తరుణి యూట్యూబ్ చానెల్ ను చూడండి, మీరు తప్పకుండా నచ్చుతారు. తొలి ప్రయత్నం ఇది . మీ సహకారం అందించండి. ఈ చానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . లైక్ చేయండి, షేర్ చేయండి !థాంక్యూ – డాక్టర్ కొండపల్లి నీహారిణి, కవయిత్రి, రచయిత్రి, సాహిత్య విమర్శకులు, మయూఖ అంతర్జాల పత్రిక,
తరుణి పత్రిక ల వ్యవస్థాపకులు, సంపాదకులు .
mayuukha
దట్టమైన మబ్బులు పరుచుకున్నాయి. చిరుజల్లు వానకురుస్తుంది చిరుజల్లుల్లో తడిసిన నేలతల్లి తన పరిమాళన్ని గాలి ద్వారా లోకంలో వెదజల్లుతుంది. వర్షం నీటిలో తడిసిన చెట్లు, ఆకులు పువ్వులు ఆనందంలో ఒకకొమ్మ పై మరోకొమ్మ వంగి గుసగుసలాడుతుంటే పుష్పాలు తమ మకరందమును పంచుతూ ఆనందడోలికల్లో తెలియాడుతున్నాయి. అంతలోనే పెద్ద ఉరుము ఆ వెంటనే మెరుపులు ఒక్కసారి వాతవరణమును భయకపితులను చేసింది. వీది దీపాలు వస్తూ పోతున్నాయి. సరిగ్గా అదే సమయంలో ఓ ఆటోరిక్షా కిర్రుమంటు శబ్ధం చేసుకుంటు గాంధీ బొమ్మ వద్దకు వచ్చి ఆగింది. ఆటు, ఇటు చూసి అందులోని మనుష్యులు వెనుదిరిగిపోయారు. వారు వెళ్ళి తరువాత జల్లువాన కాస్త జడివానగా మారింది. ఆమసక వెలుతురులో ఎదో నీడ కన్పిపించింది. మూడుకాళ్ళ (చేతికర్ర)ను అసరచేసుకొని అడుగులో అడుగువేసుకుంటు నెమ్మదిగా గాంధీ బొమ్మ వద్దకు చేరుకుంది. పైన కాస్త కప్పు ఉండటము వల్ల తడిసిన చీర చెంగును పర్చుకొని తన చేతులనే తలగడగా చేసుకొని, కాళ్ళు కడుపులోకి ముడ్చుకొని గాంధీ తాత వైపుచూడసాగింది. మహత్మ ఏమిటి ఈ కాలం? నీవు కోరుకున్న ఆహింస సమాజం? ఎక్కడ? ధర్మ నమసిపోతుంది. “ఏది జీవితం, ఏది మృత్యువు, ఏది నరకం”. అని ఆనాడు శ్రీశ్రీమహకవి అన్నారు “మాయమవుతున్నాడమ్మ మనిషన్నవాడు” అని నేటికాలంలో అందెశ్రీ గారు పాట రాశాడు. ఈనాటి నాస్థితి మరణమా! నరకమా, మృత్యువా తెలియకుంది బాపు నీవు మళ్లీ జన్మిస్తావా! మాలాంటి వాళ్ళు ఎందరో వున్నారు. వారికి జీవన విముక్తినైన ఇవ్వు, లేదా జీవనరక్షణనైనా ఇవ్వు కానీ ‘అంపశమ్య బ్రతుకులు బ్రతకలేకున్నాము. మానవుడు రాకెట్ ప్రయోగము చేస్తున్నాడు. ఖగోళ పరిశోధనలు చేస్తున్నారు. కాని కన్నవారి ఆత్మఘోష పరిశోధన చేయడం లేదు. నీవు ఎవరిలోనైన పరకాయ ప్రవేశం చేసి మాలాంటి వారికి ఆత్మశాంతి కల్గించు అంటు మౌనంగా కళ్ళ నుండి నీరు ధారపాతంగా ప్రవాహిస్తు ఉండగా మగతగా కళ్ళు మూతలు పడిపోయాయి.
బళ్ళున తెల్లవారింది గాంధి బొమ్మ దగ్గర పిల్ల పెద్ద, ముసలి అందరు గుమిగూడరు ఎదో అలజడిగా, అందోళనగా వుంది. నాకు మెలకువ వచ్చింది. రాత్రి కలలోని నుండి బయటకు రాలేదు. కాని ఎదురుగా గుంపు దగ్గరకు పోయి చూశాను నేను రాత్రి కలలో చూచిన హృదయ విచారకర దృశ్యం సాక్షాత్తుగా నాఎదుట ఉంది. అందరు తలో మాట అంటున్నారు అసలు ‘ఉపిరి’ వుందా! లేదా? అనే ‘సందేహం’ నేను దగ్గరికి వెళ్ళెలోపే వేరే వారు నాడీ పరిక్ష, శ్వాస చూసి బ్రతికె ఉందని ఋజువు చేశారు. అక్కడ చేరిన వారిలో సగం మంది వెళ్ళిపోయారు. మిగతవారు తమ ఇళ్ళల్లోకి వెళ్ళి ఒకరు నీళ్ళు తెచ్చి ముఖం పై చల్లీ త్రాగించారు. నేను వేడిగా పాలు తీసుకునిపోయి త్రాగించాను. అవ్వ కాస్త కోలుకున్నది. కానీ ఆమె బట్టలు అన్ని తడిసి పోయి ఉన్నాయి. మరో తల్లి పొడి బట్టలు తెచ్చింది. కట్టించాము. మాకు సూర్యకిరణాల నులివెచ్చధనము తోడునిల్చింది దాంతో అవ్వది మంచి జుట్టు ఆ జుట్టుకాస్త సరిచేసి పైకి ముడిచి పెట్టాము. పర్వాలేదు అసరా ఇస్తే కూర్చుంది. నీ పేరు ఏంటి? అవ్వ అని అడిగాము చెప్పటానికి కాస్త తటపటాయించింది. కాసేపటికి “రాజమ్మ” అని చెప్పింది. ఇంక వివరాలు అడిగితె చెప్పటానికి నిరాకరించింది. మేము బలవంతం చేయ చేయలేదు. నా ఫ్రెండ్ డా|| రామిరెడ్డి గారికి ఫోన్ చేసింది. డాక్టరు గారు వచ్చి ‘ఉలన్ కంబలి కప్పి’ బలానికి టానిక్ ఇచ్చి వెళ్ళారు. కాసేపటికి అవ్వకు బోజనం పెట్టి టానిక్ ఇచ్చి పడుకోబెట్టాము. రాత్రికి పగలుకు ఎంత తేడానో అవ్వకూడ అదే తేడాతో మనస్సులో మదనపడ్తునే వుంది. గతం తాలుకు వైభవం తన సంతానం, వారి వృద్ధి ఆనంద, తన భాగస్వామి సహచర్యం అన్ని కళ్ళముందు కదలాడుతున్నట్లున్నాయి. కళ్ళు మూసుకొనే వున్నాయి కాని కంటి కొనలనుండి నీరు కారిపోతుంది. అది గమనించి మేము అవ్వను కాసేపు ఒంటరిగానే ఒదిలేశాము.
సాయంకాలం వేళ పిల్లలు అందరు స్కూల్ వదలగానే గాంధీ బొమ్మ దగ్గర చేరి ఆడుకుంటారు కాని ఆరోజు వారు అవ్వనుచూసి కాస్త బెరుకుగానే వున్నారు. ఇంతలో చింటూ గాడు దగ్గరకు పోయి అవ్వ మాతో ఆడుకుంటావా. చాక్లెట్ ఇస్తాను అన్నాడు. అవ్వ మోహంలో ఎదో తెలియని వెలుగు కన్పిపించింది. చాక్లెట్ తీసుకొని చింటూగాడి నోట్లోపెడ్తూ నాకు పళ్ళులేవు నాయన నీవే తిను అంది. అయితే ఐస్క్రీమ్ తింటావా అంటు నానిగాడు వచ్చాడు. అవ్వనవ్వుతు వారించింది. అలా కాసేపు పిల్లలు అవ్వతో గడిపి ఎవరి ఇండ్లకు వారు వెళ్ళి పోయారు. ‘టీగ్లాస్’ తీసుకొని నేను అవ్వ దగ్గరకు పోయి గ్లాసు నోటికి అందించా ఎంతో కృతఘ్నత భావంతో నావైపు చూస్తు ‘టీ’ తాగింది అవ్వ. అవ్వతాత పేరు చెప్పు అన్నాను. అవ్వ సిగ్గుపడి పోయి కాసేపు ఆగి “రామచంద్రయ్య” అని చెప్పింది. ఇంక నెమ్మదిగా వివరాల్లోకి వెళ్లాను. ఎక్కడినుండి వచ్చావు నీవు నీకు ఎవరు లేరా! అని అడిగినాను. ఓక్షణం మౌనం రాజ్యమేలింది. నెమ్మదిగా తనకు ఓకొడుకు, కూతురు ఉన్నారని, ఈ మధ్యనే తనకొడుకు చనిపోయాడని అతనికి నల్గురు కూతుళ్లు అని, తన కూతురు మరో ఊరిలో స్థిరపడిందని చెప్పింది కళ్ళ నీళ్ళతో. ఇంక వివరాలు అడిగితే రెండు చేతులు జోడించి దండం పెడ్తూ అడగవద్దని వారికి చెడ్డ పేరు వద్దని వారించింది. దాదాపు 90సంవత్సరాల వయస్సులో వున్న ఆతల్లి మనసా, వాంచ తన వారి కుటుంబ క్షేమంనే కోరుతుంది. తప్ప మరో ఆలోచనలేదు. అదేకాబోలు తల్లిప్రేమ భూమాతలా ఎన్నితప్పులు చేసిన క్షమిస్తుంది. ఇక్కడికి ఎలా వచ్చావంటే దాదాపు 40కీ, లో మీటర్లు నడిచి వచ్చానని చెప్పింది. ఆమాట విన్న ప్రతి హృదయం చలించిపోయింది. ఒకరి మెహలు ఒకరు చూసుకుంటు అవ్వ ద్గర ఉన్న వాకింగ్ స్టాండ్ అది కూడ చాలపాతది దాంతో ఇంత దూరం తలుచుకుంటేనేమైండ్ ఓక్షణం పనిచేయడం మానేసింది. అవ్వకు రాత్రి బోజనం ఏర్పాటు చేసినాము. ఎవరింట్లోనైనా వుండు రమ్మని అడిగాము అవ్వ ఓప్పుకోలేదు. దాంతో పడకకు కావలసి ఏర్పాట్లు కూడా చేశాము.
ఇంటికొచ్చి పడుకున్నాను పైనా ఫ్యాన్ తిరుగుతుంది. నాలో ఆలోచనలు కూడ అంతే స్వీడ్గా తిరుగుతున్నాయి. స్త్రీ జన్మఇంతేనా లేక మానవజన్మనే ఇంతనా. ముసలి తనం వరమా! శాపమా! యవ్వనము బాధ్యతలతో గడిచిపోతుంది. బాల్యము చదువుతో, నడివయస్సు నల్లేరు మీద బండి అయితే ముసలి తన అంపశయ్య మీద ఎదురు చూపులా! ఎంటి ఈసృష్టి దీనికి పరిష్కరము లేదా లాంటి ఎన్నో ఆలోచనలు మనస్సు నిండా తేనేటిగల్లా ముసురుకున్నాయి. ఆలోచనల్తో ఎపుడు నిద్రపోయానో నాకే తెలియదు. ఫోన్ మ్రోగుతుంది ఎక్కడో లీలాగా విన్పిస్తుంది నిద్రమత్తు వీడలేదు అదే పనిగా సెల్ఫోన్ మోగుతూనె వుంది దాంతో మెలకువలోకి వచ్చి ఫోన్ ఆన్ చేసి మాట్లాడిన రాత్రి ఎవరో ఇద్దరు మనుష్యులు వచ్చి అవ్వను కొట్టపోయారంట దారిన పోతున్న వారు చూసి వాళ్లను పట్టుకొని పోలీసులకు అప్పగింస్తానంటే అవ్వ ఓప్పుకోలేదట ఇంతలో వారు పారిపోయారంటా నా ఫ్రెండ్ చెప్పిన విషయం. అప్పుడు అర్థం అయింది అవ్వను ఎవరో కాదు తన కుటుంబ సభ్యులే ఇలా చేస్తున్నరని అయిన అవ్వ వారిని క్షమిస్తుంది. ఎందుకు తన మనవారాళ్ళ కోసమా! తన కన్నపేగు దూరం అయిన తన వారసులైన క్షేమంగా వుండలని కాబోలు ఏదిఏమైన అవ్వగతం తెలుసుకోవాలని దాన్ని గూర్చి ఆలోచన చేశాను.
అవ్వ పుట్టింటివాళ్ల ఓరకంగా ధనవంతులే అమెకు పసుపుకుంకువ కింద కాస్తపొలం ఇచ్చారు. ఒకతె కూతురు కావడం వల్ల ఓ బంగళా కూడ ఇచ్చారు. దాంతో ఆ ఇంట్లోనే తను తన భర్తతో కల్సి కాపురం చేశారు. పిల్లలు లేకపోవడంతో ఒక అబ్బాయిని తెచ్చుకొని పెంచుకుంది. అతనికి రాఘవ అని పేరుపెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న సమయంలోనే రాజవ్వకు ఓ కూతురు జన్మినించింది. ఇద్దరిని రెండు కళ్ళగా భావించి వారి బావితరానికి చక్కటి బాటలు వేయాలని రాజవ్వ, రామచంద్రయ్య దంపతులు ఎన్నో కలలు కనడమే కాకుండా వాటిని అచరణలో పెట్టడానికి సాయశక్తులు కృషి చేశారు. వారి ఆశలకు తగ్గట్టుగానే రాఘవ, రమ్య ఇద్దరు చక్కని రూపం, తెలివితో చదువులోను ముందుండేవారు. ఒకసారి రాఘవకు విపరీతమైన జ్వరం వచ్చింది. పరిస్థితి ఆందోళనకరంగా మారగ డాక్టర్ గారు భగవంతునిపై భారం వేశారు. ఆసమయంలో రాజమ్వ తనకులదైవం అయిన అమ్మవార్ని పూజిస్తూ మోకాలిపైనా 108 ప్రదక్షణాలు చేసింది. మోకాళ్ల నుండి రక్తం కారుతున్న లెక్క చేయలేదు. ఉపవాసాలు, దీక్షలుచేసింది. ఇలా ఓవారం రోజుల పూజలానంతరం, డాక్టర్లు వైద్య ఫలితంమో రాఘవ కళ్ళుతెరచి అమ్మ! ఆకలి అన్నాడు. పట్టరాని సంతోషంతో రాజవ్వ వేడి వేడి అన్నం తినిపించింది. అలా కొడుకు కడుపు నిండా తిటుంటే రాజవ్వ పడిన కష్టం, తన ఆకలి మర్చిపోయింది. రాజవ్వ కొడుకును ఒళ్ళో పడుకో పెట్టుకొని దేవుని కథలు, చందమామకథలు చెప్పసాగింది. వాడికి ఇష్టమైన అన్ని వండి పెడుతుంది. ప్రతిరోజు ఒక్కోరకంగా వారం పది రోజుల్లో వాడుమాములు మనిషైయ్యాడు. ఎవరు కన్నబిడ్డ అయినప్పటికి రాఘవ తనబిడ్డ అనుకుంది. ఎందుకంటే రాఘవ మూసినకన్ను తెరవకుండ జ్వరంతో పడివున్న రోజుల్లో డాక్టరు గారు రక్తం కావాలి రాఘవకు రక్తంలేదు అన్నారు. ముందు వెనుక ఆలోచిచంకుండ రాజవ్వ తన రక్తం ఎంత కావలన్న తీసుకొండి కాని నా రాఘవ బ్రతకాలి వాడు లేకుంటే నేను బ్రతకలేను అని బోరున ఏడ్చింది. అలాంటి సందర్భంలో రాజవ్వ తన రక్తం రాఘవకు పంచి నిజంగానే కన్నతల్లి అయింది. ఇపుడు రాఘవ సంపూర్ణంగా రాజవ్వ కొడుకు ఆనాటి నుండి రాఘవకు కూడ ఎలాంటి అనారోగ్యం కల్గులేదు. తన ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా చూస్తూ జీవనం సాగిస్తున్న రాజవ్వ భర్త పొరుగు వూళ్లో వ్యాపారం బాగా సాగితే కొన్నాళ్ళ వరకు ఇంటికే రారు. వ్యాపారం తక్కువ ఉన్నప్పుడు ఇంటికి వచ్చి రాజవ్వతోను, పిల్లలతోను సంతోషంగా ఉండేవాడు. రాజవ్వ ఏరంగుచీర కట్టుకుంటే ఎంత అందంగా ఆనందంగా వుంటుందో రామచంద్రయ్యకు బాగా తెల్సు. దానికి తోడు మెడలో కాసుల పేరు, తలలో మల్లెపూవ్వులు, చేతి నిండా గాజులు, పెద్ద కుంకుమబొట్టు, కళ్లకు కాటుకతో చూడగానే చేతెలెత్తిమెక్కెలానే వినయంగల రూపం రాజవ్వది. చుట్టు ప్రక్కల వారికి ఎంతో గౌరవం అభిమానం కూడ, గిట్టనివారికి రాజవ్వ ఆత్మాభిమానం గర్వంగా కన్పిస్తుంది. కాని సున్నితమైన మనస్సు తన కోసం తాను ఏనాడు ఆలోచించుకోదు. అడిగిన వారికి లేదనకుంటా తన చేతనైన సహాయం చేస్తూ తనపని తాను చేసుకుంటూ జీవనం గడిపేది. ఇలా కొంత కాలానికి రాఘవకు యుక్త వయస్సుతో పాటు ఉద్యోగము వచ్చింది. రమ్యకు కూడా పెండ్లి చేయాల్సిన సమయం వచ్చింది. అందమైన చదువకున్న రమ్యకు తగిన వరుడ్ని చూసి కాస్త ధనవంతుల ఇంటికోడలిగా చేసింది. ఇంక మిగిలింది రాఘవ.
ఓరోజు రామచంద్రయ్య రాఘవ పెండ్లి ప్రస్తవం తెచ్చారు. రాఘవ! చెల్లి పెండ్లి అయింది. ఇంక నీకు కూడ పెండ్లిచేస్తే మా బాధ్యత తీరుతుంది. మాకు కూడ వయస్సు మీదపడ్తుంది అన్నారు. అప్పటి వరకు అమాయకంగా అమ్మచాటు పిల్లాడిలా వుండే రాఘవ పెండ్లిమాటలు వచ్చే సరికి ఎలాంటి సంకోచము లేకుండ, నాన్న నేను క్లాస్ ఎపుడు ఫస్ట్ గా వుండేవాన్ని మీకు తెస్సు కదా. నాతోపాటు టాప్ ర్యాంకర్గా ఓ అమ్మాయి అదే ధరణి నాన్న మేము ఇద్దరము పెండ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము అన్నారు. ఆమాటలు విన్న శ్రీమతిశ్రీ రామచంద్రయ్య గార్లు విస్తుపోయారు ఇంతకాలం ఎందుకు చెప్పలేదు అన్నారు. సందర్భం రాలేదు కదా నాన్నగారు. ఇప్పుడు మీరు పెండ్లి విషయాలు మాట్లాడుతుంటే చెప్పలనిపించింది అన్నాడు. ఈ దంపతులు ఒకరిమోహలు ఒకరు చూసుకుంటు చేసేది ఏమి లేదు అనుకున్నారు కాబోలు రాఘవ ఇష్టప్రకారమే ధరణితో వివాహం జరిపారు. అంత సవ్యంగానే జరుగుతుంది. రాఘవ, ధరణి మంచిజీతం గల ఉద్యోగస్తులు అయ్యి ఇద్దరు సంపాదన పరులైయ్యారు.
రమ్యకు ఇద్దరు పిల్లలు వారు తమ సంసారంలో సుఖంగానే వున్నారు. రాఘవకు ఇద్దరు అమ్మాయిలు మూడో కాన్పు దగ్గరకు వస్తుంది. ఇసారైన ఫ్యామిలి ఫ్లానింగ్ చేసుకోమని రామచంద్రయ్య తనకొడుకుకు సలహా ఇచ్చారు కాని ధరణి తల్లి అందుకు ససేమిరా ఓప్పుకోలేదు “పున్నమనరకము” నుండి కాపాడె కొడుకు లేకుండ ఎలామరో సారి చూద్దాము అంటు రామచంద్రయ్య మాటలను త్రోసి పుచ్చింది. నల్గువ సారి కూడ అమ్మాయే ఇలా నల్గురు అమ్మాయిలకు తండ్రిగా రాఘవ. అమ్మ వార్లు అందరు తమ ఇంట్లోనే వున్నారని రాజవ్వ సంబరపడిపోతు వారి కోసం పొదుపు చేయటం మొదలు పెట్టింది. తన పుట్టింటి వారు ఇచ్చిన పొలం, ఇల్లు చాలా ఖరీదైన ఆస్తులుగా ఎదిగినాయి.
ఆకస్మాతుగా రామచంద్రయ్య గారి ఆరోగ్యము క్షీణించసాగింది వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్య కుదుట పడ్తునే వుంది. అంతలోనే మళ్ళి వ్యాదీ తిరగపడ్తుంది. చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. రామచంద్రయ్య వ్యాపారం బాగా సాగిన రోజుల్లో చాల డబ్బు రాజవ్వ పేరున వుంచారు. కొంత రామచంద్రయ్య వైద్యానికి ఖర్చు అయిన చాలా సొమ్ము రాజవ్వ పేరునే వుంది. ఇంట్లో ధరణి పెత్తనం మితిమీరటం ఆసొమ్ము తన పిల్లలకు తనకు కావలని ఇంట్లో గొడవలు మొదలైనాయి. రాఘవ కూడ భార్యకు తోడుగానే వున్నాడు.
ఈ ఇలాంటి సందర్భాలు అందరికి సహజమే కాబట్టి రామచంద్రయ్య దంపతులు కూతురు అల్లుడిని పిలిచి పాత ఇల్లు కూతురికి, పొలం తాలుకుహక్కును మాత్రం రాఘవకు ఇచ్చారు. రాజవ్వ పేరున ఆస్తులు మాత్రం అమె బతికి ఉన్నంత కాలం ఆమెకు చెందాలని వీలునామా రాయించారు. అప్పటికి గొడవ సద్దుమణిగినప్పటికీ మానసికంగా రామచంద్రయ్య చాల కృంగిపొసాగాడు. రాజవ్వ ఎంత దైర్యం చెప్పిన అతని మానసిక రోగం తగ్గుముఖం పట్టలేదు. కొంత కాలానికి రాజవ్వను ఒంటరిదాన్ని చేసి రామాచంద్రయ్య పై లోకానికి వెళ్ళిపోయాడు. తాత చనిపోయిన సంవత్సరంలో ఆడ పిల్ల పెళ్ళి చేసి చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందనే నమ్మకంతో రాఘవ ఇద్దరు అమ్మాయిల పెండ్లి ఒకేసారి చేశారు. పొలంలో కొంత భాగం అమ్మివేసి మరికొంత వారి ఆదాయంతో అప్పటికే రాజవ్వ వంటి మీది నగలు మాయమైనాయి. భార్య పిల్లలు ఖర్చులు భరించలేక లంచం తీసుకోవడం వల్ల అనుకొని పరిస్థితుల్లో రాఘవ ఉద్యోగం నుండి తీసివేయబడ్డాడు. దాంతో ఇంక ఇద్దరు అమ్మాయిల పెండ్లిళ్ళు చేయ్యాలి. ఎలా అని మానసికంగా మధనపడ్తూ అనారోగ్యం కొని తెచ్చుకున్నాడు. భార్య ధరణి మాత్రం తనకు ఇంక ఎదురులేదని తనదే పెత్తానం అన్నట్లు ఆమె ప్రవర్తన రోజురోజుకు శృతి మించి పోతుంది. రాజవ్వ పై ఒత్తిడి తీసుకరాసాగింది. డబ్బు మిగిలిన నగలు ఇస్తే తన కూతుళ్ళ పెండ్లి చేస్తానని నిస్సహాయ స్థితిలో రాఘవ ఉన్నాడు.
అనుకున్నట్లుగానే మిగిలిన పొలం రాజవ్వ నగలతో మరో ఇద్దరు అమ్మాయిల పెండ్లి ఘనంగా జరిపారు. కొంత అప్పు కూడా చేయాల్సి వచ్చింది. అప్పు చేశారు కాని ఎలా తీర్చాలో అనే ఆలోచన లేదు. కొంత కాలానికి అప్పుల వాళ్ళ అగడాలు ఎక్కువైనాయి. రాఘవ ఏమి తోచ్చని స్థితిలో తన నాన్న గారి వ్యాపారం చేయసాగారు. కుటుంబానికి దూరంగా వుంటూ అలవాటులేని వ్యాపారం కాబట్టి లాభల కన్న నష్టలే ఎక్కువైనాయి ఉన్న అప్పులు తీర్చలేదు సరికదా కొత్త అప్పులు చేయడం జరిగింది. రాజవ్వకు వయస్సు మీదపడి కంటిచూపు మందగించింది. నడవలేని స్థితిలోకి వచ్చింది. కాని తన భర్త రామచంద్రయ్య మాట ప్రకారం తన వద్దనున్న డబ్బును తన మనవారళ్ళ పిల్లలకు ఇవ్వాలని భద్రపర్చసాగింది. కాని వాటికై కోడలు, కొడుకు ప్రతిరోజు హింసించడం మొదలుపెట్టారు.
ఓరోజు ఇంట్లో అందరు గొల్లుమని ఎడ్చుస్తున్నారు. రాజవ్వ అప్పుడే నిద్రలో నుండి మెల్కొని కళ్ళజోడు సవరించుకుంటూ కిందకు వచ్చి చూసింది. తనబిడ్డ రాఘవ చలనం లేకుండ పడివున్నాడు. తన రక్తం ధారపోసి బ్రతికిచుకున్న వాడు ఈనాడు వాడి తండ్రి దగ్గరకు వెళ్ళాడు. ఇద్దరు కలిసి నన్ను ఒంటరి దాన్ని చేశారు అనుకుంటు ఆచేతనంగా కూలబడింది. కళ్లవెంట నీళ్ళురావడం లేదు ఎందుకంటే రాఘవకువ తను ఎడిస్తే చూడలేదు. మౌనగంగలా తనలో తానే వేదన తరంగాలను అదుపు చేసుకుంటుంది. జరగాల్సిన కార్యక్రమాలు జరిపించారు.
కొడుకు తనప్రాణం దూరం అయ్యాడు. తట్టుకొనిలేని హృదయం రాత్రి పగళ్ళు విలపిస్తునే వుంది. అలా చీకటి గదిలో ఎన్ని రోజులు వుందో తనకే తెలియదు. ఓ రోజు గదిలో లైటు వెలిగింది. రాఘవ పెద్ద కూతురు వచ్చింది. తన భుజం పైనచేయి వేసింది. రాఘవ స్పర్శలా అన్పించి మనస్సుకు కాస్త ఊరట కల్గింది. చేతిలో బాబు వున్నాడు ఒళ్లోకి తీసుకుంది. మా నాయన మళ్ళీ నా ఒళ్ళోలోకి వచ్చాడు అంటూ సంబరంగా గదిదాటి బయటికి వచ్చింది. కోడలు తినడానికి అన్ని పెట్టింది. ఎన్నాళ్ళు అయిందో రాజవ్వ అన్నం తినక కడుపునిండా తిన్నది తనగదిలో నిద్రపోతుంది. అప్పుడే చల్లటిగాలి చిన్నుకులు మొదలైనాయి. కరెంట్ పోయింది. ఎవరో తన గదిలోకి వస్తున్న అలికిడి గాజుల శబ్దం వినబడుతుంది. తనను (రాజవ్వ) నలుగురు పైకి ఎత్తుకున్నారు. నిద్రలో ఉన్నదని భయపడినారు. కాని రాజవ్వ మెలకువతోనే గమనించసాగింది. ఆనలుగురు కలిసి రాజవ్వను ఓ ఆటోలో వేసుకుని వెళ్ళి వూరిచివరన ఒదిలేసి వెళ్ళారు. ఇంక ముసలిదాని పీడ విరగడైంది. ఈ వర్షంలో తడిసి చచ్చిపోతుంది. ఆ డబ్బు మొత్తం తీసుకోవచ్చని ప్లాన్ వేసి రాజవ్వను చీకటిలో ఆనాధగా వదిలి వెళ్ళారు. ఇది రాజన్య గతం గురించి మేము తెలుసుకున్న విషయాలు. చాలా బాధ
కలిగింది.
మరునాడు ప్రొద్దున్నే కాలింగ్ బెల్ మోగుతుంది పాలవాడు పాలు తెచ్చాడు. దాంతో పాటు రాజవ్వ పరిస్థితి బాగా లేదని చెప్పాడు. రాజవ్వకు పాలగ్లాసు తీసుకొని వెళ్ళాను మేము తెలుసుకున్న విషయాన్ని నా కలగా రాజవ్వకు చెప్పాను. రాజవ్వ నన్ను గట్టిగా పట్టుకుని ఎడ్వసాగింది.
–
అదే బిడ్డ నాగతం నీకలగా వచ్చింది. అని తల ఊపింది. రేడియో వారు అప్పుడే మానవ సంబంధాలు – విలువలను గూర్చి చెప్తు పాటలు వేస్తున్నారు. నాకో ఐడియా వచ్చింది. దాన్నితోటి వారితో పంచుకున్న. మా ప్రయత్నం ఫలించి, ఓ 10 సంవత్సరాల అబ్బాయి, 8 సంవత్సరాల అమ్మాయి రాజవ్వ దగ్గరకు పూలు పట్టుకుని వచ్చారు. రాజవ్వ వారిని తన తొడమీద కూర్చోపెట్టుకొని ముద్దులు పెట్టుకుంది. తన సంచిలో భద్రంగా దాచుకున్న కొన్ని కాగితాలను వారికి ఇచ్చింది. ఆ పిల్లలు వారి ఇంటికి వెళ్ళి వారి తల్లిదండ్రులతో రాజవ్వ విషయం చెప్పారు. అవ్వను మన ఇంటికి తీసుకు రండి, లేకపోతే మేము కూడ ఇంట్లోకి రామని మొండికేశారు. రాజవ్వ ఇచ్చిన ఆస్తి కాగితాలు వారిపైకి విసిరి బయటకి వచ్చారు వారి స్నేహితులతో కలిసి గాంధి తాత బొమ్మ వద్దకు వచ్చారు. రాజవ్వలో ఎదో తెలియని శక్తి కాస్త వచ్చినట్లు అయింది. కాని మాట్లాడలేకపోతుంది. ఎదో సైగలు చేస్తుంది. కానీ అర్థం కావడం లేదు. గాంధి తాత బొమ్మపై చూపులు నిల్పి అలాగే పడుకుంది. ఇంతలో రాఘవ భార్య ఆమె కూతుళ్ళు వచ్చారు పశ్చాతాపంతో. అప్పటికే రాజవ్వ ప్రాణజ్యోతి గాంధీ తాత విగ్రహం దాటి రామచంద్రయ్యను కలిసింది. మానవత్వమును తిరిగి మెల్కోలిపిన పిల్లలు రాఘవ మనవడు, రమ్య మనరాలు. మరో తరం, మధ్య తరానికి మార్గదర్శనమై నిల్చింది.
మయూఖ ఆశ్వయుజ మాస, అక్టోబర్ 2022 సంపాదకీయం
ఎవరు ఏ ఉక్కు పాదాన్ని మోపినా నీదైన ధైర్యం నీదైన చైతన్యం అనే స్పృహ ఉండాలి . పరిస్థితులు ఎన్నో వస్తుంటాయి ,పోతుంటాయి . హోరుగాలికి , గాలి వానకు స్థిరంగా నిలబడిన పర్వతమంతటి మనోనిబ్బరం ఉంటే తొట్రుపాటులు ,తొందరపాటులూ ఉండవు . జీవితం నిలకడగా ఉంటుంది. దారుణ ప్రభావాలు చూపే అతి అనుకరణాల దుష్పరిణామాలు ఆలోచనల ను ఎండి పోయేలా చేసినా వాటికి లొంగిపోకుండా జీవనది ప్రవాహం లానూ సాగేలా జాగ్రత్త వహించాలి.
వ్యక్తులు ఉంటారు .వ్యవస్థలు ఉంటాయి .ఈ రెంటిలో ఏది ముఖ్యం అనేది తెలుసుకునే సమర్థత కావాలి .ఈ సమర్థత ఎలా వస్తుంది ?ఇది ఒక గొప్ప ప్రశ్న !ప్రశ్నించుకుంటేనే ఆత్మ ప్రబోధం అవుతుంది .అనంతమైన సారస్వతం మనకు ఉన్నది .అద్భుతమైన సాహిత్యం మనకున్నది .చేతిలో పుస్తకం పట్టుకొని ప్రశాంత చిత్తం తో చదివే రోజులు దరిదాపుల్లో లేనట్టు ఉన్నా , ఒక తెలివిడి తనం కోసం వర్తమానంలో గతాన్ని తోవ్వుకోవడమే ఇప్పుడు అవసరం. అంతర్జాలంలో మంచిని మాత్రమే కంటికి కట్టుకుంటే , మనస్సుకు చుట్టుకుంటే ప్రమాదాలకు తావుండదు. కాని , అలా చేయడం లేదు. సమయమున్నప్పుడు సమయాన్ని చేజిక్కించుకున్నప్పుడు పుస్తకం చేతబట్టి చదివాలి. అప్పుడే అలసట తగ్గుతుంది , ఆసక్తి పెరుగుతుంది. అవగాన వస్తుంది.
రంగులు ..రంగులు .. ఎక్కడ చూసినా రంగులే ! ఈస్ట్ మెన్ కలర్ చిత్రాల పరిజ్ఞానం బెస్ట్ అయి కూర్చున్నది . నలుపు తెలుపు భావాలు వీగిపోతున్న అతిపెద్ద లైఫ్ కాన్వాస్ పైన మనదైన తలకాయ ఎక్కడున్నదో వెతుక్కోవలసిన వర్తమానమిది.భావి జీవితం చిరునామాను ఏ కుంచె చెప్పగలదు? ప్రశ్న ! ప్రశ్నించకుంటే ఆత్మ జ్ఞానం ఎట్లా అందుతుంది ?
స్పీడ్ .. స్పీడ్ .. అంతా స్పీడ్ మయమే ! ఈ వేగం నిత్యజీవితంలో కలిసిపోయింది . ఎన్ని ఆంక్షలు ఎన్ని నియంత్రణలు పరిపాలనలో ఉన్నా , దాటిపోవాలి దూరిపోవాలి చేరుకోవాలి అనే ఆతృతతోనే హృదయం అనే సాటిలైట్ ఆర్బిట్ లో మనసనే గ్రావిటేషనల్ ఫోర్స్ తిరుగుతూ తిరుగుతూ ఆలోచన అనే ఇంధనాన్ని ఖర్చు చేస్తూనే కక్ష్యలను దాటుతున్న వైనం! రహదారులపై వేగ నియమాన్ని తీసుకుంటే, స్పీడ్ తో పరిమితులను దాటామనే పరమానందం వాహన చోదకునిలో కలిగిస్తూ పోతున్నప్పుడు సంభవించేది యాక్సిడెంట్సే! ఇంటికి జరిమానాలు వస్తే ఏంటి , జరగవలసిన నష్టాలు జరిగిపోతూనే ఉంటాయి. అతి వేగం ప్రమాదకరం అనేది రాతలకే పరిమితమైపోతున్నది.
ప్రాపంచిక విషయాలన్నీ అశాశ్వతమైనవని యోగిపుంగవులుగా ఎందరో చెప్తున్నా పరుగులకాలంతో పోటీపడుతున్నారు సామాజికులు.
ఆహార నియమాలు ఎన్ని పాటించినా , శని ఆదివారాలలో సరదాలకు వినియోగిస్తున్న సమాజం ఇది . ఒకరోజు పెట్టే ఖర్చు పేద కుటుంబానికి నెల గ్రాసమవుతుంది . ఇవన్నీ తెలియకనా ! తెలుసు ! తెలిసి చేసే వే! జాగ్రదావస్థనుండి స్వప్నావస్థలనుండి జనులు నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. జ్ఞాన , విజ్ఞాన శక్తులకు ఆకర్షితం కావాలంటే మనవైన మూలాలను మర్చిపోవద్దు.
ఓవైపున ప్రపంచంలో పేరు మోసిన దేశాలు సుస్థిరమైన మన భారతదేశం కౌటుంబిక జీవన విధానం వైపే ఆశ్చర్యం గా చూస్తున్నాయి. వేల వేల సంవత్సరాల క్రితం పుట్టిన మన సంస్కృతిని వాళ్లు అద్భుతంగా భావిస్తూ నేర్చుకుంటున్నారు ఇప్పుడు. పాశ్చాత్య దేశాలు మన దేశాన్ని ఎంతో గౌరవిస్తున్నాయి చాలా ఉదాహరణలు ఇందుకు చెప్పవచ్చును . స్విట్జర్లాండ్ లో ఎన్నో ఏళ్ళ క్రితమే వారే నిర్మించిన ఆరున్నర అడుగుల ఎత్తులో ఉన్న ‘నటరాజ విగ్రహం ‘ వాళ్లకు స్ఫూర్తిగా ఉన్నది.
చికాగోలో వివేకానందుని విగ్రహము , వివేకానందుని వీధి వాళ్లకు ప్రేరణగా ఉన్నది. అయితే ఇదే సమయంలో భారతీయ వ్యవస్థను దెబ్బ కొట్టే వ్యూహాలతో పనిచేస్తున్న కుట్రలు కొన్ని దేశాల్లో ఉన్నాయి. ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాలలో సెమినార్లు నిర్వహిస్తూ కేవలం మత పరంగా చూసి, సర్వ మత సౌభ్రాతృత్వ దృక్పథంతో ఉన్న మనదేశంపై అబద్ధాల బురదచల్లుతున్న వైనమూ ఉన్నది. ఇది అందరూ తెలుసుకోవాలి . అంటే ఆనాడు ఎప్పుడో ఆయా దేశాల్లో మన సంస్కృతిని చాటే విగ్రహాలు , వీధులు స్థాపించినప్పటికీ ఇప్పుడు మన దేశంలో పెరిగిపోతున్న ఇంత అనైక్యతకి మధ్యన చాలా చాలా భేదం ఉన్నది. మారుతున్న కాలం ఏం నేర్పిస్తుంది అనేది ఆలోచించాల్సిన అవసరమున్నది.
దేశ సౌభాగ్యాన్ని రక్షించుకునే ఆశయంతో ఆనాడు మన సమాజం ఉండేది. మరి ఇప్పుడో?ఇదే ఆలోచించాలి.
ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ వృత్తులతో పాటు వచ్చినవాటి రాజకీయ కారణాల తో కొత్త రంగులు పులిమిన విచిత్ర చిత్రాలను గమనించవచ్చు. అతి ఎక్కడైనా అనర్థాలు తెస్తుంది. వేల ఏళ్ల చరిత్ర ను తిరగేస్తే ఉన్న పరిస్థితులు వందేళ్ల చరిత్రలో లేవు. ఉండవు. మార్పులు సంభవిస్తాయి. మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదే చేటు తెచ్చింది , వీటికి బాధ్యులెవరో తెలుసుకోవాలి. ” తెల్లోడు తెచ్చిన తెగులేర యిది , నల్లోడు నేడు నడుపుతున్నాడు” ఈ వాక్యాలు అక్షర సత్యం.
అనైక్యత ..అనైక్యత ..అనైక్యత .. ఇది ప్రస్తుతం ఎక్కువైన వైనం! ఈ కాలుష్యం నుంచి తట్టుకోవాలి ఈ కాలుష్యాన్ని పోగొట్టాలి. అప్పుడే దేశ సమగ్రత ను కాపాడుకున్న వాళ్ళం అవుతాం .
పైన చెప్పుకున్న అన్ని కాలుష్యాలను దిగుమతి చేసుకున్నప్పటి నుండే ఇలా దిగజారి పోతున్న నేటి పరిస్థితులకు కారణం. లక్ష్యాన్ని గురి చేసుకోవడం అన్నదే లేదు ఇదంతా సామూహిక ఖననం అనవచ్చు . ఈ ఒంటెద్దు పోకడలలో దేశ ఔన్నత్యాన్ని కోల్పోతున్నామనే ధ్యాస లేకుండా పోతున్నది. ఆం .. ఏమైతే నాకేంటి అనో, ఆం .. నా ఒక్క అడుగుతో పోయేదేముందనో తెలివి తక్కువగా ఉంటున్నారు దేశీయులు. ఈ అనాసక్తత ఈ ఆడంబర హేల ఈ అనాలోచిత ఇవన్నీ దేశ సమగ్రతకు చేటు చేస్తాయి. ఇది చాలా చాలా ప్రమాదకరం. రేపటి తరానికి చెడును చేసే చర్యలు ఇవి! రంగుటద్దాలనుండి చూడక కళ్ళు తెరిచి చూడాలి.
బతుకమ్మ పండుగను కొన్ని ప్రాంతాల్లో బ్రతుకు నిచ్చే పండుగ అని బతుకమ్మని అంటారు కానీ మా మహబూబ్నగర్లో బతుకమ్మలు ఆడరు బతుకమ్మ పాటలు పాడుతారు బొడ్డెమ్మ అని రజాకర్ల కాలంలో ఆడవాళ్ళను చాలా హింసించేవారు వారిని వివస్త్రను చేసి ఆటలు ఆడేమని వారట అందుకని స్త్రీని బతకమ్మ అని అక్కడ కొలుస్తారు ఆనాటికి ఈనాటికి స్త్రీల పరిస్థితి అలాగే లేకున్నా కొన్ని మార్పులతో ఈరోజు కూడా కడుపులో ఉండే ఆడపిల్లని చంపేస్తున్నారు మన తెలంగాణ వచ్చిన తర్వాత ఆడబిడ్డ బతుకమ్మ అని బతుకమ్మ పాటలకి కొత్త ఊపిరి వచ్చి మన తెలంగాణ అంతా కుటుంబ సమేతంగా చిన్నా పెద్ద తారతమ్యము లేక చక్కగా జరుపుకుంటున్నటువంటి ఒక మంచి పండుగ బతుకమ్మ పండుగ అందరూ ఆటలాడుతూ పాటలు పాడుతూ పువ్వులను దేవతలుగా భావిస్తూ జరుపుకుంటున్నటువంటి పండగ బతుకమ్మ పండుగ అదే కాక తెలంగాణలో ప్రజలు రాయిని రప్పను కూడా దేవుడిగా భావిస్తారు చెట్టును కూడా కానీ కొన్ని రకాలైనటువంటి రోగాలకు చేతికి గడ్డలు అయితే ఒక ఆకు రసం పూస్తారు పాము తేలు కాటుకు ఒక రకం ఆకు రసం పూస్తారు అప్పటినుండి కూడా చెట్లకు పువ్వులకి తెలంగాణ వారు చాలా ప్రాధాన్యత ఇస్తారు అలాంటి పండుగలలో బతుకమ్మ పండుగ ఒకటి పూల అన్ని రకాలైన పూలను పూజించే అపురూపమైన పండుగ తలలో పెట్టుకొని పూలను తలపైన ఎత్తుకొని గౌరీగా భావించి సమర్పించే పండగ బతుకమ్మ పండుగ

రచయిత డా.లక్కరాజు నిర్మల
సాహిత్యం సమాజానికి దర్పణం వంటిది . కవి మనసు అద్దం అయితే ఇక తీక్షణ కాంతిపుంజలై కవిత్వంగా భావాలు జాలువారుతాయి. ఎందరో కవులు కవయిత్రులు కవితా సిరులు పండిస్తున్నారు .ఎందరో రచయితలు రచయిత్రులు భాషా సాహిత్య సేవ చేస్తున్నారు.పరిశోధనా రంగం లో తమదైన ప్రతిభను చాటుతున్న వారందరూ ఎంతో కృషి చేస్తున్నారు. మీరందరినీ ప్రోత్సహించే ఎన్నెన్నో పత్రికలు మనకు ఉన్నాయి. లిఖిత రూపంగా తమ తమ రచనలను పత్రికలలో చూసుకొని ఆనందపడుతున్నారు. అంతర్జాలంలోనూ ఆధునికంగా కనిపిస్తూ సంతోషిస్తున్నారు ఇటువంటి కళలకు మయూఖ పత్రిక ఒక చక్కని అంతర్జాల వేదిక గా ఉన్నది.ఎన్నో రచనలు గత ఏడాదిన్నరిగా మయూఖ ప్రచురిస్తూ తన వంతు సాహితీ సేవ చేస్తున్నది . ఈ క్రమంలోనే కవితల పోటీని నిర్వహించాలని నిర్ణయించుకుంటున్న వేళ , నా సెల్ ఫోన్ కి
“నా దేశం రా నాదేశం !నా దేశం నా భారతదేశం!
మన్ను బంగరౌ మాన్యాలున్నా, సాలెల్ల పారే సెలయేరులున్నా
మడిలో మొక్కకు తడి లేదన్నా,” అంటూ ఉర్రూతలూగించే గొప్ప కవిత్వాన్ని రాసి, ఆనాడు ఈ గేయంతో మమ్మల్ని ఉత్తేజపరిచిన పెండ్యాల రాఘవరావు గారు మీకేం అవుతారు?’‘ అంటూ నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ ని పంపినవారు
గౌరవనీయులు, పెద్దలు , కవి ,రచయిత నెల్లుట్ల నవీన చంద్ర గారు. తర్వాత ఫోన్లో మాట్లాడుకున్నాం. వారు కెనడాలో ఉంటారు . నేను అమెరికాలో ఉన్నాను. ఒక జూమ్ మీటింగులో నా గురించి విని ఈ మెసేజ్ పెట్టారట. ”మీరెవరో తెలుసుకుందామని” అని అన్నారు . అలా పరిచయమయ్యారు.
ఆ రోజు ఆ మెసేజ్ లో మా బాపు పెండ్యాల రాఘవరావు గారి పేరును ఆ గేయాన్ని చూడగానే ఆనందం పట్టలేకపోయాను అందుకే వెంటనే మాట్లాడుకుందాం అని మెసేజ్ పెట్టి ఫోన్ చేశాను. ఆ మెసేజ్ ఎంత బాగున్నదో, ఎంత హుందాగా ఉన్నదో అంతకంటే ఎక్కువ రెట్లు వారి సంభాషణ ఉన్నది. అంతటి భావాత్మకమైన కవిత్వాన్ని గేయాన్ని రాసిన పెండ్యాల రాఘవరావు గారి కన్నబిడ్డను నేను! నా హృదయం సంతోషంతోను గర్వంతో నూ తేలిపోయింది. వారి కూతురుని అని తెలిసి నవీన చంద్ర గారు కూడా ఆశ్చర్యపోయారు. నా హృదయంలో కలిగిన భావాలకు ఏమాత్రం తగ్గకుండా ఎంతో ఉన్నతంగా ఆనాటి తెలంగాణ ప్రాంత ప్రజల కష్టాలు , నాయకుల నిస్వార్ధ పోరాటాలు చెబుతూ ఈ గేయం ఆనాడు అందరి నోళ్ళల్లో నానిన గేయమని, రాఘవరావు గారు అంటే మా యువతరానికి ఆనాడు గొప్ప స్ఫూర్తి అని, ఎప్పటివో 60 ఏళ్ల క్రింది ముచ్చట్లు అన్నీ చెప్పారు.
ఈ పరిచయం మరింత ముందుకు సాగి నేను ప్రారంభించిన మయూఖ పత్రిక విషయాలు తెలుసుకొని మయూఖ పత్రిక పక్షాన వారి సోదరులు నెల్లుట్ల ఈశ్వరచంద్ర గారి స్మృత్యర్థం కవితల పోటీని నిర్వహించమని దానికి సంబంధించిన వ్యయాన్ని భరిస్తానని చెప్పారు. వారి మాటతో ఈ కార్యాన్ని దిగ్విజయంగా పూర్తిచేసాను. 153 కవితలు పోటీకి వచ్చాయి. కవితలపై కవి పేరు లేకుండా కేవలం శీర్షిక మాత్రమే ఉంచి ఆ కవితలన్నీ ఇద్దరు న్యాయనిర్ణేతలకు పంపించాను. అందులో మూడు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు , మూడు ప్రోత్సాహక బహుమతులు ,20 సాధారణ ప్రచురణార్థం ఎంపిక చేయమని అడిగాను.ఇద్దరు న్యాయ నిర్ణేతల సహకారంతో ఎంపిక చేసాం. ఏనుగు నరసింహారెడ్డి గారు నెల్లుట్ల రమాదేవి గారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
నేను అమెరికాలో ఎక్కువ కాలం ఇవ్వడం వలన ప్రకటనలో ఇచ్చినట్టు ఇండియాలో ప్రత్యక్షంగా సభను నిర్వహించలేకపోయాను. కానీ ZOOM మీటింగ్ ద్వారా ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. కవితా వేదిక ద్వారా నవీన చంద్ర గారు ఈ బాధ్యతను తీసుకున్నారు. సమర్థవంతంగా నిర్వహించారు, ఇంకా నిర్వహిస్తున్నారు . అంతేకాదు ఎంపిక చేసిన కవితలను “కొత్త పాతల మేలు కలయిక” అనే పేరుతో పుస్తకాన్ని కూడా ప్రచురిస్తున్నారు. ప్రకటనలో ఇచ్చినట్లుగా నగదు బహుమతులను సర్టిఫికెట్ల ను తొందరలో విజేతలకు త్వరలో పోస్టు ద్వారా అందజేస్తాం.
ప్రకటనలో చెప్పినట్లే మయూఖ పత్రికలో బహుమతులకు ఎంపికైన కవితలను ప్రత్యేక సంచికగా ప్రచురిస్తున్నాను. మిగతా కవితలను కూడా తరువాత వీలును బట్టి ప్రచురిస్తాను. ఆలోచననాత్మకమైన ,సందేశాత్మకమైన చక్కని ఈ కవితలను చదివి ఆనందిస్తారని ఆశిస్తున్నాను.
_ డా. కొండపల్లి నీహారిణి, మయూఖ సంపాదకురాలు.
mayuukhathemagazine@gmail.com
గమనిక
మయూఖ పత్రిక ప్రత్యేక సంచిక మీ ముందు ఉంది. ప్రకటనలో ప్రకటించినట్లే బహుమతి గ్రహీత ల కవితలు ఈ ప్రత్యేక సంచిక లో వేస్తున్నాం .
మయూఖ ద్వైమాసిక పత్రిక కదా! ఆగస్టు మయూఖ వచ్చింది , అక్టోబర్ మయూఖ వస్తుంది. ఈ రెండు నెలల మధ్య ఇలా కవితా వేదిక పోటీ కవితలను ఇప్పుడు సెప్టెంబర్ నెలలో ప్రత్యేక సంచిక గా తెస్తున్నాం.
అక్టోబర్ మయూఖ పత్రిక అక్టోబర్ మొదటి వారంలోనే యథావిధిగా వస్తుంది.
మయూఖ వచన కవితల పోటీ ఫలితాలు-
మయూఖ , కవితా వేదిక (కెనడా ) సంయుక్తంగా నిర్వహించిన వచన కవితల పోటీకి 155 కవితలు రాగా , ఆ వచ్చిన కవితలపై కవితా శీర్షిక మాత్రమే వుంచి కవుల పేర్లు లేకుండా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఏనుగు నరసింహారెడ్డి, నెల్లుట్ల రమాదేవి గార్లకు అందజేసాము.
ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల తో పాటు
ప్రోత్సాహక బహుమతుల కోసం 3 కవితలను, సాధారణ ప్రచురణ కోసం 20 కవితలను ఎంపిక చేశారు .
1.ప్రథమ బహుమతి:- ‘ఆట‘ పెళ్లూరు సునీల్,నెల్లూరు. 2.ద్వితీయ బహుమతి:- ‘ శ్వేత వర్ణ యమపాశం‘ _ జాబేర్ పాషా, సిద్ధి పేట్ (నివాసం-మస్కట్).
- రక్షా రేఖలు- చొక్కాపు లక్ష్ము
నాయుడు, విజయనగరం. ప్రోత్సాహక బహుమతులు - విశాలంగా పారే దే -చందలూరి నారాయణ
2 నీరు మింగిన నేల- గిరి ప్రసాద్ చల్ల మల్ల, మియాపూర్ – హైదరాబాద్. - హోమ్ టూర్ – దాసరి మోహన్,బోడుప్పల్- మేడ్చల్.
సాధారణ ప్రచురణకు ఎంపికైనవి-
1.వచ్చి పో మిత్రమా- కే . కౌండిన్య తిలక్,అల్వాల్-సికింద్రాబాద్.
- రాగమాలిక- బి.వి. శివప్రసాద్, విజయవాడ.
- అసలు రంగు- సాంబమూర్తి లండ, శ్రీకాకుళం.
4.లసుము- రమేష్ నల్గొండ, ఆసిఫాబాద్ జిల్లా.
5.నేనో నదిని -లేదాళ్ళ రాజేశ్వరరావు, మంచిర్యాల. - నాగరకత-సుంకర గోపాలయ్య, నెల్లూరు
- యుద్ధ మేఘం – ఎస్ .నరేష్ చారి,రావిరూకల-సిద్ధిపేట్ జిల్లా.
8.ఒక్క సంతకం – గొర్తి వాణి శ్రీనివాస్, విశాఖ పట్నం.
9.పదండి ముందుకు -స్వాతి శ్రీపాద, హైదరాబాద్. - అమ్మ నన్ను మన్నించు- మధుకర్ వైద్యుల, హైదరాబాద్.
11.సందేశం -రాపోలు సుదర్శన్, హైదరాబాద్.
12.ఆమె -కోరాడ అప్పలరాజు, అనకాపల్లి-విశాఖ జిల్లా.
13.శిధిలనది – యములపల్లి నర్సిరెడ్డి, అనంతపురం.
14.బతుక్కి మెతుక్కీ – వురిమిళ్ళ సునంద, ఖమ్మం.
15.అతడు- ఎస్ .ముర్తుజా , కర్నూల్.
16.సమాయుత్తం కావలసిన వేళ- కళా గోపాల్, నిజామాబాద్.
17.మూగబోయిన వసంతం – కిరణ్ విభావరి - ఆమె లేకుంటే – వారణాసి నాగలక్ష్మి, హైదరాబాద్.
- మగ హత్య- అమూల్య చందు, విజయవాడ.
20.మృత్యు వాంగ్మూలం- మానాపురపు చంద్రశేఖర్.
“విజేతలకు త్వరలో హైదరాబాద్ లో జరగనున్న సభలో బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది.” అని ప్రకటనలో చెప్పాము . కాని , నేను అమెరికాలో చాలా కాలం ఉండవలసి రావడం తో ‘కవితా వేదిక ‘ పైన అంతర్జాల కవి సమ్మేళనం నిర్వహించారు పెద్దలు నెల్లుట్ల నవీన చంద్ర గారు. ప్రత్యక్ష సభను జరపలేకపోయిన కారణాన! ఈ 26 కవితలతో పాటు పోటీ కి వచ్చిన మరో 20 కవితలను , కవితా వేదిక కవుల కవితలను కలిపి కవితా సంపుటి ని తెస్తున్నారు. తొందరలో పుస్తకం, సర్టిఫికేట్ , నగదు బహుమతి పొందిన వారికి నగదు బహుమానం అన్నీ పోస్ట్ చెయ్యబడుతాయి.

మయూఖ సంపాదకురాలు.
mayuukhathemagazine@gmail.com
స్వతంత్రత – నీవు
ఈ జీవన పోరాటంలో అనునిత్యం అనుక్షణం కొత్తదనాన్నే ఆస్వాదిస్తారెవరైనా! కాని ఒప్పుకోరు. బ్రతుకు బడి చాలా పెద్దది. కూర్చుని చదువుకోని పాఠాలన్నో ఉంటాయి. పాఠాలు నేర్పని గురువులా కాలం వెంటనే ఉంటుంది.
చాలా విషయాల్లో తేలికగా తీసుకునే మనిషి తన అస్తిత్వానికి దెబ్బ అనుకుంటే మాత్రం సహించని స్థితి ఉంటుంది
పరాయిపాలనలో నికృష్టంగా ఉండే కష్టాలేమీలేవు ప్రస్తుతం , కానీ .. . ఈ “కానీ” కి చాలా అర్థాలున్నాయి. ఆ నాటి పరిస్థితులేవీలేని పరమ స్వేచ్ఛగా వెళ్ళదీసుకునే వీలున్నదిప్పుడు. కానీ…
భూగోళం మీద దాదాపు తొంభై శాతం ఆక్రమించి పాలించిన ఒక చిన్న దేశం బ్రిటన్! సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం అంటూ ఉంటాము . అంటే ఏంటి ? అంటే బ్రిటన్ దేశం లో సూర్యుడు అక్కడ అస్సలే అస్తమించడా?కాదు! బ్రిటన్ లో కూడా సూర్యాస్తమయం అవుతుంది.మరెందుకు ఈ మాట అంటారు? అంటే, ప్రపంచం లో ఎక్కడచూడూ అన్ని దేశాలు బ్రిటిష్ వారి పాలనలోనే అప్పుడు ఉండేవి . భూమి ఎటుతిరిగినాగానీ అటు సూర్యుడు కనిపిస్తాడు ,సూర్యరశ్మి ఉంటుంది. ఆ ప్రాంతాలన్నీ బ్రిటిష్ ఆక్రమిత ప్రాంతాలుగానే ఉండేవి. దీంతో “సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని “అని అనడం పరిపాటి అయ్యింది.
మన భారతదేశాన్ని కూడా బ్రిటషర్లు అలా యుక్తి , కుయుక్తులతో చేజిక్కించుకుని ఓ రెండు వందల సంవత్సరాలు పాలించారు. మనదేశ సంపద కొల్లగొట్టి, మనని మనుషులు గా చూడక అవమానపరుస్తూ హీనాతిహీనంగా చూసేవారు. అన్నదమ్ముల మధ్య , రాజ్యాలమధ్య , సంస్థానలమధ్య విభేదాలు సృష్టించి విభజించి , ఐదు ఆవులు ఒక పులి కథ లాగా మన పాలకులను అంతం చేసి తమ హస్తగతం చేసుకున్నారు. అన్నేళ్ళల్లో వాళ్ళు చేయని అరాచకం లేదు. మన విజ్ఞాన గ్రంథాలను, మన పండితులను ఎత్తు కెళ్ళి సంస్కృత భాషలో ఉన్న ఆయా శాస్త్రాలను ఇంగ్లీష్ లో కి అనువాదం చేయించి ప్రయోగాలు చేసుకున్నారు . ఆధునిక విజ్ఞాన సంపన్నులైనారు. మన దేవాలయాల లోని విగ్రహాలను ఎత్తుకెళ్లి వాళ్ళ మ్యూజియంలలో పెట్టుకున్నారు.అవి చూస్తున్నప్పుడు కడుపు తరుక్కుపోతుంది. అందమైన గాజు నిర్మాణాల్లో మన ఆధ్యాత్మిక అమృతవాహిని ని బంధించారు కదా అని మనసు అల్లకల్లోలమైపోతుంది.
ఇవన్నీ మేధావులకు తెలుసు . కానీ ఇవి తెలియని తరాలు వచ్చాయి . మారిన తరాలకు మన వీరులు , మన సైనికులు , మన నాయకులు పడిన కష్టాలు తెలియాలి. ఎన్ని ప్రాణాలు పోతే ఈ స్వాతంత్ర్య సాధించుకున్నామో తెలియాలి . లేకుంటే చాపక్రింద నీరులా వస్తున్న దేశ ద్రోహం మన పిల్లలకు ఈ కొత్త తరాలకు తెలియదు, అర్థం కాదు. ఆక్రమించే రూపం మారవచ్చు, అణగద్రొక్కే విధానం మారవచ్చు వాళ్ళ విషపు చూపులను పసిగట్టేందుకు కొత్త స్ఫూర్తి ఇప్పుడు అవసరం . వడ్డించిన విస్తరి అయింది మన దేశం . రేపటి రోజులలో “… చింపిన విస్తరి కావద్దు” ఇది ఈ అమృతోత్సవ శుభ సందర్బంగా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి . ఇది ఒక ప్రత్యేక అవసరం. మనకాలంలోనూ ఇప్పటికీ యుద్ధాలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం కూడా! పరోక్ష యుద్ధాలు ఏవో సభ్యసమాజానికి తెలుసు . ప్రత్యక్ష యుద్ధం కూడా జరుగుతున్నది . ఆక్రమణకు గురయ్యే దేశం ఎంత , ఎన్ని విధాలుగా నష్ట పోతున్నదో తెలుసు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని , గమనింపులోకి తెచ్చుకొని మనం మన దేశాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. ఈ వజ్రోత్సవ సందర్భంగా మనమంతా , మన యువతరమంతా భారతదేశ సమగ్రతకోసం ఆలోచనలను పదునుపెట్టాలి. రేపటి తరానికి ఏ కష్టాలు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఒక్క గొంతుకలం కావాలి . నా దేశ సర్వోన్నతి నేను ఏం చేస్తున్నాను అని నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి, దేశ సుభిక్షత కోసం నేను ఏం చేయాలి అని నిన్ను ప్రశ్నికుని పూని ఏమైనా మేలు చేయాలి . అప్పుడే నీదే అనుకునే స్వతంత్ర భారత దేశం నీదవుతుంది.
అందరికీ డెభ్భై ఏళ్ల భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జై భారత్ !!
కాకతీయ వైభవం సప్తాహం లో ప్రశంసలు పొందిన తెలంగాణ సామాజిక రచయితల సంఘం బాధ్యులు

కాకతీయ వైభవం సప్తాహం లో భాగంగా హన్మకొండలోని అంబేద్కర్ భవనంలో ఈరోజు జరిగిన కవి సమ్మేళనంలో కవులు తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర సహ అధ్యక్షుడు కామిడీ సతీష్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు తొర్రూరు పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త ,తెలంగాణ ఆణిముత్యం పుడమి రత్న సాహిత్య విక్రమార్క జాతీయ సేవ రత్న పురస్కార గ్రహీత ఇమ్మడి రాంబాబు మహబూబాబాద్ జిల్లాకు చెందిన మా ర సం మాజీ అధ్యక్షుడు గుర్రపు సత్యనారాయణ పాల్గొని కాకతీయ అంశంపై కవి సమ్మేళనం లో పాల్గొని తమ కవితా గానం వినిపించినందుకు వరంగల్ మహానగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి చేతుల మీదుగా సన్మానం ప్రశంసా పత్రం జ్ఞాపిక స్వీకారం జరిగింది.ఉదయం నుండి రాత్రి వరకు ఈ కార్యక్రమం కొనసాగింది కాకతీయుల అదృష్టసంఖ్య 7 అని చరిత్ర చెబుతోంది అని అందుకు అనుగుణంగా జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొన్న 110 మంది ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ శ్రీమతి గుండు సుధారాణి కవులను అభినందిస్తూ శాలువ, మెమొంటో లతో ఘనంగా సత్కరించి ప్రశంసలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సాహిత్యం రంగానికి కవులకు పెద్దపీట వేస్తుందని అన్ని రంగాల వారిని గుర్తించడం జరుగుతుందని గత కాలం చరిత్రలో రాబోయే తరానికి అందించే కవులు రచయితలు వారధి అని సమాజంలో పాత్ర గణనీయమైనది అని అన్నారు కాకతీయ పాలన ఆదర్శాలను పాటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆలయాలను చెరువులను అభివృద్ధి చేస్తుందని అన్నారు సీఎం కేసీఆర్ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పెద్దపీట వేస్తుందని అన్నారు రాబోయే రోజుల్లో కవి సమ్మేళనాన్ని కాలేజీ కళాక్షేత్రంలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటానని అన్నారు ఈ కార్యక్రమంలో సమాచార శాఖ ఏడి జి లక్ష్మణ్ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ మున్సిపల్ చైర్మన్ సుందర్ రాజు యాదవ్ కుమార్ ఇంజనీర్ భూపాల్ ప్రముఖ కవులు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ వి ఆర్ విద్యార్థి పొట్లపల్లి శ్రీనివాస రావు సిరాజుద్దీన్ ప్రొఫెసర్ బన్న అయిలయ్య బిల్ల మహేందర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు
ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే ముందు మన అవగాహన ఎంత గా ఉంది అనేది కూడా ఒక అంచనా వేసుకోవాలి . అప్పుడే మనం అనుకున్నది ఏ స్థాయిలో ఉందో, మనమే స్థాయిలో ఉన్నామో తెలుస్తుంది . నిత్య జీవితంలో ఎన్నో విషయాలను మనసులో భద్రపరుచుకుంటాం. అప్పుడు తేదీల్లోని రోజులకు, సంవత్సరాలకు ఎంతో కొంత ప్రాముఖ్యత ను ఏర్పరుచుకుంటాం.
అట్లాగే ఇప్పుడు ఈ జూన్ జూలై నెలల్లో ను ముఖ్యమైన విషయాల తేదీలను జ్ఞానం తోనే కాదు హృదయం తోనూ తలుచుకునే ప్రయత్నం చేద్దాం.ఏప్రిల్ 22 వ తేదీని ధరిత్రి దినోత్సవం గానూ ,
గత నెల మే 1వ తేదీన కార్మిక దినోత్సవం విశేషంగానూ పాటించే విషయాలన్నీ వసంత ఋతువు లో చర్చించుకున్నాం.
అయితే ఇప్పుడు కేవలం దినోత్సవాల ప్రత్యేకత లు చెప్పడం కాదు ఇది. మానవ మనుగడకు కీలకం గా చెప్పుకునే యోగా గురించి , పెరుగుతున్న జనాభా గురించి పరామర్శించుకోవడం .
అంతరిక్ష గర్భాలను , భూ గర్భాలను శోధించే విజ్ఞానాన్ని సాధించిన మనిషి , తను నివసించాల్సిన భూమికి ,తన ఉనికికి ఏం ముప్పు కలుగబోతుందో తెలుసుకోలేకపోతున్నాడు. ఏదైనా నేర్పుతో కొంత వస్తుంది కానీ త్రికరణశుద్ధితో చేస్తే ఎంతో సాధించగలడు. తన కృషితో శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని అయితే సంపాదించుకున్నాడు గాని అది అతి పోకడలకు పోతే ఏం నష్టం కలుగుతుందో ఊహించడం లేదు . ఎంతసేపు వ్యక్తిగత జీవితం గురించే గాని నలుగురి గురించి ఆలోచించడం లేదు.
ఐదు వేల ఏళ్ళ క్రితమే యోగాను పరిచయం చేశారు మన భారతీయ ఋషులు. శరీరానికి మెదడుకు సమన్వయ సంబంధాలు బాగుండేలా అంటే మంచి కనెక్షన్ ఉండేలా చేస్తుంది యోగా. ఒక క్రమబద్ధమైన జీవన శైలికి అలవాటు చేస్తుంది యోగా. మానసిక శక్తి పెరుగుతుంది . ఎముకలు , కండరాలు బలపడతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఏ వ్యాధులు తొందరగా దరిచేరకుండా ఉంటుంది. . గుండె ఊపిరితిత్తులు సరిగా పని చేస్తాయి. జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది,సమస్థితి తో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. కాబట్టి ఆకలి సరిగా అవడమూ, ఎంత తినాలో అంతే తినాలి అనే స్ఫురణ కు రావడం వీటివల్ల నిద్ర సరిగా పట్టడమూ వంటి ఆరోగ్య సూత్రాలకు సంబంధమైన ఉపయోగాలు ఎన్నో కలుగుతాయి . దీనితో మనసుకు స్వాంతన చేకూరుతుంది.
అయితే, యోగాను ఆధ్యాత్మిక ప్రయోజనం గానే గతంలో చూడటం వల్లనే జన సామాన్యులకు వెళ్లలేదు. కాని ‘యోగా‘ అంటే వ్యాయామ సాధనల సమాహారాల రూపం. యోగ మానవాళి భౌతిక మానసిక విలువలను సమతుల్యంగా ఉంచుతుందని తెలుసుకోవాలి. యోగ ఒక కళ . ఒక ఆరోగ్యకరమైన ప్రక్రియ . జీవనాన్ని ఉల్లాస పరిచే క్రియ. యోగ వల్ల వ్యక్తి చైతన్యం కలుగుతుంది దాని ద్వారా విశ్వ చైతన్యం కలుగుతుంది. ఇది గ్రహించే 2014 సంవత్సరంలో జూన్ 21వ తేదీని “అంతర్జాతీయ యోగా డే “నిర్ణయించి ఐక్యరాజ్యసమితి /యు యెన్ సంస్థ ఇలా యోగా కోసం ఒక ప్రత్యేక మైన రోజును ప్రకటించింది.
అలాగే జూలై 11వ తేదీని వరల్డ్ పాపులేషన్ డే ప్రపంచ జనాభా దినోత్సవం గా జరుపుకుంటున్నాము. ప్రపంచం మొత్తం మీద ఐదు మిలియన్ల జనాభాకు చేరుకున్నది అన్న స్పృహ తో భయం కలిగి, అప్పుడు 1987లో ప్రపంచజనాభా దినోత్సవం అనేది ఏర్పాటు చేయడమైంది . ఇప్పుడు మూడింతల జనాభా పెరిగింది. కాని తగ్గిందేమీ లేదు. పాపులేషన్ డే అంటే ఉత్సవంగా చేసుకొని జనాభాను అధికం చేయడం కొరకు కాదు, పాపులేషన్ నియంత్రణ కోసం అనేది అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఏర్పడింది. జంతుజాలానికే కుటుంబం అనేది ఉండగా ఇక మనుషుల మైన మనకు కుటుంబవ్యవస్థ లేకుంటే ఎట్లా! కుటుంబం అనడానికి వివాహం అనేది పునాది. తోడు నీడ ఉండాలి అనే కాన్సెప్టుతో పెళ్లి అనేది ముఖ్యం అనుకుని ఈ వ్యవస్థను ఏర్పరిచారు. మంచి ఉద్దేశంతో ఏర్పరిచింది కానీ కొందరు దురలవాట్ల తో దురుద్దేశాలతో దీనిని భ్రష్టు పట్టిస్తున్నారు .కుటుంబ వ్యవస్థ ను గుర్తించి , ప్రపంచం లోని అన్ని మతాలవారు ఈ కుటుంబ వ్యవస్థ ను పాటించి , ఇప్పుడు నియంత్రణను కూడా ఒప్పుకుని , సముచిత స్థానాన్ని ఇస్తున్నారు. కేవలం కొన్ని మతాలలో మూఢత్వం తో కుటుంబ నియంత్రణ చేయవద్దని మొండి గా వాదిస్తుంటారు. వారు తప్పకుండా ఆలోచించాల్సిన విషయమే ఇది.
కుటుంబంలో సభ్యులు పెరగడం వలన సంపాదన ఎక్కువ అవుతుంది అనే ఆలోచనతో కంటారు, అంటే సంపాదించే చేతులు ఎక్కువవుతాయి అని అనుకుంటారు . కానీ , కుటుంబం పెరగడం వలన ఈ పావర్టీ అనేది ఎక్కువ అవుతుంది .
మరీ వింతైన విషయం ఏమిటంటే అమ్మాయిలు పుడితే అబ్బాయిలు పుట్టేదాకా కనడం అనేది. ఇంకా ఏ కాలంలో ఉన్నారో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆడపిల్ల అయినా మగపిల్లవాడు ఐనా తల్లిదండ్రులను వృద్ధాప్యం లో చూసుకోగలరు అది పెంపకం లో ఉంటుంది. దీని విషయం లో ప్రభుత్వాలు , సంస్థ లు , సంఘం సేవకులు ప్రజల లో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలి. ఇంట్లో సంతానం ఎక్కువైతే ప్రపంచం లో జనాభా ఎక్కువ అవుతుంది.
జనాభా ఎక్కువ అవడం వలన అన్నీ నష్టాలే , కష్టాలే. వస్తు వినియోగాలు పెరుగుతున్నాయని ఉత్పత్తులు పెంచడం , దీనితో పొల్యూషన్ పెరగడం . గ్లోబల్ వార్మింగ్ అనేది ఎంతో ముఖ్య విషయం అయ్యింది . ఉదాహరణకు ప్లాస్టిక్ వినియోగం తీసుకున్నట్టయితే , ఎలిమినేట్ యూజ్ ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్ అనేది వచ్చింది . అంటే ప్లాస్టిక్ బ్యాగులను ఇంటికి తీసుకువచ్చి ఒకసారే వాడి పడేయకుండా దాన్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగించి ఇక అది పనికిరాదు అనుకున్నప్పుడే పడవేయడం . ఎన్నో ఏళ్ల క్రితం పాతిన దైనా ప్లాస్టిక్ అనేది భూమిలో కరిగిపోని వస్తువు. ఇది భూ పర్యావరణానికి హాని చేస్తుంది . అంటే తద్వారా మానవాళికి హాని జరుగుతుంది అని అర్థం. దీన్ని కంట్రోల్ చేయడం కొరకు జూలై 3ను వరల్డ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఫ్రీ డే గా ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ లేని జీవితాన్ని ఊహించడం కష్టమై పోయిన కాలమిది. ఈ సమస్యల నుండి బయట పడడానికి కొత్త కొత్త ప్రయోగాలు శాస్త్రజ్ఞులు చేయవలసి వస్తున్నది . ఇందులో భాగంగా , ప్లాస్టిక్ అనేది నాన్ బయోడిగ్రేడబుల్ థింగ్ కాబట్టి దాన్ని అంటే వాడి పడేసిన ప్లాస్టిక్ ను సిమెంటు లో కలిపి రహదారి రోడ్డు వేయడానికి వాడుతున్నారు. ఇలా ఒకదానితో మరొకటి ముడిపడి సమస్యలు , పరిష్కారాలు ఇదే నేటి గ్లోబలైజేషన్ కు కారణం అవుతున్నాయి.
ఇవన్నీ , ఈ నష్టాలన్నీ తగ్గాలంటే పచ్చదనంతో కళకళలాడే గృహ వాతావరణం, మహా వృక్షాల సమేతమైన మహారణ్యాల పెంపకం పైన దృష్టి పెట్టాలి. ఇదే తక్షణ కర్తవ్యం.
**
మయూఖ పత్రిక పాఠకులకు కొన్ని విషయాలు:-
మయూఖ పత్రిక open చేయగానే సంపాదకీయం పైన కుడివైపు చిన్న 3 గీతలు ఉంటాయి వాటిని క్లిక్ చేస్తే విషయ సూచిక వస్తుంది. మీకు వరుసగా కవితలు, వ్యాసాలు, కథలు, అనువాద సాహిత్యం, బాల సాహిత్యం, పుస్తక సమీక్ష లు , ఇంద్రధనుస్సు , ధారావాహిక నవల వంటి విషయాలు కనిపిస్తాయి. ఏది చదవాలనుకుంటే దానిపైన క్లిక్ చేస్తే అవి వస్తాయి . ఇంద్రధనుస్సు లో వివిధ కళ లో సమాహారం గా , సినీ గేయ విశ్లేషణ , కార్టూన్లు, చురకలు, యాదాద్రీశ వైభవమ్,అనర్ఘరత్నాలు, గళ్ళ నుడికట్టు వంటి అంశాల తో ఉంటుంది .
పాత సంచికలు చదవాలంటే స్క్రీన్ ను పైకి జరిపితే కనిపిస్తాయి . ఏ రచయిత పేరు పైన క్లిక్ చేస్తే ఆ రచయిత ఇదివరకు రాసిన అంశాలు కూడా వస్తాయి. స్క్రీన్ పైకి అంటుంటే పాత ఆర్టికల్ లు వస్తాయి. మీ అభిప్రాయాలు పెట్టవచ్చు.
తెలుగు సాహిత్యం కోసం కృషి చేస్తున్న మయూఖ పత్రిక తెలుగు వారి సాహిత్యాభిలాష కోసమే పనిచేస్తున్నది. మీ మీ రచనలను
mayuukhathemagazine@gmail.com కు పంపించ గలరని మనవి చేస్తున్నాను.
మరో విషయం మయూఖ వచన కవితల పోటీ లో బహుమతులు గెలుచుకున్న కవితలను ప్రత్యేక సంచికగా తీసుకొస్తాము అని తెలియజేస్తున్నాను .
*_