విశ్వమంతా త్రిమూర్తి స్వరూపం.అలాగే శ్రీ సుధామ గారి సృష్టి సప్తపదులకి శ్రీవిహారిగారు హితవరిగా మంచిముత్యాలని ఏరితే,శ్రీశాంతమూర్తిగారు 5అక్టోబర్ 2023లో సప్తపదుల వాట్సప్ గ్రూప్ నెలకొల్పి చేయూత నిచ్చారు.

బడి పిల్లలు కూడా చురుగ్గా పాల్గొని అచ్చులో చూసుకుని ఆనందించటం గొప్ప విషయం.
సప్తపదీయులకు ప్రోత్సాహమిస్తూ 100రూపాయల చొప్పున బహూకరించటం,ప్రోత్సహించటం సృజనకర్తకి ఆత్మ తృప్తి ,కవులకు గొప్ప అనుభూతి.3 వ సప్తపదుల పంచశతిమేలిమి ఆకర్షణీయమైన ముఖచిత్రంతో ఆకట్టుకుంది.20అక్టోబర్ 2025న అన్నమాట ప్రకారం ప్రచురణ ,కవులకి సకాలంలో అందడం వారు ఫోటోతో సహా తమ ఆనందాన్ని గ్రూప్ లో పంచుకోటం ఓకొత్త అనుభవం.ఇక సప్తపదుల ఉద్దేశం జీవిత సత్యాల ఆవిష్కరణ, సామాజిక బ్రతుకు ఘటనల వ్యాఖ్యానం.నేటికీ 700పైగా సభ్యులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం ముదావహం.సచిత్రంగా ఎన్నికైన సప్తపదులు రావటం ప్రత్యేక ఆకర్షణ. విద్యార్థులను ప్రోత్సాహించిన అధ్యాపకులని అభినందించితీరాలి.

సప్తపది నిర్మాణం:-
సప్తపది నిర్మాణ పద్ధతిని శ్రీసుధామ గారు వివరించటంతో ఆసక్తి కుతూహలం పెరిగింది అందరికీ.అనుభూతి సామాజిక అంశం తో మూడులైన్లతో కవిత రాయాలి.అంత్యప్రాసతో కూడిన పదాలు మొదటి రెండో లైన్లలో ఉండాలి.మూడోలైన్ లో ఆరెండుపదాలు సమన్వయంచేస్తూ ఐదవ చివరిపదం అంత్యప్రాసతోనే ముగించాలి. ఒకసారి వాడిన పదం మళ్లీ వాడరాదు.అన్యభాషాపదాలు వాడరాదు.అసమాపక క్రియాపదాలు వద్దు.
ఉదాహరణకు కాటేగారుపాండురంగవిఠల్ గారు రాసిన సప్తపది
ఊగడం
తూగడం
జీవితమంటే ఊయలలా సాగటం
తుదకు ఆగడం” జీవితసత్యం చెప్పారు.మూడో తరగతి సాయి అకిరా ఇలా అంది” ఇచ్చుకో పుచ్చుకో
ఒకరికొకరని సాయంచేస్తూ మంచి పేరు తెచ్చుకో” అంది.అలాగే ఏడవక్లాస్ టి.ధరణి భావం లో సమాజం ని చూపింది.
స్థలాలు పొలాలు
పెళ్లికి తప్పక చూస్తున్నారు వధూవరుల జాతక ఫలాలు”
తెలుగుకి వెలుగుబాట పర్చిన సప్తపదులు వాట్సప్ గ్రూపులలో మేలిమిగా నిలిచింది.అందరూ పాల్గొనేలా కొత్త పదాలు నేర్చుకునేలా ఆసక్తికరమైన అంశాలతో గంగాప్రవాహంలా సాగిపోతూ కొత్త ఒరవడిని సృష్టించింది.ఇది తెలుగుసాహిత్యంలో మైలురాయి.కవులు తమకవితవరకే చూస్తారు.కానీ శ్రీసుధామగారు శ్రీవిహారిగారు సామాన్య జనాలకి పదాలపై కూర్పు పై ఆసక్తి కలిగించి రాయించారు.సప్తపది వాట్సప్ గ్రూప్ అడ్మిన్ గా శ్రీశాంతమూర్తిగారు నిర్వహించారు.ఈత్రివేణీసంగమంఇలా సాగిపోతూనే సాహితీసేవలో తరించాలని,తెలుగుసాహిత్యంలో శాశ్వతంగా నిలుస్తుంది అని అందరి నమ్మకం అభిప్రాయం.
ముందడుగు:-
సప్తపదీయులకు ప్రోత్సాహమిస్తూ 100రూపాయల చొప్పున బహూకరించటం,ప్రోత్సహించటం సృజనకర్తకి ఆత్మ తృప్తి ,కవులకు గొప్ప అనుభూతి.3 వ సప్తపదుల పంచశతిమేలిమి ఆకర్షణీయమైన ముఖచిత్రంతో ఆకట్టుకుంది.20అక్టోబర్ 2025న అన్నమాట ప్రకారం ప్రచురణ ,కవులకి సకాలంలో అందడం వారు ఫోటోతో సహా తమ ఆనందాన్ని గ్రూప్ లో పంచుకోటం ఓకొత్త అనుభవం.ఇక సప్తపదుల ఉద్దేశం జీవిత సత్యాల ఆవిష్కరణ, సామాజిక బ్రతుకు ఘటనల వ్యాఖ్యానం.నేటికీ 700పైగా సభ్యులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం ముదావహం.సచిత్రంగా ఎన్నికైన సప్తపదులు రావటం ప్రత్యేక ఆకర్షణ. విద్యార్థులను ప్రోత్సాహించిన అధ్యాపకులని అభినందించితీరాలి.

పుస్తకాలుగా :-
సప్తపది పేరులోనే పెన్నిధి విశిష్టత కలది.ఏడడుగులబంధం రెండు జీవితాలను కల్పితే వాట్సప్ సప్తపది విశ్వవ్యాప్తమై నలుమూలల ఉన్న తెలుగువారిని కొత్త గా కలంపట్టినవారిని వెన్నుతట్టి ప్రోత్సహించింది. పది సప్తపది పదే పదే పిలిచే,కలాలు కదిలి స్పందించే! మొదటిపుస్తకంనవీన 5 డిసెంబర్2023లో విడుదలైంది.331మంది కవుల పేర్లు ఫోన్ నెంబర్లు పుస్తకంచివర ప్రచురించటం ఇంకో విశేషం.218పేజీల్తో అనుకున్న టైంకి ప్రచురణ ఆవిష్కరణ, చేతికి అందడం చకచకా జరిగాయి.నిబంధనలు పెట్టినా కొత్త కలాలకు ఊతమిస్తూ ఆలోచనలను తట్టిలేపాయి.ఊహలకు రెక్కలొచ్చాయి.మూడో పుస్తకంకి చిన్న పిల్లల బడిబుడతల సప్తపదులు చోటుచేసుకోటం శుభ పరిణామం.మినీ కవిత లాగా అనిపించే పద్యకవిత్వ నియమనిబంధనలతో బుర్రలకు పదును పెట్టాయి.తక్కువ మాటలు గూఢార్ధం, గాఢంగా కదిలించేదే సప్తపది.పైకి సులువు లోన బరువుగా ఉండే ఈప్రక్రియ సుధామ గారి మానసిక పుత్రిక. తథాస్తు అంటూ పెద్దలు శ్రీవిహారిగారు నిష్కర్షగా సలహాసూచనలిస్తూ తీర్చిదిద్దారు.అలాగే శ్రీ శాంతమూర్తిగారు శ్రద్ధగా నిర్వహణబాధ్యత పంచుకుంటున్నారు. వీరికి అండదండ గా నిల్చిన వారు గంధకుటి డా.బి.ఎస్.ఆర్.ఎస్.ఆంజనేయ శర్మగారు.7పదాల్ని3 పాదాల్లో ఇమిడ్చే ప్రక్రియ కి ఆధారం సుధామ గారు ఇచ్చిన “మచ్చు”ని ఆధారంగా చేసుకుని కొత్త కలాలు హెచ్చుగా స్పందించి మెచ్చుకునే రీతిలో రాశారు లయతో ఆహా ఓహో అనేలా!నవీన నవీనతను ప్రవేశపెట్టింది.సమయపాలన కు పెట్టింది పేరుఅయిన పెద్దలు5 డిసెంబర్ 2023లో జనాల చేతికందించటం ఇంకో విశేషం.17 ఏప్రిల్ 2023లో మొలకెత్తిన ఈప్రక్రియకి 24గంటల్లో 600కవితలు రావటం విశేషం.శ్రీవిహారిగారి సప్తపదుల సంపుటి నీరుపోస్తే,ఆర్థోపిడీషియన్ డా.రమణయశస్వి గారి”యశస్వీయ సప్తపదులు” చిగురించింది. వాట్సప్ ప్రసార సంచికలో విశేష అంశంగా ప్రసారమైన ఈప్రక్రియ కుతొలి న్యాయ నిర్ణేత .వై.రామకృష్ణారావుగారు.బహుమతులకు యోగ్యమైన వాటిని ఎన్నిక చేశారు.శ్రీవిహారిగారు ఓర్పు నేర్పుతో 10సప్తపదులకు 100రూపాయలచొప్పున బహుమతులివ్వటం జరిగింది.ఇక రెండవ సప్తశతి కవితాసంకలనంలో2024 నవంబర్ వరకు పది వివిధ పత్రికల్లో ప్రచురితమైన వాటినుంచి ఎంపిక చేసిన 700సప్తపదులు పుస్తకంగా రావటం ఇంకో సంచలనం.డా.నిర్ణేత నాళేశ్వరం శంకరంగారు ఇలా అన్నారు – “కవిత్వం 18పర్వాల్నించి 18పాదాలు ఆపై3పాదాలతో అవక్రత్రివిక్రమునిగా ఎదిగింది అన్నారు.సర్వశ్రీ సుధామ విహారిగార్లు నన్నయ్య నారాయణ భట్టులాగా సహకరించుకుంటూ 219పేజీలతో 206మంది కవులతో ఎదిగింది.” అని!
ఈ సప్తపది పై వచ్చిన పుస్తకాలు అందరూ చదవవలసిన పుస్తకాలు.
