగయ్యింది. మారుతల్లి జానీని బయటకు పంపేందుకు ఏదో ఉపాయం ఆలోచించసాగింది. ప్రేమ ఒలకపోస్తూ ఓ నా ప్రియమైన జానీ, నువ్వు గోనెసంచీ తీసుకొని అడవికి అవతలివైపు వెళ్ళి అక్కడ పండే మంచి వెరైటీ వోర్ సిస్టర్ పియర్ మేన్స్ ఆపిల్సు సంచీ నిండ తెంపుక రా. జానీ ఈసారి ఏ అడ్డూ చెప్పకుండా ఒక నిట్టూర్పు తీసి బయటికి వెళ్ళింది. మంచులో మూడుసార్లు జారిపడింది. కాళ్ళకు దెబ్బలు తగిలి గాయాలయినాయి. ఎలాగో అడవి చేరింది. అక్కడ ఆ 12 మంది యువకులు కలిశారు. ఈమె చెప్పినట్లు సంచి నిండా ఆపీల్సు పెట్టించాడు మేకతోలు కోటులో ఉన్నతడు. ఓహో ఆమె గార్కి మంచి వెరైటీ ఆపిల్సు కావలసి వచ్చిందా అన్నాడు. సంచిలో పండ్లు నింపిన తరువాత వాటి మీద మూడుసార్లు చల్లని ఆవిరి వచ్చేట్లు ఊదాడు. ఇప్పుడు మారుతల్లి వీటిని అంతగా ఆనందించకపోవచ్చు అన్నాడు అతడు. ఆ బరువైన సంచి జానీకి ఒక ఈకవలె తేలికగా ఉండి ఆమె మంచు మీద మెత్తటి దారి మీద నడిచినట్లు నడిచి ఇల్లు చేరింది. అతను మీ చెల్లెలును వీటిని తినవద్దని చెప్పమన్నారు. ఆమె ఆ విషయం చెప్పినందుకు చెల్లెలు ఆమెను నెట్టివేసి తామే తినేశారు గబగబా. వారికి కడుపులో బాగా నొప్పి లేచింది. ఈ విశ్వాసం లేని అమ్మాయి దయ్యంతో కలిసి మనమీద కుట్ర చేసిందని మారుతల్లి అంది. వారి కడుపులో పేగులకు ఏమీ తెలీదు. కానీ వారు దూదిపింజల లాగ ఇంటి పొగ గొట్టం నుండి బయటపడి ఎంతో దూరం తేలిపోయారు. ఇంటిదారి ఎప్పటికీ దొరకలేదు. ఇంటి వద్ద తండ్రి, కూతురు వివాహమై తన మంచి భర్తతో కలిసి ముగ్గురు ఎప్పటికన్నా ఎక్కువ సంతోషంగా వుండిపోయారు. మారు తల్లికి తగిన శాస్తి జరిగింది.
అనగనగా ఒక రాజు. అతని పేరు పగ్నాషియన్. అతనికి బాల్యం నుండి కొట్లాట ఆటలే ఇష్టము. చెక్క గుఱ్ఱం ఎక్కి కఱ్ఱ ఖడ్గం తిప్పుతూ ఊగుతూ సంతోషంగా ఆడుకునేవాడు. అతను పెరిగి పెద్దవాడయ్యాడు. యువరాజు అయ్యాడు. అతను రాజు అయిన వెంటనే మావుడ్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.
అతను ప్రతీ యుద్ధంలో పాల్గొనేవాడు. అతనికి ఎప్పుడు యుద్ధకాంక్షే. అతను ఎప్పుడూ స్నేహం వద్దు, యుద్ధం ముద్దు అనుకునేవాడు. అతని యుద్ధాల వలన పక్క రాష్ట్రాల రాజులకు కష్టం, నష్టం జరుగుతుండేది. ఈ తలనొప్పి తగ్గించుకోవడం కోసం పక్క మూడు రాష్ట్రాల రాజులు కలిసి ఒక ఒడంబడిక చేసుకున్నారు, ఇతనికి గుణపాఠం నేర్పాలని. ఇతనిపై సవాలు విసిరారు.
ఇది సామాన్యమైన యుద్ధం కాదని భార్యతో చెప్పాడు. తను ఒక సంవత్సరం వరకు తిరిగి రాకపోతే తను ప్రపంచంలో లేననుకొని లేక జైల్లో బంధించబడినానని అనుకొని నీవు స్వేచ్ఛగా వేరే వివాహం చేసుకో అని చెప్పాడు. అంతవరకు ఒంటరిగా వుండలేవు కాబట్టి నీవు రాత్రిళ్ళు పొద్దుపోయే వరకు మన న్యాయశాఖ పెద్ద గుమాస్తాచేత పుస్తకాలు చదివించుకో. అతను ప్రపంచంలో జీవించి లేననుకోమనే మాట ఆమె మనసుకు బాధను కలిగించింది. అయినా ఒంటరిగా కాలక్షేపం చేయడం కష్టమనుకొని భర్త చెప్పిన పెద్ద గుమాస్తాతో రాత్రిళ్ళు పుస్తకాలు చదివించుకుంటూ వుండమన్న మాట కొంత నయమనుకుంది.
ఆ పెద్దగుమాస్తా కోటలో వున్న పుస్తకాలన్నీ అరడజన్ సార్లు ఇదివరకే చదివేశాడు. అతను చాలా గౌరవంగా రాణీగారికి కొన్ని పుస్తకాలు, మరికొన్ని ఆయన రాసినవి ప్రతిరోజు చాలాసేపు వరకు చదివి వినిపించేవాడు. ఆమెగారు అతనితో సంతోషంగా మాట్లాడుతూ ఆ కథలన్నీ వింటూ ఒక సంవత్సరంపైన ఒక దినం కాలం గడిపింది.
భర్త చెప్పిన కాలం గడిచింది కాబట్టి, గుమాస్తాతో తనను వివాహం చేసుకోమని కోరింది రాణి. దానికి గుమాస్తా నేను ధన్యుడను మహారాణి. కానీ నేను చాలా మామూలు వాడిని. మీరు రాజ వంశీయులు. అదీగాక రాజు ఏదైన జైలులో బంధింపబడి ఉండవచ్చు. నాకు ఇష్టం లేదని చెప్పను కాని, ఇంకొక సంవత్సరం, ఒక దినం వేచి ఉండటం మంచిదన్నాడు. ఆ సమయం కూడా గడిచింది. కానీ రాజు రాలేదు.
రాజు పగ్నాషియస్ యుద్ధంలో చంపబడలేదు. కానీ అతడ్ని గాయపరిచి రెండు సంవత్సరాలు జైలుశిక్ష విధించాడు రాజు లిటిల్ గోర్ము. అతను మూడు ప్రక్క రాష్ట్రాల ప్రతినిధి రాజు. ఆ సమయం గడిచాక రాజు పగ్నాషియస్ ను అతను జైలు నుండి విడిపిస్తూ ఇప్పుడు నీకు యుద్ధకాంక్ష జబ్బు కుదిరందనుకుంటా అన్నాడు. ఇకముందు నీపై జాలి చూపను. యుద్ధభూమిలో పట్టుబడితే నీ తల నరికేయబడుతుంది. ఇప్పుడు నిన్ను వదిలి పెడుతున్నాను. రాజు లిటిల్ గోర్ము, పగ్నాషియస్ గుఱ్ఱాన్ని జుర్మానా కింద తన వద్దనే ఉంచుకున్నాడు. కాబట్టి పగ్నాషియస్ తన ఇంటికి నడిచి పోవలసి వచ్చింది.
అతను నడిచి నడిచి చివరకు తన కోట చేరేవరకు అక్కడ పెండ్లికి జోరుగ తయారీలు అవుతున్నాయి. ఎందుకనగా గుమాస్తా పెట్టిన రెండు సంవత్సరాల ఒక దినం గడువు పూర్తి అయింది. పగ్నాషియస్ అప్పటికి రాలేదు, కాబట్టి గుమాస్తా వివాహానికి ఒప్పుకున్నాడు.
అప్పుడు ఆ రాణి ఆ గుమాస్తా తను మామూలువాడినన్న మాటను మదిలో ఉంచుకొని, అతడిని రాజవంశంలో చేర్చి, రాజ్య వ్యవహారాలు చూచే అర్హత ఇచ్చింది. ఇప్పుడు అతను ఆమెకు తగిన వాడైనాడు. వారు వారి పెండ్లి వేడుకలకు గొప్ప ఏర్పాటు చేశారు. దానికి దూర దూరాలనుండి రాజులు, ధనికులు, గొప్పవారు అక్కడికి చేరారు. వచ్చిన వారిలో రాజు లిటిల్ గోర్ము రాణి మావుడ్ కు శుభాకాంక్షలు తెలిపాడు, కాని రాజు పగ్నాషియస్ గురించి ఏమీ అడగలేదు. కేవలం ఒక ముసిముసి నవ్వు నవ్వాడు.
విందు భోజనాలు చివరకు వచ్చేవరకు పగ్నాషియస్ కోట వద్దకు చేరాడు. ఆ చింపిరి వెంట్రుకల నెత్తితో, చిరిగిన గుడ్డల్లో ఉన్న తమ రాజును ఖడ్గం మరియు గుఱ్ఱం లేనందున ఎవరూ కూడా గుర్తించలేదు. పగ్నాషియస్ బాధతో కన్నీరు కార్చాడు. తను యుద్ధం వలన రాజ్యాన్ని, ధనాన్ని, చివరకు తన భార్యను కూడా పోగొట్టుకున్నానని అంటూ మూల్గాడు. నా పని అయిపోయిందన్నాడు. నౌకర్ల ఇండ్లలో అతనికి ఒక కోడి కాలును తినేందుకు ఇచ్చారు. అది తిని నోరు మరియు కండ్లు తుడుచుకొని వెళ్ళిపోయాడు ఎక్కడికో. ఎక్కడికి పోయాడో ఎవరికి తెలియదు. కనీసం తన పాత రాజ్యంలో మరెప్పుడూ కనబడలేదు. అతను చివరకు అనుకున్నాడు. స్నేహం ముద్దు, యుద్ధం వద్దు. అది ఆనాటికే కాదు, ఏనాటికైనా అదే సత్యం .అదే క్షేమం. ఇదే అతనిలో కలిగిన పరివర్తన.
పూర్వం ఒక క్రూరమైన మారుతల్లి. ఆమె భర్తపేరు మ్యాలెట్. ఆమెకు ఇద్దరు కూతుర్లు. రోజీ ఆమె స్వంత కూతురు. జానీ ఆమె చనిపోయిన సవతి కూతురు. పొద్దున్నే ఆమె కూతురు రోజీకి కడుపు నిండా రుచికరమైన కోడి కూర, మాంసముతో నింపబడిన పావురము తినడానికి ఇచ్చింది. ఏదో మిగిలింది చాలీ చాలనిది జానీకి ఇస్తుండేది.
రోజీ ఏ చిన్న పని కూడా ముట్టుకోకపోయేది. మొత్తం ఇంటిపని ఉదయం నుండి సాయంత్రం వరకు జానీతో చేయించేది మారుతల్లి. అయినా మెచ్చుకోకపోయేది.
రోజీ ఎప్పుడు మంచి సిల్కు మరియు ఖరీదైన వులన్ దుస్తులు ధరించేది. జానీకి మాత్రం మామూలు కాటన్ దుస్తులు ఉండేవి.
అది జనవరి మాసం. బయట మొత్తం మంచు, విపరీతమైన చలి. చాలా మటుకు అందరు చలికి తాళలేక మంటల దగ్గర కూర్చునేది. ఒకసారి మారుతల్లి బయటికి తొంగి చూసేవరకు చలికి ముక్కు ఎర్రబడింది.
ఎంతో ప్రేమ నటిస్తూ నోట్లో పంచదార ఉన్నట్లు ఓ నా ముద్దుల జానీ అని పిలిచి నాకు మన ఇంట్లో టేబుల్పై గాజు వేజులో లిల్లీ పూల సువాసన ఆనందించాలని ఉంది. నీవు వెళ్ళి అడవి లోయలో పూసే లిల్లీ పూలు తీసుకరా అని అంది. అందుకు జానీ అమ్మా ఇది జనవరి మాసం, ఇప్పుడు లిల్లీలు వుండవు కదా. ఆ మాట పట్టించుకోకుండా జానీని డోర్ తీసి బయటికి నెట్టి వెనుక నుండి డోరు ఢబీల్న మూసేసింది. విధిలేక జానీ ఆ చలిలో అడుగుపెడితే జారే మంచుపై, అతి కష్టంగా నడుస్తూ అడవిలోకి చేరింది. ఆ అడవిలో ఆమె పన్నెండు మంది యువకులను చూసింది. వారు వేసవికాల దుస్తుల్లో వున్నారు. ఒకడు మాత్రం మేకతోలు కోటు వేసుకొని ఉన్నాడు. అతనే వారి లీడరు. వాళ్ళు ఈ అమ్మాయిని చూసి ఆశ్చర్యపడి జాలితో ఎక్కడికి వెళ్తున్నావని అడిగారు. ఆమె కథంతా వాళ్ళకు చెప్పింది. అప్పుడు వారిలో ఒకతని జేబు నుండి లిల్లీ పూలు తీసి ఇచ్చాడు. అవి పట్టుకొని ఇల్లు చేరింది. మారుతల్లికి ఈమె తిరిగి వచ్చినందుకు కోపమే కాని లిల్లీలు తెచ్చిందని లోనికి రానిచ్చింది.
మరుసటి రోజు ఎంతో ప్రేమను నటిస్తూ నా ప్రియమైన జానీ, నాకు బాస్కెటు నిండా స్ట్రాబెర్రీసు అడవి నుండి తీసుకురా అంది మారుతల్లి. దాదాపు కన్నీరు పెట్టుకుని జానీ అంది, అమ్మా అవి జనవరిలో అవి పండవు కదా. నోరు ముయ్యి అని గద్దించింది మారుతల్లి. నీవు లిల్లీసు తెచ్చినవు గదా. అదే మాదిరిగ స్ట్రాబెర్రీసు తే అని జానీని బయటికి నెట్టి తలుపు మూసేసింది. పాపం అమ్మాయి మోకాళ్ళ మటుకు మంచులో, చలి గాలిలో మామూలు దుస్తుల్లో అడివికి చేరింది. అక్కడ ఆ పన్నెండు మంది యువకులు కలిశారు. వారితో ఆమె తన మారుతల్లి చెప్పిన విషయం చెప్పింది. ఆ యువకులకు కోపం వచ్చింది. మేకతోలు కోటు వేసుకున్నతను సరే నీకు స్ట్రాబెర్రీసు ఇస్తాను, కాని నీ మారుతల్లి జాగ్రత్త పడాలి. అతను తనవారిలో ఒకతనితో అమ్మాయి బ్యాగ్ నిండా రుచికరమైన స్ట్రాబెర్రీసు నింపమన్నాడు. నింపినాక వాటిపై అతను ఊదాడో, అదేంటో తెలియదు కానీ ఇది నీ మారుతల్లిని బాగు చేస్తుందన్నాడు. జానీ వారికి కృతజ్ఞతలు తెలిపి ఇల్లు చేరింది. ఆమె దారిలో వెచ్చదనం అనుభవించింది. మారుతల్లికి జానీ తిరిగి రావడం ఇష్టంలేక కోపించింది, కానీ స్ట్రాబెర్రీసు బాగా ఇష్టమైనవి. వాటిని తీసుకుని ఆమె, ఆమె కూతురు రోజీ గబగబా ఒక్క పండు మిగలకుండా తినేశారు. జానీకి పాపం ఒక్క పండు కూడా ఇవ్వలేదు. కానీ తల్లి బిడ్డ ఆ రాత్రి వానరాళ్ళు తిన్నట్లు చాలా కడుపునొప్పితో బాధపడ్డారు.
మరునాడు ఉదయం రోజీ మరియు ఆమె తల్లికి కొంత ఆరోగ్యం బాగయ్యింది. మారుతల్లి జానీని బయటకు పంపేందుకు ఏదో ఉపాయం ఆలోచించసాగింది. ప్రేమ ఒలకపోస్తూ ఓ నా ప్రియమైన జానీ, నువ్వు గోనెసంచీ తీసుకొని అడవికి అవతలివైపు వెళ్ళి అక్కడ పండే మంచి వెరైటీ వోర్ సిస్టర్ పియర్ మేన్స్ ఆపిల్సు సంచీ నిండ తెంపుక రా. జానీ ఈసారి ఏ అడ్డూ చెప్పకుండా ఒక నిట్టూర్పు తీసి బయటికి వెళ్ళింది. మంచులో మూడుసార్లు జారిపడింది. కాళ్ళకు దెబ్బలు తగిలి గాయాలయినాయి. ఎలాగో అడవి చేరింది. అక్కడ ఆ 12 మంది యువకులు కలిశారు. ఈమె చెప్పినట్లు సంచి నిండా ఆపీల్సు పెట్టించాడు మేకతోలు కోటులో ఉన్నతడు. ఓహో ఆమె గార్కి మంచి వెరైటీ ఆపిల్సు కావలసి వచ్చిందా అన్నాడు. సంచిలో పండ్లు నింపిన తరువాత వాటి మీద మూడుసార్లు చల్లని ఆవిరి వచ్చేట్లు ఊదాడు. ఇప్పుడు మారుతల్లి వీటిని అంతగా ఆనందించకపోవచ్చు అన్నాడు అతడు. ఆ బరువైన సంచి జానీకి ఒక ఈకవలె తేలికగా ఉండి ఆమె మంచు మీద మెత్తటి దారి మీద నడిచినట్లు నడిచి ఇల్లు చేరింది. అతను మీ చెల్లెలును వీటిని తినవద్దని చెప్పమన్నారు. ఆమె ఆ విషయం చెప్పినందుకు చెల్లెలు ఆమెను నెట్టివేసి తామే తినేశారు గబగబా. వారికి కడుపులో బాగా నొప్పి లేచింది. ఈ విశ్వాసం లేని అమ్మాయి దయ్యంతో కలిసి మనమీద కుట్ర చేసిందని మారుతల్లి అంది. వారి కడుపులో పేగులకు ఏమీ తెలీదు. కానీ వారు దూదిపింజల లాగ ఇంటి పొగ గొట్టం నుండి బయటపడి ఎంతో దూరం తేలిపోయారు. ఇంటిదారి ఎప్పటికీ దొరకలేదు. ఇంటి వద్ద తండ్రి, కూతురు వివాహమై తన మంచి భర్తతో కలిసి ముగ్గురు ఎప్పటికన్నా ఎక్కువ సంతోషంగా వుండిపోయారు. మారు తల్లికి తగిన శాస్తి జరిగింది.
