పూరి గుడిసెల కనుకొలకుల్లో
ఉబికిన రక్తాశ్రువులు
అపార్ట్మెంట్లు,గృహాల గుండెల్లో
హోరెత్తిన మరణం మృదంగారావాలు;
ఇంతకాలం తమ రెపరెపల్లో కేవలం
వాత్సల్యం
తమ గలగలల్లో కేవలం అనురాగం
పలికించిన చిలికించిన
కొంగులు, గాజులు
ఒరుసుకుంటున్నాయ్
బిగుసుకుంటున్నాయ్
ఆవేశం తో ఆక్రోశం తో
వారి ఆవేశం ఆక్రోశాల అగ్ని పర్వతం పెఠిల్లున విస్ఫోటించి
మీ అస్తిత్వం తుడిచి పెట్టుకు ముందే
ఓ సారాసురా,! ఓ గుడంబ పిశాచమా! ఓ కల్తీ మద్యమా!
క్విట్ తెలంగాణా! క్విట్ ఆంధ్రా!
అలనాటి నెల్లూరు,దూబగుంటల
మద్యపానవ్యతిరేక మహిళోద్యమ క్రోధాగ్ని
అదిగో! ఇంకా రగుల్తూనే ఉంది
మరి..ఇక మీకు చరిత్ర పుటలే గతి!
Dr. Lakshmanacharyulu M
Dr. Lakshmanacharyulu M
(9640233930)
1,పాండురంగ మాహాత్మ్యము-రామకృష్ణుని రచనా వైఖరి (విమర్శ, తెలుగు)
2.దృశ్యాదృశ్యాలు (మినీ కవితా పద్య మాలిక)
అనువాదాలు:
1,అహల్య
2 సత్సంప్రదాయసుధ
3 చిత్రకళాతపస్వీ కొం శేషగిరి రావు .(తెలుగు నుండి హిందీ లోకి)
ఉద్యోగం: తెలుగు/హిందీ అనువాదకులు & దుబాసీ ( ఉర్దూ/తెలుగు) హైదరాబాద్ మహానగర పాలక సంస్థ
1. పోనీ ! పోనీ !
కోల్ కతా ఓ మహానగరం. పెద్ద సంఖ్యలో.. చాలా పెద్ద సంఖ్యలో జనం అక్కడ నివసిస్తూ ఉంటారు. అలాగే అక్కడికి వచ్చిపోయే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. లక్షల మంది బస్సులు, స్టీమర్ల, హ్రంలు, ట్రైయిన్లు, ఇలా ఏ వాహనం దొరికితే దానిలో, ఆఫీసులకి, ఇతర పనులకి వెళ్తూ – వస్తూ ఉంటారు. రవాణా సాధనాలన్నీ ఎప్పుడూ క్రిక్కిరిసిపోయి ఉంటాయి.
రామం, సుధీర్, జేమ్స్, అయూబ్ – నలుగురూ వేర్వేరు ఆఫీసుల్లో పనులు చేస్తూ, రోజూ ప్రొద్దున్నే వెళ్ళడం, తిరిగి ఇళ్ళకు రావడం చేస్తూ ఉంటారు. పరస్పరం పరిచయాలైతే లేవు, కాని ఇవ్వాళైతే నలుగురూ ఒకే బస్సులో ప్రయాణం చేస్తున్నారు.
బస్సు ప్రయాణీకుల్తో కిటకిటలాడుతోంది. సూదిమొనంత ఖాళీ కూడా లేదు. రామం, సుధీర్, అయితే ఎలాగో అలా త్రోసుకుంటూ లోపలికి వెళ్ళ గలిగారు. జేమ్స్ కొంచెం కష్టపడితే ఇక లోపలికి వచ్చేస్తాడు కాని పాపం ! అయూబ్ బస్సు ద్వారం దగ్గరే కడ్డీ పట్టుకుని వ్రేలాడుతూ ఉన్నాడు.
ఇంతలో బస్సు కదిలింది. రోడ్డు మీద జనం బస్సుల్లో జనం. ప్రజల మానసిక థ కూడా దిగజారి పోయింది. ఎవరూ ఎవర్ని లెక్క చేయరు. ఎవరి స్వార్థం వారిదే. ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు రామం.
అంతే ! ధడేలన్న శబ్దం. ఏదో పడిపోయినట్టయింది. ఎవరిదో భయం నిండిన ‘కేక’ హృదయ విదారకంగా వినబడింది. బహుశా అయూబ్ పడిపోయినట్టున్నాడు. అలా క్రింద రోడ్డు మీద పడిపోయిన అయూబ్ మీది నుండి – వెనకాలే వచ్చిన ఒక వాహనం, వేగం నియంత్రణ కోల్పోయినందున, వెళ్ళిపోయింది. అయినా….
రామం, సుధీర్, జేమ్స్ మాట్లాడుకుంటున్న మాటలు స్పష్టంగా వినబడుతున్నాయ్…
అరే ! భయ్యా ! మా ఆఫీసుకు లేటయి పోతోంది.
పద, పద !! పోనీ ! పోనీ !! బస్సు పోనీ !!
2. మీ గొప్ప కోసమని…
ఒకప్పుడు గురు శిష్యులిద్దరూ ఒక ఊర్లో ఉండేవారు. ఇద్దరూ ప్రతిరోజూ జ్ఞాన సంబంధమైన చర్చ జరుపుతూ ఉండేవారు.
ఒకరోజున గురువుగారు శిష్యుణ్ణి పిలిచి – ”ఇవాళ నేను ఓ గంటసేపు నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతా.. నువ్వు జాగ్రత్తగా విని విశ్లేషిస్తూ, నేనేం చెప్పానో సరిగ్గా చెప్పాలి” అని అన్నాడు.
ఓ గంటసేపు గురువుగారు తన గురించి చెప్పాక, విశ్లేషించమని కోరగా, ”అయ్యా ! మీరు ఎక్కువగా మీ గురించే మీరు పొగుడుకున్నారు. ఆత్మస్తుతి ఎక్కువైంది. మీకు ”నేను” అనేది ఎంత ఇష్టమని తేలిందంటే, సుమారుగా ప్రతి వాక్యంలోనూ దాన్ని ఉపయోగించారు. ఇక ఇతరుల్ని చాలాసేపు నిందించారు, విమర్శించారు. మీకు మీలోని మంచితనం మాత్రమే కనిపించగా, ఇతరుల్లోని లోటుపాట్లు, తప్పులు మాత్రం మీకు కనిపించాయి”.
”మీ వ్యక్తిగత జీవితం గురించి విన్నాక ”మీరు మీ కీర్తి కోసం, మీ గొప్పత కోసం ఇతరుల్ని విమర్శకు గురిచేస్తూ, వారిలో ఏవో తప్పులు వెదుకుతూ ఉంటారని నాకు అర్థమైంది” అని అన్నాడా శిష్య పరమాణువు.
3. స్వర్ణ యుగం
భూమ్మీద ఒక్కో మతానికి చెందిన ఒక్కో వ్యక్తి మిగిలాడు. పరస్పరం పోట్లాడుకున్న దాని ఫలితంగా ఇలా జరిగింది. ఇప్పుడు వారి కళ్ళల్లో ఈర్ష ్యకి బదులు భయం చోటు చేసుకుంది. తమలో తాము పోట్లాడుకుని, పోట్లాడుకుని మనుషుల ఎత్తు బాగా తగ్గిపోగా, చుట్టూ ఉన్న జంతువుల ఎత్తు బాగా పెరిగిపోయింది. ఆ పశువులన్నీ మనుషుల్ని చుట్టుముట్టాయి.
”ఇక మనం బ్రతికి బట్ట కట్టలేం. ఈ జంతువులు మనల్ని తినేస్తాయి” అని అన్నాడో మనిషి.
మరొకడు కొంచెం తెలివిగలవాడు ”అసలు ఇన్ని శతాబ్దాలుగా మనిషి ఎలా తప్పించుకున్నాడో గదా అని ఆలోచిస్తే, మనుషుల్లోని ఐకమత్యమే దీనికి కారణమని తెలుస్తుంది. కానీ… మతం పేర, కలహాలు ప్రారంభం అయినప్పట్నించే మనిషి పరిస్థితి ఇలా అయిపోయింది” అని అన్నాడు.
”సరే ! మనం ఇప్పుడేం చేద్దాం?” అన్నాడు మూడోవాడు.
”రండి! మళ్ళీ అందరం ఏకమౌదాం. ఐకమత్యమే బలం. అప్పుడు బహుశా మనమే మళ్ళీ గెలుస్తాం” అన్నాడు నాలుగోవాడు.
పశువులు చాలా తెలివి గలవి. మనుష్యులంతా ఒకటైతే మనం వారిముందు నిలబడలేం. ఓడిపోతాం అని అనుకుని మనుష్యుల చుట్టూ ఉన్న కట్టడిని తొలగించి వారికి స్వేచ్ఛనిచ్చాయి.
అంతే ! భూమ్మీద కేవలం మానవతా మతం మాత్రమే నిలబడింది. నవనిర్మాణం, మానవ ప్రగతికి సంబంధించిన స్వర్ణయుగం మరల తిరిగొచ్చింది.
4. సంతాప సభ
స్కూల్లో ఒక విచిత్రమైన ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. పిల్లలంతా లైన్లలో నిలబడి మౌనంగా ఉన్నారు. ఇంతలో ఓ కారు హారన్ శబ్దం వారి నిశ్శబ్దానికి భంగం కలిగించింది.
గోపీ ఇవాళ మళ్ళీ ఆలస్యంగా వచ్చాడు. రాగానే కారు దిగి భయం భయంగా వెళ్ళి లైన్లో నిలబడ్డాడు. మెల్లగా తన ప్రక్క ఉన్న బాలుని అడిగాడు.
”ఏమైంది?”
”కనబట్టంలా? సంతాప సభ నడుస్తోంది” అని గుసగుసలాడాడు బాలు.
”ఎవరు పోయార్రా?”
”మన రామయ్య మాస్టారు నిన్న రాత్రే కాలం చేసారట”. సంతాప సభ ముగిసింది. ”ఇవాళ స్కూల్ మూసేస్తున్నాం” అని ప్రకటించారు హెడ్మాస్టర్ గారు.
గోపీకి పట్టలేనంత ఆనందం కలిగింది. బాలు భుజం మీద చెయ్యేసి నవ్వుతూ – ”భలే ! స్కూల్ బంద్ ! సరేగాని మెట్రోలో క్రొత్త సినిమా విడుదలైందిరా ! పోదామా !
బాలు నిశ్చేష్టుడై అలా చూస్తూ ఉండిపోయాడు.
5. పలాయనం
డాక్టర్ సారథి తీరిక అస్సలులేని మనిషి. ఇవాళెందుకో బాగా అలసిపోయాడు. రేయింబవళ్ళూ రోగులు, పరీక్షలు, చికిత్స… ఇదే గొడవ. అసలైతే ఎప్పుడూ నవ్వుతూ త్రుళ్ళుతూ ఉంటాడు. మంచిగానే రోగులతో ప్రవర్తిస్తాడు. ఇవాళ… విసిగిపోయాడో ఏమో, ఎటైనా దూరంగా, వెళ్ళి ఏకాంతంగా ఉండాలని అనుకున్నాడు.
అప్పుడే ఆయనకి తన మిత్రుడు సుందరం గుర్తుకొచ్చాడు. స్కూల్ రోజుల నుండి ఫ్రెండ్. ఎన్నిసార్లు ఇంటికి రమ్మని ఆహ్వానించినా సారథి వెళ్ళలేక పోయాడు. ఇవాళ ఎలాగైనా సరే, వెళ్ళి ఓ 2-3 గంటలు ఆయనతో గడపాలని భావించాడు. కాదు… గట్టిగా అనుకున్నాడు. సారథి ఓ పది నిముషాల తర్వాత సుందరం గారింటి ముందు నిలబడి, కాలింగ్ బెల్ నొక్కాడు. మొహంలో ఆనందం. ఇక్కడ తననెవరూ… ఏ రోగీ… వచ్చి విసిగించదు” అని అనుకున్నాడు.
ఇంతలో తలుపు తెరుచుకుంది. శ్రీమతి సుందరం డాక్టర్ సారథిని చూసి, గుర్తుపట్టి నమస్కరించింది.
అరె ! మీరు రావడం చాలా మంచిదైంది. మీ స్నేహితుడి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. నిన్నట్నించి బాగా జ్వరం ఉంది. రండి.. రండి…” అన్నదావిడ.
- ఆవు చేను మేస్తుంటే మరి దూడ…?
నేనెన్నోసార్లు వద్దని చెప్పా, వెయ్యి సార్లు వివరించా, కాని ‘వాడి’ బుర్రలో ఏదో త్వరగా పక్కనే ఎక్కదు. అసలు ఇలాంటి పనులు చేసే వయసా ఇది?
విశ్వనాథంగారు నాకు సెంటర్లో కలిసారు “క్రొత్త బజారు”లోని ఈ సెంటరు దానికి చాలా పేరు పొందింది. ఇక్కడ సెలూన్, స్వీటుషాపు, పూల దుకాణం, ఇలా అన్ని రకాల దుకాణాలున్నాయక్కడ. జనం ఏదో సరుకులు కావాల్సినవి కొనుక్కోవడానికి వచ్చి పరస్పరం ఏవో ముచ్చట్లు చెప్పుకొంటూ, కుశల ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు.
విశ్వనాథంగారు ఒక దీర్ఘనిశ్వాస విడిచి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు. “ఇలాంటి కొడుకుని ఆ దేవుడు ఎవ్వరికీ ఇవ్వకూడదు. వయసా, కేవలం పదిహేడు సంవత్సరాలు కాని చేపలా ‘మందు’ అలా త్రాగుతూనే ఉంటాడు. ఎంత చెప్పినా వినిపించుకోడు. మందు త్రాగొద్దని నేనేమీ చెప్పను కాని మరీ ఇంతలా త్రాగడం, త్రాగి రోడ్డుమీద పడడం… ఇదేం తెలివి?
చివరి వాక్యం వినగానే నాకేదో అనుమానం వచ్చింది. విశ్వనాథంగారి వంక ఎందుకో కన్నార్పకుండా చూసా, కొంచెం వాసన గట్టిగా పీల్చా. విశ్వనాథంగారు మత్తు ప్రభావంలో అటూ ఇటూ తూలుతూ కనిపించారు.
- ఇలా కూడా జరుగుతుంది
కారు చాలా వేగంగా వెళ్తోంది. డాక్టర్ సర్వేశ్వరరావు చాలా తొందరలో ఉన్నాడు. నిజమేమంటే, అసలు ఆయనెప్పుడూ హడావిడిగానే ఉంటాడు. రోగులెప్పుడూ పెద్ద సంఖ్యలో ఆయన చుట్టూతా ఉంటారు. రోజుకి ఇరవై నాలుగు గంటలకి బదులు ఇరవై అయిదెందుకు లేవా అని ఆయన ఎప్పుడూ చింతిస్తూ ఉంటాడు.
శ్యామల, ఆయన భార్య – “ఏమండోయ్! ఏదో ఒక రోజు, నేనో, మన పిల్లవాడు సురేశ్ జబ్బు పడతాం. అప్పుడైనా మీరు మా దగ్గర కూర్చుంటారో, కూర్చోరో నాకైతే సందేహమే” అని ఎప్పుడూ అంటూ ఉండేది.
నిజానికి డాక్టర్ సర్వేశ్వర్రావుకి తన కుటుంబం అంటే చాలా చాలా ప్రేమ. అయినప్పటికీ తన భార్యతో, తన ఏకైక కుమారరత్నం సురేశ్ తో కలిసి కొంచెం టైమైనా గడిపేందుకు ఆయనకు అస్సలు వీలైయే్యది కాదు.
‘అంబ’ సినిమా థియేటరం మలుపు దగ్గర కారు కొంచెం ‘స్లో’ అయింది. డాక్టర్ సర్వేశ్వరరావు ఆలోచనల దారం పుటుక్కున తెగింది.
‘ఏమైంది?’ అని అడిగాడాయన డ్రైవర్ని.
“సార్, ముందైతే చాలా పెద్ద గుంపు ఉంది. అక్కడ ఏదో ‘యాక్సిడెంట్’ అయినట్టుగా ఉంది. “ఎవరో బాగా గాయపడినట్టున్నారు” అన్నాడు డ్రైవర్.
‘అరే! నువ్వైతే బండి ఆపొద్దు. ఈ రోజుల్లో కుర్రాళ్లు వాళ్ళూ పై తెలీకుండా బండ్లు తోలుతారు, రోడ్డుపై కూడా అలాగే నడుస్తారు’ ఇలాంటివేవో చేస్తూనే ఉంటారు.
“కాని… సార్! మీరే డాక్టర్ కద. ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని కాపాడగలరు.”
“అయితే ఏంటట? నేను డాక్టరైతే ఇలా ప్రతి చచ్చేవాణ్ణి కాపాడుకుంటూ పోవడం నా వల్ల కాదు. నా పనులు నాకుంటాయ్”
డ్రైవర్ మౌనంగా ఓ నిట్టూర్పు విడచి బండిని ఆపకుండా, అలాగే పరుగులు తీయిస్తూ వెళ్ళాడు. డాక్టర్ గారితో వాదించడం వృధా అని అతనికి తెలుసు.
కారు హాస్పిటల్ ప్రాంగణంలోకి ప్రవేశించింది. అంబులెన్సుతో ఢీ కొట్టబోయి క్షణంలో తప్పించుకున్నది. అంబులెన్సు డ్రైవర్ ని చెడామడా తిట్టేందుకై డాక్టర్ సర్వేశ్వరరావు కారు దిగాడు. ఇలా దిగాడో లేదో “సార్! ఆలస్యం చెయ్యకుండా కారెక్కండి. మీ అబ్బయి సురేశ్ కి ‘అంబ’ థియేటర్ దగ్గర చాలా పెద్ద యాక్సిడెంటైందట. ఎవరో ఫోన్ చేశారు. బహుశా ఈ పాటికి చినబాబు….
- డ్యూటీ
అతనో గొప్ప సర్జన్ అవ్వాలని అనుకునేవాడు. హోలీ పండుగ. ఆ రోజు కూడా ఇంట్లో ఉండకుండా డ్యూటీ చెయ్యాల్సి వచ్చిందని అతనికి డాక్టరు వృత్తిమీద బోళ్ళంత విసుగు, కోపం వచ్చాయి. మరి అవాళ అమ్మ కూడా కోపంతో ఏమేమో అన్నది. అలాంటి ఆలోచన వచ్చినందుకు. అయితే మరి ఒకటి కావాలంటే, ఒకటి పోగొట్టుకోవాలి కదా!
సరే… ఎలాగో అలా డ్యూటీకి వచ్చి అన్య మనస్కకంగానే కూర్చున్నాడు. ఇంతలో… ఒక నర్సు పరిగెత్తుకుంటూ వచ్చి ఏదో చెప్పగానే ఒక్కో ఉదుటున లేచి వార్డుకొచ్చాడు. తీరా చూస్తే, అక్కడో బెడ్ మీద తన తమ్ముడే స్పృహ లేకుండా పడి ఉన్నాడు. ఓ రెండు నిముషాలు కాగానే అతను హఠాతు్తగా లేచి రక్తపు వాంతి చేసుకున్నాడు. దాంతో తమ్ముడితో బాటుగా అతని దుస్తులపైనా రక్తం పడి ఎర్రగా అయింది. రోగినైతే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి వెంటనే సర్జరీ చేయడం జరిగింది.
రెండు గంటలపాటు కష్టపడి అతను బయటికి వచ్చాడు. అక్కడ వాళ్ళమ్మ ఎదురుగా నిలబడి ఉంది. చూపులెక్కడో ఉన్నాయి.
“అమ్మా! నువ్వేం బాధపడకు. తమ్ముడి పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది” అనగానే ఆమె కళ్ళల్లో నీళ్ళు గిరగిర తిరిగాయి.
వెంటనే ముందుకొచ్చి తన పెద్ద బాబైన అతన్ని గట్టిగా కౌగలించుకుని – “బాబూ ప్రొద్దున్న నేనన్న మాటల్ని పట్టించుకోమాకు. మనసులో ఏమీ పెట్టుకోకు. ఇక నేను డ్యూటీ సంగతి ప్రస్తావించి నిన్నేమీ అనను సరేనా? డాక్టర్లకి హోలీ ఏమిటి? దీపావళేమిటి?” ఏదైనా ఒకటేకద!”
అతనో చిరునవ్వు నవ్వి – “మాకు హోలీ పండగ ఉండదని ఎవరంటారమ్మా? ఇదిగో, నా బట్టల్ని చూడు మనిషి రక్తం రంగు తాలూకు చుక్కల మరకలివి. ఇలాంటి హోలీ మరింకెవరన్నా ఆడతాడా అసలు?”
- ఫ్యాషన్
దేవుని తీర్పు కూడా కొంచెం విచిత్రంగానే ఉంటుంది మరి. ఆయన తన భక్తుల్లోనే కొందరికి విశేషంగా సిరిసంపదలిస్తే, కొందరి కసలేమీ ఇవ్వలేను. అసలు లోకంలో సరిసమానం అనేది ఎక్కడుంది అంటే, అది చాలా అరుదే అని చెప్పాల్సి ఉంటుంది. తేడాలనేవి మనకి తేలికగానే కనిపిస్తాయి.
నగరంలోని ఒక సందు మలుపులో ఉంది శివదయాళ్ గారి దుకాణం. శివదయాళ్ ఓ టైలర్. మంచి పేరున్నవాడు సంపాదించుకున్నదాంతో ఇల్లు గడుపుకుంటూ వస్తున్నాడు.
ఆ రోజున ఒక పెద్ద కారు వచ్చి ఆయన దుకాణం ముందు ఆగింది. దాంట్లోంచి ఒక ఫ్యాషనబుల్ అమ్మాయి – వన్నెల విసనక్రర దిగింది. దుకాణంలో లోపలకొచ్చి ‘మీరు నాకో ప్రత్యేకమైన డ్రెస్ తయారుచేసి ఇవ్వగలరా?’ అని అడిగింది.
ఆ అమ్మాయి తన కెలాంటి డ్రస్ కావాలో వివరించి చెప్పేసరికి శివదయాళ్ నోట మాట రాలేదు. ఆ డ్రస్లో వళ్ళు కప్పబడేది చాలా తక్కువ సరే, దాంతో తనకేంటి? తనకు పోయేదేముంది? ఆయన కొలతకు తీసుకున్నాడు.
ఆ రాత్రి శివదయాళ్ కీ నిద్ర అస్సలు పట్టలేదు పక్కనే ఉన్న గదిలో లైట్ వెలుగుతోంది. అద్దం ముందు నిలబడి శివదయాళ్ పదహారేళ్ళ కూతురు తనను తాను చూసుకుంటోంది. ఆమె చేతిలో అదే ప్రొద్దున్న తన దగ్గరికొచ్చిన అమ్మాయి కుట్టించుకున్న డ్రస్సు ఉంది. తండ్రి అక్కడికి రావటం గమనించి ఆమె సిగ్గుపడింది.
శివదయాళ్ కళ్ళల్లో కన్నీళ్ళు చిప్పెల్లాయ్ కూతురు తలమీద చెయ్యేసి నిమురుతూ “హూ… దేవుడి తీర్పు ఎలా ఉంటుందో చూడు! పేదోళ్ళకి వళ్ళు కప్పుకునేందుకు చాలినన్ని బట్టలుండవు. ఉన్నోళ్ళకైతే వళ్ళు కప్పుకునేందుకు బట్టలు చాలానే ఉన్నాయి. కాని ఫ్యాషన్స పేర, వళ్ళంతా కనబడేట్టు చూపించడంలో ధనికులు ఎక్కవగా విశ్వసిస్తారు.
- ఓ నిజాయితీ మనిషి
భూషణంగాదు ఓ పెద్దమనిషి. కొందరైతే ఆయన్ని అసలు ప్రపంచంలో కెల్లా గొప్ప వ్యక్తి అని అంటూ ఉంటారు. దీనికి ఎన్నో కారణాలున్నాయి. ఆయన పేదల పాలిటి పెన్నిధి. మంచి విషయాన్ని ప్రచారం చేస్తాడని, ఓ గొప్ప నిజాయితీ పరుడని… ఇలా… ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉంటారు జనం.
ఇవాళ పొద్దు నుంచి ఎందుకో మరి ఆయన చాలా బాధ పడిపోతున్నాడు. తన చుట్టూతా ఉండేవారి బాధల్ని దుఃఖాల్ని చూసి ఆయన పాపం, తీవ్రంగా బాధ పడిపోతాడు. వెంటనే తన సెక్రటరీని పిలిచాడు. ఆయన వచ్చి మౌనంగా తలొంచుకునే ‘సార్! మీరు నన్ను పిలిచారా?’ చెప్పండి సార్. ఏం చేయమంటారు? అని అడిగాడు.
‘ఆఁ నిన్ను పిలిచా. నీకు తెలుసు కదా! ఎవరన్నా సరే, బాధపడితే నేను చూడలేనని. చూడు! మన వీధిలోనే ఒక ‘విధవరాలు’ ఉంది కదా! ఆమె యవ్వనంలో ఉన్నఅందగత్తె కూడా. ఆమెకి ఎవరైనా మంచి కుర్రాణ్ణి తెచ్చి పెళ్ళి చేయాలని ఉందోయ్!’ అన్నాడు.
దానికి సెక్రటరీ ఒక్క క్షణం ఆలోచించి “సార్! మీ తమ్ముణ్ణి మించిన యోగ్యుడూ, మంచివాడూ, అందగాడు మరెవరున్నారు మన వీధిలో? పైగా అతనికి పెళ్ళి కూడా కాలేదు కదా!”
‘అంతే! మర్నాడే పాపం! ఆ సెక్రటరీ గారి ఉద్యోగం ఊడి పోయింది.
2. అనుకరణ (నకలు)
25 సంవత్సరాల సుధారాణికి వ్యతిరేకంగా ఉన్న కేసు ఎలాంటి మెలికలు, ఇబ్బందులు లేకుండా, స్పష్టంగా ఉండడంతో – ఒక జడ్జిగా – నా నిర్ణయఁ పెద్దగా కష్టపడకుండానే, వినిపించా.
తీర్పు చెప్తూ – సుధారాణీ! నువ్వు మాదక ద్రవ్యాలకు అలవాటుపడి, నీ ఆరేళ్ళ కూతురు మీనాని ఇద్దరు కుర్రాళ్ళకి అప్పగించేసావ్. పాపం, అపరాధాల చరిత్రలో బహుశా ఇది అన్నిటికన్నా ఘోరాతి ఘోరం. దీనికిగాను నువ్వు 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. పారిపోయిన ఆ కుర్రాళ్ళిద్దరి సంగతి పోలీసు చూసుకుంటుంది” అని అన్నా.
తీర్పు వినిపించాక, ఒక తాత దృష్టితో నేను ఆ పాప మీనాని చూసా. రేపు ఈ అమ్మాయి కూడా వాళ్లమ్మను అనుకరించదు కదా! అలాగే తయారవదు కదా”! అని అనిపించింది నాకు
3. ఫోటో
కార్యక్రమం ఎంతో హంగూ – ఆర్భాటాలతో హడావుడిగా ప్రారంభమైంది. పెద్ద షామియానా, లోపల, క్రింద నేలపై పెద్ద సంఖ్యలో కూర్చుని ఉన్న నిరుపేదలు, పైన వేదికపై చక్కగా అలంకరించిన మేజా బల్ల, కుర్చీలు అన్నీ యథాస్థానంలో అందంగా ఉన్నాయి.
ఇక మొదలైంది కార్యక్రమం. ఉపన్యాసాలు మొదలైనాయి. ఒకరి వెంట ఒకరు వచ్చి గోపాలయ్యను, ఆయన గొప్పతనాన్ని పోటీపడి పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మేడనిండా పూలమాలలో గోపలయ్యగారు గంభీరంగా, చిద్విలాసంగా ఉన్నాడు. ఏదో అప్పుడప్పుడు చిరునవ్వులు రువ్వుతూ ఉన్నాడు.
సరే, భోజనాలు, కంబళ్ళు పంపిణీ కార్యక్రమం… అన్ని మునిగిపోయి, అందరూ ఒక్కొక్కరే మెల్లగా వెళ్లిపోయారు. ఫోటోగ్రాఫర్ కూడా వెళ్లిపోయాడు. అదిగో, అప్పుడొచ్చాడు ఓ ములి నిరుపేద వ్యక్తి, తన మనవడి సహాయంతో వచ్చి గోపాలయ్యను దీవించి, “అయ్యా1 నేను అనాథను, నిరుపేదను, కొంచెం ఆలస్యం అయింది. మన్నించండి. సమయానికి రాలేకపోయా. ఒంట్లో బాగాలేదు. వీడూ లేడు దగ్గర. చివరికి ఎలాగో రాగలిగా! దయచేసి నాకు కంబళి, భోజనం దయచేస్తే…”
గోపాలయ్యగారు అతని మాటల్ని వినీ విననట్లుగా అలా ముందుకి వెళ్లి – “ముసలోడు పిచ్చోళ్ళా ఉన్నాడు. అంతా అయిపోయాక వీడికెవరిస్తాడు కంబళి, భోజనం? ఆ ఫోటో గ్రాఫర్ ఉంటే, పరిస్థితి మరోలా ఉండేదేమో! అయినా… ఫోటో లేకుండా పుణ్యకార్యక్రమాలు, దానధర్మాలు చేస్తే స్వర్గం దొరకదు కదా!” అన్నాడు చిన్నగా నవ్వుతూ తన అనుచరుడితో
4. దర్యాప్తు
ప్రజలు పెట్టిన గగ్గోలు విని మంత్రిగారు లక్షల రూపాయల కుంభకోణం కేసు పరిష్కరించేందుకుగాను ఒక ‘కమీషన్’ని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఎంతో నిజాయితీగా, న్యాయబద్ధంగా తన పని ప్రారంభించింది.
ముందుగా ఆ విభాగం అధ్యక్షుణ్ణి, వారి క్రింద పనిచేసే ఉపాధ్యక్షుణ్ణి, అలాగే వరుసగా పెద్దా – చిన్నా అధికారులందరినీ లోతుగా విచారణ చేసింది ఆ కమిటీ. అందరూ తమ తమ తెలివి తేటల్తో, మరో కారణాలతో చక్కగా తప్పించుకున్నారు. చట్టం వారికి చుట్టం అయింది. చివరికి ఆ కార్యాలయంలో పనిచేసే ఓ అటెండర్ (చప్రాసీ) ఇరుక్కున్నాడు. ఆ విచారణ కమిటీ తన నిర్ణయం వినిపిస్తూ – మాయమైన 5 లక్షల కుంభకోణం కేసులో ప్రధానమైన వేరులాంటివాడు ఈ అటెండర్. అందుకనే మేం ఆ ‘వేరును’ తొలగించేసాం. ఇక చెట్టు, కాండం, ఆకులు, పూలు అన్నీ ఆనందంగా ఉన్నాయి. ఈ విభాగం ప్రగతిపథంలో చక్కగా పరిగెడుతుంది అని అన్నారు.
5
నేనొక శిల్పిని. విగ్రహాలు రూపొందిస్తూ ఉంటాను. ఓ రోజున సీతారామయ్యగారు తన మనసులోని మాట చెప్పడంలో నేను ఆయన అభిమానుల్ని కలిసి, సంప్రదింపులు జరిపా. అంతా చక్కగా నిర్ణయించి, ఆయన విగ్రహం ఒకటి ఏర్పాటు చేయడానికై ఏర్పాట్లు ప్రారంభించాడు. విగ్రహం రూపొందించే పని నా కప్పగించారు. చివరికి విగ్రహం తయారైంది. దాన్ని స్థాపించడం సీతారామయ్య తాను జీవించి ఉండగానే తన విగ్రహావిష్కరణ దృశ్యం చక్కగా చూడగలిగాడు. కొన్ని రోజుల తర్వాత ఆయన మరణించాడు. ఓ రోజు రాత్రి ఆయన నా కలలోకి వచ్చి చాలా బాధతో – “నా విగ్రహం కారణంగా నేను చాలా బాధపడుతున్నా. విగ్రహం పెట్టిన కొత్తల్లో నాకు చాలా ఆనందం కలిగేది. విగ్రహం ఏర్పాటు కాగానే నా బాధ మొదలైంది. విగ్రహం విగ్రహమే కదా! అది జీవించి ఉండేవారి స్థానం భర్తీ చేయగలదా? అది కేవలం పైన పక్షులకి, క్రింద కుక్కలకు, పందులకు ఆశ్రయం ఇస్తోంది” అని అన్నాడు. ఇప్పుడేమీ ఆ విగ్రహం పేరు తలచుకుంటేనే వాళ్ళు కంపరమెత్తిపోతుంది. దాని స్థితి చూస్తే నాకు కడుపులో దేలినట్టౌతోంది. ఇది మీకే కాదు, నాకూ అవమానమే. ఇప్పుడు నేను కూడా ఆ విగ్రహంలా వివశత్వంతో, తప్పించుకోలేని స్థితిలో ఉన్నా” అని ఆయన నిట్టూర్చాడు.
- వైమనస్యం
సామాన్యంగా నేను చాలా తక్కువగానే మాట్లడతాను. చెడు మంచి గురించి వాటిని ఎత్తి చూపడం గురించీ మాట్లాడను. నలుగురితో కలివిడిగా కూడా ఉండను. అలా దూరం దూరంగా ఉండడంలోనే నాకానందం కలుగుతంది.
నిన్ననే జరిగిన సంఘటన. మా ఆవిడతో కలసి జమునాదాస్ గారింటికి వెళ్ళా. పలకరింపులయ్యాయి. కొద్దిసేపయ్యాక, ఆ వీధిలో ఎవరున్నారు, వారెలాంటివారు అనే విషయంపై మా చర్చ నడిచింది. ఇదిగో, ఇదే నాకు చిరాకు తెప్పించే విషయం. ఎలాగో, ముళ్ళమీద కూర్చున్నట్టుగా అలా కూర్చుని వాళ్ల మాటలు వింటున్నా.
మాటల్లో ఓ పెద్ద మనిషి బిహారీ బాబు గురించిన ప్రసక్తి వచ్చింది. జమునాదాస్ ఆయన్ని జోడింపచేస్తూ, నానా మాటలూ అన్నాడు. చివరికి…. “మర్యాద – మన్నన, సత్ప్రవర్తన లాంటివేమీ ఆయనకి తెలీవు. ఎప్పుడు పలకరించినా మేం తెలియనట్టుగానే మొహం పెడతాడు. ‘నమస్తే’కి జవాబు కూడా ఇవ్వడు. రాత్రిళ్ళైతే మనిషే కనబడదు. బహుశా ఇంట్లో ‘ముందు’ సేవిస్తూ ఉంటాడేమో మరి.”
తర్వాత నావైపు తిరిగి – “మీరేమంటారు, డాక్టరుగారూ!” అని అన్నాడు.
ఇక నాకు మాట్లాడడం తప్పనిసరై. “బిహారీబాబు ఓ పెద్ద మనిషి, మంచి మనిషి. రాత్రిళ్లు ఆయనకి సరిగ్గా కనపడదు. ఆయనకి విటమిన్ ‘ఏ’ లోపం ఉంది. నా దగ్గర వైద్యం చేయించుకుంటూ ఉన్నాడు. కొద్దిరోజుల్లో నయం అవుతుంది” అని అన్నాను. అంతే!! అక్కడివారి కబుర్లు మరొకరిని విమర్శించడంవైపుకి మళ్ళాయి.
2. ఏరుదాటాక….
ప్రొఫెసర్ మనోహర్ గారి ప్రక్క నుండి అలా వెళ్ళిపోయింది రేణు. ఓ ‘నమస్తే’ లేదు, ఓ ‘హలో’ లేదు. ప్రొఫెసర్ కి ఇది నచ్చలేదు. బాధ కూడా కలిగింది. ఆమె ఆయన విషయానికే చెందిన ఒక పరిశోధక విద్యార్థిని. ఆయన దగ్గరకు పరిశోధనకి సంబంధించి అవసరం ఏర్పడితే వస్తూ ఉండేది. బహుశా తను నన్ను గమనించలేదేమో అని అనుకున్నాడు. సరే అనుకుని లేచి ఆమె దగ్గరకు వెళ్లి – “నమస్తే! రేణూ! ఎలా ఉన్నావ్?” ప్రశ్నించాడాయన.
రేణు నమస్కరిస్తూ – “క్షమించండి! నాక్కొంచెం పని ఉంది” అని చెప్పి ఆమె జారుకుంది. అయినా ప్రొఫెసర్ గారు తన పట్టు వదల్లేదు. ఆయన రేణు వెనకే వెళ్ళాడు. అసలు ఈ రేణు, ఆ రేణేనా? “సర్! మీరు జీనియస్!” అంటూ తెగపగడుతూ ఉండేది. ఇవాళ అదే రేణు ఇలా ప్రవర్తిస్తున్నది. ఇలా అనుకుంటూ ప్రొఫెసర్ నడుస్తూ ఉంటే ఓ గది లోంచి రేణు తన స్నేహితురాల్తో – “ఆ ముసలోడు నా వెంట పడుతూ ఉన్నాడే? వదల్టంలేదు. నా మంచి ఏంకోరుకుంటున్నాడో మరి?”
“ఒకప్పుడు నువ్వాయిన్ని తెగ పొగిడేదానివి కదే!” అడిగింది స్నేహితురాలు.
“అప్పటిసంగతే వేరు. అప్పుడు నాకు పరిశోధనలో సహాయం అవసరం. ఇప్పుడా థీసిస్ చాలావరకూ పూర్తి అయింది. ఇక ఆయనతో నాకేం పని?”
3. వ్యామోహం
ఇవ్వాళ బహుశా అన్నిటికన్నా క్రికెట్ కే చాలా పేరు, ఆకర్షణా ఉన్నాయి. ఆట అర్థం అయినా కాకపోయినా, ఆ ఆటలో ఆసక్తి చూపించటమే ఒక ఆకర్షణ, అభిరుచి. సందులు – గొందుల్లోను, ఆఫీసులోను, అంతెందుకు, స్నానం చేసేటప్పుడూ ఆ ఆటంటే చెవి కోసుకునేవాళ్ళు కామెంట్రీ వింటూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే రామ్ దయాళ్ గారు వీటన్నిటికీ మినహాయింపు అనే చెప్పాలి. ఆయనకి ఈ వ్యామోహం అంటే అస్సలు పడదు. “క్రికెట్ మన కాలాన్ని వృథా చేస్తే, ఈ కామెంట్రీ అనేది ఇంకా, ఇంకా మన సమయాన్ని నష్టపరుస్తుందని” ఆయన ఎప్పుడూ అంటూ ఉంటాడు.
ఒక రోజున ఏమైందంటే…. రామ్ దయాళ్ గారు తన ఆఫీసుకి వెళ్లే హడావుడిలో ఉన్నారు. ఇంతలో ట్రాన్సిస్టర్ రొద వినబడింది. అంతే! ఆయనగారి ‘మోడ్’ ఖరాబైపోయింది. “ఇదేమన్నా కామెట్రి వినే టైమా? చదువూ సంధ్యా ఉండదు. రేడియో మాత్రం తప్పకుండా ఉండాలి. ఆ పిచ్చి కామెంట్రీ కట్టెయ్!”
ఆ రోజున ఆయన అందరిమీద ‘అక్షింత వేసాడు’. పిల్లల్ని కూడా ఆయన వదల్లేదు. అందరూ పాపం బిక్క మొహాలతో తమ చదువు సంధ్యల్లో మునిగిపోయారు.
దడదడా రామదయాళ్ గారు ఇంట్లోంచి బయటకు వచ్చేసారు. తరువాత స్కూటరెక్కి బయటికి వచ్చేసి, ఎవ్వరూ లేని ఒక మారుమూల ప్రదేశంలో బండి పార్క్ చేసి, తన జేబులోంచి ప్యాకెట్ సైజ్ ట్రాన్సిస్టర్ బయటకు తీసి, స్కూటర్ పైన విశ్రాంతిగా కూర్చొని ఎంతో ఆసక్తితో క్రికెట్ కామెంట్రీ వినసాగారు.
4. మత్తు – చిత్తు
“ఎన్నోసార్లు నేను వద్దని చెప్పా, వేలసార్లు నచ్చ చెప్పా, కాని వాడి బుర్రలో ఏమన్నా ఎక్కితేగా? అసలు ఇలా చేసే వయసా వాడిది.”
దీనానాథ్ నాకో సెంటర్లో కనబడ్డారు. ‘కొత్త బజారు’ లోని ఆ సెంటరు ఇలాంటివాటికి బాగా పేరుపడింది. ఇక్కడ ఒక హెయిర్ కటింగ్ సెలూన్, హల్వా దుకాణం, పూలదుకాణం ఇలా అన్ని రకాల దుకాణాలు ఉన్నాయి. జనం తమకి కావల్సిన సామాన్లు కొనుక్కోడానికి వస్తూ ఉంటారు. అలాల వచ్చినవాళ్ళ పరస్పరం పిచ్చాపాటీ మాట్లాడుకుంటారు, కుశల ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు.
దీనానాథ్ నిట్టూరుస్తూ – “ఆ దేవుడి లాంటి కొడుకుని ఎవరికీ ఇవ్వకూడదు. పట్టుమని పదిహేడేళ్ళుంటాయేమో! కాని, చేపలా మందు తాగుతూ ఉంటాడు. ఎంతగా చెప్పినా వినడం లేదు. నేను మందు త్రాగొద్దని చెప్పను. కాని ఇంత చిన్న వయసులో ఇంతలా త్రాగడం అనేది బుద్ధుండి చేసే పనేనా?”
చిట్టచివరి వాక్యం వినగానే నాకెందుకో అనుమానం వచ్చింది. నేను దీనానాథుణ్ణి పరీక్షగా చూస్తా, కొంచెం దగ్గరగా జరిగి వాసన పీల్చా. అంతే!! ఆయన మత్తులో బాగా చిత్తై ఉన్నాడు.
5. బేరం
ఈ కథ ఏ కాలానికి చెందినదైనా కావచ్చు. అంటే జరిగిపోయిన కాలానికి, జరుగుతున్న కాలానికి, అలాగే జరగబోయే కాలానికి కూడా సంబంధించినది కావచ్చు.
ప్రతిదేశానికి రక్షణ వ్యవస్థ అంటూ ఉంటుంది. ఈ కథలోని కాల్పనిక దేశానికి కూడా ఒక రక్షణ వ్యవస్థ ఉన్నది. ప్రతి దేశంలో పెద్ద పెద్ద అధికారులున్నట్టే ఈ దేశంలో కూడా నేరాలు జరుగుతాయి.
మన కాల్పనిక దేశానికి చెందిన ఒక సజ్జనుడు నేరాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఆయన కూతుర్ని ఎవరో అపహరించుకుపోయారు. నేరం చాలా తీవ్రమైనది. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా సన్నద్ధమైంది.
ఎలాగో అలా చివరికి అమ్మాయి దొరికింది. కాని…అపహరించినవారు దొరకలేదు. చివరికి రక్షణ యంత్రాంగం ఒక వ్యక్తిని అరెస్టు చేసింది. పోలీసు అధికారి అతణ్ణి చూస్తూ – “నీకు రోజుకి యాభై రూపాయలు దొరుకుతాయి. ఏడు రోజుల్లో ఈ వ్యవహారమంతా చల్లబడిపోయింది. నిన్ను విడిపించే బాధ్యత మాది సరేనా?” అని అన్నాడు.
ఆ వ్యక్తి పేదవాడు, నవ్వుతూ – “అయ్యా! నన్నువిడిపించొద్దు. ఈ యాభై రూపాయల రేటుమీద నేను జీవితాంతం జైల్లో ఉండగలను. నేనిలా లోపల ఉన్నా నా కుటుంబం బయట హాయిగా ఉండగలుగుతుంది” అని అన్నాడు.
కేవలం ప్రశ్న
కుట్టూరావ్ కి విపరీతమైన కోపం వస్తోంది.
ఇవాళ రాత్రి ఆయన తన కుమారుడికి ఎలాగైనా ఒక గుణపాఠం నేర్పాలని, బుద్ధి చెప్పాలని అనుకున్నాడు.
ఆయన భార్య సరస్వతి. ఆమెకి తన భర్త కోపం గురించి బాగా తెలుసు. ఆమె తన చిన్న కుమారుణ్ణి నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తోంది. నాడు నిద్రకు ఉపక్రమించాడు. ఆ తల్లి మనసు తన పెద్ద కుమారుడి భవిష్యత్ గురించి ఆలోచించసాగింది. నిజానికి ఆమె మనసు తప్పే చేస్తున్నది.
‘ఛెళ్’ మన్న చెంప దెబ్బ విని సరస్వతిరావు ఆలోచన్లల నుంచి హఠాత్తుగా బయటపడింది. దానితోబాటే ఆమె భర్త మాటలు వినబడసాగాయి. ఆమె భర్త గొంతు చించుకుంటూ అరవసాగాడు.
“ఒరేయ్! నువ్వో వెధవ్విరా. త్రాగి ఇంటికొచ్చావ్! ఎంత ధైర్యంరా నీకు? పో! నీ మొహం నాకు చూపించకు. ఇక నా ముందుకి ఎప్పుడూ రావద్దు.”
పెద్దబ్బాయి వాళ్లనాన్నని విచిత్రంగా చూసాడు. తరువాత పడుకోడానికని లోపలికి వెళ్ళాడు. కాని చిన్నబ్బాయి ఇంకా మేలుకునే ఉన్నాడు.
“ఏంటమ్మా! అన్న తాగొచ్చాడా ఏంటి? నాన్న అలా అరుస్తున్నాడు?”
సరస్వతి ఏమీ జవాబివ్వలేదు.
చిన్నబ్బాయి మళ్ళీ అడిగాడు – “దీనికోసమని అన్నని నాన్న ఎందుకు కొడుతున్నాడమ్మా? మరి…. ఆయన కూడా ఇంటికి అప్పుడప్పుడు త్రాగివస్తాడు; మనమీద అరుస్తాడు కదా! ఆయన్నెవరూ ఏమీ అనరా?”
“అంతే! ఆ రోజున మొదటిసారిగా కుట్టూరావ్ తన చిన్నబ్బాయి మీద కూడా చెయ్యి చేసుకున్నాడు.
ఆలోచన
నిన్ననే జరిగిన సంఘటన. నేను నా స్కూటర్ తో సహా ఒక ట్రాఫికంలో చిక్కుపడిపోయాను. బండిని మెల్లిగా చాలా మెల్లిగా నడుపుతూ వెళ్తున్నా, నాకెదురుగా ఒక గుర్రబ్బండి (టాంగా) ఉంది. దానిపై కొంతమంది స్కూల్ పిల్లలు కూర్చుని ఉన్నారు.
నిజానికి ఇతరుల సంభాషణ వారికి తెలియకుండా వినడం అనేది సభ్యత కాదు కదా! అయినా… ఇప్పటి నా పరిస్థితి ఎలా ఉందంటే…. ఆ పిల్లల మాటలు, వాటంతట అవే, నేను వినాలని అనుకోకపోయినా… నా చెవుల్లో పడసాగాయి.
వాళ్ళంతా 8-9 సంవత్సరాల వయసున్న ఉన్న పిల్లలు. ఓ పది మంది దాకా ఉండి ఉంటారు. “మా అన్న గడిచిన ఐదు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం వెదకుతూనే ఉన్నాడు. ఎం.ఏ. పాసయినాడు. ఓ గోల్డ్ మెడలు కూడా వచ్చింది అని ఒకడనగా – ఇంకొకడు – “అవును! అందుకే ఈ చదువులవల్ల మనకే లాభమూ ఉండదని, దండగని నేను అంటూ ఉంటాను. మా అన్న ఉన్నాడు. పదో క్లాసు తప్పాడు. అయితే నేం….? వాడి బిజినెస్ బ్రహ్మాండంగా నడుస్తోంది. ప్రతినెలా “దాదాగిరి”తో చాలా డబ్బు సంపాదిస్తాడు”. ఇప్పటికే చాలా డబ్బు వెనకేశాడు.”
బంగారు పతకం
రాజీవ్ కి ఇవ్వాళెందుకో పాతరోజులు గుర్తుకొస్తున్నాయం. బంగారు పతకాన్ని చేతిలోకి తీసుకోగానే వళ్ళంతా పులకరిస్తోంది. ఇదే పులకరింత అతనికి. ఆ పతకం ముఖ్య అతిథుల చేతులమీదుగా, చప్పట్ల మధ్య తీసుకుంటున్నప్పుడు కలిగింది. ఆ రోజున “మీ అందరికీ నువ్వు గర్వకారణం చాలూ! నీవల్ల కేవలం నీ గౌరవమే కాదు, ఈ విద్యాలయం ప్రతిష్ఠ కూడా రెట్టింపు అయింది” అని ఆ ముఖ్య అతిథి అన్న ప్రశంసావాక్యాలు తలచుకున్నప్పుడల్లా అతని ఛాతీ విస్తరించేది.
ఇది జరిగి పదేళ్ళయింది. ఈ పదేళ్ళలోనూ ఏమీ జరగలా. రాజీవ్ తండ్రి మరణించాడు, తల్లి మంచం పట్టింది. తనేమో ఈ రోజుకు ఉద్యోగంకై అన్వేషిస్తూనే ఉన్నాడు. ఇవాళైతే అమ్మ ఆరోగ్యం బాగా పాడైపోయింది. రాజీవ్ దగ్గర పాపం మందులు కొనేందుకు డబ్బులు లేవు. చివరికి ఇవాళ తన బంగారు పతకాన్ని అమ్మకానికి పెట్టాలని నిశ్చయించుకున్నాడు.
నేను మెల్లిగా ఆ టాంగా వెనకే వెళ్తున్నా. నాకు ఆశ్చర్యం, బాధ, జాలి, వాళ్లందరి మీదా కలిగాయి. అసలు వీళ్ళకి విద్య ఉద్దేశ్యం ఏమిటో, దానివల్ల కలిగే ప్రయోజనాలు నిజంగా ఈ పిల్లలకి అర్థం అవుతున్నాయా అనే ఆలోచనలో మునిగిపోయాను.
మెడలో జేబులో పెట్టుకుని భారమైన గుండెలతో, ఇంట్లోంచి బయలుదేరాడు రాజీవ్. ఈ లోకంలో నీతి, న్యాయం, మానవత్వం, మంచితనాలు లేవని అనిపించింది అతనికి. బంగారు పతకం, అన్ని సర్టిఫికేట్లు, ప్రథమశ్రేణి కేరియరం. కాని ఉద్యోగం హుళక్కు. ఎక్కడా చేసేందుకు పనే దొరకలేదు.
ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎప్పుడు తను బంగారు నగల దుకాణం దగ్గరికొచ్చాడో తెలియనే లేదు.
“ఏం కావాలి సార్! అనే పిలుపుతో అతడు ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు.
ఎదురుగుండా యజమాని. పెద్ద నగల దుకాణం ఉంది.
“నా బంగారు పతకం ఒకటి అమ్మాలనుకుంటున్నా సేఠ్ జా! అన్నాడు రాజీవ్.
సేఠ్ గారు మెడలం చేతిలోకి తీసుకున్నాడు. అటూ ఇటూ త్రిప్పాడు. ఏదో రాయికి దాన్ని సరసరా అటూ ఇటూ గీచాడు పరీక్షించాడు.
“బాబూ! నా టైం చాలా విలువైంది. ఇలా వృధా చెయ్యకు. ఇది బంగారం కాదు. పైన పూత ఉంది అంతే. దీని విలువ పది రూపాయలకన్నా ఎక్కువ చేయదు” అని అన్నారు.
వైరం
సాధారణంగా నేను తక్కువగా మాట్లాడుతా. అంతే మితభాషిని. మంచి చెడు అలవాట్లకు దూరంగా ఉంటా… ఇతరులతో కలవడాలు, రాసుకుపూసుకు తిరగడాలు కూడా తక్కువే. ఇలా దూరం దూరంగా ఉండడం వల్ల నా ప్రాణానికి హాయిగా ఉంటుంది.
నిన్న జరిగిన విషయం ఒకటి చెప్తా. మా ఆవిడతో కలిసి జమునాదాస్ గారింటికి వెళ్ళాను. కొద్దిసేపు పిచ్చాపాటీ అయ్యాక, మా వీధిలో ఎవరెలాంటివారు అన్నదానిపై చర్చ మొదలైంది. నేనైతే ఇక తప్పదన్నట్టుగా బలవంతంగా కూర్చుని వాళ్ళ మాటలు వింటూ ఉన్నా.
కొత్త వ్యక్తి అయిన బిహారీబాబు గురించి చర్చ మొదలైంది. జమునాదాస్ ఆయన్ని ఉతికి ఆరేస్తూ, చివరికి అతగాడికి అసలు సభ్యతంటే ఏమిటో తెలీదు. ఎప్పుడూ మనల్ని గుర్తించినట్టే ఉంటాడు. నమస్తే అంటే జవాబుచెప్పడు. ఎటో చూస్తూ ఉంటాడు. రాత్రిళ్లయితే మరీ బడాయిపోతాడు. మనల్నసలు చూడనే చూడడు. బహుశా మత్తులో మునిగి తేలుతూ ఉంటాడేమో”
హఠాత్తుగా నావైపు తిరిగి – “మీరేమంటారు డాక్టర్ గారూ!” అని అన్నాడు.
“ఇక నేను చెప్పక తప్పలేదు. బిహారీ బాబూ పాపం చాలా మంచివాడు. రాత్రిళ్ళు సరిగ్గా చూడలేదు – ఆయనకి విటమిన్ ‘ఏ’ లోపం ఉంది. నా దగ్గరే వైద్యం చేయించుకుంటున్నాడు. కొద్ది రోజుల్లో తగ్గి పోవచ్చు”,
“ఆరోగ్యవంతుడైపోతాడు” అన్నాను నేను.
తర్వాత మాటలన్నీ మరొకరి దోషాల్ని వెదకసాగాయి.
దర్యాప్తు
ప్రజల గగ్గోలు పెడుతూంటే భరించలేక మంత్రిగారు రూపాయల కుంభకోణం వ్యవహారంపై ఒక దర్యాప్తు కమిటీ వేయగా ఆ కమిటీ చాలా నిజాయితీగా, నిష్పక్షపాతంగా తన పని ప్రారంభించి ఆ శాఖకి చెందిన అందరికన్నా పెద్ద అధికారిపై దర్యాప్తు ప్రారంభించారు. ఆయనకి ఒక పెద్దమనిషిగా, గొప్ప ధనికుడిగా పేరుంది. మొత్తానికి ఆయన ఆ ఐదు లక్షల కుంభకోణం నిర్దోషిగా బయటపడ్డాడు. తరువాత ఆయన సహచరుడి వంతు వచ్చింది. ఆయన ఈ మధ్యనుంచే గొప్పవాడైపోతున్నాడు. ఆయనో వకీలు కూడా తన తెలివితేటల్తో, ఆయన బయటపడ్డాడు. చివరికి ఆ విభాగం బంట్రోతు వంతు రాగా ఆ కమిటీ మంత్రిగారికి తన నివేదిక అందజేసింది.
మర్నాడు మంత్రిగారు వార్తాపత్రికల్లో చేసిన ప్రకటన ఇలా ఉంది.
“దర్యాప్తు సంఘం తన విచారణ పూర్తి చేసింది. వారి ప్రకటన ఇలా ఉంది-
మేము దర్యాప్తు చేసాక ఈ శాఖ బంట్రోతు ఈ కుంభకోణానికి మూలం అని తేలింది. మేము ఆ వేరుని మొదలంట తొలగించాం. కాండం, ఆకులు పూలు ఎంతో సంతోషంగా ఉన్నాయి. ఇక వారు ఈ శాఖని ప్రగతి మార్గంలో పరుగులు పెట్టిస్తారు!!
పూజ
పోద్దార్ కుటుంబం ఇద్దరు సోదరులతో విడిపోయింది. మృణాల్ అన్న, సత్యజీతం తమ్ముడు వీరి మధ్య పంపకాలకు, భాగాలకు లోను కాని వాడు వారి కుటుంబాలకు గత 40 సంవత్సరాలుగా సేవచేస్తున్న నౌకరు ధర్మా ఒక్కడే.
ఈ సంవత్సరం రెండు కుటుంబాలవారు ఒకరికొకరు తీసిపోని విధంగా చేస్తున్నారు.
‘దేవీ పూజలు’.
‘అమ్మ అందరికన్నా మిన్న. ఆమెకి అన్న మృణాల్ గారింటిలోనే స్వాగతం చెప్పి పూజ చెయ్యాలి. మీరంతా వంగి ప్రణామాలు చేయండి’ – అని ప్రకటించాడు పూజారిగారు. వాతావరణంలో ప్రశాంతత ఒక్కసారిగా నెలకొన్నది. ఇంతలో తమ్ముడు సత్యజీతం ఇంట్లోంచి కూడా అలాంటి ప్రకటనే వెలువడింది. అక్కడున్న వాళ్లంతా వంగి దణ్ణాలు పెట్టారు. ధర్మా ఆలోచనలో పడిపోయాడు. తను ఇప్పుడు ఏ దుర్గమ్మకు నమస్కరించాలి? అన్న దుర్గమ్మకా? తమ్ముడి దుర్గమ్మకా? తనకైతే ఇద్దరూ పుత్ర సమానులే….
“అమ్మా! నేనెక్కడ చెయ్యాలి పూజ? ఇక్కడా? అక్కడా?” అరిచాడు ధర్మ.
“ఈ అన్నదమ్ముల ఆస్తులైతే పంచుకున్నారుగాని నిన్నెలా పంచుకుంటారమ్మా? నేనలా చేయను చేయలేను. నేనిద్దరి ఇళ్ళ మధ్యనా నమస్కరిస్తా. నా దుర్గమ్మ ఇక్కడా, అక్కడా అన్నిచోట్లా ఉంది”
ధర్మ వంగి నమస్కరించి, తిరిగి మరి లేవనే లేదు.
ఋణం
డా. నాయక్ తన గదిలో ఒంటరిగా కూర్చుని దీర్ఘాలోచనలో ముణిగి ఉన్నాడు. అతను ఆలోచిస్తూ ఉన్న రోగి పరిస్థితి విషమగా ఉంది. తరువాత లేచి అటూ ఇటూ తిరగసాగారు. ఇంతలో ఫోన్ ట్రింగ్, ట్రింగ్ అనగానే ఆయన మొహంతో నవ్వు విరిసింది. “హమ్మయ్య” అనుకుని.
‘ఎవరైనా దొరికారా?’ అని అడిగాడు.
‘సారీ సర్? దొరకలేదు, తిరుగుతూనే ఉన్నాం’-
అంతే! డాక్టర్ మొహం మారిపోయింది. మళ్ళీ విషాదం అలముకుంది.
‘ఆశ’కు తగిన బ్లడ్ గ్రూప్ దొరకడం లేదు.
ఎందుకు దొరకడం లేదో కూడా ఆయనకు తెలుసు.
డా. నాయక్ దేవుణ్ణి నమ్మడు. కాని ఇవాళ ఆయన దేవునికి నమస్కరించాడు తలవంచి.
“ఆశ” కోసమై ఆరాధిస్తున్నాడు. ఇంతలో ఫోన్ మ్రోగింది. వెంటనే అందుకున్నాడు.
“నేను, ఇన్స్ పెక్టర్ ఖన్నా. పేపర్లో మీ ప్రకటన చూసాను. నా దగ్గర ఉన్న ఖైదీల్లో ఒక ఖైదీ రక్తం గ్రూపు మీ “ఆశ’ పేషెంటుతో ‘మ్యాచ్’ అవుతుంది. అతను రక్తం ఇవ్వాలనుకుంటున్నాడు.
ఆఁ అలాగా! తప్పకుండా?
ఆ ఖైదీ పేరు?
“కిషన్”
డాక్టర్ నాయక్ గారి కళ్ళనుండి కన్నీళ్ళు జలజలా రాలాయి. వాటి మధ్యనుంచే ఆయన దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు.
ఇంతకీ…
ఆ కిషన్ అనేవాడే ‘ఆశ’ తండ్రిని హత్యచేసి, దానికే శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు.
అద్దాల ఇల్లు
శ్రీరాంసేవకంగారి మూడ్ ఇవ్వాళ అస్సలు బాగా లేదు. ఆయన భార్య హాస్పిటల్ లో ఉన్నది. గత ఐదు రోజులుగా ఆయన ఆందోళనగానే ఉన్నాడు. ఇవ్వాళ ఆరోగ్యం కొంచెం బాగానే ఉన్నా ఇవ్వాళే మరి రాంసేవక్ గారి మనసు చాలా క్రుంగిపోయి ఉంది.
ఆయన మనసు పాడైపోడానికి కారణం సుస్పష్టమే. ఈ హాస్పిటల్ ఆయన లాంటివారికి తగినది కాదు. ఆయన నాతో – “చూడండి, ఈ హాస్పిటల్ ఎలా ఉందో? శ్రద్ధగా గమనించండి. అసలు ఇది హాస్పిటలేనా? బాత్ రూంలు మురికిగా ఉన్నాయ్. ఎక్కడ చూసినా బ్యాండేజీలు, గుడ్డలు, మందుల ప్యాకెట్లు – చెత్త, చెదారం ఎంతైనా సిగ్గు పడాల్సిన విషయం ఇది.”
ఆయన మాటలో నిజం ఉందని నాకూ అనిపించి ఆయనతో ఏకీభవించసాగాను. మేమిద్దరం అప్పుడు హాస్పిటల్ వరండాలో నడుస్తూ మాట్లాడుకుంటూ ఉండగా నాకు హఠాత్తుగా నిజంగానే అక్కడక్కడ చెత్త – చెదారం కనబడ్డాయి.
తర్వాత నేను రామసేవక్ గారిని గమనించసాగాను. ఆయన తన జేబులోంచి ఒక బీడి తీసి వెలిగించాడు. దాని బూడిద నేల మీద దులిపాడు. అంతకుముందే ఆయన నోట్లో తాంబూలం (పాన్) ఉంది. మధ్య మధ్య తుఫుక్కున నేలమీద ఉమ్ముతూనే గచ్చుని రంగు మయం చేస్తున్నారు. తర్వాత ఎంతో నిబ్బరంగా నా భుజంపై చెయ్యేసి – “ఈ హాస్పిటల్ లోని మురికి, చెత్తల గురించి నేను చెప్తున్నా కదూ! అసలు మనందరం కలిసి దీన్ని శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది అన్నారు.
భాషా జ్ఞానం
ఒక రోజున నేను సైకిల్ మీద ఇప్పటికి వస్తున్నా. దారిలో ఓ మూల ఓ పెద్ద గుంపు కనబడగా నేను కూడా ఆగిపోయి కుతూహలఁగా వాళ్ళ మాటలు వినసాగాను.
అక్కడ ఒకాయన జనం మధ్య నిలబడి ఏవో పళ్ళు అమ్ముతూ ఉన్నాడు. పళ్ళన్నీ చకచకా, చూసూ్త ఉండగానే పెద్ద సంఖ్యలో అమ్ముడుపోసాగాయి.
ఆ వ్యక్తి తన తియ్యని మాటల ధోరణిలో ఒక మరాఠి మహిళతో – నమస్తే అమ్మా! “ఇదేఫలం చాంగలే భేట్ తాత్ ఫారచ్ స్వస్త్” అని అన్నాడు.
అలాగే, ఒక సర్దార్జీతో – ‘సత్ శ్రీ అకాల్! ఏ చంగే ఫల్ నే, సస్తేనే” అని అన్నాడు.
అంతలోనే అక్కడికొక సూట్ బూట్ లో వచ్చిన పెద్దమనిషితో – గుడ్ మార్నింగ్ సర్! నైస్ ఫ్రూట్స్ హియర్, వెరీ చీప్!”
ఇలా చాలాసేపు అమ్మకాలు కొనసాగాయి. గుంపు కొంత చెదిరిపోగా – ఆ మనిషి చూపు నాపైన పడింది. వెంటనే బెంగాలీలో – “నమొష్కార్ మోశాయ్! ఎ ఖానౌ భాలో ఫౌల్ ఆచే – భూబ్ హే శౌస్తా!”
నేను కొన్ని పళ్లు కొన్నా ఆ మనిషి భుజంపై చెయ్యివేసి – ‘ఎన్ని భాషలొచ్చు నీకు భయ్యా” అని అడిగా.
కన్నార్పకుండా ఆ వ్యక్తి – ‘మన దేశంలో మాట్లాడే భాషలన్నీ సుమారుగా నా కొచ్చు అని అనగా – నేనాశ్చర్యపోయి ‘అన్నీనా?’ అని అన్నా. ఆయన నవ్వి – సుమారుగా ప్రతిభాషలోనూ ‘నమస్కారం. ఇక్కడ అన్ని రకాల పళ్లూ చాలా చౌకగా దొరుకుతాయి” అనే మాటల్ని మాత్రం నేర్చుకున్నా”.
“దీనివల్ల ఏమిటి లాభం?” నేనడిగాను.
చందు అనే పేరున్న ఆయన – “బాబుగారూ! నేనిలా వాళ్ళ భాషలో చెప్తే వాళ్ళు ఆనందం పొందుతారు. ఇలా చెయ్యడంతో వాళ్ళ మనసులో నాకు ముందుగా చోటు దొరుకుతుంది. తర్వాత వాళ్ళలా మాట్లాడుతూ ఉంటే నేను నా పళ్ళు తూస్తూ ఉంటా” నన్నాడాయన.
సరిపోని సమయం
మంచం మీద పడి ఉన్న ఆ పెద్ద మనిషి పరిస్థితి పాపం! దయనీయంగానే, విషమంగానే ఉంది. బుగ్గలు పీక్కుపోయి ఉన్నాయి. పెద్ద బొజ్జ. ఆయనకి గుండెజబ్బు. అలాగే పోర్టల్ సిరహోసిసంతో కూడా ఆయన బాధపడుతున్నాడు. ఇటువంటి దుస్థితిలో కూడా ఆయనకు ఫోనుమీద ఫోను అలా వస్తూనే ఉన్నది. అస్సలు తీరిక లేకుండా, ప్రతి ఐదు నిముషాలకు ఒకసారి వ్యాపార సంబంధమైన వ్యవహారాలపై ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు.
ఇంటికొచ్చిన డాక్టర్ – “మీకింత తీరిక లేకుండా ఉంది కద! మరి ఈ జబ్బెలా వచ్చింది మీకు? నిజానికి ఇది ఎక్కువగా అతిగా త్రాగే వాళ్ళకే వస్తుంది”. ఏం చెప్పమంటారు? డాక్టర్! తీరిక లేనందువల్లే నేను తిండి తినలేను. ఏదో ఇలా మద్యపానం చేస్తూ కాలం గడుపుతా త్రాగడానికైతే నాకు తక్కువ టైం పడుతుంది సార్!” అన్నాడు.
మార్పు
నూతనంగా నిర్మించబడిన ఆ దేవాలయం దగ్గర భక్తులు చాలామందే ఉన్నారు. అంతా ఎంతో భక్తిభావంతో దేవుడికి వంగి వంగి నమస్కారాలు చేస్తూ తమ అభీష్టాలు తీర్చమంటూ వేడుకుంటున్నారు. ప్రతిరోజూ అక్కడ భక్తులంతా పెద్ద సంఖ్యలో చేరుకుంటూ అర్చనలు, ఆరాధనలు చేస్తున్నారు.
సేఠ్ దీనదయాళ్ గారు ఈ దేవాలయం నిర్మించారు. ఆయన లాంటి మహా పిసినారి, పాపాత్ముడు అసలు ఒక దేవాలయం నిర్మించడమే ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. “ఇక నా స్థానం భగవంతుని చరణాల చెంతనే. రోజూ రాత్రి 7 గంటల తర్వాత దేవాలయంలోనే కూర్చుంటా” అని ఆయన అందరితో చెప్పాడు.
సేఠ్ తో నాకున్న పరిచయం ఇప్పటిది కాదు. ఆయన నాకు పాత స్నేహితుడే. అతనిలో మార్పుని చూసిన నేను ఉండబట్టలేక ఓ రోజున అతనిలోని ఈ మార్పుకి కారణం అడిగా – దానికి ఆయన గంభీర స్వరంతో – “జీవితమంతా నా ఇష్టమొచ్చినట్టు బ్రతికాను. ప్రజల్ని ఇష్టమొచ్చినట్టుగా త్రొక్కుకుంటూ పోయా. ఈ మధ్య కొన్ని రోజులుగా జనం ఎందుకో నాకు దూరం అవుతున్నట్టు, నన్ను దూరం పెడుతున్నట్టనిపించింది. ఆలోచించాను. ఇదిగో! ఇలా చేశాను. పగలంతా పూర్వంలాగానే వ్యాపారం ద్వారా సొమ్ములు పాత పద్ధతిలోనే సంపాదించుకుంటూ ఇక రాత్రి వెళ్ళి గుళ్ళో కూర్చుంటా. అప్పుడు ప్రజలు కేవలం దేవుడికే కాదు, నాకూ – అంటే ఈ సేఠ్ దీనదయాళంకి కూడా – వంగి, దణ్ణాలు పెడతాడు. ఇలా ప్రాణాల్తో ఉండగానే నేను స్వర్గసుఖాల్ని అనుభవిస్తా” అని అంటంటే విని నేను తెల్లబోయాను.
***
విగ్రహం
నేనొక శిల్పిని. ఒకరోజున సీతారామ్ నా దగ్గరకొచ్చి తన మనసులో ఉన్న మాట చెప్పాడు. సరే, నేను నా మిత్రుడి కోర్కె తీర్చాలని అనుకున్న, సీతారాముణ్ణి అభిమానించ వారితో మాట్లాడాను. సరే, మాటలు చేతల రూపం దాల్చాయి. ఆయన విగ్రహం ఒకటి పెట్టాలని నిర్ణయించడం జరిగింది. శిల్పం చెక్కించే పని మొదలైంది.
చివరికి సీతారామం తను బ్రతికుండగానే తన కోరిక – అదేనండీ – తన విగ్రహ నిర్మాణం, స్థాపన – రెండూ చూసుకున్నాడు. ఆనందించాడు. ఇది జరిగిన కొద్దిరోజుల తర్వాత ఆయన కాలధర్మం చెందాడు.
ఓ రోజున సీతారామ్ నా కలలోకి వచ్చి ఎంతో బాధపడుతూ – “మిత్రమా! ఆ విగ్రహం కారణంగా నేను చాలా బాధపడుతూన్నానోయ్! విగ్రహం ఏర్పాటైన కొద్దిరోజులు బాగానే ఉంది కాని… ఇప్పుడే చాలా బాధగా, అవమానంగా ఉందోయ్! ఎంతైనా బొమ్మ, బొమ్మే కద! అది ఎప్పటికీ ప్రాణం పోసుకోలేదు. అవునా! ప్రస్తుతం కేవలం అది పశువులకి, పక్షులకీ ఆశ్రయం కలిపిస్తోంది, ఆనందం అందిస్తోంది! ప్చ్’’
అదిగో! అప్పట్నించే నాకూ చాలా బాధ కలిగింది. నా మిత్రుడి శిలావిగ్రహం చూసి చూసి బాధపడుతున్నా. ఇలా విగ్రహస్థాపన జరగడం అతడికీ అవమానమే, నా కళకి కూడా అవమానమే. కాని….ఏం చేస్తాం! ఆ విగ్రహం లాగా నేను కూడా వివశుణ్ణే, మరో దారి లేదు మరి!
* *
చీవాట్లు
గోపాల్ గోపాలస్వామి పరువు ఇవాళ గంగలో కలిసిపోయింది. జూదం ఆడుతూ వాడు పట్టుబడ్డాడు. వాళ్ళమ్మ నాన్నలు వాడి ముందు కూర్చుని గద్దిస్తున్నారు, చీవాట్లు పెడుతున్నారు.
డా. హరీష్ గోపాల్ వాళ్ళ నాన్నగారు. నగరంలో ఆయన ఒక గొప్ప పేరున్న డాక్టరు. సామాన్యంగా ఆయన మౌనంగానే ఉంటారు. కాని తిట్టవలసిన, చీవాట్లు పెట్టవలసిన అవసరం పడితే, ఇక అంతే! అలా తిడుతూనే ఉంటారు. ఓసారి గోపాలంతో – “చూడు! గోపాల్! నీ సంగతేంటో నాకేమీ అర్థం కావడం లేదు. నీ చదువేంటో నాకేమీ బోధపడడం లేదు. ఎప్పుడూ ఏదో గొడవ చేస్తూనే ఉంటావ్. మా తరంలో ఇలా ఉండేది కాదురా! వళ్ళోంచి చదివేవాళ్ళం. చదువు తప్ప నువ్వు చెయ్యడానికి మరో పని ఏముంటుందసలు? దాంట్లో నువ్వు జీరోవే కదా! పైగా… ఇలాంటి చెడు వ్యసనాలు, దురలవాట్లు….”
ఇప్పుడు గోపాల్ వాళ్ళమ్మ వంతు వచ్చింది. ఆమె కూడా నగరంలో బాగా పేరున్న స్త్రీల వ్యాధుల నిపుణురాలు. శ్రీమతి మాల అంటే చాలామందికి తెలుసు. గొప్ప మాట కారి, తిట్టడంలోనైతే చాలా నైపుణ్యం ఉంది. ఇక ఆమె మొదలుపెట్టంది – “చూడు! నువ్వు మాకు ఒకే ఒక్క సంతానం. నీ కోసమని నేను మీ నాన్నగారు ఎన్నో త్యాగాలు చేసాం. ఎన్నో వదులుకున్నాం. ఈ భవనం, ఈ డబ్బు, వైభోగం, అంతా నీదే కద! పొద్దుట్నుంచీ రాత్రివరకూ మేం పడుతున్న శ్రమ కేవలం నీ కోసమే కద! మరెందుకని నువ్విలా జూదం ఆడడం లాంటి చెడు వ్యసనాలు మరిగావ్?” అని అన్నది.
గోపాల్ మౌనంగా వింటున్నాడు వాళ్ల మాటల్ని. అసలేం మాట్లాడతాడు వాడు? అమ్మా నాన్న లంటే చచ్చేంత భయం. అలా తలొంచుకుని మౌనంగా వింటూనే ఉన్నాడు. అటు వాళ్ళమ్మా నాన్నల తిట్లూ చీవాట్లు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇక వాళ్ళిద్దరూ కలిసి ఒక్కసారిగా అందుకున్నారు –
“చెప్పరా! నీకేం తక్కువైందని ఇలా జూదం, పేకాటలు మొదలుపెట్టావ్? అసలు జీవితంలో నీకేం తక్కువైందిరా? మేం నీకివ్వనిదంటూ ఏముందిరా? చెప్పు ఇంకా ఏం కావాలి?”
ఇక గోపాల్ ఉండబట్టలేక ఏదన్నా మాట్లాడాలనుకున్నాడు. మెల్లగా నోరు తెరిచి – “అవును! నాకు జీవితంలో అన్నీ ఇచ్చారు. అయితే మీ తీరికలేని జీవితంలో నాకు కేవలం రెండే రెండు కావాలి? ఇస్తారా?”
అమ్మ నాన్నలిద్దరూ ఒక్కసారిగా – “ఏం కావాలి నీకు?” అని అన్నారు ఆశ్చర్యంగా.
నాకు – – నాకు కావాల్సినవి…. ఒకటి నాతో గడపడానికి కొంత సమయం… అలాగే కొంచెం ప్రేమ. అంతే!” అని అన్నాడు. గోపాల్ కళ్ళంలో కన్నీళ్ళు చిప్పిల్లాయి.
ఫ్రేమ్
రోజులాగానే ఇవాళ కూడా శివచరణ్ పనిలోకి వెళ్తుండగా హఠాత్తుగా గుండెలో తీవ్రంగా నొప్పి వచ్చింది. ఆయన్ని వెంటనే పక్కమీద పడుకోబెట్టి ఏవో ఉపచారాలు, చేసినా ఫలితం లభించలేదు. పదిహేను నిముషాల్లోనే పాపం! ఆయన ఆ బాధ పట్టుకోలేక కన్నుమూసాడు.
అంతే! అప్పటిదాకా నవ్వుల్తో నిండి ఉన్న ఆ ఇల్లు ఏడుపులు, పెడబొబ్బలతో ప్రతిధ్వనించింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆయన ముగ్గురూ కొడుకులూ కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చారు, ఒక ముఖ్యమైన విషయంలో. అదేమంటే… ఇవాళ్టి నుంచి మనం నాన్నగారి ఫోటోకి నమస్కారం పెట్టాకే మనం, మన మన పనులకి వెళ్దాం. నాన్నగారు వాళ్ళ నాన్నకి అంటే తాతగారికి ఏం చేసేవాడో అదే మనమూ ఈయన విషయంలో చేద్దాం” అని అనుకున్నారు. శివచరణ్ జీవించి ఉన్నప్పుడు ఎప్పుడు బయటకు వెళ్ళాల్సి వచ్చినా, వాళ్ల నాన్నగారీ ఫోటోకి దణ్ణం పెట్టుకునేవాడు.
“అది సరే! పూజా గృహంలో స్థలం ఏదీ ఖాళీగా లేదు కదా? నాన్నగారి ఫోటో ఎక్కడ పెడతాడు?” అడిగింది పెద్ద కోడలు.
మళ్ళీ ముగ్గురు ‘సుపుత్రులూ’ ఆలోచించి ఓ రెండు నిముషాల్లోనే ఒక నిర్ణయానికి వచ్చేసారు. “ఆఁ దానిదేవుంది? తాతగారి ఫోటో తీసేసి, అదే ఫ్రేంలో నాన్నగారి ఫోటో పెడదాం. మళ్ళీ క్రొత్త ఫ్రెం కొనాల్సిన అవసరం ఉండదు. పాత ఫ్రేంతోనే మనం పని కానిచ్చేద్దాం. ఏమంటారు” అని అన్నాడు పెద్ద కుమారుడు.
నేత్రదానం
ఆ కాలేజి స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఆ వూళ్ళోని ప్రముఖ నేత్ర వైద్యుడు డా. శుక్లాగారిని ఆహ్వానించగా ఆయన వచ్చి తన ఉపన్యాసంలో – “అసలు నేత్రదానానికి ఉన్న గొప్పదనమే వేరు. దీన్ని మించిన దానమే లేదు నిజానికి. మీరంతా మీ మీ పేర్లను నేత్రదానం చేసే పవిత్రమైన కార్యానికి నమోదు చేసుకోండి” అని అన్నాడు.
విద్యార్థులంతా చాలా ఆసక్తిగా ఆయన మాటలు వింటున్నారు. అక్కడే ఉన్న జ్ఞాన్ ఆహుబా తన కుర్చీలో చాలా అసహనంగా అటూ ఇటూ కదలసాగాడు. చివరికి ఉండబట్ట లేక డాక్టర్ గారి మాటలకు అడ్డొస్తూ –“ ఆపండి ఇంక! మీ డాక్టర్లు అందరూ కపటులే. చెప్పాల్సిన నిజానికి కూడా మీరు ఏవేవో చిలవలు – పలవలు కలిపించి చెప్తారు. ఉన్నదొకటైతే మరొకటి చెప్తారు. నాటకీయంగా చెప్తారు. అలా చేసి ఆనందం పొందుతారు. నా చెల్లెలి అంధత్వాన్ని మీలో ఎవ్వరూ పోగొట్టలేకపోయారు. పైగా నేత్రదానం నేత్రదానం అంటూ మాటలు చెప్తాడు. ఇక్కడున్న వాళ్ళంతా మీ మాటల ప్రభావంతో తప్పట్లు కొడతారు, కాని ఎవ్వరూ కూడా నా చెల్లెల్ని గ్రుడ్డితనం పోగొట్టాలనే విషయం గురించే ఆలోచించరు” అని అన్నాడు.
“అంతే! ఆ మాటలకి అక్కడి వాతావరణం మౌనం వహించింది. అంతా తలొంచుకుని ఏం ఆలోచించుకున్నారో ఏమో?” కొన్ని క్షణాలు గడిచాయో లేదో ఆ సభలో ఒక మూల నుండి ఒక చెయ్యి పైకి లేచింది. తరువాత ఇంకో మూలం నుండి మరో చెయ్యి లేచింది పైకి. అంతే!! ఆ హాల్ మొత్తం పైకెత్తిన చేతులతో నిండిపోయింది. అంతా కలిసి ఒకే స్వరంతో మేమంతా జ్ఞాన్ సోదరి నేత్రాలకు చికిత్స చేసి చూపు తిరిగి ఇప్పించాలనుకుంటున్నాను” అని అన్నాడు.
విస్మితుడై జ్ఞాన్ ఆహుజా అలా కూర్చుండి పోయాడు.
నేత్రదానం అంటే ఏమిటో, అతనికి అర్థమైంది. అతని కళ్ళలో కన్నీళ్ళు ఉబికి వచ్చాయి. తన చిన్నారి చెల్లెలు ఇక చూడగలదనే నమ్మకం అతనికి కలిగింది. అంతే! వెంటనే తను కూడా తన చెయ్యెత్తి, “నేను కూడా నా కళ్ళని దానం చేస్తా ఎవరి తల్లిగాని, చెల్లెలుగాని, ఎవరి బంధువైనాగాని చూపు పోగొట్టుకుని ఉంటే వాళ్ళకి నా నేత్రాలు అంకితం చేస్తున్నా” అని అన్నాడు ఆవేశంతో, అందరికీ వినబడేట్టుగా-
కథా పంచకం (చిన్న కథలు)
అనువాద కథలు
మూలం : నరేంద్ర లాహ (హిందీ) అనువాదం : డా॥ లక్ష్మణాచార్యులు, మరింగంటి
1. కారణం
గోపాలరావు వంటి భావుకుడైన రచయిత ఎందుకని ఆత్మహత్య చేసుకున్నాడో, అసలు కారణం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే, తెలుస్తే ఆ కారణం అనేది అతనికే తెలియాలి, లేదా నాకు తెలియాలి లేదా ప్రసిద్ధ ప్రచురణకర్త రూప కిశోర్ గారికి తెలియాలి. బ్యాంక్ లోని ఆయన ఖాతాలో ఒక లక్ష రూపాయల పెద్ద మొత్తం ఉండగా కూడా మరి ఆయనెందుకని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎవ్వరి ఊహకీ అందడం లేదు. ఇదేదో ఆ రచయిత పిచ్చితనమే అనే నిర్ధారణకి వచ్చిన జనం ఈ విషయాన్ని ప్రక్కన పడేశారు.
ఈ సంఘటన మొత్తం నా కళ్ళముందే జరిగింది. నేను రూపకిశోర్ గారి కార్యదర్శిని. గోపాలరావుగారు ఒక రచయితగా గొప్ప పేరు సంపాదించాడు. ఆయన వద్ద డబ్బు లేదు, కాని తను వ్రాసిన సాహిత్యం చాలానే ఉంది. అయితే రూపకిశోర్ గారి ఆఫీసులో ఏదో విషయమే వారిద్దరి మధ్య గొడవ జరిగింది.
“మిమ్మల్ని మీరేమనుకుంటున్నారసలు? డబ్బుకి ప్రతిఫలంగా పనులు కూడా చేయించుకుంటున్నారు కదా! అసలు రచయితే గనక లేకపోతే, ప్రచురణకర్తల భవనాలు నిలబడలేవు” అంటూ గోపాలరావు వాదించాడు.
రూపకిశోర్ ఒక జిత్తులమారి వ్యక్తి కద! మొహంపై నవ్వు పులుముకుంటూ, అప్పుడేర్పడిన పరిస్థితిలో గాంభీర్యతను తేలికగా కొట్టేస్తూ-
“ఆరే! మీరు అలా ఊరికే కోపం తెచ్చుకుంటున్నారు. సరే, మనం ఓ ఒప్పందం చేసుకుందాం. మేము మీరు రాసిన సాహిత్యం అంతా కొనేసి మీకో లక్ష రూపాయలకి చెక్కు ఇస్తాం సరేనా!” అని అన్నాడు.
గోపాలరావు దీన్ని తనకు లభించిన గౌరవంగా భావించాడు. సరే, కోటీశ్వరుడైన రూపకిశోర్ గారి కార్యాలయంలో గోపాలరావు మొత్తం సాహిత్యాన్ని ఆయన ఎదురుగానే తగలబెట్టటం జరిగింది. దీన్ని ఆపాలని కోరుకున్నా, గోపాలరావు దాన్ని నిరోధించలేకపోయాడు. పైగా వెళ్ళిపోతూ ఉండగా – “నీలాంటి చౌకబారు రచయితలు వస్తారు, పోతారు. మా దృష్టిలో నీ సాహిత్యం విలువ ఇంతేనని తెలుసుకోండి” అనే మాటలు ఆయన చెవిలో కూడా పడ్డాయి.
అంతే! అదే రాత్రి గోపాలరావు ఆత్మహత్య చేసుకున్నాడు.
2. వ్యాపారం
ఎందుకోగాని ఆ రాజకీయ నాయకుడి మొహం గంభీరంగా తయారైంది ఎంతో దిగులుగా, దిగాలుపడి, తన ఇంటిపెరట్లో అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. ఏదో పెద్ద సమస్య తనని చుట్టుముట్టినట్టుగా అనిపించింది నాకు.
వెంటనే దగ్గరకు వెళ్ళి సహానుభూతి ప్రదర్శించి, భుజంపై చేయివేసి కారణం ఏమిటని మెల్లగా అడిగా – దానికాయన ఎంతో బాధపడిపోతున్నట్లుగా నాతో ఇలా అన్నాడు –
అవును తమ్ముడూ, చాలా పెద్ద చిక్కే వచ్చిపడింది. ఆర్నెల్లు గడచిపోయాయ్, ఒక్క హర్తాళ్ గాని, ఉద్యమంగాని, గొడవగాని ఏదీ జరగలా? నాకేంటో చాలా బాధగా ఉందోయ్! ఇలాగే ఇంకో నెల గడుస్తుందనుకో. ఇక నా వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుంది” అని అన్నాడు. అంతే, ఆ మాటలు విన్న నా తల గిర్రున తిరిగిపోయింది.
3. ఎంపిక
అతనికి హఠాత్తుగా యమధర్మరాజు దర్శనం అయింది. ఒక్కసారిగా కంగారు పడినా వెంటనే స్థిమితపడి – “అయ్యా! ఏమిటీ అకాల ఆగమనం? నాకేమీ పోయే కాలం రాలేదే!” అని ప్రశ్నించాడు.
“నేనొచ్చింది, నీ కోసం కాదురా మూర్ఖుడా! నీకింకా భూమ్మీద నూకలున్నాయ్ అయినా నీ ఖర్మ ఎప్పుడు, ఎలా కాల్తుందో చెప్పలేను”, అద్సరే! ప్రస్తుతం నీకో పరీక్ష. నీకు అమ్మ కావాలో, భార్య కావాలో, ఇరువురిలో ఎవరు కావాలో, అక్కర్లేదో తేల్చుకో. ఇద్దరిలో ఒక్కరిని ఇవాళ నేను పట్టుకపోవడాని వచ్చాను” అని అన్నాడాయన.
మనవాడు ఒక్క క్షణం ఆలోచించి, అయ్యా! యమ ధర్మరాజా! అలా అయితే మీరు మా అమ్మనే పట్టుకుపోండి. ఆమెతో నాకెలాంటి ప్రయోజనం లేదు. భార్య ఇంకా కొంతకాలం నాకు పనికొస్తుంది. ముందు ముందు ఈమె కూడా పనికి రాకుండాపోతే, అప్పుడు ఈమెను కూడా మీకు నేను అప్పగిస్తా” అని అన్నాడు. అది విన్న యమధర్మరాజు అవాక్కైపోయాడు.
4 . సానుభూతి
శ్రేష్ఠిగారి మరణంతో నగరమంతా శోక సాగరంలో మునిగిపోయింది. ఆయనకెంతో పేరు – ప్రఖ్యాతులుండడం వల్ల ప్రతి ఒక్కరూ అంతిమ దర్శనం చేసుకోడానికని ఆయన ఇంటికి వచ్చి భౌతిక కాయం చుట్టూ చేరారు.
అలా సానుభూతి ప్రకటించి, రెండు కన్నీటి బొట్లు రాల్చడానికి వచ్చినవారిలో నేను కూడా ఉన్నాను. ఆయన పార్థివ శరీరంపై పూలు జల్లి రెండు నిముషాలు మౌనంగా నిలబడి ముందుకు జరిగాను.
ఇంతలో నాకు ఇద్దరి వ్యక్తులం గుసగుసలు స్పష్టంగా వినబడ్డాయి. వారికి నేను వింటున్నట్టు తెలీదు.
“అరే! ఇవాళ మనకి మంచి అవకాశం దొరికిందిరా! ఎంత వీలైతే అంత ఎంత అందితే అంత, నీ ఇష్టం. జనం చాలామందే ఉన్నారు, పనికానిచ్చెయ్! కాని జాగ్రత్త రోయ్!”
ఇంతలో ఇంకో గొంతు వినబడింది –
“మరేం ఇబ్బంది లేదురా! కొన్ని పూలు దోసిళ్ళలో నింపుకుని కొంతసేపు దిగులు, దిగాలు మొహంపైనా…. పులుముకుంటే… మనకిక… డబ్బులే డబ్బులు – ఉదయం నుండి సాయంత్రంవరకు మనం ఆ శవం చుట్టూతా తిరిగే గుంపులో వీలైనన్ని ఎక్కువసార్లు కలసి తిరుగుదాం, మనం పూలు చల్లుకుంటూ నడుద్దాం, అలాగే ‘మన పని’ కానిచ్చేద్దాం. ఓ నాలుగైదు జేబులు అలా… అలా కత్తరించేద్దాం…. కాని ఓ సంగతి మాత్రం మరచిపోకు! మొహం మీద నవ్వనేదే రాకూడదు. అప్పుడప్పుడు కళ్లు తుడుచుకుంటూ ఉందాం. పూలు అలా చల్లుకుంటూ పోదాం…. మనం సానుభూతి, శోకం ప్రకటించేందుకు గద వచ్చింది, ఏమంటావ్….”
అంతే! నా మొహంలో నెత్తురు చుక్కలేదు.
5. హర్తాళ్
అమ్మ అలా నడుస్తూ నడుస్తూ ‘బ్యాట్’ చేత పట్టకుని వంటింట్లోకి విసవిసా వెళ్ళింది.
అమ్మ అలా తన బ్యాట్ తీసుకుని వెళ్ళడం సంజయ్ కంటపడింది. వాడు కంగారు పడ్డాడు. ‘అమ్మా! అంటూ ఆమెని ఆపి, “ఏంటిది? నా బ్యాట్ తో నీకేం పని? ఎందుకలా పట్టుకెళ్తున్నావ్ వంటింట్లోకి?” అని అడిగాడు ఆశ్చర్యంతో.
అమ్మ వాణ్ణి అలా చూస్తూ “మరేం లేదురా? ఇంట్లో వంట చెరకు అయిపోయింది. ఈ బ్యాట్ తోనే ఇవాళ వంట!’’ అంది.
“ఏంటీ! వంటా! నా బ్యాట్ తోనా? ఏంటమ్మా? నీకు నా బ్యాటే దొరికిందా?” అడిగాడు ఆందోళన పడుతూ –
అమ్మ వాడి కళ్ళల్లోకి చూస్తూ – “అరే! నువ్వే కదరా ఇలా చెయ్యడం నేర్పింది? మీ కుర్రాళ్ళంతా హర్తాళ్ తో బస్ తగలబెట్టి మన సంపదని, మన వస్తువుల్ని మనమే తగలబెట్టుకోవాలన్నది నాకు నేర్పారు కదరా?
సంజయ్ కి విషయం అంతా అర్థమైంది. కళ్ళు తెరుచుకున్నాయ్. ఇక నుంచి ‘దేశానికి’ నష్టం కలిగించే ఏ పనీ చెయ్యను చెయ్యనివ్వనని నిర్ణయం తీసుకున్నాడు.
కథా పంచకం (చిన్న కథలు)
అనువాద కథలు
మూలం : నరేంద్ర లాహ (హిందీ) అనువాదం : డా॥ లక్ష్మణాచార్యులు, మరింగంటి
- దొరికితేనే దొంగలు
ఓ పెద్ద మనిషి తన కొడుకుని పిలచి ‘హితోపదేశం’ చేస్తూ ` ఒరేయ్! జీవితంలో ఏదైనా సాధించి గొప్పవాడివి కావడానికి ప్రయత్నించు. అవిగో! ఆ భవనాలు చూసావా? వాటి యజమానుల్లా నువ్వు కూడా ఏదో ఒకటి చేసి గొప్పవాడివి అవ్వు. సరేనా?’’ అని అడిగాడు.
ఆ కొడుకు తన జులపాల జుట్టు పైకెగరేస్తూ ` ఏం చేయమంటావ్?’’ అని అడిగాడు మెల్లగా.
ఆ పెద్దమనిషి వేదాంత ధోరణిలో ` ‘‘కష్టపడు. వీళ్ళంతా రేయింబవళ్ళు కష్టపడ్డారు. ఆఖరి చెమట చుక్కనూ కార్చి, శ్రమచేయడం వల్లనే అంత పెద్ద పెద్ద భవనాలు నిర్మించగలిగారు. నువ్వూ అలాగే కష్టించి పనిచేసి, పెద్ద ఇల్లు ఒకటి నిర్మించు. దానిలో నివసిస్తున్నట్టుగా కలకంటూ ఉండు’’ అని అన్నాడు.
ఆ కొడుకు ఏదో ఆలోచిస్తూ దృఢస్వరంతో ` ‘‘అలాగే నాన్నా!’’ అని అన్నాడు.
అదే రాత్రి ఆ కుర్రాడు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. పోలీసులు వాణ్ణి పట్టుకొని జైల్లో పెట్టారు.
ఈ సంగతి తెలిసి, ఆ పెద్ద మనిషి కంగారుగా వచ్చి పలకరించాడు. ‘‘నాన్నా! నేనైతే సరైన మార్గమే ఎంచుకున్నా కాని నాటైం బాగా లేదు. పట్టుబడి పోయా పెద్ద పెద్ద భవనాల్లో ఉండే బడా బాబులు కూడా ఇదే మార్గం పడతారు. దొరకనివాళ్ళు పెద్ద పెద్ద భవనాల్లో ఉంటే, దొరికినవాళ్లిలా ఊచల వెనక ఉంటారు. దొరికితే దొంగ దొరక్కపోతే దొర! అంతే!!
- మసాలా
శ్రీ బాబూలాల్గారు నగరానికి చెందిన పెద్ద విమర్శకుల్లో ఒకరు. ఏ అంశమైనా, ఏ సమస్య ఎదురైనా దాన్ని విమర్శిచడంలో వెనుకాడడు. తప్పులు పట్టడంలో ఎవరైనా సరే, ఆయన తర్వాతే.
ఈ మధ్యనే జరిగిన ఒక సంగతి తీసుకుందాం. ఓ రోజు బాబూలాల్గారు తన ఇంటివరండాలో కూర్చుని తీరికగా ‘టీ’ త్రాగుతూ ఉన్నారు. వారితోబాటుగా ఇంకొంతమంది ఇలాంటి విమర్శకులు అక్కడ కూర్చొని ఉన్నారు.
ఇంతలో పక్కింటి హరిగారు అటుగా వచ్చారు పాపం! ఏదో పోగొట్టుకున్నట్టుగా చాలా ఆందోళనగా, విచారంగా ఉన్నారు. మన బాబుగారు ఆయన్ని గమనించి ` ‘ఏమైంది! హరిగారూ? ఏంటలా ఉన్నారు?’ అడిగారు ఆదుర్దాగా.
హరిగారు ఒక్క క్షణం ఆగి, ఆయన ఆదుర్దా పడుతూనే ` ‘ఏం చెప్పమంటారు బాబుగారూ! ఇందాక అలా బజారుకు వెళ్ళా. అక్కడ నా సైకిల్ని దొంగలెత్తుకుపోయారు’’ అని అన్నారు.
ఇంకేముంది? మన బాబుగారికి ‘మసాలా’ దొరికింది. ఆయనలోని విమర్శకుడు నిద్రలేచాడు ` ‘‘ఏమిటో! ఈ మధ్య మనుషుల్లో హడావుడి, నిర్లక్ష్యం, అజాగ్రత్తలు ఎక్కువైపోయినయ్. అసలు బజార్లో సైకిల్ ఎక్కడ పెట్టాలో, ఎక్కడ పెట్టగూడదో తెలీదు. పైగా సైకిల్కి తాళం కూడా వేయరు’’ అని అక్షింతల జల్లు కురిపించాడు. ఆయనేమన్నా అనుకుంటాడేమోనని హరిగారు అలాగే తలొంచుకుని నిలబడ్డాడు.
ఇంతలో ఆ దేవుడు ఆయన బాధ గమనించినట్టున్నాడు. ఇంట్లోంచి బాబుగారి శ్రీమతి గట్టిగా అరిచింది `
‘‘ఇదిగో! అలా బజారుకెళ్ళి కొంచెం కూరగాయలు తీసుకురండి’’ అని అన్నది.
బాబుగారు తన సుపుత్రుణ్ణి చూచి ` అరే! బాబూ! కొంచెం వెళ్ళి నా సైకిల్ తీసుకురా!’’ అని అన్నారు.
ఐదు నిముషాలు గడిచాక, ఆయన కుమారుడు పరిగెత్తుకుంటూ వచ్చి, కంగారుగా ` ‘‘నాన్నగారూ! మన సైకిల్ ఇంట్లో కనబడడం లేదు. మీరు సరిగ్గా తాళం వేసినట్టు లేదు. ఎవడో దొంగ వచ్చి ఎత్తుకపోయాడు.’’
- పాపం! బ్రహ్మానందం!
బ్రహ్మానందానికి చాలాకాలం తర్వాత బస్సు ప్రయాణం చేసే అవకాశం వచ్చింది. పాపం! దురదృష్టవశాత్తూ మళ్ళీ మధ్యలోనే సీటు దొరికింది. కిటికీ ప్రక్క రెండు సీట్లు మాత్రమే ఉండే అదృష్టం మాత్రం ఎప్పట్నించో దొరకడం లేదు. తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ తన సీట్లో కెళ్ళి కూర్చున్నాడాయన.
‘‘హు! ఏమిటీ! ఆ దేవుడికెందుకో నా మీద కోపం. బెండకాయలా తాను ముదిరిపోతున్నా జీవితయాత్రలో తనకెలాగూ ఒకతోడు ఇవ్వలేదు. ఇక బస్సులోనూ ‘మంచితోడు’ ప్రక్కనే కూర్చునే అదృష్టమూ కలిగించడం లేదు’’ అని అనుకున్నాడు దిగులుగా, దిగాలుగా బ్రహ్మానందం అలా గొణుక్కుంటూనే ఉండగా… ఎప్పుడు పట్టిందో…. అలా నిద్రపట్టింది. పూర్తిగా నిద్రలో కూరుకుపోకముందే….
‘‘నేనిక్కడ కూర్చోవచ్చా?’’ అన్న ఓ మధురమైన స్వరం వినబడగానే దిగ్గున లేచి కూర్చున్నాడు బ్రహ్మానందం.
తనేదో అప్సరసల లోకంలో ఉన్నట్టుగా అనిపించిందతనికి చప్పన కళ్ళు తెరచి చూచాడు.అలా అతన్ని అడిగిన మహిళ గొప్ప అందగత్తె అయితే కాకపోయినా బ్రహ్మానందానికైతే ఎంతో అందంగా కనబడిరది. జీవిత సహచరి కోసం తన అన్వేషణ ఈ బస్సు ప్రయాణంవల్ల పూర్తి అయినట్టనిపించింది. ఉబ్బితబ్బిబ్బై….
అరె… ఎందుక్కూచోకూడదు? ఇది మీ కోసమే…. రండి…. తప్పక కూర్చోండి’’ అని అన్నాడు.
బ్రహ్మానందం ప్రక్కన సీటు ఖాళీగా ఉంది. ఏ కారణంచేతనో దాన్ని రిజర్వ్ చేసుకున్నవాడు రాలేదు.
ఆ మహిళ ఆ సీట్లో కూర్చుని ‘హమ్మయ్య’ అని అనుకుంది.
‘అవునూ! ఎక్కడిదాకా మీ ప్రయాణం మేడం?’ అడిగాడు మన బ్రహ్మానందం.
‘గుంటూరు’ సర్!’’
‘అరె, ఎంత ఆశ్చర్యం!! నేనూ గుంటూరుకే వెళ్తున్నా!!’
నిజానికి బ్రహ్మానందం వెళ్ళాల్సింది అక్కడికి కాదు, ఇంకా పై ఊరికి.
మెల్లమెల్లగా మనవాడు ఆమెను మాటల్లోకి దింపి, తనను పరిచయం చేసుకుంటూ… ‘‘నా పేరు ఆనందం, బ్రహ్మానందం. మీరు నన్ను బ్రహ్మ లేదా ఆనంద్ అని కూడా పిలవవచ్చు.
‘బై ద బై మీ పేరు?’ అడిగాడు బ్రహ్మానందం.
‘సార్! నా పేరు మోహిని. కాని మీ పేరులా రెండు ముక్కలు చేసి, ఏదో ఒక ముక్కతో మాత్రం పిలవకండి’’.
బ్రహ్మానందం బ్రహ్మాండంగా నవ్వాడు, పడి పడి నవ్వాడు. పరిచయం పెరిగింది. ఆమె చనువుతో మాటలు కొనసాగించింది. బ్రహ్మానందం మనసు గాలిలో తేలిపోసాగింది. తన జీవన సహచరి ఇక ఈమేనని అనిపించింది. అంతే, గాల్లో తేలిపోసాగాడు. తనకో చిన్న, అందమైన ఇల్లు, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు…ఇలా, ఇలా…నా పేరు ప్రక్క ఆమె పేరు ఎంతో ‘మ్యాచ్’ కూడా అయింది.
బస్సు ఒక్క ఉదుటున ఆగింది. మనవాడి ఊహల దారం పుటుక్కున తెగింది.
శ్రీమతి మోహిని తీయని స్వరంతో `
‘గుంటూరు వచ్చేసిందన్నయ్యా! మీరేంటి? దిగదల్చుకోలేదా? నేనైతే దిగిపోతున్నా. ‘మా వారు’ క్రింద నా కోసం వెయిట్ చేస్తున్నారు. బై బై…’’
- దయచేసి వెళ్ళిపోండి!
ఆ దుర్ఘటన అందరి గుండెల్నీ పిండేసింది. అలాంటి ప్రమాదాన్ని బహుశా ఎవ్వరూ ఇంతకముందు చూసి ఉండరు. ఒక అరవై సంవత్సరాల మహిళ కారు ప్రమాదంలో తన ప్రాణాలు కోల్పోయింది.
మల్లయ్య సేఠ్గారి పుత్ర రత్నం దుందుడుకు స్వభావి. తన కారు అత్యంత వేగంగా నడుపుతాడని పేరు. ఆ రోజు కూడా అలాగే జరిగింది. వాడి వేగానికి ఆ వృద్ధ మహిళ బలైపోయింది.
ఆ సమయంలో అక్కడికి చేరినవారిలో ఆవేశం కట్టలు తెంచుకున్నా, సేఠ్గారి కుమారుడి కారుని ఎవరూ ఆపలేకపోయారు. వాడు కారు ఆపకుండా అలాగే వెళ్ళిపోయాడు. వాళ్ళందరికీ వాడిల్లు తెలుసు కాబట్టి అంతా వెళ్ళి ఆ ఇంటి బయట గుమికూడి సేఠ్ కొడుక్కి వ్యతిరేకంగా నినాదాలు చేయసాగారు.
అక్కడ వరండాలో సేఠ్గారు తన గుమాస్తాతో ఏవో లెక్క పద్దుల గురించి చర్చిస్తున్నారు. ప్రజల గుంపు అక్కడికి వచ్చింది. అందరికన్నా ముందున్న యువకుడి రెండు చేతుల్లో ఆ వృద్ధురాలి శవం ఉంది.
‘‘చూడండి సేఠ్! మీ కొడుకు నిర్వాకం! అతి వేగంగా వచ్చి ఈ వృద్ధురాలిని పొట్టన పెట్టుకున్నాడు’’ అని అన్నాడతను.
ఆ గొడవేదో చూడమని సేఠ్ ఇంట్లోకి గబగబా వెళ్ళిపోగా, ఆ గుమాస్తా బయటకొచ్చి, ఆ వృద్దురాలి శవాన్ని చూసాడు. చూసి అవాక్కైపోయాడు. ఇంతకీ ఆమె అతని భార్యే. ఆయన ఒక్క క్షణం ఆలోచించాడు. ఏమనుకున్నాడో ఏమో… ఆ గుంపులోని వారిని చూస్తూ `
‘‘చూడండి! ఈ విషయంలో మీరెవరూ సేఠ్ని ఏమీ అనొద్దు. ఏమన్నా అన్నారో నా మీదొట్టే. ఎందుకంటే మీరు గట్టిగా పోట్లాడిన మరుక్షణమే నా ఉద్యోగం కాస్తా ఊడిపోతుంది. ఈ ముసలితనంలో నేను తిండిలేక మలమల మాడిపోతాను. పైగా నాకు పెళ్లికాని ముగ్గురమ్మాయిలున్నారు. ప్రమాదంలో చనిపోయినామె నా భార్యే. కాని ఈ విషయంలో నేను ఈ వయసులో సేఠ్తో గొడవపడి, నన్ను, నా కుటుంబ సభ్యుల్ని ఎందుకు బాధ పెట్టాలి? మీ అందరికీ ఓ నమస్కారం. దయచేసి వెళ్ళిపోండి.’’
- అవసరార్థం
డాక్టర్ రఘుకి ఇవాళ తప్పనిసరై కార్లో రాంగ్సైడ్లో వెళ్ళాల్సి వచ్చింది. కారణం ఒకరోగి పరిస్థితి చాలా విషమించింది. ఆ రోగి ఇల్లు రోడ్కి అటు ప్రక్కన ఉంది. సరైన దారిలో వెళ్తే గనక అరగంట కన్నా ఎక్కువ సమయమే పడుతుంది.
ఇంతలో ఆయన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపేసాడు. కాని అంత తేలికగా కూడా వెంటనే వదిలేసాడు ఓ శాల్యూట్ కొట్టి. పైగా, అతన్ని ఎందుకలా వదిలేసావ్? అని అడిగిన వ్యక్తితో ` ‘‘చూడు! డాక్టర్ అంటే నడిచే దేవుడు’’ అని డాక్టరు రఘుతో కూడా ‘‘మీరు దైవ స్వరూపం సార్! మీరు చెప్పే కారణం తప్పక నిజమే అయి ఉంటుంది’’ అని ఆయనకూ విష్ చేసాడు.
తర్వాత డాక్టర్ రఘుకి దగ్గరగా వచ్చి మెల్లగా ` ‘‘డాక్టర్! మా అబ్బాయికి ట్రీట్మెంట్ మీ హాస్పిటల్లోనే మీ పర్యవేక్షణలోనే జరుగుతున్నది. కొంచెం వాడిమీద శ్రద్ధ పెట్టండి’’! అని అన్నాడు.
ఇది జరిగిన ఏడు రోజుల తర్వాత కూడా తిరిగి ఇలాగే జరిగింది. డాక్టర్ రఘు మళ్ళీ రాంగ్సైడ్లో డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. అదే ట్రాఫిక్ పోలీసు ఆయన్ని మళ్ళీ పట్టుకున్నాడు. అయితే ఈసారి మాత్రం ఆయన డాక్టర్గారిని వదల్లేదు. డాక్టర్గారిపై చలానా వేసాడు.
‘‘ఆ రోజు సంగతి వేరు. మా అబాయి మీ ‘కేర్’లో ఉన్నాడు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. మావాడు వేరొక డాక్టర్గారి ‘కేర్’లో ఉన్నాడు. ఇప్పుడిక మీతో నాకేంటి అవసరం? నేను మీకెందుకు సేవ చేస్తాను సార్!’’ అని లౌక్యంగా అన్నాడు.