Home వ్యాసాలు సప్తపదులు! శుకసారికలు!

సప్తపదులు! శుకసారికలు!

by Achyutuni Rajasri

బడి పిల్లలు కూడా చురుగ్గా పాల్గొని అచ్చులో చూసుకుని ఆనందించటం గొప్ప విషయం.
సప్తపదీయులకు ప్రోత్సాహమిస్తూ 100రూపాయల చొప్పున బహూకరించటం,ప్రోత్సహించటం సృజనకర్తకి ఆత్మ తృప్తి ,కవులకు గొప్ప అనుభూతి.3 వ సప్తపదుల పంచశతిమేలిమి ఆకర్షణీయమైన ముఖచిత్రంతో ఆకట్టుకుంది.20అక్టోబర్ 2025న అన్నమాట ప్రకారం ప్రచురణ ,కవులకి సకాలంలో అందడం వారు ఫోటోతో సహా తమ ఆనందాన్ని గ్రూప్ లో పంచుకోటం ఓకొత్త అనుభవం.ఇక సప్తపదుల ఉద్దేశం జీవిత సత్యాల ఆవిష్కరణ, సామాజిక బ్రతుకు ఘటనల వ్యాఖ్యానం.నేటికీ 700పైగా సభ్యులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం ముదావహం.సచిత్రంగా ఎన్నికైన సప్తపదులు రావటం ప్రత్యేక ఆకర్షణ. విద్యార్థులను ప్రోత్సాహించిన అధ్యాపకులని అభినందించితీరాలి.

సప్తపది నిర్మాణం:-
సప్తపది నిర్మాణ పద్ధతిని శ్రీసుధామ గారు వివరించటంతో ఆసక్తి కుతూహలం పెరిగింది అందరికీ.అనుభూతి సామాజిక అంశం తో మూడులైన్లతో కవిత రాయాలి.అంత్యప్రాసతో కూడిన పదాలు మొదటి రెండో లైన్లలో ఉండాలి.మూడోలైన్ లో ఆరెండుపదాలు సమన్వయంచేస్తూ ఐదవ చివరిపదం అంత్యప్రాసతోనే ముగించాలి. ఒకసారి వాడిన పదం మళ్లీ వాడరాదు.అన్యభాషాపదాలు వాడరాదు.అసమాపక క్రియాపదాలు వద్దు.
ఉదాహరణకు కాటేగారుపాండురంగవిఠల్ గారు రాసిన సప్తపది
ఊగడం
తూగడం
జీవితమంటే ఊయలలా సాగటం
తుదకు ఆగడం” జీవితసత్యం చెప్పారు.మూడో తరగతి సాయి అకిరా ఇలా అంది” ఇచ్చుకో పుచ్చుకో
ఒకరికొకరని సాయంచేస్తూ మంచి పేరు తెచ్చుకో” అంది.అలాగే ఏడవక్లాస్ టి.ధరణి భావం లో సమాజం ని చూపింది.
స్థలాలు పొలాలు
పెళ్లికి తప్పక చూస్తున్నారు వధూవరుల జాతక ఫలాలు”
తెలుగుకి వెలుగుబాట పర్చిన సప్తపదులు వాట్సప్ గ్రూపులలో మేలిమిగా నిలిచింది.అందరూ పాల్గొనేలా కొత్త పదాలు నేర్చుకునేలా ఆసక్తికరమైన అంశాలతో గంగాప్రవాహంలా సాగిపోతూ కొత్త ఒరవడిని సృష్టించింది.ఇది తెలుగుసాహిత్యంలో మైలురాయి.కవులు తమకవితవరకే చూస్తారు.కానీ శ్రీసుధామగారు శ్రీవిహారిగారు సామాన్య జనాలకి పదాలపై కూర్పు పై ఆసక్తి కలిగించి రాయించారు.సప్తపది వాట్సప్ గ్రూప్ అడ్మిన్ గా శ్రీశాంతమూర్తిగారు నిర్వహించారు.ఈత్రివేణీసంగమంఇలా సాగిపోతూనే సాహితీసేవలో తరించాలని,తెలుగుసాహిత్యంలో శాశ్వతంగా నిలుస్తుంది అని అందరి నమ్మకం అభిప్రాయం.

ముందడుగు:-
సప్తపదీయులకు ప్రోత్సాహమిస్తూ 100రూపాయల చొప్పున బహూకరించటం,ప్రోత్సహించటం సృజనకర్తకి ఆత్మ తృప్తి ,కవులకు గొప్ప అనుభూతి.3 వ సప్తపదుల పంచశతిమేలిమి ఆకర్షణీయమైన ముఖచిత్రంతో ఆకట్టుకుంది.20అక్టోబర్ 2025న అన్నమాట ప్రకారం ప్రచురణ ,కవులకి సకాలంలో అందడం వారు ఫోటోతో సహా తమ ఆనందాన్ని గ్రూప్ లో పంచుకోటం ఓకొత్త అనుభవం.ఇక సప్తపదుల ఉద్దేశం జీవిత సత్యాల ఆవిష్కరణ, సామాజిక బ్రతుకు ఘటనల వ్యాఖ్యానం.నేటికీ 700పైగా సభ్యులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం ముదావహం.సచిత్రంగా ఎన్నికైన సప్తపదులు రావటం ప్రత్యేక ఆకర్షణ. విద్యార్థులను ప్రోత్సాహించిన అధ్యాపకులని అభినందించితీరాలి.

You may also like

Leave a Comment