ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యక్రమాలు ఎఫ్ ఎం రేడియో 103.5 మెగా హెడ్స్ పై లేదా
https://onlineradiofm.in/stations/all-india-air-warangal
లింక్ ద్వారా కార్యక్రమం ప్రసారం అవుతున్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా వినవచ్చు
Uncategorized
కవితలు:-
1 నీవెక్కడ నేనెక్కడ- చిట్టిప్రోలు వెంకటరత్నం
2. రెక్కలు,- పెద్దూరి వెంకట దాసు
3. నానీలు- జి. సులోచన
4. నవ్య కలం సినారె- డాక్టర్ వసుంధర, చెన్నై
5. శనార్తులు – దేవనపల్లి వీణా వాణి
6. వర్షం వర్షం వర్షం – మహమ్మద్ అబ్దుల్ రషీద్
7. ఉదయ సంధ్యలో- లక్ష్మీ త్రిగుళ్ళ
8. అంగూరు గుత్తులు- రమేష్ నల్లగొండ
9. కల్తీ యుగం -రుద్రాక్షల మఠం ప్రభులింగ శాస్త్రి
10. ఆత్మ సౌందర్యం- రాధిక సూరి
11. వృక్ష మాత- పద్మశ్రీ చెన్నోజ్వల
12. సహన ధాత్రి- అరుణా ధూళిపాళ
13. మహిళా చైతన్యం-కీర్తి శేషులు గొడవర్తి సంధ్య
కథలు:-
1 పాద యుగళం – ధర్మముళ్ళ చంద్రశేఖర్
2. కుజదోషం- డాక్టర్ మజ్జి భారతి
3. మరుగుజ్జు బుద్ధులు – శీలా సుభద్ర దేవి
4. కుబేర- ఒద్దిరాజు సుభాష్ చంద్ర
5. నా ఇల్లు- కథ రెండవ భాగం లక్ష్మీ మదన్
6. సభ్య సమాజం -నారాయణరావు (తరానా)
7. తనూజ లక్ష్మీ త్రిగుళ్ళ
వ్యాసాలు :-
1. లేఖ సాహిత్యంలో భాషా విశేషాలు- డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి
2. తొలి తెలుగు కవయిత్రి మొల్ల- విజయ రంగనాథం
3. నాకు తెలిసిన బిఎస్ రాములు డాక్టర్ భూతం ముత్యాలు
4. తోరణాలు – విజయ కందాళ
5. తెలంగాణ ఉద్యమ కవి కాళోజి – డాక్టర్ అరుణపరంధాములు
6. తెలంగాణ భాషా దినోత్సవం- డాక్టర్ చీదర్ల సీతాలక్ష్మి
7. తంజావూరు కవయిత్రి- మధురవాణి విజయ రంగనాథం
8. ఇల్లు మనిషి చిరునామా,- ఆచార్య కడారు వీరారెడ్డి
9సాహితీ సిరిమల్లి మన వడ్డేపల్లి- డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్
10. కవిత్వాస్వాదన – ఈశ్వర్ చరణ్ కవిత ఉషస్సు సంధినేని నరేందర్
11. జాతీయాలు -రంగరాజు పద్మజ
12. ఇంద్రధనస్సులో ఏడోరంగు- దేవనపల్లి వీణా వాణి
13. విద్యుత్కవి డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ – ఎన్.నరేష్ చారి
14. విశ్వ కవి – మన కవి-రవీంద్రనాథ్ ఠాగూర్ -రాధిక సూరి
15. గూటి పక్షులు గులాబీ ముళ్ళు పద్మశ్రీ చెన్నోజ్వల
16. మహాప్రస్థానం మళ్లీ చదువుదాం – కె.కె.తాయారు
17. శ్రీమతి దుర్గాబాయి దేశ్ ముఖ్ – కీర్తిశేషులు గొడవర్తి సంధ్య
ధారావాహిక:-
జీవన మాధుర్యం 2 వ భాగం
బాల సాహిత్యం:-
1.ఓ మేక ఓ తోడేలు (అనువాద కథ) ఒద్దిరాజు మురళీధర్ రావు
2.ఆర్మీ వీరుడు – దార ప్రీతిక
ఇంద్రధనస్సు:-
1. మన ఉపాధ్యాయుడు – ముదుగంటి ప్రతాప్ రెడ్డి – సందినేని నరేందర్
2. వేగుచుక్కలకే వేగుచుక్క – రంగనాయకమ్మ – రంగరాజు పద్మజ
3. ప్రజ్ఞాన్ విద్యార్థి ప్రజ్ఞ- వలిపె రామ్ చేతన్
4. కరణ్ బజాజ్ – నారాయణ రావు ( తరానా)
5. సాహిత్యాన్ని ప్రేమించిన కవయిత్రి గొడవర్తి సంధ్య గారికి శ్రద్ధాంజలి
-మయూఖ సంపాదకులు
ఇంటర్వ్యూ లు
1 బహుముఖ ప్రజ్ఞాశాలురు – సంగనభట్ల నరసయ్య గారు-అరుణ ధూళిపాళ
2
పుస్తక సమీక్షలు:-
1. విజ్ఞానం కలిగించే ఆయుధం ఆనందలహరి
-నన్నపురాజు విజయశ్రీ
2. కళ్యాణం శ్రీనివాస్ “పిడికిలి”
— నరేందర్ సాదినేని
3. మాటల చెట్టు మాటలు:-
-కట్టెకోల విద్యుల్లత
అనువాద సాహిత్యం:-
1. “గుల్జార్ షాయరీ” గీతాంజలి విశ్లేషణ -నరేందర్ సందినేని
2. పాఠశాల అనే విశాల భావం ముందు ఎవరు తెలుసుకున్నారు! (అనువాద కథ)-ఒద్ది రాజు మురళీధర్ రావు
3. “వచన కవితగా…”- (అనువాద కవిత)-ఎలనాగ
4. “మీ ఔర్ మీరా ఆంగన్”( అనువాద కవిత)
మూలం : వారాల ఆనంద్
విజయ రంగనాథం (హిందీ అనువాదం)
సంపాదకీయం :-
శతవత్సరాల కవితాశరధి దాశరథి – డాక్టర్ కొండపల్లి నీహారిణి,
మయూఖ పత్రిక సంపాదకులు
కవితలు:-
1. యుద్ధం లేనిది ఎక్కడ?-మారం రాజు శ్రీనివాసరావు
2. సెల్యులార్ జైల్ – శాంతి
3. మనసు – మాట – అరుణ ధూళిపాల
4. The learned poem – ఆర్ ఎం ప్రభులింగ శాస్త్రి
5. పిచ్చుక – గడ్డం సులోచన
6. శవయాత్ర పాఠం – కందాలై రాఘవాచార్య
7. అల్యం గల్లంతైంది – డాక్టర్ బండ సరోజన
8. నాన్న నాకు కొంచెం ధైర్యం యివ్వు- మధు జెల్లా
9. మహాకవి జాషువా స్మృతి గీతాలు – బొద్దుల లక్ష్మయ్య
10. బాట – జ్యోత్స్న తాతి రాజు
కథలు :-
1. దశ దిశ- దేవులపల్లి విజయలక్ష్మి
2. ఉచితం – లక్ష్మీ మదన్
3. శిక్షెవరికి – విజయ రంగనాథం
4. తిరిగి వచ్చిన వసంతం – మంచి భారతి
వ్యాసాలు :-
1. భారతదేశం మనకు ఏం నేర్పిస్తుంది? – దేవనపల్లి వీణా వాణి
2. అబ్బూరి ఛాయాదేవి – రాధిక సూరి
3. కారా మాస్టారు విజయ రంగనాథం
4. పరిశోధక పరమేశ్వరుడు ఆచార్య వెలుదండ నిత్యానంద రావు – బి. ఆంజనేయులు
5. కత్తి పట్టిన కవయిత్రి – విజయ రంగనాథం
6. హలో హల్లులు- విజయ కందాళ
7. పురుషోత్తమ మాసం – విజయ కందాళ
8. వేణు నక్షత్రం కథలు సమకాలీన జీవన చిత్రాలు- రంగరాజు పద్మజ
9.లక్ష్మయ్య కవిత్వంతో కరచాలనం – దాస్యం సేనాధిపతి
10. ఆషాడ మాస విశిష్టత- విజయ గోలి
11. కవిత్వాస్వాదన ( ధారవాహికం) సందినేని నరేంద్ర
1. మాదాడి సత్యనారాయణ రెడ్డి
2. డాక్టర్ కొమర్రాజు రామలక్ష్మి
3. గుండు రమణయ్య
12. మనం మన సమాజం మారేది ఎప్పుడో ? – డాక్టర్ బండ సరోజన
13. అవిశ్రాంత సాహిత్య సృజన శీలి’ పెన్న’ -జి శ్యామల దేవి
ధరవాహిక నవల :-
దొరసాని- లక్ష్మీ మదన్
పుస్తక సమీక్ష:-
1. వచన కవితా కన్య రూప లావణ్య దాస్యం సేనాధిపతి
“దిక్సూచి”- అరుణా ధూళిపాల
2. వేణు నక్షత్ర గోపాల్ ” అరుగు” కథలు చదవాల్సిన కథలు
– ఎన్.నరేష్ చారి
3. నైతిక విలువల వెన్నెల వెలుగుల ఆణిముత్యం వడ్డేపల్లి వెంకటేష్ “పిల్లల జాబిల్లి”- మధు జెల్లా
4. అరుణ కవిత అంతరంగం – డా.చిటికెన కిరణ్ కుమార్
ఇంటర్వ్యూలు:-
1. ప్రముఖ కథా రచయిత, సాహిత్య విమర్శకులు ‘విహారి గారి’ తో మయూఖ ముఖాముఖి – అరుణ ధూళిపాల
2. ప్రముఖ నవలా రచయిత సామాజికవేత్త ‘బిఎస్ రాములు ‘గారితో మయూఖ ముఖాముఖి – అరుణా ధూళిపాల
3. ప్రముఖ కవి, అనువాదకులు ‘వారాల ఆనంద్ గారి’ తో మయూక ముఖాముఖి- ఎస్ .అనంతాచార్య
బాల సాహిత్యం:-
1. మన’ విశ్వ’ వీడియో
2. “భక్త ప్రహ్లాద” నాటకం – బి. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ
అనువాద సాహిత్యం:-
1 అలెన్ అతని కుమారుడు ( కథ)- ఒద్దిరోజు మురళీధర్ రావు
2. చిన్న గింజంత బంగారం ( కథ )- ఒద్దిరోజు మురళీధర్ రావు
3. గుల్జార్ కవిత్వం – గీతాంజలి, డాక్టర్ భారతి (అనువాద కవిత్వం) కవిత్వాస్వాదన – నరేందర్ సందినేని
ఇంద్రధనస్సు :-
1. చీరలోని గొప్పతనం ( పాట విశ్లేషణ) – రామకృష్ణ మిద్దె
2. వాగిర చారిత్రాత్మక నవల పుస్తక సమీక్ష ( ఆడియో)- రంగరాజు పద్మజ
3. వేముగంటి శక్తిమతి సాహిత్య యాత్ర ‘ ఆకాశవాణి ప్రసంగం ‘(ఆడియో)
అన్నవరం దేవేందర్ “ఇంటి దీపం కవిత,
“స్వచ్ఛత కవిత,
“పొద్దున్నే లేస్తా…కవిత,
“మా ఊరి బస్సు కవిత,
“చెట్ల మహిమ కవిత,
కవిత్వం ఓ విశ్లేషణ.
ప్రముఖ కవి,రిటైర్డ్ సూపరింటెండెంట్,మండల ప్రజా పరిషద్ కార్యాలయం,ముస్తాబాద్,జిల్లా సిరిసిల్ల,అన్నవరం దేవేందర్ కలం నుండి జాలువారిన ఇంటి దీపం కవితా సంపుటి లోని ఇంటి దీపం కవిత పై విశ్లేషణా వ్యాసం.ఇంటి దీపం కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.కవి ఊహాజీవి.జీవితంలో చాలా భాగం చదవడం రాయడం సమాజంలో జరుగుతున్న స్థితిగతులు సమస్యల పట్ల స్పందన కలిగి ఉండడం సహజం.కవి చదివిన దానిని చూసిన దానిని తన మనసులో పరితాపం చెంది కలంతో కాగితం మీద వ్రాసి తన ఆలోచనలని సృజనతో ఆవిష్కరిస్తాడు.కరీంనగర్ కు చెందిన దేవేందర్ తెలంగాణ మాండలికంలో రాసిన కవితలు వివిధ దినపత్రికల్లో వస్తున్నాయి.చదివాను.రోజు రోజుకి దేవేందర్ కవిత్వం పరిణతి చెంది సొగసులు శోభను సంతరించుకుంది. తెలంగాణ మట్టిలో నివసించే మనుషులన్నా వాళ్ళు మాట్లాడే భాష,యాస ఇష్టమని దేవేందర్ రాసిన కవితలు తెలియజేస్తున్నాయి.తెలంగాణ మాండలికంలో కవితలు రాసిన కవులు చాలా మంది ఉన్నారు.దేవేందర్ తెలంగాణ మాండలికంలో కవితా వ్యవసాయం చేస్తున్నారు.అది నిరంతర ఝరి.దేవేందర్ కవితల్లో సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాల పట్ల ఆవేదన ఉంది. సామాజిక సమస్యల పట్ల స్పందనను కవితల రూపంలో మనకు అందిస్తున్నారు.దేవేందర్ రాసిన ఇంటి దీపం కవితా సంపుటిలో ఇంటి దీపం కవిత నాన్న యాదిలో రాయడం జరిగింది.కవితాసంపుటి లో నాన్నగారి ఫోటో చిత్రీకరణ బాగుంది.ఇంటికి దీపం ఇల్లాలు అనే సామెత తెలుగులో ఉంది. ఇల్లాలు లేకుంటే ఇల్లు కళావిహీనంగా ఉంటుంది. ఇల్లాలును కోల్పోయిన భర్త బాధాతప్త హృదయుడవుతాడు.ఆ కుటుంబంలో విషాదం నెలకొంటుంది.ఏ పని చేయాలన్నా అతనికి ఆమె లేని లోటు ఎడబాటు కనిపిస్తుంది.ఇల్లాలే ఇంటికి కాంతి.ఆమె లేకుండా ఇంటి దీపం వెలగదు.దేవేందర్ రాసిన తన కవితకు ఇంటి దీపం నాన్న అని తెలుగు సామెత రాసుకోవాల్సిన అవసరం వచ్చింది.అమ్మ నాన్నలు రెండు కన్నులు అని చెప్పుకోవాలి. అందులో నాన్న అనే కన్ను పోతే కుటుంబం కూడా విషాదంలో మునిగిపోతుందని మనకందరికీ తెలుసు.ఇంటి దీపం కవితలో మొదటి రెండు చరణాలు. “పచ్చ పచ్చని జీవితాన్ని పంచిన “పందిరి గుంజ కూలి పోయింది. ప్రకృతి పెనుభూతానికి పంట చేలు కొట్టుకుపోతాయి.దివిసీమ తుఫానుకు వేలాది ఎకరాలు పండిన పొలాలు,చెట్లు,చేమలు నేలమట్టమయ్యాయి.సునామీ వచ్చి విశాఖపట్నం విలవిలలాడింది.కుటుంబ యజమాని అయిన నాన్న త్యాగానికి ప్రతీక.దేవేందర్ నాన్న పరమాత్మను చేరుకున్నారు.తండ్రి ఏమి ఆశించక కుటుంబం కొరకు తన అణువణువును త్యాగం చేస్తాడు.పగలు సూర్యుడు సకల మానవాళికి వెలుగును ప్రసాదిస్తున్నాడు.రాత్రిపూట చంద్రుడు మరియు నక్షత్రాలు వెన్నెలను వెలుగును ప్రసాదిస్తున్నాయి. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ పల్లెల్లోకి మనం ప్రతి ఇంటికివెళ్లి చూడాలి.ఇల్లు ఉంటుంది. ఇంటి ముందు పందిరి ఉంటుంది.దేవేందర్ వాళ్ళ నాన్నను పందిరి గుంజతో పోల్చాడు.ఎన్నో ఏళ్ల నుంచి పెంచిన చెట్లను నరికి గుంజలను తీసుకొస్తారు.గుంజలు నాటి ఇంటి ముందు పందిరి వేస్తారు.ఇంటిముందు పందిరి ఉంటే ఎంతో చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది.కొన్ని సంవత్సరాలు కాగానే పందిరి గుంజ కూలిపోతే పందిరి ఉండదు. అప్పుడు మరియు ఇప్పుడు పెళ్లిళ్లకు మరియు పేరంటాలకి పందిళ్లు వేస్తున్నారు.అదొక వేడుక.ఆ సాంప్రదాయం ఇంకా కొనసాగుతుంది. “పీసు పట్టిన మక్క జొన్న చేను . “తలపువ్వు రాలి పోయింది. పీసు పట్టిన మక్క జొన్న చేను పంట పండగానే దాని తలపువ్వు రాలిపోతుంది.

“విస్తరించిన ఊడల మర్రి బలగాన్ని “చెట్టు నీడకు నిలిపి ఎళ్ళిపోయినవా!నాన్న . “అందరి నయనాలు దుఃఖ నదులైనై నాన. ఊడల మర్రితో నాన్నకు సంబంధించిన బంధువులు మరియు స్నేహితులను బలగంతో పోలుస్తున్నాడు. మర్రిచెట్టు మహావృక్షంగా ఎదుగుతుంది.మర్రి చెట్టును దేవతా స్వరూపంగా భావించి పూజిస్తారు. దేవస్థానాల్లో మర్రిచెట్టును దేవునిగా మొక్కడం, ప్రదక్షిణలు చేయడం మనకు ఎరుకే.ఇంటికి వెలుగు నాన్న.ఇంటి దీపమైన నాన్న వెళ్ళిపోగానే అందరి కళ్ళు దుఃఖంతో నదులుగా ప్రవహిస్తున్నాయి. దేవేందర్ నాన్న ఉపాధ్యాయుడుగా పనిచేశారు. ఆచార్య దేవోభవ అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆచార్యుడు అంటే దేవునిగా పూజించే సమాజం మనది.శ్రీసాయిబాబా,మెహర్ బాబా,ఆది గురువుగా పూజింపబడుతున్నారు.దేవేందర్ నాన్న ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు.విద్యార్థుల జీవితాల్లో వెలుగులను నింపారు. “నీవు నాటిన అక్షరాలు మహా వృక్షాలై “జీవిత సాఫల్య ఫలాలను పండిస్తున్నాయి. నీ అంశతో జన్మించిన కుమారుడు దేవేందర్ బాల్యంలో నీ చేత అక్షరాలు దిద్ది విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు.ఈనాడు దేవేందర్ కవి పుంగవుడై రాసిన కవితలు జీవిత సాఫల్య ఫలాలను పండిస్తున్నాయి అని అన్నారు. . “శ్రమిస్తే పూజ చేసినట్టేనని సూత్రీకరించి ” నిత్యం ఏదో పనిలో సంచరించే వాడివి. దేవేందర్ నాన్నగారు కష్టపడి పని చేస్తే పూజ చేసినట్టేనని చెప్పారు.ఎప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యేవారు.దేవేందర్ నాన్న కుటుంబానికి అండగా నిలిచారు.ఉపాధ్యాయుడిగా పనిచేస్తు పాఠశాలలో విద్యార్థిని,విద్యార్థులకు చక్కటి విద్యా బోధన చేశారు.సమాజానికి కూడా వారు మార్గదర్శకంగా నిలిచారని చెప్పవచ్చు.నిత్య కృషీవలుడు అని రైతును అంటారు.విద్య నేర్పే గురువును ఆదర్శ ఉపాధ్యాయుడు అంటారు.శ్రీకృష్ణ భగవానుడు సాందీపని గురువు వద్ద విద్య నేర్చుకున్నారు.శ్రీరామచంద్రుడు వశిష్ఠులు మరియు విశ్వామిత్రుని వద్ద విద్య నేర్చుకున్నారు. “నాన్న నీవు బహుముఖీయ వర్చస్సువి “బంధుమిత్రుల ఆత్మాభిమానుడవు. దేవేందర్ వాళ్ళ నాన్నగారిని బహుముఖీయ వర్చస్సువి అని అంటున్నారు.శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ భగవానుడు,మహావిష్ణువు,కలియుగ వెంకటేశ్వర స్వామి,అవతార పురుషుల వర్చస్సు అని చెప్తున్నారు.దేవేందర్ నాన్నగారు బంధువులతో మరియు మిత్రులతో ఆత్మాభిమానం సంపాదించుకున్న మహా మనిషి అని చెప్పడం చక్కగా ఉంది. “ముప్పై ఏళ్లు చుట్టూ పదూర్ల పెట్టుగ “నిక్కచ్చి బడిపంతులువని పేరొందినవు. పాతకాలం రోజుల్లో బతకలేని వాడు బడిపంతులు అని సామెత వాడుకలో చెప్పుకునే వారు. బడిపంతులు అంటే ఎంతో ప్రేమ,అభిమానం, గౌరవం ఉండేది.బడిపంతులు చక్కగా చదువు చెప్పేవాడు.ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా విద్యాబోధన చేసేవాడు.విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో వారు ఎల్లప్పుడు ముందుండేవారు.అనవరతం విద్యార్థులకు విద్య నేర్పడం కొరకు శ్రమించేవారు. ఆనాటి గురువు దేవేందర్ నాన్నగారికి వందనాలు చెప్పాలి.ఆచార్య దేవోభవ అన్న పదాన్ని వారు సార్థకం చేసుకున్నారు.ఆనాటి ఉపాధ్యాయులకు అన్ని సబ్జెక్టుల్లో నైపుణ్యం ఉండేది. ఉపాధ్యాయులకు ఏ కోశానా వ్యాపార దృక్పథం ఉండేది కాదు.ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడికి వెళ్లి భార్యా పిల్లలతో ఉండి పాఠశాలలో పనిచేసే వారు. దేవేందర్ నాన్న 30 సంవత్సరాలు పనిచేసిన పదూర్లలోను నిజాయితీ బడిపంతులు అని పేరు తెచ్చుకున్నారు.ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చారు. దేవేందర్ నాన్నగారిని శిష్యులకు ఎప్పుడు కనిపించినా గౌరవ సింహాం లాగా ఉండేవారని చెప్పారు.బడి వరండాలో నడుస్తుంటే నిశ్శబ్దం ఆవరిస్తది.చెప్పిన పాఠం అప్ప చెప్పకపోతే దండించే వారని చెబుతున్నారు. “మా నలుగురికీ తండ్రివే కాదు “ఆదర్శంగా విద్య నేర్పిన ఉపాధ్యాయుడవు. దేవేందర్ ఇలా చెబుతున్నారు.మా కుటుంబంలోని నలుగురికి తండ్రివి మరియు విద్య నేర్పిన ఆదర్శ ఉపాధ్యాయుడవు.ఆ కాలపు మాస్టార్లను ఎవరు మర్చిపోలేరు.ఆనాటి ఉపాధ్యాయులు చదువు నేర్పే దేవుళ్ళు.దేవేందర్ నాన్నగారికి వ్యవసాయం అంటే మహా ఇష్టమైన వ్యాపకం.వ్యవసాయదారుడికి ఎడ్లు,బాయి,నీళ్లు,పొలం,చేను,నిత్యం సంభాషణలో పలవరింతల పలుకులు.ఎడ్లను మేపడం,నీళ్లు పెట్టడం,వాటికి వరిగడ్డి మరియు పచ్చి గడ్డి వేయడం,బాయి కాడికి వెళ్లి నీళ్లతో పొలం పారించడం,నిత్య సంభాషణలో పలవరింతల పలుకులు అని చెప్పడం చక్కగా ఉంది. . “నీవు నాటిన మామిడి తోట మస్తు కాసింది “నాలుగు మామిడి పండ్లు తిని పో……. నాన్నా. ఆ కాలపు రోజుల్లో మామిడి చెట్ల పండ్లు ఎంతో తీయగా అమృతంలా ఉంటాయి.ఎంతో ప్రేమగా మామిడి పండ్లను తినమని నాన్నను పిలుస్తున్నాడు.ఆ అనుభూతి ఊహ కందనిది. “నాన్న నీకు వైద్యం ఎట్లా అబ్బింది “నౌకరిచేసిన ఊళ్లల్ల మందందరి డాక్టర్ వి “నాడిపట్టి రోగం ఎల్ల గొట్టిన కీర్తి నీది.
“దశరథం సారు చెయ్యి గుణం మంచిదనే పేరు. ఆ కాలంలో కొందరు ఉపాధ్యాయులు వైద్యం నేర్చుకుని ఆదర్శ వైద్యులుగా పని చేసే వారు. దశరథం సారు మంచి ఉపాధ్యాయుడు,మంచి వైద్యుడు అనే కీర్తిని సంపాదించుకున్నాడు. “వైద్యం వ్యవసాయం చదువు చెప్పుడే కాదు “చిత్రంగా చిత్రకారునివి ఎలా అయ్యావు నాన “పనిచేసిన బల్లల్లో రిజిస్టర్లు బోర్డులు అల్మారీల “రంగురంగుల రాతలన్నీ నీ కుంచె లోనివే “ఇంటి దూలాల మీద ఆ రంగులతో చిత్రించిన “సూక్తులు బొమ్మలు తేదీలు మా శిలా శాసనాలు “అందమైన అక్షరాలు రంగురంగుల బొమ్మల సృజన “జీవితాన్ని కళా ఉత్సవంగా జీవించడం నేర్పావు నాన్న. “చేతి వేళ్ళతోనే కళాత్మకత ముఖం మీద నవ్వు “ప్రేమ పరిమళం తప్పుకు మందలింపు ఖాయం “ఎన్ని మెలకువల జీవితం ఎంతో బోధన.

దేవేందర్ నాన్న మంచి చిత్రకారుడు.చిత్రకారుడు చిన్నతనం నుంచి బొమ్మలు గీయడం ఒక హాబీగా పెట్టుకుంటాడు.పొద్దు ఉండదు,మాపు ఉండదు. ఎప్పుడు చిత్రాలు గీయడంతోనే వారికి సరిపోతుంది.చిత్రకారులు ఒక తపస్సులా పని సాగిస్తుంటారు.చిత్రకారుని ముఖం కాంతివంతంగా కళకళలాడుతుంది.మల్లెలు నవ్వినట్లుగా ఉంటుంది. ఎవరి పట్ల ద్వేషం ఉండదు.ప్రేమ పరిమళం కలిగి అందరి యెడల సఖ్యతతో ఉంటారు.తప్పు చేసినప్పుడు మందలింపు ఖాయం.తప్పు చేసినప్పుడు సహృదయంతో వారిలో పరివర్తన తేవాలని మందలించేవారు.చెడు భావనతో కాదు. ఇవాళ తప్పు చేసిన వాళ్ళకి వంత పాడే లోకం తయారైంది.దుర్మార్గాలు,దోపిడీలు,పెచ్చు పెరిగిపోతున్నాయి.తప్పును చూసి చూడనట్లు ఉండడం నేరం.జీవితం పూల పాన్పు కాదు.జీవితం అనే బాటలో ఎన్నో కష్టాలు కన్నీళ్లు ఎదుర్కోవాలి. ఎంతో మెలకువగా గడిపి జీవితం సార్థకం చేసుకోవాలి. “మధ్యం వాసన,సిగరెట్ పొగ అంటేనే. “చిరచిరమనే నీకు. “పక్షవాతం ఎట్లచ్చి గోస పెట్టింది నాన్న. “భీమునోలే ఉన్న నిన్ను దీనున్ని చేసింది. దేవేందర్ నాన్నగారికి మద్యం వాసన,సిగరెట్ పొగ అంటేనే గిట్టదు.దురలవాట్లు లేకున్నప్పటికీ పక్షవాతం వ్యాధి సోకింది.ఈనాటి వారు ఆహార నియమాలు పాటించకపోవడం,యోగ ప్రాణాయామాలు చేయకపోవడం వల్ల శరీరంలో సమతుల్యత దెబ్బతిని వ్యాధుల బారిన పడుతున్నారు.పక్షవాతం పగవాడికి కూడా రావద్దు అంటారు.పక్షవాతం వస్తే మంచంలోనే ఉంటారు. నాన్న మీకు పక్షవాతం వచ్చి మంచంలో లేవ లేకుండా ఉంటే అమ్మ నిన్ను సాకింది.నాన్న మీకు మంచం నుండి లేవరాదు.ఏ పని చేసుకోలేరు. ఎవరో ఒకరు దగ్గర ఉండి చేయాలి.నాన్న నీవు భీమునిలా బలం కలిగి ఉన్నప్పటికి పక్షవాతం సోకి నిన్ను దీనున్ని చేసింది.నాన్న నిన్ను ఏమీ చేయలేని అశక్తునిగా చేసింది.పక్ష వాతం వ్యాధి సోకి ఎంతో బాధను అనుభవించావు అని కవి దేవేందర్ ఆవేదన చెందుతున్నాడు. “.అమ్మ నీకు కాళ్లు చేతులైన త్యాగం “అన్ని అవసరాలకు పసి పిల్లగాని తల్లైంది. పసిపిల్లాడి కొరకు తల్లి ఎంతో కష్ట పడుతుంది. పసిపిల్లాడి ఎదుగుదలకు తల్లి ఎంతో ఆరాటపడుతుంది.అమ్మ నిన్ను పసిపిల్లాడిలా సాకింది.నాన్న నీకు కాళ్ళు చేతులు పని చేయక చలనం లేకుండా మంచంలో పడి పోయి ఉంటే అమ్మ నీకు కాళ్ళు చేతులు అయి సేవ చేసింది.నాన్న నీ అన్ని అవసరాలకు తల్లిలా అమ్మ చేసిన త్యాగం మరువలేనిది అని గుర్తు చేసుకోవడం చక్కగా ఉంది. . “నాన్న! “ఇంటికి చుట్టాలు వస్తే ఎంత సంబరం నీకు. దేవేందర్ నాన్నకు ఇంటికి చుట్టాలు వస్తే ఎంతో ఆనందంగా ఉండేవారు.అతిథిదేవోభవ. అతిథిని దేవునిలా పూజించాలని శాస్త్రాలు చెప్తున్నాయి.ఈ రోజుల్లో ఎందరు అతిథులను ఆదరిస్తున్నారు.అతిథులను గౌరవించడం లేదు. చుట్టాలు వచ్చినా వారితో ప్రేమ ఆప్యాయతలతో మెలగడం లేదు. “దగ్గరోళ్ళు అయినా దూరపోల్లు అయినా పండుగ “స్నేహితులు వచ్చిన ఆనందాల పలకరింత “ఇప్పుడు అందరు వచ్చి నిలబడ్డారు నాన “ఒక్కసారి లేచి రా! వాళ్లను ఆరుసుకుందాం. . కవి దేవేందర్ కు నాన్నగారు భౌతికంగా లేరు అని తెలుసు.దేవేందర్ నాన్న ఇంటికి చుట్టాలు వస్తే ఎంతో సంబరంగా ఉండేవారు.ఇప్పుడు ఇట్లాంటి నాన్నలు ఎంతమంది ఉన్నారు?కుటుంబ సభ్యులు బంధువులు ఎప్పుడు వెళ్ళి పోతారా అని ఎదురు చూస్తారు.మంచి పలకరింపు.ఆప్యాయత, అనురాగాలు ఉండవు.దేవేందర్ నాన్నకు దగ్గర వాళ్ళు అయినా దూరపు వాళ్లు అయినా పండుగ. పండుగ అంటే ఇంటిల్లిపాది ఆనందంతో ఉంటారు.పిండి వంటలు చేసుకుంటారు. కష్టసుఖాలు కలబోసుకుంటారు.దేవేందర్ నాన్నలాంటి స్నేహితులు అరుదు.అలాంటి స్నేహితులు లభించడం అరుదు.ఒక వరంగా భావించవచ్చు. ఎలాంటి కష్టాల్లో ఉన్నా స్నేహితుడొక్కడే గట్టెక్కిస్తాడు.పురాణాల్లో మనం కుచేలుడు శ్రీకృష్ణ భగవానుని గాధను విన్నాం.శ్రీకృష్ణ భగవానుడు తన స్నేహితుడు తెచ్చిన గుప్పెడు అటుకులు తిని వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదించాడు.ఒక్కసారి లేచి రా వాళ్లను అరుసుకుందాం.చనిపోయిన వాళ్ళు ఎక్కడైనా లేచి వస్తారా? అలా జరగదు.క్రైస్తవులు ఆరాధించే బైబిల్ గ్రంథంలో ఇలా రాసి ఉంది.ఏసు లేచి పునరుత్తానం చెందినట్లు చాలామందికి కనిపించాడు అని రాయబడి ఉంది.నాన్నగారి జ్ఞాపకాలు,మర్చిపోలేని వ్యక్తిత్వం,ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. “నాన్న నీ నిక్కచ్చితనమే
“మమ్మల్ని పజ్జొన్న కర్రల్లా నిటారుగా నిలిపింది.
” నీ నిజాయితీ జీవన విధానమే
“ మమ్మల్ని అబద్ధం లేని నిబద్ధ జీవులని చేసింది.
దేవేందర్ నాన్నగారి నిక్కచ్చితనం,నిబద్ధత, నిజాయితి,సౌశీల్యం మమ్ములను సన్మార్గంలో నడిచేటట్లు చేసిందని తెలియజేయడం చక్కగా ఉంది.
“నీ ఆత్మవిశ్వాస వ్యక్తిత్వమే
“ఆత్మగౌరవ పతాకంలా నిలుస్తుంది.
దేవేందర్ నాన్న ఆత్మవిశ్వాసం కలిగి ఉండే వారు.మంచి నడవడి,విశాలమైన భావాలు ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించారు.ఇతరులు కూడా ఆత్మవిశ్వాసంతో జీవించేటట్లు ప్రేరణ కలిగించాడు.వ్యక్తిత్వ వికాసం వల్ల ఆత్మగౌరవం జెండాలా రెపరెపలాడుతుంది అని కవి దేవేందర్ వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“నిరంతర శ్రమ తనమే
‘పని తనపు ఆలోచనలు రగిలించింది.
దేవేందర్ నాన్న నిరంతరం శ్రమ చేస్తూ జీవితాన్ని గడిపాడు.ఇతరులు కూడా అతనిని చూసి బాగా శ్రమించాలి.బాగా పనిచేయాలి అనే స్ఫూర్తిని కలిగింపజేసింది.
” మానవ సంబంధ బాంధవ్యాలే
“మమ్మల్ని అనురాగపు తీగలుగా మలిచింది.
జీవించడం అనేది ఒక కళ.దేవేందర్ నాన్న అందరు అందరితో కలిసిమెలిసి ప్రేమానురాగాలతో జీవించడం సాధ్యమని నిరూపించాడు.దేవేందర్ నాన్న అందరికి ప్రేమను పంచుతూ ఆప్యాయతతో కలిసిమెలిసి ఉండే వాడు.మానవ సంబంధాలను అనురాగపు తీగలుగా మల్చినాడు అని తెలియజేస్తున్నారు.
“నీ చిరు దరహాసమే
“మమ్మల్ని నవ్వుల పువ్వులు పూయిస్తుంది.
నవ్వుతూ బతకాలిరా అనే సినిమా పాట ఉంది. నవ్వడం ఒక కళ.నవ్వు నవ్వించు అన్నారు.నవ్వడం భోగం.నవ్వకపోవడం రోగం అని జంధ్యాల అన్నారు.దేవేందర్ నాన్న చిరు దరహాసమే మమ్మల్ని నవ్వుల పువ్వులు పూయింపజేస్తుంది అన్నారు.
‘ కొంచమంతున్న కోపగుండితనమే
“అన్యాయంపై కన్నెర్ర చేయిస్తుంది. దేవేందర్ నాన్న ఆన్యాయాన్ని సహించే వాడు కాదు. కోపం చూపుతోనే వాళ్లను అణిచివేసేవాడివి అన్నాడు. “నాన్నా నీవు “నా బతుకు పందిరి గుంజవు “ఆఆలు దిద్దిచ్చిన సుద్ద ముక్కవు “నిటారుగా నిలబెట్టిన ఇంటి నిట్టాడువు “నిత్యం వెలుగుతున్న దీపానివి
“నాన్న నాకు రోజు కోసారి కనిపించు. దేవేందర్ నాన్నగారు ఎక్కడికి వెళ్లిపోలేదు. అంతరంగంలో అంతర్యామి రూపంలో హృదయంలో దాగి ఉన్నాడు.దేవేందర్ నాన్న ఆశయాలు సాధన చేస్తూ అనుక్షణం కృషి చేస్తూ ఉంటే దశరథం మాస్టారు ఇంటి దీపం అలా వెలుగుతూనే ఉంటుంది.దేవేందర్ నాన్న తీర్చిదిద్దిన శిష్యుల ఇళ్ళ లోగిళ్లలో వేలవేల దీపాలు కాంతులతో వెలుగులు విరజిమ్ముతూనే ఉంటాయి. తెలంగాణలో నాన్నలు అనురాగపు దివ్వెలుగా త్యాగానికి ప్రతీకలుగా నిలుస్తారు.చక్కటి కవితను అందించిన దేవేందర్ ను అభినందిస్తున్నాను.కవి దేవేందర్ మరిన్ని మంచి కవితలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను. రచన : నరేంద్ర సందినేని.
అన్నవరం దేవేందర్ “స్వచ్ఛత” కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన: నరేంద్ర సందినేని
ప్రముఖ కవి,అన్నవరం దేవేందర్ కలం నుండి జాలువారిన “స్వచ్ఛత” కవిత పై విశ్లేషణా వ్యాసం. స్వచ్ఛత కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.చెడు పదార్థాలను తీసివేయడం ద్వారా స్వచ్ఛత ఏర్పడుతుంది.రసాయనిక ప్రక్రియ ద్వారా నీటిని స్వచ్ఛత చేసి ఉంచుతారు.ప్రజలు చైతన్యంతో చేతుల్లో చీపుర్లు చేతపట్టి వీధులను శుభ్రంగా ఊడ్చి వేయాలి.వీధుల్లో ఉన్న చెత్త చెదారాన్ని తొలగించాలి.ప్రతి ఒక్కరు పారిశుద్ద్యం పైన దృష్టిని కేంద్రీకరించాలి.ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.దైవత్వానికి వెన్నంటి ఉండేది,పరిశుభ్రమైన పరిసరాలే అనే సందేశంతో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలి.స్వచ్ఛత అనే కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రజలు అందరు సంకల్పం తీసుకోవాలి.మహాత్మా గాంధీ కలలు కన్న స్వచ్ఛ భారత్ దిశగా ప్రతి పౌరుడు అడుగులు వేయాలి.ప్రతి ఒక్కరు చెత్తను వీధుల్లో వేయకుండా జాగ్రత్తగా డస్ట్ బిన్ లో వేయాలి. చెత్తను డస్ట్ బిన్ ల నుండి డంపింగ్ యార్డ్ కి తరలించాలి.స్వచ్ఛత అనే ఉద్యమంలో సమాజంలోని ప్రజలు అందరు భాగస్వాములు కావాలి.కవి దేవేందర్ రాసిన స్వచ్ఛత కవితలోని విశేషాలు తెలుసుకోవాలనే తహతహ మొదలవుతుంది.ఒకసారి మనసు పెట్టి స్వచ్ఛత కవిత చరణాల్లోకి దృష్టిని సారించండి.ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి.సమాజాభివృద్ధికి దోహదం చేసే ఎన్నో విషయాలు మన దృష్టికి వస్తాయి.స్వచ్ఛత కొరకు పాటు పడండి.స్వచ్ఛతయే మన జీవిత లక్ష్యంగా కొనసాగండి.
“ఆమె రహదారిలో పరుచుకున్న మాలిన్యాన్ని
“సవ్యంగా శుభ్రపరిచే పరిచారిక.
గ్రామాల్లో,పట్టణాల్లో,మెట్రో నగరాల్లో,పారిశుద్ద్య కార్మికులుగా స్త్రీలు పనిచేస్తున్నారు.కొందరు రాత్రిళ్ళు రహదారులు శుభ్రం చేస్తారు.కొందరు పొద్దున లేచిన దగ్గర నుండి మధ్యాహ్నం వరకు వారికి కేటాయించిన వాడల్లో రోడ్లను మరియు రహదారులను శుభ్రం చేస్తున్నారు.మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ద్య కార్మికులను,మునిసిపాలిటీ స్వీపర్లుగా పిలుస్తారు.కవి దేవేందర్ ఆమెను రహదారిలో పరుచుకున్న మాలిన్యాన్ని సవ్యంగా శుభ్రపరిచే పరిచారిక అని అంటున్నాడు. మున్సిపాలిటీ పారిశుద్ద్య కార్మికుల్ని గౌరవించే కనీస సంస్కారం ఎందరికి ఉంటుంది? రోడ్లు ఊడ్చే వాళ్ళను చాలా మంది హేళనగా చూస్తారు.రోడ్లు ఊడ్చే వాళ్లను చిన్న చూపు చూస్తారు.పారిశుద్ద్య కార్మికులు కూడా మనలాంటి మామూలు మనుషులు.జీవనం గడపడం కొరకు పారిశుద్ద్య పనులు చేస్తున్నారు.పారిశుద్ద్య కార్మికులను గౌరవించే సంస్కారాన్ని అలవర్చుకున్న కవి దేవేందర్ ను అభినందించాలి.
“పొద్దంతా పోగుపడ్డ చెత్తా చెదారాన్ని
“అహో రాత్రులు స్వహస్తాలతో స్వచ్చ పరుస్తుంది
“ఆమెకు నిద్రా అలసట పవళింపులు లేవు
“రాత్రంతా పని ప్రయాణ కొలువులే.
పారిశుద్ద్య కార్మికులు పొద్దంతా పోగుపడ్డ చెత్తా చెదారం,దుమ్ము ధూళిని అహో రాత్రులు శ్రమించి స్వహస్తాలతో శుభ్రం చేస్తారు.మనం మన ఇండ్లల్ల ఉన్న చెత్తా చెదారాన్ని సరిగా శుభ్రం చేసుకోవాలి అనే సంస్కారానికి దూరంగా ఉంటున్నారు.నిజంగా పారిశుద్ద్య కార్మికులు చీపుర్లతో వీధులను ఊడుస్తూ నిర్విరామంగా శ్రమిస్తున్నారు అనే విషయం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది.సాధారణ పౌరులైన జనాలు రాత్రి పూట ఏం చేస్తుంటారు.చక్కగా తిని హాయిగా ఇళ్ళలో నిద్రకు ఉపక్రమిస్తుంటారు.అలసట పవ్వళింపులు లేకుండా పారిశుద్ద్య కార్మికులు రాత్రంతా నిద్ర మానుకొని వీధులు శుభ్రం చేసే పని కొనసాగిస్తున్నారు.అయినప్పటికి రహదారులు ఎంతో అధ్వాన్నంగా ఉంటున్నాయి.రహదారులు వేసేటప్పుడు కూడా నాణ్యత పాటించడం లేదు. కొత్తగా రోడ్లు వేస్తున్నారు.నెల రోజులకే రోడ్లు పాత రోడ్లుగా మారి పాడై పోతున్నాయి.భారీ వర్షం పడగానే రోడ్ల నిండా గుంతలు పడి ఎక్కడికక్కడ లేచిపోతున్నాయి.రోడ్లు ఇంత అద్వాన్నంగా ఎందుకు ఉంటున్నాయి?పాలకులు అవినీతికి పాల్పడుతూ ఉండడం వల్ల కాంట్రాక్టర్లు నాణ్యత లేని రోడ్లు వేస్తున్నారు.పారిశుద్ద్య కార్మికులు ఎంతో ఓపికతో రహదారులను శుభ్రం చేస్తున్నారు.వీధుల్లో చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నప్పటికి విసుగు చెందకుండా విరామం లేకుండా ఓపికతో శుభ్రపరుస్తున్నారు.రాత్రి అంతా మెలుకువతో ఉండి వీధుల్లో ఊడ్చే పనిని కొనసాగిస్తున్నారు.పట్టణాల్లో చూస్తే షాపుల ముందు చెత్త పడేస్తారు.మోరీల్లో చెత్తను వేయ కూడదు అనే విషయాన్ని మరిచి పోయినారు.మోరీల్లో చెత్తను వేస్తున్నారు.మోరీల్లో చెత్త పేరుకుపోయి పట్టణాలు,గ్రామాలు దోమలకు నిలయాలుగా మారుతున్నాయి.దోమల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురికావడంతో చికెన్ గునియా, డెంగ్యూ దోమకాటు గురై ప్రజలు అర్థాంతరంగా తమ జీవితాలను చాలిస్తున్నారు.చెత్తను డస్ట్ బిన్ లో వేయాలి అని మున్సిపల్ అధికారులు చెప్పరు. ఏదో నామ మాత్రంగానే చెత్త బండ్లు ఏర్పాటు చేసి చెత్తను తరలించడం చేస్తుంటారు.చెత్త బండ్లు ఏర్పాటు చేశాం.ఇక మా పని అయిపోయింది అని చేతులు దులుపుకుంటున్నారు.మున్సిపల్ అధికారులు ప్రతి వాడలో డస్ట్ బిన్ లు,నాలుగు రోడ్ల కూడల్ల వద్ద డస్ట్ బిన్ లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.ప్రతి వాడలో నివసించే ప్రజలు చెత్తను డస్ట్ బిన్ లో వేసేలా అవగాహన కల్పించాలి. ఇంటింటికి చెత్త బండ్లు తిరగాల్సిన అవసరం లేదు. మున్సిపల్, కార్పొరేషన్ అధికారులు అన్ని చోట్ల అన్ని వాడలలో పెద్ద డస్ట్ బిన్ లు తప్పకుండా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది.డస్ట్ బిన్ లు లేకపోవడం వలన ప్రజలు ఖాళీ ప్లాట్ లలో చెత్తను వేస్తున్నారు.ఖాళీ ప్లాట్ యజమానులకు జుర్మానా వేయడం సరి అయిన పద్దతి కాదు.మునిసిపల్, కార్పొరేషన్ అధికారులకు డస్ట్ బిన్ లు ఏర్పాటు చేయనందుకు జుర్మాన వేయాలి.వేలాది రూపాయలు ఇంటి పన్ను వసూలు చేస్తూ ప్రజల కనీస అవసరాలు అయిన డస్ట్ బిన్ లు ఏర్పాటు చేయకపోవడం,నిర్లక్ష్యం వహిస్తున్న మున్సిపల్ సంస్థలు బాధ్యతలు నుండి తప్పుకొని తమ బాధ్యతలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలి. ఇంటింటికి చెత్త సేకరణ కొరకు బండ్లు వద్దు. కార్పొరేషన్,మున్సిపల్ అధికారులు సరైన కార్యాచరణతో డస్ట్ బిన్ లు ఏర్పాటు చేసి చెత్తను డస్ట్ బిన్ ల నుండి తరలించినట్లయితే కొండలా పేరుకు పోయిన చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.చెత్తతో కరెంట్ ఉత్పత్తి చేసి ప్రజలకు చౌకగా విద్యుత్ సరఫరా చేయవచ్చు.చెత్త పేపర్లను రీసైక్లింగ్ చేయవచ్చు.ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా రీసైక్లింగ్ చేయవచ్చు.పాలకులకు చిత్తశుద్ధి కొరవడింది.పాలకులు తమ అధికారాన్ని కాపాడుకోవడానికి మరియు అక్రమ ఆస్తులు సంపాదించడానికి సమయం కేటాయిస్తున్నారు.నగర పాలక సంస్థ సరైన కార్యాచరణతో ముందుకు సాగాలి.ఏదో నామమాత్రంగా పనులు చక్కబెడుతున్నారు.సమాజంలోని పౌరులుగా పారిశుద్ద్య కార్మికులను గౌరవిస్తూ సరైన జీతాలు ఇవ్వాలి.పారిశుద్ద్య కార్మికుల అభివృద్ధికి దోహదం చేసే కార్యక్రమాలు చేపట్టాలి.
“రోడ్ల మీద నగరీకులు విసిరేసిన
“సకల అపరిశుభ్రాల్ని తొలగించే మాన్విత.
రోడ్ల మీద చెత్త ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తారు. చెత్తను చెత్త డబ్బాలో వేయాలనే ఇంగిత జ్ఞానం కూడా ఉండదు.పౌరులు తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోని వాళ్ళు ఉన్నారు.పౌరులు దుకాణాల సముదాయం శుభ్రంగా ఉంచుకోవాలనే ఆరాటం సోయి కరువైంది.పౌరులు చిత్త శుద్దితో మెలిగినట్లయితే చెత్త సమస్యకు పరిష్కారం లభిస్తుంది.దుకాణాల వాళ్లు చెత్తను రోడ్లపై పారవేస్తారు.మున్సిపాలిటీ అధికారులు సరైన చర్యలు తీసుకోవాలి.ఒక చోట డంప్ యార్డు ఏర్పాటు చేసి అందరు అక్కడ చెత్తను వేసేలా నగర పాలక సంస్థ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.మున్సిపల్ అధికారులు పట్టణ పారిశుద్ద్యం పట్ల శ్రద్దను కనపరచాలి.మున్సిపల్ అధికారులు తమ విద్యుక్త ధర్మాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు.ప్రభుత్వాన్ని పాలిస్తున్న పాలకులలో చైతన్యం కొరవడింది.
“రద్దీ రవాణా నిద్రపోయిన తర్వాత
“రహదారులు అలసట తీరినయాల్ల
“అప్పుడే మున్సిపల్ స్వీపర్ల మేలుకొలుపులు.
ప్రతి నిత్యం రోజంతా రోడ్ల పై రద్దీ ఉంటుంది.రాత్రి పూట రద్దీ జనం,రవాణా వాహనాలు కూడా నిద్రపోతాయి.రహదారులు కూడా రాత్రిపూట అలసట తీర్చుకుంటాయి.మున్సిపల్ స్వీపర్లకు రాత్రిపూట నిద్ర ఉండదు.స్వీపర్లు గుడ్లగూబల్లా రాత్రి పూట పనిచేస్తుంటారు.మున్సిపల్ కార్మికుల దీన స్థితిని గురించి సానుభూతితో కవి దేవేందర్ స్వచ్ఛత కవిత ద్వారా ఆవేదన వ్యక్తం చేయడం చక్కగా ఉంది.
“హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ కార్పొరేషన్ల
“వాడవాడల వెదజల్లే కాంతులు
“ఆ మహా తల్లుల చీపుర్ల చలవే
“మైల తీసిన నగరాలు తెల్లని మల్లెపువ్వులైతై.
మున్సిపల్ కార్మికులు శ్రమించి శుభ్రంగా చీపుర్లతో ఊడ్వడం వల్లనే వీధులు కాంతులు వెదజల్లుతున్నాయి.ఆ మహా తల్లుల చీపుర్ల చలవ వల్ల మలినాలను తీసిన నగరాలు మల్లెపువ్వులా సొగసు గొలుపుతున్నాయని అంటున్నారు. మల్లెపూలు స్వచ్చతకు ప్రతి రూపాలు,తెల్లగా ఉంటాయి అని మన అందరికి తెలుసు. మల్లెపూవులలో మాలిన్యం ఉండదు.శుభ్రం చేసి ఊడ్చిన నగరాలు మల్లెపూవులా మారి శోభను సంతరించుకుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“పొరకల చీపుర్లతో నిత్యం నడిచి క్లీన్ చేసినా
“ఎన్నడు ఆ దారుల మీద డ్రైవ్ చేయని వాళ్ళు
“పని చేయడమే వాళ్ళ జీవనం. పారిశుద్ద్య కార్మికులు చీపుర్లతో ప్రతిరోజు నడిచి రహదారులను శుభ్రం చేస్తారు.చాలీచాలని జీతాలతో బతుకులు గడిపే పారిశుద్ద్య కార్మికులకు వాహనాలు కొనుక్కునే స్తోమత లేదు.వాహనాలు ఎక్కడి నుండి వస్తాయి? పారిశుద్ద్య కార్మికులు శ్రమించి ఊడ్చిన రహదారుల మీద వాహనాలు ఎలా నడుపుతారు.పారిశుద్ద్య కార్మికులు పేదరికంలో బతుకును గడుపుతున్నారు.పారిశుద్ద్య స్త్రీ కార్మికుల గురించి ఆర్తిగా పారిశుద్ద్య స్త్రీ కార్మికులు పని చేయడమే వాళ్ళ జీవనం అని కవి దేవేందర్ వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.
“కాంట్రాక్టర్ దగ్గర తక్కువకు ఎక్కువ పని చేసే
“ఎట్టి పువ్వుల రెమ్మలు వీళ్ళు.
కాంట్రాక్టర్లు పారిశుద్ద్య కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు.కాంట్రాక్టర్లు చాలీచాలని జీతాలు ఇస్తున్నారు.పారిశుద్ద్య కార్మికుల కుటుంబాలు పేదరికంలో కునారిల్లుతున్నారు.పారిశుద్ద్య కార్మికులు రోడ్ల మీద చీపుర్లతో దుమ్ము,ధూళి శుభ్రం చేసి తీవ్రమైన అనారోగ్యం బారిన పడుతున్నారు. పారిశుద్ద్య కార్మికులు ప్రమాదాల వల్ల,గాలి,వానకు కరెంటు తీగలు కింద పడితే కరెంట్ షాక్ కు గురై చనిపోతున్నారు.
“మన రహదారుల కోసం
“రాత్రిళ్ళను దారపోస్తున్న వాళ్ళు
“చీపుర్లకు,వాళ్లకు ఒక్కసారి మొక్కాలె
“నగర స్వచ్చ రాయబారులు ఆ వనితలు.
కవి దేవేందర్ కు పారిశుద్ద్య స్త్రీ కార్మికుల పట్ల సానుభూతి ఉంది.స్వచ్ఛత అనే పేరుతో కవిత రాశారు.పారిశుద్ద్య కార్మికురాలైన ఆమెను ఎంతో గౌరవంగా పరిచారిక అని సంబోధించారు.రాజ్యాలు పోయాయి.రాజులు,రాణులు గతించిన చరిత్రగా పుస్తకాల్లో మిగిలి పోయారు.రాణుల దగ్గర పనిచేసే పరిచారికలు ఎక్కడ ఉంటారు? రాణులతో నివసించే పరిచారికలు కాలగర్భంలో కలిసి పోయారు.పారిశుద్ద్య కార్మికురాలైన ఆమె రహదారిలో పరుచుకున్న మాలిన్యాన్ని సవ్యంగా శుభ్రపరిచే పరిచారిక.ఎక్కడ చూసినా,ఏ ప్రాంతానికి వెళ్లినా పారిశుద్ద్య కార్మికుల పరిస్థితి మార లేదు. మన తెలంగాణ ప్రాంతంలో స్త్రీ పరిచారికలు రహదారుల శుభ్రం చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు.పారిశుద్ద్య కార్మికురాలైన ఆమె రెక్కలు ముక్కలు చేసుకుని పని చేస్తున్నది.
“రద్దీ రవాణా నిద్రపోయిన తర్వాత
“రహదారులు అలసట తీరిన యాల్ల
“అప్పుడే మున్సిపల్ స్వీపర్ల మేలుకొలుపులు.
ఉదయం,మధ్యాహ్నం,సాయంత్రం,వేళల్లో రోడ్ల పై విపరీతమైన రద్దీ ఉంటుంది.పట్టణంలో అయితే జనాలు రోడ్డు ఇటు వైపు నుంచి అటు వైపు దాటాలంటే చాలా సమయం పడుతుంది.జనాలు వాహనాలను తప్పించుకొని రోడ్డును క్రాస్ చేయడం చాలా కష్టం అవుతుంది.రాత్రి అయిన తర్వాత రోడ్ల మీద రద్దీ తగ్గిపోతుంది.రవాణాకు సంబంధించిన వాహనాలు రోడ్ల మీద తిరగవు.రాత్రి సమయంలో రహదారులు అలసట తీర్చుకుంటాయి.ఆ సమయంలో మునిసిపల్ స్వీపర్లు రోడ్లను శుభ్రం చేస్తారు.పారిశుద్ద్య కార్మికులైన పరిచారికలు తమ నిద్రను త్యాగం చేసి రహదారులు శుభ్రం చేస్తారు. రాత్రి పూట నగరం అంతా తిరుగుతూ పోలీసులు గస్తీ చేయడం మానుకున్నారు.పోలీసులు రాత్రి పూట గస్తీలో తిరుగుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది.రాత్రిపూట పిచ్చివాళ్లు,తాగుబోతులు రోడ్ల పై తిరుగుతూ నానా హంగామా సృష్టిస్తుంటారు.పిచ్చివాళ్లు, తాగుబోతులు,రాత్రిపూట తమకు తోచిన రీతిలో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ అలజడులు రేపుతూ ప్రశాంత వాతావరణము కలుషితం చేస్తూ రోడ్ల పై తిరుగుతారు.పారిశుద్ధ్య కార్మికులకు పిచ్చివాళ్ళ నుండి తాగుబోతుల నుండి ఎలాంటి రక్షణ లేదు. రాత్రిపూట పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కల్పించాల్సిన విషయాన్ని పాలన చేస్తున్న అధికారులు,పోలీసులు పట్టించుకోవడం లేదు. పారిశుద్ద్య కార్మికురాలైన పరిచారిక అలాంటి గడ్డు సమయంలో పనిచేసి రహదారులను శుభ్రం చేస్తున్నది.పారిశుద్ద్య కార్మికులు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు.మన రహదారుల కోసం రాత్రిళ్లను ధారపోయడం సామాన్యమైన విషయం కాదు. పారిశుద్ద్య కార్మికులను గౌరవంగా నగర స్వచ్ఛ రాయబారులు ఆ వనితలు అని చెప్పిన తీరు చాలా చక్కగా ఉంది.చక్కటి కవితను అందించిన కవి దేవేందర్ ను అభినందిస్తున్నాను.దేవేందర్ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
అన్నవరం దేవేందర్ పొద్దున్నే లేస్తా… కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని.
ప్రముఖ కవి,అన్నవరం దేవేందర్ కలం నుండి జాలువారిన పొద్దున్నే లేస్తా కవిత పై విశ్లేషణా వ్యాసం.పొద్దున్నే లేస్తా కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.పొద్దున్నే లేస్తే మనిషి జీవనానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.పొద్దున్నే లేస్తే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని మన అందరికీ తెలుసు పొద్దున్నే లేస్తే వ్యక్తిగతంగా,సామాజికంగా, ఆరోగ్యపరంగా అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు.పొద్దున్నే లేస్తే ఎన్నో పనులను వెను వెంటనే పూర్తి చేసుకోవచ్చు.ఏ పని అయిన ఆలస్యం లేకుండా వెంటనే పూర్తి అవుతుంది.చివరి క్షణంలో ఆదరబాదరగా పనులు చేయాల్సిన అవసరము ఉండదు.మీరు త్వరగా నిద్ర లేవడం వలన మీకు రోజులో తగినంత సమయం లభిస్తుంది.మీరు పనులను త్వరగా పూర్తి చేసుకోవడంతో పాటు,మరెన్నో ఇతర కార్యకలాపాలు చేయడానికి సమయం లభిస్తుంది. అదనపు సమయం ఉండడం వల్ల మీరు వ్యక్తిగతంగా ఎదగడానికి తోడ్పడుతుంది.పొద్దున్నే నిద్ర లేస్తే ఎలాంటి పని అయినా శ్రద్ధ పెట్టి పూర్తి చేస్తారు.మీరు చేస్తున్న పని తీరు మెరుగుపడుతుంది.ఒత్తిడి,ఆందోళన మీ దరికి చేరవు.పొద్దున్నే లేస్తే మీరు సరైన సమయంలో నిద్ర పోతారు.పొద్దున్నే లేవడం అలవాటుగా మార్చుకుంటే త్వరగా నిద్రపోతారు.మీ శరీరం ప్రణాళిక ప్రకారం పనులు చేసుకోవడానికి సహకరిస్తుంది.పొద్దున్నే లేస్తే మానసికంగా, శారీరకంగా,ఆరోగ్యంగా ఉంటారు.పొద్దున్నే లేస్తే మీకు నులి వెచ్చని సూర్యోదయం,కుండీలో పూల మొక్కపై రాలిన తుషార బిందువులు,తొలి మంచు తెరలు,పక్షుల కిలకిలా రావాలు,స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తాయి.ఒక మనిషి విజయానికి కారణం కష్టపడటం మరియు పొద్దున్నే లేవడం వల్ల సాధ్యపడుతుంది.పొద్దున పల్లెల్లో అయితే కోడికూతతో నిద్రలేస్తారు.ప్రాతః కాలంలో పక్షుల కిలకిలా రావాలతో ముగ్ధ మనోహరంగా ఉంటుంది. పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని యోగ, ప్రాణాయామాలు,ధ్యానం అలవర్చుకుంటే మనిషికి ఆ రోజంతా ఉల్లాసంగా ఉంటుంది.మనిషిలోని అనంతశక్తులు ఉద్దీపనం చెందుతాయి.పొద్దున లేస్తే మనిషి నిత్య నూతనంగా ఉంటాడు.పొద్దున లేస్తే ఆ రోజు చేయాల్సిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేస్తాడు.ఇంకా సమయం కూడా మిగిలి ఉంటుంది. పొద్దున లేస్తే మనిషి జీవితం ఉన్నత పథంలో సాగుతుంది.పొద్దున లేవకుంటే ఏ పని సవ్యంగా చేయలేడు.అనారోగ్యం బారిన పడతాడు.పొద్దున్నే లేస్తే ఎలా ఉంటుంది? కవి దేవేందర్ మనిషి యొక్క దినచర్య గురించి చెప్పినట్టుగా తోస్తుంది.ప్రకృతి మాత ఒడిలో ఉన్నట్టుగా ఉంటుంది.ప్రకృతి మాతకు మనం సహకరిస్తే ప్రకృతి మాత మనకు సహకరిస్తుంది.ప్రకృతి మాత సహకారంతో మనిషి జీవనం అద్భుతంగా ఉంటుంది.పొద్దున లేస్తే ఏం జరుగుతుంది? ఆ విశేషాల గురించి తెలుసు కోవాలంటే మనం కవి దేవేందర్ పొద్దున్నే లేస్తే కవితలోని చరణాల పట్ల దృష్టిని సారించి,అలౌకిక ఆనందం సొంతం చేసుకుందాం.
“ పొద్దున్నే లేచి ఏం చేస్తా
“ అప్పుడే పూస్తున్న బంతిపూలను పలకరిస్తా
“ అవి చిరునవ్వుల జల్లు కురిపిస్తవి.
పొద్దున్నే లేచి ఏం చేస్తా అని మనలను ఆలోచన తరంగాల్లో తేలియాడ చేస్తున్నాడు.పొద్దున లేవగానే అతడు అప్పుడే పూస్తున్న బంతిపూలను చూసి పలకరిస్తాడు.పలకరించగానే బంతిపూలు చిరునవ్వుల జల్లులు కురిపిస్తాయి అని తెలియజేస్తున్నాడు.పొద్దున్నే లేచి బంతిపూలను చూడగానే మనసంతా ఉల్లాసంగా ఉద్దీపనం చెందుతుంది.ఆ రోజంతా బంతిపూల పరిమళాలను ఆస్వాదిస్తూ పలకరించి అలౌకిక అనుభూతి చెంది పరవశించినాడు.వికసించిన బంతి పూల చిరునవ్వుల జల్లులతో పులకరించి తాద్యాత్మం చెందినట్లు చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ పందిరి మీద పాకే బచ్చలి కూర అందుకుంటా
“ మనసంతా చెక్కలు గుల్ అయిపోతది.
పల్లెల్లో ఇంటిముందు పందిరి ఉంటుంది.పందిరి గుంజకు అల్లుకొని పాకిన బచ్చలి తీగ పచ్చ పచ్చగా ప్రకృతి మాత ఒడిలో ఉంటుంది.కవి దేవేందర్ పందిరి మీద పాకే బచ్చలి కూర అందుకొనగానే మనసంతా చక్కిలిగింతలు పెట్టినట్లుగా ఆనందంగా హాయిగా అయిపోతది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.బచ్చలి ఆకులను కూరగా వండుకుంటారు. బచ్చలి తీగ పైకి పాకి పందిరి అంతా అల్లుకుంటుంది.బచ్చలి తీగ పందిరికి నీడను చల్లదనాన్ని ప్రసాదిస్తుంది.ప్రకృతిలో భాగమైన బచ్చలి కూర తీగను అందుకొని మనసంతా పరవశంతో ఒక రకమైన చక్కిలిగింతల అనుభూతిని పొందుతున్నాడని చెప్పిన భావం అద్భుతం అని చెప్పవచ్చు.
“ ఇంటి ముందున్న మొక్కలకు నీళ్లు తాపిస్తా
“ ఆ పచ్చనాకులు నాతో ముచ్చట్లు పెడుతయి.
పొద్దున్నే లేచి ఆరోజు జరిగిన చిత్రాల్లో భాగాలను తెలియజేస్తున్నాడు.పొద్దున్నే లేచి ఇంటి ముందున్న మొక్కలకు నీళ్లు పారిస్తా అని చెప్పడం లేదు.ప్రాణం ఉన్న జీవులమైన మనుషులు నీళ్లు తాగుతారు. మొక్కలు జీవించడానికి నీళ్లు కావాలి.నీళ్లు పారిస్తేనే మొక్కలు పచ్చదనంతో కళకళలాడుతాయి.నీళ్లు పారిన తర్వాత ఆ పచ్చనాకులు నాతో ముచ్చట్లు పెడుతయి.నీళ్లు తాపిన తర్వాత ఆ పచ్చనాకులు
ముచ్చట్లు పెడుతయా అనే సందేహాలు మనలో కలుగుతాయి.మొక్కలు నీళ్లు తాగగానే ఆ పచ్చనాకులు సంతోషంతో మెరుస్తాయి.ముచ్చట్లు పెడుతాయి.ప్రకృతి కాంత పులకరించి పచ్చని ఆకులు ముచ్చట్లు పెట్టినట్లుగా అనిపిస్తాయి అని చెప్పిన తీరు అద్భుతం అని చెప్పవచ్చు.
“ కాళ్ళల్ల మెదిలే పిల్లి కూనలకు పాలు పోస్తా
“ అవి మీదికచ్చి గావురాలు చేస్తయి.
పొద్దున్నే లేస్తే ఏం చేస్తాడో అని చెబుతున్నాడు. ఇంట్లో పిల్లి ఈనింది.పిల్లికి పుట్టిన పిల్లికూనలు సందడి చేస్తూ ఇల్లంతా కలయ తిరుగుతున్నాయి. పిల్లికూనలు చూడ ముచ్చటగా ముద్దుగా ఉన్నాయి. ప్రేమతో పిల్లికూనలను దగ్గరికి తీస్తే కాళ్ళల్లో మెదలుతాయి.పిల్లికూనలకు ప్రేమతో పాలు పోస్తాను.పిల్లి కూనలు ప్రేమతో మీదికచ్చి గావురాలు చేస్తయి.పెంచుకున్న పిల్లి కూనలు కాళ్ళల్ల మెదులుతయి,పిల్లి కూనలు గావురాలు చేస్తయి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ వాకిట్ల వేసిన ముగ్గులను చూసి మురుస్తుంట
“ హృదయం కళాత్మకమై తేలిపోతది.
అమ్మ పొద్దున లేచి వాకిలిని శుభ్రంగా ఊడ్చి పేడతో కల్లాపి చల్లుతుంది.అమ్మ వాకిట్లో అందంగా ముగ్గును తీర్చి దిద్దుతుంది.పొద్దున లేస్తే అమ్మ వేసిన ముగ్గును చూసిన వెంటనే హృదయం కళాత్మకమై ఆనందంతో తేలిపోతది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ అరి పాదాలతో నేల మీద అటు ఇటు నడుస్తా
“ దేహమంతా మట్టి తరంగమై పులకరిస్తది.
పొద్దున్నే లేస్తే ఎన్ని మంచి పనులు చేస్తున్నాడో చెబుతున్నాడు.అరి పాదాలతో నేల మీద అటు ఇటు నడిస్తే కాళ్లలో చలనం కలిగి చైతన్యం వస్తుంది.అరి పాదాలతో నేల మీద నడవడం వల్ల ఒళ్లంతా చెమట పట్టి మట్టి తరంగమై పులకరిస్తది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ నీలి ఆకాశం కేసి తేరిపార చూస్తుంటా
“ మేఘాల నుంచి సూర్యుడు కరచాలనం చేస్తడు.
ఆరు బయట నుండి పైకి చూస్తే మనకు కనిపించే నీలిరంగు ఆవరణమే ఆకాశం.భూమి ఉపరితలంపై ఉండే మేఘాలు నీటి ఆవిరితో కూడిన వాయు ఆవరణాల పై పడిన సూర్యకాంతి పరావర్తనం చెందడం వలన ఆకాశం మనకు నీలిరంగులో కనబడుతుంది.మేఘాలు గాలిలో తేలుతూ ఉండే చిన్న నీటి బిందువులు లేదా మంచి స్పటికాలు.అవి చాలా చిన్నవి కాబట్టి తేలుతూ ఉంటాయి.సూర్యుని ద్వారా జరిగే భాష్పీభవన ప్రక్రియ ఫలితం గాలి లేదా తేమను పొందుతుంది.ఈ తేమతో కూడిన గాలి భూమి యొక్క ఉపరితలం నుండి పైకి లేస్తుంది మరియు మరింత చల్లగా మారుతుంది.నీటి ఆవిరి బిందువులను ఏర్పరుస్తుంది.తగినంత ఎత్తులో గాలిలో ఉండే ఆవిరి నీటి బిందువులను ఏర్పరుస్తుంది.ఈ చుక్కలు గాలిలో ఉండి మనకు మేఘాలుగా కనిపిస్తాయి.పొద్దున్నే లేచి పైన ఉన్న నీలి ఆకాశం దిక్కు తేరిపార చూస్తుంటే మేఘాల నుంచి సూర్యుడు తన కిరణాలను ప్రసరింపజేస్తూ కరచాలనం చేస్తాడు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ పొద్దు పొద్దున్నే లేచి ఏం చేస్తా
“ ప్రతి ఉదయం ప్రకృతిలో ఆకృతినై పలువరిస్తా.
ప్రకృతిలో వాతావరణం,పర్యావరణ వ్యవస్థ, వృక్షజాలం,జంతుజాలం మరియు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చి అబ్బురపరిచే ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. ప్రకృతి మన చుట్టూ ఉన్న అందమైన వాతావరణం, జీవరాశికి తల్లి,మనల్ని పోషిస్తుంది.మన మనుగడ కోసం అన్ని అవసరాలు అందిస్తుంది.మనం తినే ఆహారం,మనం పీల్చేగాలి,మనం ధరించే బట్టలు, మనం నివసించే ఇల్లు ఇవి అన్ని ప్రకృతి మనకు ప్రసాదించిన బహుమతులే.ప్రకృతి మన మనుగడకు తోడ్పడుతుంది.కొండలు,లోయలు, పర్వతాలు,పచ్చదనం,నదుల వంటి ప్రకృతిలో చూడటానికి చాలా అందమైన విషయాలు ఉన్నాయి.ప్రకృతిలో ఒక రకమైన సానుకూల శక్తి ఉంటుంది.ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో ప్రకృతి అందంగా దర్శనమిస్తుంది.ప్రకృతి మన భౌతిక అవసరాలకు మరియు మన మనశ్శాంతికి, ఆనందం మరియు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది.పొద్దు పొద్దున్నే లేచి ప్రతి ఉదయం ప్రకృతి మాత ఒడిలో లీనమై ప్రకృతిలో ఆకృతిగా మారిపోతా,పలువరిస్తా అని చెప్పిన తీరు చక్కగా ఉంది.చక్కటి కవిత అందించినందుకు కవి దేవేందర్ ను అభినందిస్తున్నాను.కవి దేవేందర్ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
రచన : నరేంద్ర సందినేని.
అన్నవరం దేవేందర్ “మా ఊరి బస్సు” కవిత పై విశ్లేషణా వ్యాసం. రచన : నరేంద్ర సందినేని.
ప్రముఖ కవి,అన్నవరం దేవేందర్ కలం నుండి జాలువారిన ఇంటి దీపం కవితా సంపుటిలోని “మా ఊరి బస్సు” కవిత పై విశ్లేషణా వ్యాసం.మా ఊరి బస్సు కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.మా ఊరికి బస్సు రావడం ఏమిటి? అనే సందేహం మనకు కలగవచ్చు.జిల్లా కేంద్రం బస్ స్టేషన్ నుండి పల్లెలకు కూడా పల్లె బస్సులు నడుపుతున్నారు.ఒకప్పుడు పల్లెకు బస్సు సౌకర్యం లేదు.పల్లె నుండి పది కిలోమీటర్లు నడిచి మండలము మరియు తాలూకా ప్రాంతంకు వస్తే అక్కడ నుండి బస్సులు దొరికేవి. పల్లెకు బస్సు రావడం అంటే పల్లెటూరు వారికి ఎంతో సంబురం అని చెప్పవచ్చు.ఏదైనా ఊరికి పోవాలంటే బస్సు సౌకర్యం లేకపోవడం వలన 15 కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసి వచ్చేది.జిల్లా కేంద్రం బస్ స్టేషన్ నుండి మా ఊరికి పోయే బస్సును గురించి చెబుతూ మా ఊరి బస్సు అని అంటున్నాడు.కవి దేవేందర్ చెప్పే మా ఊరి బస్సు సంగతులు ఏమిటి? తెలుసుకోవాలనే ఆసక్తి కలగడం సహజం అని చెప్పవచ్చు.మా ఊరి బస్సు యొక్క విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఊరి బస్సు కవిత చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించినట్లయితే మా ఊరి బస్సుకు సంబంధించిన అన్ని విషయాలు మనకు అవగాహనలోకి వస్తాయి.
“ ఆ బస్సు మా ఊల్లె కెల్లి
“ పచ్చని పల్లె అనురాగాలను మోసుకస్తంది.
మా జిల్లా బస్ స్టేషన్ నుండి మా ఊరికి వెళ్ళిన పల్లె బస్సు పచ్చ పచ్చగా కళకళలాడుతున్న మా పల్లె వాసులకు సంబంధించిన నిజమయిన అనురాగాలను మోసుకొని వచ్చి ఆనందింపజేస్తుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ తన్మయత్వపు ఊరు గాలి సోకి బయిలెల్లింది.
“ ఊరి దూలినీ తీసుకొస్తంది.
భావనలో నిమగ్నమైన స్థితి లేక భావన తన్మయత్వం అని చెప్పవచ్చు.తన్వయత్వంతో కూడిన మా ఊరి బస్సు పల్లె గాలిని పీల్చుకొని ఒక రకమైన ఆనందంతో పల్లె వాసులను ఎక్కించుకొని బయలుదేరింది.మా ఊరి బస్సు కదలగానే పల్లె లో చెలరేగే దుమ్ము దూళిని కూడా తన వెంట తీసుకొస్తుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ కిటికీల్లోంచి కనపడుతున్న తలకాయలన్నీ
“ కిల కిలా నవ్వుల ఎరుకున్న మొకాలు.
మా ఊరు నుంచి వచ్చిన ఆ బస్సులో కూర్చున్న వాళ్లలో కిటికీలోంచి చూస్తే కనబడుతున్న మనుషులు నాకు తెలిసిన మా ఊరికి చెందిన వారు.అతను మాత్రం పట్నంలో ఉద్యోగం చేస్తూ బతుకు కొనసాగిస్తున్నాడు.అతను ఉద్యోగం చేస్తూ పట్నంలో ఉండడం వలన ఊరికి పోవడం తగ్గింది. అతను అనుకోకుండా ఆ రోజు పల్లె వాసులను చూడాలనే కుతూహలంతో బస్ స్టేషన్ కు వెళ్లాడు. ఎందుకో చిత్రంగా బస్ స్టేషన్లో తనను చూడగానే కనపడిన ఊరి వారు ఆనందంతో కిలకిలా నవ్వుతున్నారు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ సంచులు సందుగలతో దిగే వాల్లంతా
“ మా వాడల కలెతిరిగిన సోపతిగాల్లే.
జిల్లా కేంద్రం బస్ స్టేషన్ లో మా ఊరి నుండి వచ్చిన బస్సు పాయింట్ మీద ఆగింది.మా ఊరు నుండి వచ్చిన బస్సులో నుండి సంచులు సందుగలతో దిగిన ప్రయాణికులు ఎవరు? అంటే అతని ఊరి వారు.అతనితో ఊరిలోని వాడలలో కలిసిమెలిసి తిరిగిన స్నేహితులు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ వాల్లంతా ఎల్లప్పుడూ
“ మా ఇంటికి రావలసిన సుట్టాలు.
జిల్లా బస్ స్టేషన్ లో మా ఊరి బస్సులో నుండి దిగిన ప్రయాణికులు అతని ఊరి వాళ్ళు.వాళ్ళు ఎల్లప్పుడు అతని ఇంటికి రావాల్సిన బంధువులు. ఊరి బంధువులు కాబట్టి ఎల్లప్పుడు అతని ఇంటికి సంతోషంగా వస్తారు.మా ఊరి బస్సులో నుండి దిగిన ప్రయాణికులు అతని యొక్క ఆత్మీయులు, చుట్టాలు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ బస్సు మీద పేరు చూసినప్పుడల్లా
“ మా ఊరే కండ్లండ్ల చక్మని మెరుస్తంది.
బస్ స్టేషన్ లో నుండి బయలుదేరే బస్సులకు ఆ బస్సు ఏ ఊరికి వెళుతుందో తెలియజేసే సైన్ బోర్డు ఉంటుంది.అతను బస్ స్టేషన్ కు వెళ్లి బస్సు బోర్డు మీద పేరు చూసినప్పుడల్లా మా ఊరి పేరు బస్సు బోర్డు మీద ఉన్నట్లుగా కళ్ళలో మెరుపు మెరుస్తుంది. నేను పుట్టి పెరిగిన మా ఊరు కళ్ళల్లో మెరుస్తది. మా ఊరి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నట్లు ఎంతో ఆనందంతో ఊరి బస్సు గురించి పంచుకున్న అనుభవాలు చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ పచ్చని కొబ్బరాకులు పట్టుకొని
“ కొత్తగ బస్సు వచ్చిన్నాటి ఆనందం
“ ఊరికి దూరమైన నాకు
“ ఆ బస్సు కనపడ్డప్పుడల్లా సంబురం.
మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం.స్వాతంత్ర్యం వచ్చిన చాలా రోజుల వరకు కూడా గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించబడలేదు.రెండు వైపులా పచ్చని కొబ్బరి ఆకులు కట్టిన బస్సు మొదటిసారిగా ఊరిలోకి వచ్చినప్పుడు ఆనందంతో గ్రామస్తులంతా స్వాగతం పలికిన రోజును,తన చిన్ననాటి ఆనందాన్ని గుర్తు చేసుకుంటున్నాడు.అతనికి ఉద్యోగం దొరకగానే తన ఊరి నుండి పట్టణానికి వెళ్లిపోయినాడు.ఊరికి దూరమైనప్పటికీ అతనికి తన ఊరి ఎర్ర బస్సు కనపడ్డప్పుడల్లా కలిగిన సంబురం మాటల్లో వ్యక్తం చేయలేకపోతున్నాడు. కొత్తగా తన ఊరికి బస్సు సౌకర్యం కలిగిన రోజును ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా గుర్తు పెట్టుకుని మా ఊరి బస్సును గురించి చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ ఎనుకటి ఎక్కువ తక్కువ అంతరాలు
“ బస్సు వచ్చిన తర్వాత అంతరాల సమాంతరం.
మా ఊరికి బస్సు వచ్చిన తర్వాత ఊరి వారందరు బస్సులోనే ప్రయాణం చేసేవాళ్ళు.బస్సు వచ్చిన తర్వాత వెనుకటి తీరుగా పెద్ద కులం,చిన్న కులం అనే తేడాలు లేకుండా అందరు బస్సులోనే ప్రయాణించేవాళ్లు.మా ఊరికి బస్సు వచ్చిన తర్వాత పెద్ద,చిన్న అంతరాలు సమసి పోయి ఊరి వారు అందరు ఒక్కటిగా మెదులుతున్నారు.మా ఊరి బస్సు వచ్చిన తర్వాత ఊళ్లోని జనాల మధ్య ఎక్కువ తక్కువ తేడాలు తగ్గిపోయినయి అని చెప్పిన తీరు అద్భుతం అని చెప్పవచ్చు.
“ బస్సుల కూకుంటే రచ్చబండ మీద ఉన్నట్టే
“ ఇంటింటి ముచట్లన్నీ ఇమరస
“ పట్నంలో పల్లె యాదికస్తే
“ బస్టాండుకు పోయి తిరిగి తిరిగి రావాలె
“ మా బస్సు వస్తూ వస్తూ
“ ఎన్ని మంచి వార్తలు తెస్తదో !
రచ్చబండ అనేది ఒక భారీ చెట్టు నీడలో సాధారణంగా నిర్మించబడిన ఎత్తైన వేదిక.
రచ్చబండ అనేది గ్రామస్తులు తమ సామాజిక సమస్యలు,ఆర్థిక సమస్యలు ఇతర వివాదాల గురించి చర్చించడానికి ఒక సాంప్రదాయకమైన సమావేశ స్థలం.ఎక్కువగా పెద్దవారు అని పిలవబడే ఒక గ్రామ అధిపతి రచ్చబండపై కూర్చుని అనేక సమస్యలకు పరిష్కారాలను అందించడానికి మరియు గ్రామస్తుల మధ్య ఉన్న వివిధ వివాదాలను పరిష్కరించడానికి రచ్చబండలు పనికి వస్తాయి.ఇవి ఎల్లప్పుడు ఆయా గ్రామాలకే పరిమితమవుతాయి.ఆధునిక కాలంలో పట్టణీకరణ వల్ల రచ్చబండలు అంతరించి పోతున్నాయి.మా ఊరి బస్సుల ఎక్కి సీట్ల మీద కూర్చుంటే మా ఊరి రచ్చబండ మీద జరిగే కార్యక్రమంలో పాల్గొన్నట్లేనని తెలియజేస్తున్నాడు.బస్సులో కూర్చున్న మా ఊరి వాళ్ళు రచ్చబండ మీది లాగా ఇంటింటి ముచ్చట్లు మాట్లాడుతు విమర్శలు చేస్తున్న తీరు రచ్చబండ తీరుగా అనిపిస్తుంది.పట్టణంలో నివసిస్తున్న అతను పల్లె గుర్తుకు వస్తే బస్ స్టేషన్ కు పోయి తిరిగి తిరిగి వస్తడు.బస్ స్టేషన్ కు పోతే ఊరి వాళ్ళందరు కలుస్తారు.ఊరి ముచ్చట్లు అన్ని తెలుస్తయి.బస్ స్టేషన్ కు పోతే పల్లెకు పోయినట్టుగా ఉంటది. మా ఊరి బస్సు పట్నంకు వస్తూ వస్తూ మా ఊరి నుంచి ఎన్నెన్నో మంచి ముచ్చట్లు మోసుకు వస్తుందని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ పొలం పారుతుంది
“ భూమక్క బిడ్డ లగ్గం దొరింపు అయ్యింది
“ ఏనె కింది బాయిల నీళ్లు పడ్డయి
“ మనూరికి నీళ్ళ కాలువ వస్తందట
“ కొత్తకొత్త మతలావులన్నీ
“ బస్సు దిగినోల్లే ఎల్లడిస్తరు.
పట్నంలో అతను బస్ స్టేషన్ కు వెళితే మా ఊరిలో ఏం జరిగింది? అనే విషయాలు తెలుస్తాయి.మా ఊరి బస్సు నుండి దిగిన జనాలు వివరాలు అన్ని సవ్యంగా తెలియజేస్తారు.మా ఊరిలో వానాకాలం వానలకు మన ఊరి చెరువు నిండి పోయింది. చెరువు నీరు ఎక్కువై మత్తడి దునుకుతుంది. చెరువు నిండిందంటే ఊరి జనాలకు మరియు రైతులకు తాగునీరు,సాగునీరు పుష్కలంగా లభిస్తాయి.ఊరిలో పండుగ వాతావరణం అలుముకుంటుంది అని చెప్పవచ్చు.చెరువులో నీళ్లు ఉంటే వ్యవసాయం మస్తుగా సాగుతది.వర్షాలు పడిన తర్వాత ఊరిలో రైతులు ఇరువాలు దున్ని పొలం మడిని పొతం చేసి వరి నాట్లు కూడా పెట్టినారు.మన ఊరి చెరువు నుండి పొలానికి నీళ్లు పారుతున్నయి.మన ఊళ్ళె పెళ్ళికి ఎదిగిన భూమక్క బిడ్డకు పెళ్లి ఖాయం అయింది.భూమక్క బిడ్డ పెళ్లి కాలేదని అందరు నారాజు అయేటోల్లు. చూడు కళ్యాణం వచ్చిన కక్కు వచ్చిన ఆగదు అంటరు కదా.అదే నిజమైంది.మన ఊల్లే ఏనె కింది బాయి ఎండి పాయె.వర్ష కాలం వానలకు చెరువు నిండింది.ఏనె కింది బాయిల నీళ్లు పడ్డాయి.మన ఊరికి కాలువల ద్వారా నీళ్లు వస్తయట,అందరు అంటున్నారు.పొలాలకు,పెరండ్లకు కాలువల ద్వారా నీళ్లు పారుతె మస్తుగా పంటలు పండించి రైతులకు మంచిగా గిట్టుబాటు అవుతుంది.ఇగ మన ఊరి రైతులకు చేతి నిండా పని.ఎన్నెన్నో కొత్త కొత్త విషయాలు,మన ఊరి బస్సు దిగిన వాళ్ళు తెలియజేస్తరు.బస్ స్టేషన్ కి వెళ్లితె మన ఊరి వాళ్ళను కలిస్తే ఊరి సంగతులు అన్ని తెలుస్తయి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ డ్రైవర్ రఘుపతి రాంగా రాంగా
“ మా అమ్మ పంపిన
“ మక్క కంకులు పల్లికాయ ముల్లె తొక్కు సీసా
“ బియ్యం సంచీ ఎన్నెన్ని తెస్తడో
“ ఎంతెంత మురిపెం కడుపు నింపుతడో..
రఘుపతి రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.మా ఊరి బస్సుకు డ్రైవర్ రఘుపతి.రోజు మూడు ట్రిప్పులు పట్నం నుండి బస్సు మా ఊరికి వస్తది.రెగ్యులర్ గా రోజు మూడు ట్రిప్పులకు బస్సు డ్రైవర్ రఘుపతి వస్తడు.మా ఊరి నుంచి బస్సు పట్నం వచ్చేటప్పుడు మా అమ్మ రఘుపతి డ్రైవర్ ద్వారా పంపిన మక్క కంకులు, పల్లికాయ ముల్లె,తొక్కు సీసా,బియ్యం సంచీ ఇంకా ఎన్నెన్నో తెస్తడు.రఘుపతి డ్రైవర్ ఎంతెంతో మురిపెంగా మా అమ్మ పంపినవి తీసుకువచ్చి
మా కడుపు నింపుతాడు అని అతని గురించి ప్రేమ గా తెలియ జేస్తున్నాడు.మా ఊరి నుండి బస్సు పట్నంకు వచ్చేటప్పుడు అమ్మ పంపినవి డ్రైవర్ రఘుపతి ప్రేమతో తీసుకు వస్తాడు,మా కడుపు నింపుతడు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ బస్సు పల్లెకు పట్నంను కలిపే దారపు కండె
“ బస్సు సకల జనుల ఇల్లు వాకిలి.
మా ఊరి బస్సు పల్లెకు పట్టణంను కలుపు దారపు కండెగా మారింది అని తెలియ జేస్తున్నాడు.మా ఊరి బస్సు మా ఊరి జనాల అందరి ఇల్లు వాకిలి. మా ఊరి బస్సు లేకుంటే సకల జనుల ఇల్లు వాకిలి లేదు అని చెబుతున్నాడు.ఇంటికి వాకిలి ఉంటేనే అందం.ఇంటికి వాకిలి లేకుంటే అంతా శూన్యంగా తోస్తుంది.మా ఊరికి బస్సు ఉంటేనే ఇల్లు వాకిలి ఉన్నట్లు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ పల్లె బస్సు ప్రయాణం అంటేనే
“ చెట్లు గుట్టలు పిట్టలు చూసి పరవశించుడు.
మా ఊరికి పల్లె బస్సులో ప్రయాణం చేస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది.పల్లె బస్సులో ప్రయాణం చేయడం వల్ల మా ఊరిలోని పచ్చ పచ్చని చెట్లు, ఎత్తైన అందమైన గుట్టలు,ఆకాశంలో విహరించే రంగు రంగుల పిట్టలు చూసి ఆనందంతో ప్రకృతి మాత ఒడిలో ఉన్నట్లుగా పరవశించిపోతాం అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ బస్సు ప్రయాణం
“ ఒకానొక సామూహిక ఏకాంత చైతన్యం.
ఏ ఊరికి వెళ్లాలన్నా బస్సులో ప్రయాణం చేయడం ఆనవాయితీగా వస్తోంది.బస్సులో అందరు కలిసి సామూహికంగా ప్రయాణం చేస్తారు.బస్సులో ప్రయాణం చేయడం వల్ల అందరిలో ఏకాంత చైతన్యం ఏర్పడుతుంది.చాలామంది జనాలకు బస్సు ప్రయాణం సామూహిక ఏకాంత చైతన్యం అని చెప్పిన తీరు చక్కగా ఉంది.మా ఊరి బస్సు చక్కటి కవిత అందించినందుకు కవి దేవేందర్ ను అభినందిస్తున్నాను.కవి దేవేందర్ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
రచన : నరేంద్ర సందినేని.
అన్నవరం దేవేందర్ “ చెట్ల మహిమ “ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రముఖ కవి,అన్నవరం దేవేందర్ కలం నుండి జాలువారిన ఇంటి దీపం కవితా సంపుటిలోని “చెట్ల మహిమ’ కవిత పై విశ్లేషణా వ్యాసం.చెట్ల మహిమ కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.చెట్లకు మహిమలు ఉంటాయా? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.కవి దేవేందర్ చెట్ల మహిమ కవితను గురించి తెలుసుకోవాలంటే కవిత చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.చెట్ల మహిమ గురించి అన్ని విషయాలు అవగాహన లోకి వస్తాయి.
“ యాప చెట్ల కింద
“ వాకీట్ల పన్నోనికి తెలుస్తది
“ అదెంత సుఖ నిద్రో
“ చెప్ప తరమా చెట్ల మహిమ.
పల్లెలో వేప చెట్లను యాప చెట్లుగా పిలుస్తారు.వేప చెట్టు నుండి వచ్చే వేప ఆకు,వేప పూత,మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడతాయి. మనిషికి కావాల్సిన స్వచ్ఛమైన గాలిని వేపచెట్టు అందిస్తుంది.వేప కొమ్మను పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు.వేప చెట్టు కట్టెతో ఇంటికి వాడే ద్వారాలు,తలుపులు,కిటికీలు,బీరువాలు, మంచాలు తయారు చేస్తారు.మనదేశంలో వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా జనం పూజిస్తారు. వేపకాయల నుండి వేప నూనె తయారు చేస్తారు. ఉగాది పండుగ రోజున వేప పూత బెల్లంతో కూడిన ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. వేప చెట్టు ఏ కాలంలో ఎప్పుడు చూసినా పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటుంది.వేప చెట్టు తీవ్రమైన క్షామ పరిస్థితుల్లో మాత్రమే చాలావరకు ఆకులను రాల్చుతుంది.ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారో వారు ఆరోగ్యవంతంగా ఎక్కువ కాలం జీవిస్తారు.ఎన్నో సుగుణాలు ఉన్న వేప చెట్టును ఇంటి ఆరోగ్య దేవతగా చెప్పవచ్చు. పల్లెలో అతని ఇంటి వాకిలికి ఆనుకొని విస్తారంగా వేప చెట్లు ఉన్నాయి.వేప చెట్ల కింద పడుకున్న వారికి ఎంత హాయిగా ఉంటుందో తెలుస్తది.వేప చెట్టు నీడన పడుకుంటే చక్కటి సుఖ నిద్ర వస్తుంది. వేప చెట్టు నీడ వల్ల ఎంత ఉపయోగమో చెప్పతరమా చెట్ల మహిమ అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ పొలం ఇరువాలు దున్ని
“ టేకు ఆకుల్ల తిన్నోనికి తెలుస్తది
“ అదెంత కండ్ల పండుగో
“ చెప్ప తరమా ఊడల మహిమ.
పొలం అనగా వ్యవసాయ భూమి.రైతులు పంటలు పండించే ప్రదేశం.వ్యవసాయ భూములు సారవంతమైన నేలను కలిగి ఉంటాయి.పొలం యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఆహారం మరియు ఇతర పంటలను ఉత్పత్తి చేయుట.ప్రధానంగా వ్యవసాయ ప్రక్రియలకు ఉపయోగించే భూమిని పొలం అంటారు.వ్యవసాయ భూమి అయిన పొలం ఇరువాలు దున్నిన తర్వాత రైతులు తినడం కొరకు పళ్ళెం ఉపయోగించకుండా టేకు చెట్టు ఆకులో అన్నం కలుపుకొని తింటారు.టేకు చెట్టు ఆకులు పెద్దగా ఉంటాయి.టేకు చెట్టు ఆకుల్లో అన్నం తినడం వల్ల ఎంతో కమ్మగా ఉంటుంది.టేకు చెట్టు ఆకుల్లో తినడం వల్ల ఎంతో మేలు చేకూరుతుంది.టేకు చెట్టు యొక్క పచ్చని ఆకుల మహిమ చెప్పతరమా అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ అటు ఇటూ మర్రి చెట్ల మధ్య
“ పయనించినోనికి తెలుస్తది
“ అదెంత కండ్ల పండుగో
“ చెప్ప తరమా ఊడల మహిమ.
మర్రిచెట్టు బాగా విస్తరించిన శాఖలతో అనేకమైన ఊడలతో పెరిగే అతి పెద్ద వృక్షం.మర్రి చెట్టును వటవృక్షం అని కూడా అంటారు.మర్రి చెట్టు పురాణాలలో పవిత్ర వృక్షంగా ప్రస్తావించబడింది. మర్రిచెట్టు కింద అనేక దేవాలయాలు నిర్మించబడ్డాయి.మర్రిచెట్టు ఆయుర్వేదంలో అనేక వ్యాధుల అంటు రోగాల చికిత్స కోసం ఉపయోగపడుతుందని చెప్పబడింది.మర్రి చెట్టు మన దేశపు జాతీయ వృక్షం.మర్రి చెట్టు ఆకులు పెద్దవిగా ఉంటాయి.బాగా పెరిగిన మర్రిచెట్టు నేల మీదకు వేలాడుతూ ఉండే ఊడలను కలిగి ఉంటాయి.మర్రి చెట్టు ఊడలు బాగా పెరిగిన తర్వాత పెద్ద చెట్టు యొక్క బెరడును ప్రతిబింబించేలా ఉంటాయి.చిన్న చిన్న చెట్లు కలిసి గుంపుగా ఎదిగినట్టు కనిపిస్తాయి.మర్రి చెట్ల మధ్య అటు ఇటు తిరిగిన వారికి మర్రి చెట్టు యొక్క గొప్పతనం గురించి తెలుస్తుంది.మర్రి చెట్ల వద్ద మసలినట్లయితే అక్కడి చల్లదనం కన్నుల పండుగగా ఉంటుందని తెలియజేస్తున్నారు. మర్రిచెట్టు ఊడల మహిమ చెప్పతరమా అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ బంతీ చామంతుల సొగసు
“ పందిరి మీద పారిన మల్లె పరిమళం
“ ఇంట్లో ఉన్నోల్లకే తెలుస్తది సువాసన
“ చెప్ప తరమా తీగల మహిమ.
బంతి పువ్వు బంగారు,పసుపుపచ్చ,నారింజ రంగులలో లభ్యమవుతుంది.బంతిపూలను పూజలలో పెళ్లిళ్లలో అలంకరణ కొరకు సామాజిక కార్యక్రమాల కోసం దండలు తయారు చేయడానికి వాడుతారు.చామంతి అందమైన పువ్వు.చామంతి శీతాకాలంలో పూస్తుంది.మల్లె సువాసనలు ఇచ్చే పూల మొక్క.వేసవి రాగానే మల్లెపూల వాసన గుప్పుమంటుంది.స్త్రీలు తమ సౌందర్యాన్ని పెంచుకోవడానికి,పూజలకు మల్లెపూలు ఎక్కువగా ఉపయోగిస్తారు.పల్లెలో ఇంటి వద్ద గల పెరట్లో గల తోటలో బంతిపూల చెట్లు,చామంతి పూల చెట్లు పెంచుతారు.ఇంటి ముందు గల పందిరి మీద ఏపుగా పెరిగిన మల్లెతీగ సువాసన వెదజల్లుతుంది.పల్లెలో ఇంట్లో ఉన్నవారికి బంతి, చామంతి మల్లెపూల పరిమళం తెలుస్తుంది. సువాసనలు వెదజల్లే బంతి,చామంతి,మల్లె తీగల మహిమ చెప్ప తరమా అని చెప్పిన తీరు అద్భుతం అని చెప్పవచ్చు.
“ నిప్పుల్ల కక్కే ఎండల్ల
“ చింత నీడకు సేద తీరినోల్లకే తెలుస్తది
“ హృదయం ఎంత సల్లనో
“ చెప్ప తరమా చింతాకు మహిమ.
నిప్పులు కక్కే ఎండలు అంటే వేసవి కాలం.భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు అని చెప్పవచ్చు. ఎండలు పెరగడంతో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.వేసవి వేడి నుండి తట్టుకోవడానికి చింత చెట్టు నీడకు చేరితే ఎంతో హాయిగా ఉంటుంది.ఎండ వేడిమి నుంచి కాపాడుకోవచ్చు. వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి.వేసవి ఎండ నుండి రక్షించుకోవడానికి పల్లెలో జనాలు చింతచెట్టు నీడకు చేరి సేద తీరుతారు.చింత చెట్టు నీడ ఎంతో చల్లగా ఉంటుంది.చింత చెట్టు హృదయం ఎంతో చల్లనిది.చింతాకు వల్లనే చింతచెట్టు చల్లదనం ప్రసాదిస్తుంది.చెప్ప తరమా చింతాకు మహిమ అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ రచ్చ బండ కాడ పచ్చని చెట్టు నీడన
“ పటాపంచలైన పంచాయితీ పగలు
“ పెట్టుకున్నోల్లకే తెలుస్తది ఆత్మ ఇమరశ
“ చెప్ప తరమా కొమ్మల మహిమ.
రచ్చబండ అనేది పల్లెవాసులు తమ సామాజిక సమస్యలు వివాదాల గురించి చర్చించడానికి ఏర్పాటు చేయబడ్డ సమావేశ స్థలం.గ్రామ పెద్ద రచ్చబండపై కూర్చుని ఇరుపక్షాల సమస్యలను సావధానంగా విని వివాదాలను పరిష్కరిస్తాడు. గ్రామాల్లో రచ్చబండ పచ్చని చెట్టు నీడన కొలువై ఉంటుంది.గ్రామ పెద్ద ఇరుపక్షాలను పిలిచి మాట్లాడి పరిష్కారం చెపుతాడు.గ్రామ పెద్ద చెప్పినట్లు ఇరుపక్షాలు వినాలి.ఇరు పక్షాలు వినకపోతే సమస్య పరిష్కారం కాదుపంచాయతీలో కూర్చున్న ఇరుపక్షాల మధ్య పగలు ప్రతీకారాలు పెరుగుతాయి.ఎందుకు కొట్లాడుకున్నారో కొట్లాట పెట్టుకున్న ఇరు పక్షాల వాళ్లు ఆత్మ విమర్శ చేసుకోవాలి.పచ్చని చెట్టు నీడన రచ్చబండ కింద కొట్లాట పరిష్కారం కావాలి.పరిష్కారం కాని తగాదా గురించి చెబుతూ చెప్పతరమా కొమ్మల మహిమ అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ దట్టమైన ఆకుపచ్చదనం
“ ఆదివాసీలకు ప్రాణాపాణం
“ లీనమైతెనే తెలుస్తది అడవి అందం
“ చెప్ప తరమా అరణ్యాల మహిమ.
ఆదివాసీలు అంటే అడవులకు దగ్గరగా నివసించే ప్రజలు.ఆదివాసీలు తమదైన ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం.సామాజిక విలువలను కలిగి ఉంటారు.అనాది కాలం నుంచి ఆదివాసీలు అడవులు కొండ ప్రాంతాల్లోనే నివాసం ఏర్పరచుకొని జీవిస్తున్నారు.వేట లేదా వ్యవసాయం వారి ప్రధాన జీవన విధానం.ఆదివాసీ గ్రామస్తులు కూడా అడవితో ఆధ్యాత్మిక సంబంధాన్ని పెంచుకున్నారు. అడవిలో కొంత భాగాన్ని ఆదివాసీలు పవిత్రంగా పరిగణిస్తారు.ఆదివాసీలకు అడవులు వారి జీవితంలో ముఖ్యమైన భాగంగా ఉంటాయి. ఆదివాసీలు అడవి నుండి స్వచ్ఛమైన నీటిని పొందుతారు.పండ్లు మరియు కూరగాయలు సేకరిస్తారు.అడవిలో నివసించే జంతువులను వేటాడుతారు.ఆదివాసీలు నివసించే ఇండ్లన్ని అడవి నుండి తీసిన వస్తువులతో తయారు చేయబడ్డాయి. ఆదివాసీలు అనేక మొక్కలను ఆహారంగా మేతగా మూలికలు మరియు ఔషధాలుగా ఉపయోగిస్తారు.వేటాడే స్థలం,దట్టమైన చెట్ల పొదలతో క్రూర మృగాలతో ఉండే స్థలం.అడవి అనేది దట్టమైన చెట్లతో కూడిన ప్రాంతం.దట్టమైన అడవి ఆకుల పచ్చదనం ఆదివాసీలకు ప్రాణం అని చెబుతున్నారు.ఆదివాసీలు అడవి అందాలకు పరవశులై బతుకుతున్నారు.అందమైన అడవిలో లీనమై బతుకు గడుపుతున్న ఆదివాసీల గురించి చెప్ప తరమా అరణ్యాల మహిమ అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ ఊడల మర్రి కింద బర్ల మంద
“ఎండల ఎంత ఇష్టంగ పన్నయో
“ నెమరు మోము సూస్తేనే తెలుస్తది
“ చెప్ప తరమా మాను మహిమ.
ఊరి బయట సమూహంగా పశువులు ఉండే చోటును మంద అంటారు.వేసవికాలంలో ఎండలో పశువులైన బర్ల మంద ఊడల మర్రి చెట్టు కింద ఎంతో ఇష్టంగా సేద తీరుతున్నది.ఊడల మర్రిచెట్టు కింద పడుకున్న బర్రెలు ఎంతో ఆనందంగా నెమరువేస్తున్నది.చెప్పతరమా ఊడల మర్రి చెట్టు మహిమ అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ మోతుకు చెట్టు మోహన రూపం
“ కుట్టిన ఇస్తార్ల బువ్వ పెరుగు తొక్కు
“ అదెంతా ఆకలి తీరే సంబ్రమో
“ చెప్ప తరమా చెట్ల మహిమలు.
చెట్లను పూజించే సంస్కృతి మనదేశంలో చూడవచ్చు.మనదేశంలో అనేక రకాల చెట్లను పూజిస్తూ ఉంటారు.మోదుగ చెట్టును కూడా మన దేశంలో పూజిస్తూ ఉంటారు.ఇంట్లో చెడు తొలగిపోయి,మంచి జరగాలని చేసే హోమాలలో, యాగాలలో మోదుగ చెట్టు కొమ్మలను ఉపయోగిస్తూ ఉంటారు,మోదుగ చెట్టు ఎన్నో ఔషధ విలువలను కలిగి ఉంటుంది.విస్తర్ల తయారీలో మోదుగ చెట్టు ఆకులను ఉపయోగిస్తారు.మోదుగ చెట్టు ఆకులతో చేసిన విస్టర్లలో వేడి వేడి అన్నం తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.మోదుగ చెట్టు మోహన రూపం కలిగి ఉంటుంది.
మోదుగ చెట్టు ఆకులతో కుట్టిన విస్తర్లలో బువ్వ పెరుగు తొక్కు కలుపుకొని తింటే ఆకలి తీరుతుంది, ఎంతో మేలు చేస్తుంది.మోదుగ చెట్టు ఆకుల గురించి చెబుతూ చెప్పతరమా చెట్ల మహిమ అని చెప్పిన తీరు అద్భుతం అని చెప్పవచ్చు.చెట్ల మహిమ అనే చక్కటి కవిత అందించినందుకు కవి దేవేందర్ ను అభినందిస్తున్నాను.కవి దేవేందర్ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

ఆత్మకు రూపాన్ని అందించి
అనంత లోకాల నుండి అవని పైకి
దిగుమతి చేసే దేవత – అమ్మ!
నెల తప్పిన నాటి నుండి
నిలువెల్లా మురిసిపోతూ –
కడుపులో కదలికలు మెదలుతుంటే
కలలలో తేలిపోతూ –
కూర్చున్నా, లేస్తున్నా, నడుస్తున్నా,
ఆపసోపాలు పడుతూనే
ఆనందంలో మునుగాడుతూ –
జవ సత్త్వాలు ఉడుగుతున్నా
నవ మాసాలు మోసి,
నిండు గర్భిణిగా నొప్పులన్నీ భరించి,
ప్రసవించి, ప్రభవింపజేస్తుంది
సృష్టిలో ఒక సరిక్రొత్త జీవిని!
పడతి నుండి పరిణామం చెంది
ప్రపంచంలో నిలుస్తుంది
ఒక మాతృమూర్తిగా!
నిస్వార్థమైన ప్రేమకు
ఒక నిలువెత్తు ప్రతీకగా!!
కనుల ముందు నిజమైన
తన కలను చూచి
కష్టాన్నంత క్షణంలో మరిచిపోయే
కమనీయ హృదయ – అమ్మ!
చనుబాలే అమృతంగా పంచి,
తన ఒడినే ఊయలగా మలచి,
జోలపాటతో యోగ నిద్రలోకి
ప్రయాణింపజేసే ప్రథమ గురువు – అమ్మ!
అమ్మ అడుగులు వేయిస్తుంది
అమ్మ నుడుగులు నేర్పిస్తుంది
అమ్మ ఆకలి తీరుస్తుంది
అమ్మ లోకం చూపిస్తుంది
అమలినమైన అనురాగానికి
ఆకృతి దిద్దితే – అది అమ్మ!
ఆమెకు సరితూగడు తానైనా
ఆ సృష్టికర్త బ్రహ్మ!!#
(మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో …)
“ఆంధ్ర సాహిత్యంలో వచన కవితా శిల్పి,కవికుల తిలకుడు,రస గంగాధరుడు అయిన దేవరకొండ బాలగంగాధర తిలక్ తన రచనల ద్వారా ఒక విశిష్ట రచనా ప్రవృతిని,కవితా స్రవంతిని, నిర్దిష్టకులాలలో, నిరంతర రస ప్రవాహంగా ప్రవహింపచేశాడు. తన అమూల్య రచనల ద్వారా ఆంధ్ర సాహిత్య చరిత్రలో శాశ్వత కీర్తి చంద్రికల్ని ప్రసరింప చేశాడు. ఆయన రచనలు ఆంధ్ర సాహిత్య ధనాగారానికి ఒక అక్షయ రత్న సంపద వంటివి”.తిలక్ గొప్ప కవి.ఆధునిక తెలుగు సాహిత్యంలో ఇతనికొక విశిష్ట స్థానముంది.
నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలునా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని తన కవితా లక్ష్యాన్ని చెప్పుకున్న దేవరకొండ బాల గంగాధర తిలక్ పశ్చిమగోదావరి జిల్లా తణుకు తాలూకా మండపాక గ్రామంలో ఆగస్టు 1 వ తేదీ 1921 సంవత్సరంలో జన్మించాడు.
సమాజంలో దగాపడిన వారి జీవితాలను చూసి చలించిన తిలక్ సున్నిత హృదయుడు కాబట్టి వాటినే తన కవితావస్తువులుగా మలచుకున్న
తిలక్ భావకవిత్వంలోని భావ సౌకుమార్యం, భాషా మార్దవం, అభ్యుదయ కవిత్వలక్షణాలతో కలసి వెలసిన తిలక్ కవిత్వం, అభ్యుదయ, భావ కవిత్వాల కలనేతతో “అమృతం కురిసిన రాత్రి,ప్రభాతము సంధ్య,గోరువంక కవితాసంపుటిలు,సుందరీ సుబ్బారావు,ఊరి చివర ఇల్లు అనే కథా సంపుటాలు,సుశీల పెళ్లి,,సాలెపురుగు అనే నాటకాలు,సుచిత్ర ప్రయాణం,ఇరుగుపొరుగు,సప్తశిల అనే నాటికలు ఎన్నో ప్రక్రియల్లో రచనలు చేసిన తిలక్ కేవలం 45 ఏళ్ల అతి చిన్న వయసులో సెప్టెంబరు 1 వ తేదీ 1966వ సంవత్సరంలో అనారోగ్యంతో తనువు చాలించాడు.చనిపోయాక కుందుర్తి ఆంజనేయులు రాసిన పీఠికతో 1968 సంవత్సరంలో ముద్రింపబడిన అమృతం కురిసిన రాత్రి ఉత్తమ కవితా సంపుటిగా 1971 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.
సమాజాన్ని చూసి కరిగిపోయిన తిలక్
మిత్రులకు రాసిన లేఖల ద్వారా మిత్రులతో తిలక్ కున్న సత్సంబంధాలు ,తిలక్ వ్యక్తిత్వం,మనస్తత్వం మొదలగు ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది.
‘ఆవంత్స సోమసుందర్’ తిలక్ కు ప్రాణమిత్రుడు.సోమసుందర్ కు రాసిన లేఖలో ” జీవితంలో ఎప్పుడు ఎవరు వచ్చి గుండెల్ని పెనవేసుకుపోతారో ఏం తెలుస్తుంది.అలాగ సామీప్యంలోని ఆత్మీయమైన ఆవరణలోకి విచిత్రంగా సురభీకృతం చేస్తూ నువ్వొచ్చావు. అన్నా అని పిలిచావు.ఆ పిలుపు గుండె లోతులంటి, తిరిగి తమ్ముడూ అని ప్రతిబింబించక మానుతుందా? అందుకే ఇంకా మీరు అనే సంబోధన కృత్రిమంగా ఏదో దూరాన్ని పలకరిస్తున్నట్లు తోచి మానివేశాను.” అని రాయడం వల్ల మిత్రులను ఆత్మీయుతతో దగ్గరకు తీసే ప్రేమతత్వం కన్పిస్తుంది. వరవరరావుకు రాసిన లేఖలో ” నా కింత దగ్గరైన నువ్వు అలా అలా దూరదూరంగా ఎందుకున్నావో అని నా మనసు చాలా బాధ పడుతుంది.డబ్బూ,వ్యాపారమూ, ప్రయోజనమూ ప్రధానంగా ఎంచబడే నేటి సంఘంలో అవ్యాజమైన మైత్రి,ఆర్టిస్టుల మధ్య మైత్రి ఒకటి గదా!
కన్సిడరేషన్! నువ్వు నా కన్నా చాలా పిన్నవాడివైతే మాత్రం కుల వయో దశ భేదాలు కవులలో,కళారాధకులలో అప్లై చేయవు.” అంటాడు.మైత్రీ బంధానికి తిలక్ ఇచ్చిన విలువ గొప్పది.డబ్బు,హోదాకు లొంగనిది.కులాతీత,వయోతీతమైంది.నిస్వార్థ,అవ్యాజమైనదే అసలు సిసలైన మిత్రత్వము.నిజమైన మైత్రికి ఇవేవీ అడ్డుకావని మైత్రికి చక్కని నిర్వచనం చెప్పాడు.ఇలా లేఖలలో తిలక్ స్నేహానికిచ్చిన ప్రాధాన్యం తెలుస్తుంది.
జీవితంలో ఏదో సాధించాలనే ఆశ,తపన ” వేళ్ళ సందుల్లోంచి పొడి ఇసుకలా జారిపోయే కాలాన్ని, వయస్సునీ,తల్చుకుంటే భయమౌతుంది.” అని ఒక ప్రచురణ సంస్థ నెలకొల్పాలన్న తన ఉద్దేశ్యాన్ని తెలుపుతూ నీ సహకారం ఉంటే తప్పక కృతకృత్యుణ్ణవుతానని రాస్తూ సమయం దాటాక బాధపడి ప్రయోజనం లేదు.” అందుకే ఈ లోపుగా చేసి వెయ్యడం మంచిది కదా.” అంటూ సోమసుందర్ కు రాసిన లేఖలో తెలిపాడు.
మిరియాల రామకృష్ణకు రాసిన లేఖలో జీవితంలో తృప్తి ఎట్లా లభిస్తుందో వివరించాడు.” నెల బారుగా,చప్పగా,బాధగా వెళ్లిపోయే జీవితంలో ఏవో కొన్ని గొప్ప క్షణాల్ని మనవిగా చేసుకున్నామనే ఆనందమూ,దాన్ని నలుగురితో పంచుకోవడమూ కన్నా తృప్తి ఏముంది.” అంటూనే ” ఇక్కడ దట్టంగా పరచుకున్న మనుష్యారణ్యం మధ్య రోడ్ల దుమ్మూ,దోమలూ,రాజకీయాలు జుమ్మని చెలరేగే ఈ వాతావరణంలో కన్నా అడవుల పచ్చదనమూ,ప్రకృతి సన్నిహితంగా ఉన్న మీ జీవితమే సుఖకరమేమో.” అనడం వల్ల కుళ్లు మనుష్యుల మధ్య నలిగి బ్రతికే కంటే స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ అడవుల్లో ఉంటే మనసుకు తృప్తి అనే భావన కలిగినవాడు. అట్లాని మానసికమైన ఒంటరితనాన్ని భరించడం కూడా కష్టమే నంటాడు.
తిలక్ బాధాతప్త హృదయుడు.జీవితంలో జరిగిన సంఘటనలు, మనసులో మరపురాని ముద్రలే అతన్ని కవిగా చేశాయి మోగంటి మణిక్యాంబకు రాసిన లేఖలో చిన్నతనంలో ఒక వృద్ధుడు,జీర్ణాదేహుడు,ఆకలితో అలమటిస్తున్న వాణ్ణి చూసి ఎంతో ఏడ్చాడు.” జీవితం అంటే ఏమిటి? సృష్టి పరమార్థం ఏమిటి? అన్న చింతనలో పడ్డాడు.16,17 సంవత్సరాల వయసులో ఒకసారి పార్క్ టౌన్ స్టేషన్ లో దిగివస్తుంటే ఇద్దరు ముగ్గురు బాబూ! ఒక మాట అని పిలిచారు.ఏమిటో నని వారి దగ్గరకు వెళ్ళాడు.ఒక వస్తువు మీద గుడ్డను తీసి చూపించారు.భయంకరమైన, వికృతమైన శవం.దహనానికి చందా అడుగుతున్నారు.జేబులోంచి చేతికి వచ్చిన డబ్బు తీసి వాళ్ళకిచ్చి వెళ్ళాడు.గది కెళ్లగానే ఒళ్ళంతా ఏదో అయిపోతున్నట్లు భయపడ్డాడు.రాత్రంతా ఆలోచనలతో సతమతమయి అంతా మిథ్యగా అనిపించింది.బ్రతుకు మీద విరక్తి కలిగింది.
ఇంకోసారి మిత్రులతో సినిమాకి వెళ్తున్న సమయంలో ఒక ఎనిమిదేళ్ల పిల్ల ఆకలిగా ఉంది.డబ్బులిమ్మంది అందరూ ఆమెని విదిలించుకుని చీ అని తోసి వేస్తుంటే సభ్యత కోసం తిలక్ కూడా విదిలించుకున్నాడు.ఆ రోజు రాత్రంతా బాలికనే కళ్ళముందు నిలిచింది తెల్లవారి జేబులో పది రూపాయలు వేసుకుని ఆ అమ్మాయి కోసం అంతా గాలించాడు.కానీ ఆమె కనిపించలేదు.మూడు రోజులు వెతికాడు కానీ వృధా. ” ఆమె అందమూ ,సొగసైన కళ్ళు,ఆ బాల్య చాపల్యమైన మనస్సు ఏ ధూళిలో ఏ బాధలో ఏ మంటలో దినదినమూ కాలిపోతున్నాయి ” ఎవరు దీనికి కారణం?…విలవిలలాడి పోయాను.ఆమె నా చెల్లెలే అయితే అలా ఛీదరించుకునేవాణ్ణ ?” అనుకున్నాడు నెలరోజుల తర్వాత ఆమె కనిపిస్తే జేబులోంచి ఆరు రూపాయలు తీసి చేతిలో పెట్టి ఒక రోజు కడుపు నిండా తిను అని వెళ్ళిపోయాడు.అప్పటి సంఘటనలు మనసులో కలవరం రేపి ” ఈ జీవితానికి,సమాజానికి అర్థం తెలుసుకోవడానికి,ఒక అర్థం ఇవ్వడానికి ఒక ఆదర్శ జ్వాలలో నా బ్రతుకును చుట్ట బెట్టి తోడు లేని ఈ దారిని నాటి నుండి ప్రయాణం” సాగించి అనేక బాధలతో,అనారోగ్యంతో అలమటించి ” గొప్ప అనుభవాన్ని కవిత్వాన్ని పొందాడు మధురమైన
ఆ హృదయాన్ని,మనస్సుని లోకంచుట్టూ తిప్పి సౌందర్యాన్ని అవలోకించి ఆహ్వానించాడు.” అని చెప్పిన సున్నిత హృదయుడు,కోమల మనస్కుడు జీవితానికి,సృష్టికీ ఒక అర్థం వెదికి సమాజానికి సుఖ సంతోషాల్ని అన్వేషించాలనే తపన కలవాడు.” మనిషీ, సంఘమూ,దేశమూ, విశ్వమూ ఈ సర్వ జగత్తు జ్ఞాన సరస్సులో విరిసిన ప్రేమ పద్మం లాగా సత్యం,శివం, సుందర శీలమై ఉండాలి.” అంటాడు.”
వ్యుత్పత్తి,వివేకం,ఉద్రేకం ఇన్నింటిని సమ్యక్ స్వరంలా మేళవించి” ఏదో సాధించాలనే తహతహలాడేవాడు.నిజమైన వెలుగు కోసం ” ఏళ్ల తరబడి సృష్టించుకున్న మౌఢ్య భావాలు,సంకెళ్లని పగులగొట్టి” స్వార్థమూ, సంఘ గౌరవమూ, ధనమూ ప్రధానమైన ఈ లోకాన్ని ఖాతరు చేయక ఏ పరిస్థితినైనా ఒంటరిగా ఎదుర్కోగల ఆత్మీయశక్తి నాకుంది ఆనుకొని ” సంపూర్ణ నిర్మలానురాగం ముందు తప్ప తల వాల్చగూడదని ప్రతిజ్ఞ చేసుకున్నాడు.” అని మానసిక ఆవేదనను,ఆశయాన్ని తేటతెల్లం చేశాడు.” నిర్ధయా, నిశ్చితమైన నిధి కొండరాళ్ల మీద తలబాదుకొని ఏడ్చినవాణ్ణి కాబట్టి ఏ విశ్వాసాన్ని వృధా పోనివ్వను.” సున్నితమైన నా మనస్సు మీద కూడా ఎన్నో దెబ్బలు తగిలాయి.” అంటూ మానసిక బాధను వ్యక్తపరచి ” ఒక్కొక్క కన్నీటి చుక్కను తుడువగలిగితే జన్మ సార్థకమన్న శరత్ మాటలను స్వతహాగా ఆచరించాలన్న ఉబలాటం కలిగిన వాడు.ఆయన మాటల్లోనే ” ఒక సంఘము నుండి ఉబికే బాష్పాన్ని తుడువగలిగితే ఒక్క అధరం మీదికి హాస్యాన్ని రప్పింపగలిగితే జీవితం ధన్యమౌతుందని నా ఉద్దేశ్యం.కరుణ,సౌందర్యమూ, మానవత్వమూ ఈ మూడు ప్రాతిపదికలుగా నా ఆదర్శాన్ని,ఆలోచనల్ని నిర్మించుకున్నాను నా రచనలూ నా జీవితమూ ఈ భావనల్ని వ్యక్తీకరించకపోతే నేను జీవచ్చవాన్ని” అని తన కవితా లక్ష్యాన్ని, జీవితాదర్శాన్ని వివరించాడు.తిలక్ మనస్తత్వమేమిటో ఎంతో చక్కగా వివరించాడు లేఖల ద్వారా.” *దుఃఖానికీ, బాధకీ కరుగలేకపోతే ఈ బాలగంగాధరుడు తన కవిత్వాన్ని,తన ప్రాణాన్ని కూడా బంగాళాఖాతంలో విసిరిపోతాడు అతనిలో ఎంతో దృఢవిశ్వాసం కన్పిస్తుంది.మనిషికి మానవత్వముండాలి.కరుణ, జాలి,దయా ఉండాలి.అవి లేకపోతే జీవచ్చవమేనన్న అభిప్రాయం కలవాడు.తిలక్.జీవితానుభవాలకు,రచనలకు అవినాభావ సంబంధమున్న విషయం ప్రస్పుటమైందీ లేఖల్లో.
” ఆర్ద్రమైన ప్రతి హృదయమూ అశ్రుసిక్తమైన ప్రతి నయనమూ సుందరమైన ప్రతి దృశ్యమూ నన్ను కలలో కూడా వశం చేసుకుంటాయి.ఒక్క పాటకోసం ఒక్క మాటకోసం అవసరమైతే ఈ ధనాన్ని జగత్తునీ కాదనగల సాహసం వుంది నాకు”.అని ప్రపంచాన్నే ఎదిరించి పోరాడిన ధీశాలి, కవితా వీరుడు.కవికి ఉండవలసిన ఉత్తమగుణం తిలక్ లో కనిపిస్తుంది.కవి ఊహలో చరించకుండా జగత్తులో చేదు నిజాన్ని చవిచూసి అనుభవించి ఆవిష్కరించాడు. బాహ్య జగత్తులోని విశిష్ట సన్నివేశాల వలన, ప్రజ్ఞా విశేషం వలన తమలో కలిగిన ఆలోచనా వైవిధ్యం చేత,తమకు కలిగిన అనుభవాలను కావ్య చిత్రణం ద్వారా వ్యక్తీకరించి ఆనందం చేకూర్చడం తిలక్ లక్ష్యం.ఇంద్రియాలకు తృప్తి కలిగించేది అతని దృష్టిలో ఆనందం కాదు మానవత్వంలో పరిపూర్ణత నొందుటలోనే ఆనంద మున్నదని అతని సిద్ధాంతం. *సుందర స్వప్నాల మేడమెట్ల నుండి వాస్తవిక శిథిల రూపాలలోకి హఠాత్తుగా జారిపడిన నాకు తెలుసు అంటాడు.” పైకి నవ్వుతున్నా అలలో విరగబడుతూ ఆడుతున్న సముద్రం కడుపులో వున్న బడబాగ్ని జ్వాల నెవరు గుర్తిస్తారు”. అని వాపోతాడు,లోతుల్ని వెతుకుతాడు.
జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా గాయాలు తగిలినా ఎదుర్కోగలిగే శక్తి గలవాడు.కృంగిపోవడం నా స్వభావానికి వ్యతిరేకం అన్న ధీరమనస్కుడు.
అసలు కవి అంటే ఎవరు?కవి ధర్మాన్ని లేఖల్లో వివరించాడు.” సున్నితమైన ఊహ,ఉద్రేకము,” ఉంటేనే గొప్ప రచనలు వస్తాయన్న విశ్వాసము కలవాడు.సాధారణంగా మానవులందరూ దైనందిన సమస్యలతో ,బాధలతో సతమతమవుతూ వుంటారు.చిన్న చిన్న కోరికలూ,ద్వేషాలూ,అల్పమైన ఊహాలతో సతమతమవుతూ వుంటారు.” నేలబారుగా జడంగా స్తబ్దంగా గొంగళిపురుగుల్లా పాకుతారు.వాళ్ళకి సౌందర్యం డబ్బులోనూ ఉద్యోగం లోనూ భేషజంలోనూ కనబడుతుంది కానీ కళాశీలికి యివేమీ కనిపించవు.అతనికున్న విలువలు వేరు.అతని చూపు వినీల గగనాన్ని బురుసుకుంటూ నక్షత్రమండలంలోకి పోతుంది.అతడు మనిషి లోపల మనిషిని చూస్తాడు.అతని దృష్టి ఎక్కడ అందం వున్నా నిజం వున్నా అక్కడ వాలుతుంది. దేనికోసమో తపన,అన్వేషణ నిరంతరంగా సాగిస్తాడు.ఈ యాత్రలో అతడు లౌకిక జగత్తును లక్ష్య పెట్టడు. అందుకే అతని ఊహ శాశ్వతమైంది.అతని నీతి అతీతమైంది.అతని రచన అక్షరమైంది. నశించనిది.” కవి ఊహ లోకోత్తరమైంది. అందువల్లనే ఉత్తమ రచన సార్వజనీనము,సార్వకాలికమౌతుందన్న ప్రాచీన ఆలంకారికుల అభిప్రాయాలను తలపింపచేశాడు.
కవి సంప్రదాయబద్ధుడుగా కాక కాలానుగుణంగా నూతనత్వాన్ని సంతరించుకొని రచన సాగించాలంటాడు. కుళ్ళిన ముసలిదైపోయిన సంఘాన్ని,బూజు పట్టిన భావాల్ని రూపుమాపే బాధ్యత కూడా రచయితదే. అంటూ సంఘాన్ని మేల్కొల్పాలి,ప్రజలను చైతన్యవంతులను చేయాలి.ఆత్మవిశ్వాసం ఉండాలి.కవిత్వాన్ని సమగ్రంగా దర్శించడమూ,జీవిత విధానాన్ని గురించి స్పందించడమూ చాలా అవసరం అంటాడు తిలక్.
తిలక్ ప్రకృతిలోని అందాన్ని చూసి పరవశించిపోయేవాడు.ప్రకృతిని ఆరాధించేవాడు.లేఖల్లో ప్రకృతి వర్ణన కూడా కనిపిస్తుంది.సహజ చిత్రీకరణ,కవి దృష్టి ప్రత్యేకంగా లోతుల్ని చూస్తుంది.గుండెను హత్తుకుపోయే విధంగా ఉంది.ప్రకృతి వర్ణన సహజంగా వుంది. సోమసుందర్ కు రాసిన లేఖలో ” ఈ రెండు రోజుల నుంచీ వర్షం కురిసి కురిసి భూమి తడిసి తడిసి పచ్చి పచ్చి బాలింతరాలిగా అందంగా వుంది ” అంటాడు
వర్షాకాలంలో తడిగా ఉన్న భూమి ఎట్లా ఉందో ఉపమాలంకార ప్రయోగం చేశాడు. ఆలంకారిక రచన,ప్రకృతిసాన్నిహిత్యాన్ని కోరుకునేవాడు.దట్టంగా పరచుకున్న మనుషారణ్యం మధ్య రోడ్ల దుమ్మూ దోమలూ రాజకీయాలూ జుమ్మని చెలరేగే ఈ వాతావరణంలోకన్నా అడవుల పచ్చదనము,ప్రకృతి సన్నిహితంగా వున్న జీవితమే మంచిదని మిరియాల రామకృష్ణ గారికి రాసిన ఉత్తరంలో తెలియజేశాడు.వర్షాకాలం అంటే తిలక్ ఇష్టపడేవాడు.ఆకాశంలో నల్లని మబ్బులు,ఒక్కసారిగా వాన,భూమి చల్లబడి పచ్చబడి మనసుకు ఎంతో హాయిసిస్తుందని చెప్తూనే ” స్నానం చేసి వచ్చిన యవ్వనవతి శరీరంలాగా విచిత్రమైన అందం,ఆకర్షణ.” ఉందని వర్ణించాడు.
మోగంటి మాణిక్యాంబా దేవికి రాసిన లేఖలో మనసులోని వ్యధను ఎవరూ గుర్తించలేరని రాస్తున్న సందర్భంలో పైకి నవ్వుతున్నా అలలలో విరగబడుతూ ఆడుతున్న సముద్రం కడుపులో ఉన్న బడబాగ్ని జ్వాల నెవరు గుర్తిస్తారు అంటూనే జీవితం చాలా విచిత్రమైంది,అద్భుతమైందని చెప్తూనే ” రంగురంగుల అలలలో వంగి బ్రతుకు అంచుల్ని ముంచుతూ వుంటుంది. ఎన్ని స్వప్నాలూ,ఎంత లోతు తెలియని భయంకరాఘాతాలు.” అంటూనే సూర్యోదయాన్ని యీ విధంగా ” చీకటి లొత్త గిత్తి మెత్తని వెల్తురు తూర్పున ఆడదాని అనురాగంలాగ వ్యాపిస్తోంది.నక్షత్రాలు కాంతి విహీనమై గాజుపూసల్లాగా వున్నాయి. అక్కడక్కడ ఒక మబ్బు ఏ అప్సరస ఒంటిమీద నుండో జారిన చీరకొంగులాగ గాలిలో తేలిపోతుంది.మనోహరమూ,శాంతమూ అయిన ఆ ప్రకృతిలో లీనమౌతున్న నా మనసుకు మళ్లీ అశాంతి.” అంటూ తన అనుభూతిని వివరించాడు ఇంతలోనే నిరాశావాదం.” లోపల్లోపల ఏదో ఒంటరితనం ఒక్కణ్ణే నా బాధలతో ఏదో ఎడారి అంచులమీద నడచిపోతున్నాను– అనిపించింది.ఈ సంసారమూ ఈ స్నేహాలూ అన్నీ ఎండమావులేమో– అనిపిస్తుంది.మబ్బు పట్టి ఆకాశంలో ఈ రోజంతా తెలియని చక్కని కౌశలమూ ప్రజ్ఞా వుంది.నేను కొంత ఆశ్చర్య పడ్డాను.ఇంత బాగా రాయగలడా కథలు కూడా అని— కాని నీ కథల పుస్తకంలో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించుటకుగాని,బలపరచుటకుగాని నీవు చేసిన ప్రయత్నం- ఆ కథాశిల్పంలో ముఖ్య దోషంగా కనబడింది.ఆ కథల రక్తిని అనుభవించకుండా చేసింది. పాలటబులో డిజైనులవల్ల కళ ఎప్పుడూ పరిమితమూ సంకుచితమూ అయిపోతుంది.అయితే ఆ రోజుల్లో నువ్వు ఆ ప్రభావపు ఇనుప కౌగిలిలో ఉండేవాడిని.కాని ‘కాలనేమి’ లో దోషం మచ్చుకైనా లేదు”.
వరవరరావు రచనలపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ వరవరరావుకు రాసిన లేఖలో “అమృతవృష్టిలో అక్కడక్కడ బెట్టుగా ఉంది.యజ్ఞంకై కొత్త టానిక్,సోషలిస్టు సీత–ఇటువంటివి అనుచితంగా తోచాయి.
కుక్క నోట్లోంచి ఎంగిలాకు– ఆ ఇమేజరీ ఎందుకో? ఫోర్స్ డ్ గా వున్నట్లు అనిపించింది.రాకాశశికి మబ్బురంగు పైట అన్నాడు.మబ్బే పైటగా ఉంటుంది గదా.ఆషాఢ మాసంలో ఆ రంగుగల మరో పైట ఏముంటుంది? శశికి మరోసారి రివైజ్ చేస్తే మంచిదేమో అనుకున్నాను.నాకు నచ్చిన లైన్స్ గురించి చెప్పడం లేదు.మీరు మరోసారి చూడండి.మరి మీ కెలా తోస్తుందో? అన్నట్లు “వూసి” అని రెండు మూడు సార్లు ప్రయోగించారు.దాని అర్థం? నాకు కొత్తగా ఉంది.” – యూసేజ్. వరవరరావు తన రచనను సమర్థించినట్లు తెలిశాక నేను తప్పుగా అర్థం చేసుకున్నాను,పొరపాటయింది అని వేరే లేఖలో” పేజీలు సరిజేసి చదివితే రచన సందర్బశుద్ధిగా కనబడింది.” అని రాశాడు. వెనుకటి కవులకు తన కాలంలో కవులకు తారతమ్యాన్ని వివరిస్తూ ” నా వెనుక తరంలో కవులలో ముఖస్తుతీ వెనకాలే దూషణా ప్రత్యేకంగా ఉండేవి.సామాన్యుడి కన్నా ఊహలో,సంస్కారంలో మరికాస్త పెరుగుదల సూచించవలసిన ఆ కవులలో కనబడే ఈ కృత్రిమత్వం ,పిరికితనం దుర్భరమనిపించేవి.ఆఖరుకి కవిత్వంలో కవిత్వాన్ని గురించి నిజాయితీగా చూడలేని వీరి నుంచి ఏ మాశించగలమనుకొనే వాడివి.” అంటాడు.
జానకీ జానికి రాసిన ఉత్తరంలో ‘ మోడరన్ పోయిట్రీ పేరుతో పత్రికలలో ప్రకటితమయ్యే వాటిని చూచి విసుగు చెందాను.దాని మూలంగా చాలా విచారిస్తున్నాను.ప్రబంధయుగంలో చివరికాలంలో వచ్చిన సాహిత్యంలోని సమానమయిన క్షీణత, పదాల గారడి,నడకల శూన్యత,ప్రాస కొరకు ప్రయత్నించుట అందులో మనకు గోచరిస్తాయి.” అంటూ నవీన కాలాన్ని గూర్చి శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి రాసిన వ్యాసమే బాగుందని చెప్తూ సమకాలీన చరిత్రను గూర్చి విశదంగా విమర్శిస్తారని అనుకుంటున్నాదన్నాడు.
ఈ విధంగా తిలక్ లేఖల్లో అతని అనుభూతులు,అనుభవాలు, కవితాలక్ష్యం,రచనోద్దేశ్యం,విమర్శ, ప్రకృతి వర్ణన,ఆరోగ్య విషయాలు,మిత్రత్వానికి యిచ్చిన విలువ మొదలైనవి అనేకాంశాలు విదితమౌతున్నాయి.స్నేహితులకు తన మనోగతాన్ని స్పష్టంగా,నిర్మొహమాటంగా, కవితాత్మకతలో విశదపర్చడం లేఖలవల్ల గమనించవచ్చు. మారుతున్న కాలాన్ని బట్టి సత్యాన్ని అన్వేషించి సమాజాన్ని జాగృతం చేసేదే నిజమైన కవిత్వమనే అభిప్రాయం వున్నవాడు మానవత్వంలో పరిపూర్ణత నొందజూచుటలోనే ఆనందమున్నదని అతని సిద్ధాంతం.
ఈ రకంగా లేఖల వలన కవిత్వంపట్ల తిలక్ కున్న ప్రత్యేకమైన,ఖచ్చితమైన అభిప్రాయం తెలుస్తుంది.
తెలుగు సాహిత్య కన్యకు తన రచనల ద్వారా తిలకం దిద్దిన ప్రముఖ కవి తిలక్ సాహిత్య పరంగా కూడా లేఖలకు ప్రముఖ స్థానముందని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.
సంపాదకీయం
వసంత రుతువు వచ్చింది. చైత్రమాసం పాడ్యమి రోజున ఉగాది పండుగగా జరుపుకునే సంప్రదాయం గల తెలుగు వాళ్ళం మనం. చైత్రమాసం మొదటి నెల. పాడ్యమి మొదటి రోజు, మొదటి నక్షత్రం. నక్షత్ర గమనాలతో, ప్రకృతి కి అనుగుణంగా ఏర్పరచుకున్న పేర్లు ఇవన్నీ. ఉగస్య ఆది: ఉగాది. ఉగ అంటే నక్షత్రం నడక, గమనం కదా అర్థం. శుభకృత్ నామ సంవత్సరం వెళ్లి, కొత్త సంవత్సరం శోభకృత్ నామ సంవత్సరం లోకి అడుగుపెడుతున్నామంటే శోభను,ఆనందాన్ని కలిగించే సంవత్సరం అని భావిస్తున్నాం. చలికాలం పోయి, శరత్, శిశిర రుతువు లు పోయి వసంతగానం తో ప్రకృతి అంతా ఆహ్లాదకరంగా మారుతుంది. ఇది మనం భారతదేశం భౌగోళిక పరిస్థితి వలన కలిగిన వాతావరణం. ఇదంతా ఒకసారి గుర్తు చేసుకుంటూ గత వర్తమానాల మధ్య మనం ఏం సాధించాము అనేది ఒక సింహవలోకన చేసుకోవడం అవసరం.
రాజకీయాలు అవసరం లేదనుకున్నా, తెలియదు అనుకున్నా, వాటి వైపు కన్నెత్తి చూడని వాళ్ళకి కూడా రాజకీయాల ప్రభావం అనేది జీవితాలపై ఏదో రూపాన పడుతూనే ఉంటుంది. మహిళల మీద మరీ ఎక్కువగా ప్రభావం పడుతుంది. అదేంటి అని అనకుండా, అది ఏంటో గమనిద్దాం అనుకుందాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా మార్చి 8న ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి . ఈ సందర్భంలో భారతీయ మహిళ ఈ మార్చి 8 రోజున ఏమైనా ప్రత్యేకంగా తెలుసుకోగలిగిందా? ఏమైనా ప్రత్యేకంగా లబ్ధి పొందగలిగిందా? అనేది అవలోకించాల్సిన విషయం. తిండి, బట్ట, నీడ అనే మౌలిక అవసరాలు కాకుండా మహిళల అభివృద్ధి పరంగా చూసినప్పుడు, ఎన్నో వేల గ్రామాలు కలిగినటువంటి మన దేశంలో గ్రామ గ్రామాన బ్రతుకుతున్న స్త్రీలు అభివృద్ధి పథంలో ఉన్నారా ? పట్టణాలలో స్త్రీలు ఆధునిక సౌకర్యాలనుభవిస్తున్నారేమో కానీ
అస్తిత్వాన్ని కాపాడుకోగలుగుతున్నారా? పెట్రేగిపోయిన పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణ మహిళల పట్ల నిలుచుని ఏమైనా గొంతు ఎత్తగలిగిందా? లేదు లేదు లేదు అనే సమాధానాలే వస్తాయి.
ఆడపిల్లనైనా మగపిల్లలైన సమానమని విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రులకి కూతురు విషయం వస్తే నిరాశ మిగులుతున్నది. చదవాలి ఉద్యోగం తెచ్చుకోవాలి, అంతే ! ఈ ధ్యేయంగా అడుగులు వేస్తున్న అమ్మాయిల పరిస్థితి ఏమంత బాగోలేదు. కళాశాలలోనైనా, కార్యశాలలోనైనా అంతులేని వివక్షను ఎదుర్కొంటున్నారు. ముఖం ముందు మంచిగా మాట్లాడుతారు పక్కకు జరగగానే అభాండాలు వేస్తారు, అఘాయిత్యాలూ చేస్తారు.
వెకిలి మాటలు మకిలి మనసులు అర్థం చేసుకోగలిగే వాళ్ళ అర్థం చేసుకుని ఆ మగవాళ్లను దూరం పెడతారు. అర్థం చేసుకోలేని అమ్మాయిల పరిస్థితి ఇక అంతే.ఇవి పనివేళల్లో ప్రత్యక్షంగా జరిగేవి. ఇక పరోక్షంగా తక్కువ నా?వేతనాలు, ఇంక్రిమెంట్లవి ఒక తీరైతే, ఆడవాళ్ళ సమస్యలు ఓ తీరు. శారీరక అనారోగ్య సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వాలూ ముందుకురావు, ప్రైవేటు ఉద్యోగ సంస్థలు ముందుకురావు. దీనికి ప్రముఖ ఉదాహరణ ‘ నెలసరి సమయంలో సెలవులు ‘ అనే అంశం. బంగాళా ఖాతం లో వాయుగుండాలు వచ్చిపోతున్నట్టే, మహిళా దినోత్సవ సందర్భం వరకు అట్లా కొన్నేవో ఆటుపోట్లు వచ్చిపోతుంటాయి. తట్టుకునే హృదయాలు ఉండాలి. గుండె తడి అయ్యే వాళ్ళుంటే, దుఃఖ విముక్తి గొడుగు లు పట్టే ప్రయత్నాలు చేస్తారు. పశ్చిమ దేశమొకటీమధ్య కొత్త గా మెరుస్తున్నది. వాళ్లకు నూతన సంవత్సరమిప్పుడు రాదు. మార్చ్ 8 వాళ్ళకు కొత్తగాదు!
సమ దూరం పాటించే
కలువని పట్టాల మీది ప్రయాణం!!
ఒక దాని వెనుక ఒకటి
క్రమశిక్షణతో కదిలే బోగీలు!
కచేరీలు ఎక్కని సంగీతం
తాళం తప్పని చిరుతల శబ్ధం!
పావలా పల్లీలు
పదిరూపాయలకు అమ్మే
వ్యాపార నైపుణ్యం!
పసితనాన్ని పల్లెతనాన్ని గుర్తుచేసే
ఎప్పుడో తిన్న, ఎపుడూ తినాలనిపించే
నిమ్మపులుసు పిప్పరమెంటు!
టికెట్ తనిఖీ అధికారిని చూసి
బాతురూముల్లో దాక్కునే
టికెట్ లేని ప్రయాణికులు!!
ఉప్పు కారం పెట్టిన
మామిడి కాయ ముక్కలు
ఉపకారం చేస్తున్నట్లు
పక్కవారితో పంచుకోవడాలు!
శీతల పానీయాలు అమ్మేవాడు
వాడెనుకే వేడి వేడి మిర్చీ అంటూ
పొట్లం చుట్టి చేతిలో పెట్టేవాడు!
కిటికీనుండి చూస్తే
వెనక్కి పరుగెత్తుతున్నట్లు
పంటపొలాలు, పచ్చని చెట్లు!
దూరమెంతయినా
భారమనిపించని ప్రయాణం!
అద్దములో చూసుకుంటున్న
మన జీవన ప్రయాణం!!
మీ శ్రేయోభిలాషి
జగ్గయ్య.జి
9849525802
jagan.gunda @yahoo.com
తెగించి పిడికిలెత్తినప్పుడే
ఎవరైనా తేరిపార జూసుకోవాలి
వెనకా ముందు ఆలోచించు కోవాలి
అవహేళనలన్నీ అగ్గి రాజేసేవే!
తెగింపు కొట్లాటలన్నీ
వెరపు లేని త్యాగలనుంచి పుట్టుకొచ్చినవే
వాపెప్పుడు బలుపు కారాదు
చలి చీమలేకమవుతుంటే సర్పానికి వణకు పుట్టాలి!
చూసీ చూసీ ఎలుగెత్తి చాటీ చాటీ
ఎద ఉప్పొంగే దృశ్యంగా
దేశ భక్తి మొలకెత్తాలి
విద్వేషాలు నింపే ఎన్నికల పెట్టుబడి కారాదు!
ఆధునిక కాలంలో ఎవరికైనా
సుదీర్ఘ పోరాటాలక్కర లేదు
ప్రజలు తలచుకుంటే ఆకాశం చిల్లుబడ్డట్లు
అధికారం కొంపలు మునుగుతాయి!
విలువలు దిగజారినప్పుడు
నువ్వెదిగొచ్చిన సంగతి మరచి పోరాదు
సూత్రమొక్కటే ఎవరికైనా
అహంకారం పతనానికి దారులు వేస్తుంది!
ఫోటో కోసం జరిగిన రచ్చ
బాల్యంలో చినిగిన చొక్క కోసం చేసిన
హాస్యాస్పద పోరాటాన్ని గుర్తు చేసింది
ఎవరేం చేస్తున్నది ప్రజలకెరుకైతున్నది!
పాద యాత్రలు పస లేని ప్రగల్భాలు
ప్రజా జీవితాలను ప్రతిబింబించనంత కాలం
విద్వేషాలు కుతంత్రాలేవీ
రాజ్యాధికారాన్ని కట్టబెట్ట లేవు నిలబెట్ట లేవు!
చీలికలు తెచ్చే వారిదెన్నడు
దేశానికి ఏలిక కారాదు
ఏకం చేసే వారికే
భిన్న సంస్కృతుల రాజ్య పట్టం!!
:- కోట్ల వెంకటేశ్వర