ఒక సహించని తనం, సహనం లేనితొందరలు, మనిషి మీద మనిషికి అకారణంగా ఏర్పడుతున్న ద్వేషం, అసూయ, స్వార్థంసామాజిక వికారాలకు కారణమవుతున్నాయి. మనిషిని మానవత్వాన్ని తప్పించిన,మనిషిలో మనిషి లేనిఅనేక పరిస్థితులనేపథ్యంనుంచి, కవి తన పరిసరాల నుంచి మొదలై రాసినకవితాగుచ్చం‘మళ్లీ మనిషి లోకి’ కవితా సంపుటి. మనిషిలో మనిషి ప్రవహించటం లేదు. మనిషిలో మనిషితోటి వారినికనీసం మెచ్చే పరిస్థితి లేదు.మనిషి తప్పిపోయిన చోటు నుండి.దూరమైనదగ్గరితనంలోంచి మళ్ళీమనిషి మనిషి లోకి రావాలనికలల సంపుటిని వెలువరించాడు కవి. ఆదిలాబాద్ ప్రజల గొంతుక. – ”పచ్చని కోరికలతో/పంటనే ప్రపంచ మనుకొని/లోకమే తన వాళ్లనుకొని/బతుకుపయనమై పోతున్నప్పుడు/ఆకుపచ్చని కలల రాజు మట్టి గొంతుక కవిఉదారి నారాయణ.

మళ్లీ మనిషి లోకి ఉదారి నారాయణ కవితా సంపుటిలో మొత్తంయాభై ఎనిమిది కవితలు ఉన్నాయి.ప్రతి కవిత దేనికదే వస్తు శిల్పాలతో అలరారుతుంది.కవితా సంపుటిలో ప్రజల దుఃఖముంది. భావోద్వేగాలు ఉన్నాయి.మార్పు కోసం పడుతున్న తపన ఉన్నది. ప్రబోధం ఉన్నది. సందేశం ఉన్నది. ఇన్నిటి వ్యాఖ్యానమే మళ్ళీ మనిషి లోకి. ఇక్కడ రెండు పార్శ్వాలు ఉన్నాయి.ఒకటవ పార్శ్వంలోఎక్కడ గాయమవుతున్నదో అక్కడే మొదలవుతున్న కవికనిపిస్తాడు. రెండవ పార్శ్వంలోఒక భిన్నత్వము నుండి మళ్లీ మనిషి లోకిఒకటిగా చేర్చబడటం. పుస్తకం టైటిల్ని చూస్తే మళ్ళీ మనిషి లోకి అంటే ఏమిటి అని ప్రశ్న ఉదయిస్తుంది. కానీకవితా సంపుటి చదివిన తర్వాతకవి వేదనలన్నీ అర్థమవుతాయి.
మనిషిలోఅనేక శత్రువులు వచ్చి పడ్డారు.ఇవాళమనిషి మనిషిగా లేడు.మనిషిలో నుండిమనిషి తప్పిపోయాడు. మనిషితనాన్ని గుర్తించి మళ్లీ ప్రసరించమని కవికోరుకుంటున్నాడు. కవిత్వానికి తగినట్టుగా సంపుటి పై గల ముఖచిత్రం అంత మార్మికతను కలిగి ఉన్నది.మళ్లీ మనిషి లోకి వెళ్లే ముందు ఒక ప్రాథమిక ప్రశ్న – నేను ఎవరిని అని ప్రశ్నించుకోవటం.నేను అని పలకడంలో ఏక వచనం సూచిస్తుంది కానీ, నాలో నేనే లేనప్పుడు నేను అనే అస్తిత్వానికి అర్థం ఏమి ఉంటుంది? నేను అనబడే మనిషిలో అనేక బాధలు ఉన్నాయి,అపజయాలున్నాయి, గాయాలు ఉన్నాయి, చెప్పలేనన్ని అగాధాలు ఉన్నాయి. గాథలు ఉన్నాయి.నేనిలా ఒక్కడినే ఉండాలి, బాధలతోనే ఉండాలి అని ఎవరనుకుంటారు? ఇవాళ సగటు మనిషి ఒంటరి అయిన తర్వాత వేధిస్తున్న ప్రశ్నలు ఎన్నో కవినీ వేధించాయి. సామాన్యులను చుట్టుముట్టుకున్న అనేక సమస్యల పొరలను ఒకటి ఒకటిగా వలిచి చూపిస్తున్న ప్రయత్నమే ఈ కవితా సంపుటి.బాధలకు కన్నీళ్ళకు కారణమైన వాళ్లను చూపిస్తూ మనిషి కమ్మని సందేశం ఇస్తున్నాడు. దురాక్రమణ స్వభావం, ఆధిపత్య భావన, అసూయ ఒకరిని కూలదోయాలనే కుట్రపూరితమైన ఉద్దేశాలు, తోసుకొని ముందుకు పోవాలని కుటిలం మొదలైనవన్నీమనిషిని మనిషి నుంచి తప్పిస్తున్నాయి.

ఎవరి మనసులు వీళ్లు అనే కవితలో కవిపక్షం‘గుండుసూది నుంచి రాకెట్ దాకా / నెత్తుటి ముద్దలైనోళ్ళు/కంపెనీ లేబుళ్ల కిందజిగురుపూతైనోళ్లు / ఎక్కడికి వీళ్ళ పయనం/వాళ్ల బాధలను తుడిచే గుండెల వైపు/ వాళ్లు మొలకెత్తిన మట్టి వైపు /వాళ్ల మనుషులు ఉండే దారి వైపు ‘ప్రజల వైపు. నమ్ముకున్న శ్రమ, ఫలించినపుడు వలసపోయి బతుకుతున్న బాధలో కవి వెతుకులాట ఆదిలాబాధ ప్రజలనిషానీ చిత్రం.ఆదిలాబాద్ గుర్తులను బాల్యాన్ని నెమరు వేసుకున్నాడు. జీవితంతో సంభాషణ, చెట్టుతో జ్ఞాపకాలు జ్ఞాపకాలైన సంభాషణ,అవి ఎంతటివోచిత్రిక చేస్తూ ‘ నేను మనసుతో మాట్లాడాలనుకున్నప్పుడు / ఈ చెట్టు నీడనే చేరుకుంటాను /చెట్టుతో మాట్లాడుతానని అంటాడు కవి. అట్లా మాట్లాడితే చెట్టు వింటుంది. కవిత్వం అంటే మనిషే. ”కవిత్వం మరేమీ కాదు కాలమే.హృదయం తోలుచుకొని వచ్చే వేడి వేడి అక్షరాలపనితనం. అక్షరాల అల్లిక అని చెబుతూడా. నందిని సిధారెడ్డి మొత్తం మీద జీవితం వాసన రావాలే అంటారు. కాల సందర్భాన్ని, కవిత్వాన్ని, అట్లాసంపుటిలో రూపు కట్టించాడు కవి.మనిషికి మనిషి తనానికిదగ్గరై మళ్ళీ మనిషి లోకి -సంపుటిని అందించాడు ఉదారి నారాయణ. ఆయనప్రజలను ప్రేమించడం వలననే దుఃఖాన్ని అర్థం చేసుకున్నాడు. ప్రజలలో తాను ఒకడై కవిత్వం రాశాడు.సింగల్ చాయ్, ఒక డబల్ రొట్టెతో ఆకలిని చల్లబరుచుకునే అతి సామాన్యులలో సామాన్యుడైతే తప్ప ప్రజల హృదయాలలోకి తొంగి చూడలేరు. అట్లాంటి సామాన్యులకు ధనస్వామ్యులలో తుపాతులు ఏం తెలుస్తాయి? “మీ రియల్ దందాలకు ఆల్ ఇండియా కుట్రదారులకు నేను అడ్డు రాను/ మా కాందానంతా గిదే పని చేసి/ గీన్నేఇంతఖాల్ అయ్యిండ్లు /మీ అందరి భరోసా తోనే /బతుకు డకల్ బండిని దొబ్బుక స్తున్నా / గీ మట్టిలోనే పుట్టినోన్ని /గీ మట్టిలోనే పదిలమయ్యేటోన్ని /నన్ను దొబ్బెయ్యకుండ్లి /నన్ను గీడ్నుంచి గెదమకుండ్లి / నా బతుకును కూలగొట్టకుండ్లి “అంత స్పష్టంగా చెప్పిన కవి ఉదారి నారాయణ. ఇది ధిక్కారం. కవి సున్నిత మనస్కుడు కనుక సెన్సిటివిటీని తీసుకుంటూనే ఖచ్చితత్వాన్ని ప్రకటించాడు.నతన వెంట పాఠకులను తీసుకువెళ్లడానికి నిలిపి ఆలోచింప చేయటానికి ప్రజలపై సానుభూతిని కలిగించటానికితగిన భావవ్యక్తీకరణను భాషలో పొందుపరిచాడు.
మానవత్వమే గెలుస్తుందని చెప్పటానికి కరోనా వైరస్ వింత పోకడలను కవిత్వీకరించటము ఒక దాఖలా.ఒక అప్పటి కాలంలో ప్లేగు ప్రబలి ప్రజా జీవితాలను అతలాకుతలం చేసింది. ఆ అనుభవాలు మనముందుపై తరాల వాళ్లకు ఉంది.అప్పటి కొన్ని జాగ్రత్తలు , అందులో నుండి బయటపడేకొన్ని వ్యూహాలుకొంతవరకు అందినప్పటికీ, కరోనామహమ్మారికొత్త రకం గా వచ్చింది.ఇట్లా కరోనాపీడించటాన్ని అనుభవించాం.ఇక్కడఎప్పటికైనా మానవత్వమే గెలుస్తుందని ఒక ధీమానికవి వెల్లడించిన తీరుఆశాజనకమైంది.ఈ కరోనాకు కులం లేదు మతం లేదు ఏ వివక్షత లేదు కానీ అన్ని వివక్షతలు ఉన్న మనిషికి సోకింది.ఎప్పటికైనా ఆ మనిషి లోకి తొంగి చూసే కవిత నేల దిగిన నెలవంకలు. కరోనా వైరస్ తో మరణించిన హిందువులకు ముస్లిం సోదరులు అంత్యక్రియలు చేసిన సందర్భాన్ని’శరీరాన్ని పాయలుగా చీల్చుకొని / జీవజలాన్నిచ్చే నది లాంటివాడని…గుర్తుంచుకో “ఇది చారిత్రకసందర్భంగా కవి గుర్తు చేశాడు.
మన పరిసరాలనుమనలను ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకోకపోతే మనం ఎట్లా ఉండలేమో మన మెదడును అలాగే శుభ్రం చేసుకో లేకపోతే అట్లానేమనగలగలేం.అందుకు కవిత్వం గొప్ప ఉపకరణ.మన ఆలోచనలు పరిణతి చెందటానికిగొప్పగా ఉపకరిస్తుంది.భావనలను సృజనతో మేళవించుకోవటానికి మనకున్న పెద్దదిక్కు కవిత్వమే.ఆలోచింపచేసేది కవిత్వం.రూపాంగానే మిగిలిపోయిన మనిషినైతికంగా మిగలలేదు. ఆత్మీయతను కోల్పోయిన చోటఆగమైపోతున్నాడు. కనుక మనిషిని పునస్తాపితం చేయడానికి మనిషి లోకి తొంగి చూడమనిమళ్లీ మనిషి లోకి కవిత్వమంతా ఆర్ద్రమై పరుచుకున్నది.
సమాజంఇట్లా ఉండటానికి వైరుధ్యాలను చెప్పి స్వీయానుభవాలను జతచేసి ఆలోచింపజేశాడు కవి.’ఆ పెద్దలు నా బతుకు దాతలు /నా మెతుకు మెతుకుపై /నిజాయితీ శిల్పం చెక్కిన /శిల్పకారులు వాళ్లు .ఎంతో సహజంగా చెప్పాడు. అలానే “కుమ్మరి కుండను నేను/ నీ పగలెత్తు అలసటను నిద్రలోకి పంపే /గౌండ్ల మల్లేషు కల్లు బుంగను నేనే / నా చూపు ఒక కళాఖండం అన్నాడు.శ్రమ చేస్తున్న జీవులను కళాత్మకంగా చూస్తూ కవిత్వమయ్యాడు .ఉపాధ్యాయ వృత్తిలోతెలుగు సబ్జెక్టు బోధించే టీచర్ఉదారినారాయణ. భావవాదం ఎక్కువగా కనిపించే వారి కన్నా భిన్నమైన వాడు. వాస్తవికతను అధ్యయనం చేశాడు కనుక పిల్లల మీద ముద్ర వేయగలరచనలు చేశాడు.భద్ర జీవితమే ముఖ్యం అనుకుంటేఉదారి నారాయణ కవి కాలేకపోయేవాడు.వివక్షతల పూరితమైన సమాజంలో డబ్బు పీడన ఎలా ఉందో రైతు వేదనలు ఎలా ఉన్నాయోఅర్థం చేసుకున్న కవి ఊరు కండ్ల ముందే చిద్రమవుతున్న ధైర్యాన్ని రాశాడు.పల్లెలు పట్టణాలుగా మారిపోతుంటే ఆహారం వేషధారణ వ్యవహారం మారిపోతూ ఉంటే ఇది నాగరికథ అన్నాడు.
వ్యవసాయం ఒకప్పుడురైతు చేతిలో ఉండేది.ఎరువులు విత్తనాలు అన్ని రైతే సమకూర్చుకునే వాడు.ఇవాళ మార్కెట్ పై ఆధారపడపలసిన స్థితి ఏర్పడింది.రైతు పరాధీనమయ్యాడు.చివరకు ఆత్మహత్యల పర్యంతమయ్యాడు.ప్రపంచీకరణ కనిపించని శత్రుదాడిలో యుద్ధం ఎక్కడ చేయాలో దిక్కుతోచని పరిస్థితిలోఎవరికి ఎవరుఏమీ కానీ ఒంటరితనంలోకి వెళ్ళిపోయారు.కార్పొరేట్ వైద్యం ప్రజలకు మరింతభారమైపోయింది.ఎక్కడో ప్రకృతి లోసహజ సుందర అడవుల మధ్య స్వచ్ఛమైన జీవనం మధ్యఉన్న ఆదిలాబాద్ ప్రజలు కూడా ఇవాళ్ళ ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి .పల్లె ఎప్పుడూఇంకా పచ్చని కొంగుపరచి చూస్తదికానీ వచ్చి వాలుతున్నవి డేగలు కదా!అందుకే కవి”రేపైనా ఎప్పుడైనా/ నా చిన్ని బొమ్మరిల్లు/ లారీల్లోనో లాకర్లలోను కరెన్సీ కావచ్చు/ అప్పటి చర్నాకోలలు/చెరి సగం మైనింగులా / చప్పరించవచ్చు ” కవిత్వమైపారించాడు.
జీవితమంతా సంఘర్షణ అయిఉన్నది.అందుకే ప్రజల జీవితాన్ని అర్థంచేసుకోవలసిన ఆగత్యమున్నది. ఉదారి నారాయణఆ ప్రయత్నంలోభాగంగా కవితా సంపుటిని వెలువరించాడు.ఆయనకవిత్వంలో స్థానికత ఉంది.కొత్త ఒరవడితో రాయాలనే ప్రయత్నాలుఉన్నాయి. గోగు పువ్వును కొత్తగా అభివ్యక్తిచేశాడు.పరిస్థితినిఉన్నదిఉన్నట్టుగాప్రజల వద్దకు తీసుకుపోవడానికిప్రజలనుచైతన్యం చేయటానికికవికంకణబద్ధుడైయున్నాడు.నిత్యమై మెలకువతో ఉన్న కవిమళ్లీ మనిషి లోకిఅభినందనీయమైంది.