తమిళనాడు రాష్ట్రంలోని తిరుమేయచూర్ జిల్లాలో ఉన్న లలితాంబికై దేవి పురాతన ఆలయం. ఈ ఆలయం వేల సంవత్సరాల పురాతనమైనది కేవలం సూత్రాలతో ప్రవహించే కావేరీ నది దక్షిణ ఒడ్డున ఉన్న ఈ ఆలయం శివుని యాబై ఆరవ ఆలయం. ఆలయంలోని ప్రధాన దేవతలు లలితాంబికై మరియు మహానాడు. ఈ ఆలయంలో పవిత్రమైన పండుగ రాధా సప్తమి జరుపుకుంటారు. వ్యాధి లేని జీవితం మరియు సంపద జీవితంలో శాంతి మరియు ఆనందం నుండి ఉపశమనం పొందాలని భక్తులు వేడుకుంటారు. ఈ ఆలయం పేరు మేఘనాధ స్వామి పలితాంబిక ఆలయం కాగా ఈ ఆలయంలో లలితాపారాయన సూత్రాన్ని పఠించడం భక్తుల కోరికలు తీరుతాయి ఈ ఆలయానికి అమ్మవారికి శాంతి పరిచిన మహాదేవుని ఆలయంగా కూడా పేరు ఉండటం గమనార్హం. ఈ ఆలయంలో శివుడు మేఘనాథ్ స్వామిగా పార్వతి లలితాంబిక ఆవిర్భవించారు. జగన్మాత పాండాసురుడు అనే రాక్షసుడిని సంహరించడం కొరకు శ్రీ చక్ర రథంపై ఆసీనురాలై పాండాసురునిక సంహరించింది. ఆ తర్వాత ఆగ్రహంతో ఉన్న లలితాంబిక శివుని ఆదేశాల మేరకు ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసిందట.
ఋషులు పరాశక్తి దేవి వద్దకు వెళ్లి, దేవత వారికి భద్రత కల్పించాలని కోరారు. దేవి యాగం నుండి ఉద్భవించి, శ్రీ చక్రంపై లలితాంబికగా ఎక్కి, దెయ్యంతో పాటు యుద్ధాన్ని ప్రారంభించింది మరియు చివరికి దేవి దేవి అతన్ని నాశనం చేసింది. దేవి కోపంగా ఉంది మరియు శివుడు పరాశక్తి దేవిని మనోన్మణి అనే పేరుతో భూమికి రావాలని కోరాడు, తద్వారా దేవి తన కోపాన్ని చల్లబరుస్తుంది. ఈ ఆలయానికి వచ్చిన తర్వాత దేవత దయగలది మరియు సరళంగా మారింది. దేవత పదాలను పాలించడానికి వాక్ దేవతలను ఏర్పాటు చేసి, సుమారు వెయ్యి పేర్లతో తన స్తుతిని జపించమని కోరింది.
ఆలయ చరిత్ర
తమిళనాడులోని తిరువారూర్ జిల్లా cccccom తిరుమీయచ్చూర్లోని లలితాంబికాదేవి దేవాల ఎన్నో ప్రత్యేకతలను కలిగి భక్తులకు కొంగుబంగారంగా విలసిల్లుతోంది. మేఘనాథస్వామి పేరుతో పరమేశ్వరుడు, లలితాంబిక పేరుతో పార్వతీదేవి ఇక్కడ కొలువైవున్నారు. లలితాంబిక కొలువైన ఆలయ ప్రాంగణం ప్రతినిత్యం లలితా సహస్రనామ పారాయణాలతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఈ దేవాలయ దర్శనం సర్వపాప ప్రాక్షాలన గావిస్తుంది అని అంటారు ఇక్కడ స్వామిని ప్రార్థిస్తే పెళ్లి కాని యువతులకు శీఘ్ర కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. శనీశ్వరుడు, గరుడుడు, సూర్య రథసారధి యైన అరణుడు, యముడు, వాలి, సుగ్రీవులు ఇక్కడ జన్మించారని భక్తుల విశ్వాసం.
ఈ దేవాలయములో ఎన్నో ఉపాలయాలు కూడా ఉన్నాయి కాళీదేవి మందిరం దర్శించదగినది 8 చేతులతో మహిషాసురమర్ధినిగా ఉన్న ఆమెను దుర్గాదేవికా సుఖ మహర్షి సోత్రం గావించాడు. వేద వ్యాసుని కుమారుడైన సుఖ మహర్షి చిలుక ముక్కు కలిగిన వాడు. భక్తుల కోరికలను కాళీదేవి చిలుక ద్వారా లలితాంబకు తెలియజేస్తుందని అందుకే ప్రతినిత్యం ఒక చిలుక సాయం సమయాలలో లలితాంబిక గుడిపై ఎగురుతుందని అక్కడ ప్రచారంలో ఉన్న కథ.
ఈ ఆలయంలో రెండు శివమూర్తులు రెండు పార్వతి మూర్తులు పూజలందుకోవడం ప్రత్యేకత. తమిళనాట తిరుమీయచ్చూరు. తిరువారూరు, తిరుప్పగతూరు దేవాలయాల్లో మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రదేశంలోనే సూర్యుడికి శాప విమోచనం కలిగిందని పెద్దలు చెబుతారు. సూర్య రథసారధి అయిన అరుణుని అవతారాన్ని సూర్యుడు హేళన చేయడంతో బాటు అతని శివపూజను అడ్డుకోవడంతో శివుడు కోపించి సూర్యుని శపించాడు. శాపవిమోచన కోసం సూర్యుడు అర్థించగా, 7 నెలలు శివపార్వతులను ఏనుగుపై అధిష్ఠింపజేసి మేఘాలపై నుంచి, అర్చనగావించాలని అప్పుడే శాపం నుంచి విముక్తి లభిస్తుందని శివుడు పలుకగా, అదేవిధంగా చేసిన సూర్యుడు శాపం నుంచివిముక్తి పొందాడని అంటారు దాని గుర్తుగా గజవరుష్ట వాహనంపై అధిష్టించినట్టు చెక్కబడిన శివపార్వతుల విగ్రహాలు దర్శనమిస్తాయి.
దేవాలయ విశేషాలు
తిరుమీయచ్చూర్ శ్రీ మేఘనాథస్వామి ఆలయంలోని ఈశ్వరుడు స్వయంభూనాధుడు. లలితాంబిక పేరుతో అమ్మవారు శ్రీ చక్రరాజ సింహాసనంపై అధిష్ఠించి భక్తులకు అభయమిస్తూ అభయముద్రలో ఠీవిగా మహారాణిలా ఆశీనురాలై, చిరునవ్వులు చిందిస్తూ కళకళలాడే మోముతో మనకు దర్శనమిస్తుంది. ఆమె ప్రాం గణంలో లలితా సహస్రనామాలు, లలితా నవరత్నమాలా పారాయణ చేసే వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం. అందుకే జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయంలో లలితా సహస్రనామ పారాయణ చేయాలని భక్తులు కోరుకుంటారు.
ఆలయ ప్రాశస్త్యం
తిరుమీయచూర్ ఆలయం వెయ్యి సంవత్సరాల పురాతనమైనదని చరిత్రకారుల భావన. రాక్షసుడు రుషులను, దేవతలను బాధిస్తుండగా వారంతా జగన్మాతకు విన్నవించుకున్నారు. వారి కోరికను మన్నించి ఆమె పండాసురునితో యుద్ధం చేసి అతన్ని సంహరించింది. రాక్షస వధానంతరం కూడా ఆమె కోపం తగ్గకపోవడంతో ఆమెను భూలోకానికి వెళ్లి మనోన్మణి పేరుతో తపస్సు చేయమని పరమేశ్వరుడు ఆదేశించగా ఆమె ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసి ప్రశాంతంగా కరుణామయిగా మారింది. ఆమే ఈ లలితాబింక అని పురాణకథనం. హయగ్రీవుడు లలితాదేవి భక్తుడు. లలితా సహస్రనామ మహత్యాన్ని అగస్త్య మహర్షికి తెలియజేశాడు హయగ్రీవుడు. అప్పుడు లలితా సహస్రనామ పారాయణకు అనువైన స్థలం తెలియజేయమని ఆగస్త్యుడు హయగ్రీవుని కోరాడు.
హయగ్రీవుడు భూలోకంలో మనోన్మణి రూపంలో సౌందర్యనాయకి విరాజిల్లుతున్నదని అగస్త్యునికి తెలియజేస్తాడు. అనంతరం అగస్త్యుడు తన పత్ని లోపాముద్రతో కలసి తిరుమీయచ్చూర్ ఏతెంచి అక్కడ లలితాంబిక సన్నిధిలో లలితా సహస్రనామం, తను విరచించిన లలితా నవరత్నమాల పారాయణ గావించాడని తెలుస్తోంది.
12 నాగమూర్తులు…
ఈ దేవాలయంలో నవగ్రహాలు లేకపోయినా, 12 రాశులకు చిహ్నంగా, 12 నాగమూర్తులు ఇక్కడ పూజలందుకుంటారు. ఇక్కడ దీపాలు వెలిగించి పూజలు సల్పితే అన్ని గ్రహదోషాల నుంచి విముక్తులవుతారని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో పుష్కరిణి ‘సూర్య తీర్థం’ పేరుతో విలసిల్లుతున్నది. తిరుమీయచ్చూర్ దేవాలయంలో శిల్పకళ ఉట్టిపడుతుంది. ప్రాంగణంలోని ‘శివశక్తి’ శిల్పం సందర్శకులనెంతో ఆకట్టుకొంటుంది. శివుడు కోపంతో ఉన్న పార్వతిని అనునయిస్తున్నట్టు చెక్కబడిన ఈ శిల్పం, ఆమె మోములో ఒక వైపు క్రోధం, మరోవైపు చిరునవ్వు కనువిందు కలిగిస్తూ ” శిల్పాచార్యుల నైపుణ్యానికి దర్పణంగా నిలిచింది. తిరుమీయచ్చూరు లలితాంబిక విగ్రహమూర్తి అద్భుతంగా జీవకళ ఉట్టిపడుతుంటుంది. భక్తుల పాలిట పెన్నిధిగా, శివపార్వతుల సన్నిధికి ఆలవాలమై తిరుమీయచ్చుర్ లలితా సహస్రనామాలకు పుట్టినిల్లుగా ప్రఖ్యాతిగాంచింది.
తిరువాయువు జిల్లాలో మైలాడుదురైకి 12 కిలోమీటర్ల దూరంలో తిరు మీయచ్చుర్ ఉంది. మహిళాడు దొరై నుంచి బస్సు సౌకర్యం కూడా ఉంది.
*ఎవరైతే భగవంతుడికి తనను తాను అర్పించుకుంటారో వారికి భగవంతుడు పశుడౌతాడు.

3 comments
Bet.esporte… is that the official site? Sounds legit, but want to confirm before betting. Here’s a link to the real Bet Esporte site: bet.esporte
Honestly, rồng bạch kim net on Rongbachkimnet is a lifesaver. It’s easy to use and really effective. Definitely recommend checking it out at rồng bạch kim net!
If you’re serious about improving, you need rồng bạch kim nét on Rongbachkimnet in your life. Hasn’t steered me wrong yet! See it for yourself at rồng bạch kim nét.