అనగనగా ఒక రాజు. అతని పేరు పగ్నాషియన్. అతనికి బాల్యం నుండి కొట్లాట ఆటలే ఇష్టము. చెక్క గుఱ్ఱం ఎక్కి కఱ్ఱ ఖడ్గం తిప్పుతూ ఊగుతూ సంతోషంగా ఆడుకునేవాడు. అతను పెరిగి పెద్దవాడయ్యాడు. యువరాజు అయ్యాడు. అతను రాజు అయిన వెంటనే మావుడ్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.
అతను ప్రతీ యుద్ధంలో పాల్గొనేవాడు. అతనికి ఎప్పుడు యుద్ధకాంక్షే. అతను ఎప్పుడూ స్నేహం వద్దు, యుద్ధం ముద్దు అనుకునేవాడు. అతని యుద్ధాల వలన పక్క రాష్ట్రాల రాజులకు కష్టం, నష్టం జరుగుతుండేది. ఈ తలనొప్పి తగ్గించుకోవడం కోసం పక్క మూడు రాష్ట్రాల రాజులు కలిసి ఒక ఒడంబడిక చేసుకున్నారు, ఇతనికి గుణపాఠం నేర్పాలని. ఇతనిపై సవాలు విసిరారు.
ఇది సామాన్యమైన యుద్ధం కాదని భార్యతో చెప్పాడు. తను ఒక సంవత్సరం వరకు తిరిగి రాకపోతే తను ప్రపంచంలో లేననుకొని లేక జైల్లో బంధించబడినానని అనుకొని నీవు స్వేచ్ఛగా వేరే వివాహం చేసుకో అని చెప్పాడు. అంతవరకు ఒంటరిగా వుండలేవు కాబట్టి నీవు రాత్రిళ్ళు పొద్దుపోయే వరకు మన న్యాయశాఖ పెద్ద గుమాస్తాచేత పుస్తకాలు చదివించుకో. అతను ప్రపంచంలో జీవించి లేననుకోమనే మాట ఆమె మనసుకు బాధను కలిగించింది. అయినా ఒంటరిగా కాలక్షేపం చేయడం కష్టమనుకొని భర్త చెప్పిన పెద్ద గుమాస్తాతో రాత్రిళ్ళు పుస్తకాలు చదివించుకుంటూ వుండమన్న మాట కొంత నయమనుకుంది.
ఆ పెద్దగుమాస్తా కోటలో వున్న పుస్తకాలన్నీ అరడజన్ సార్లు ఇదివరకే చదివేశాడు. అతను చాలా గౌరవంగా రాణీగారికి కొన్ని పుస్తకాలు, మరికొన్ని ఆయన రాసినవి ప్రతిరోజు చాలాసేపు వరకు చదివి వినిపించేవాడు. ఆమెగారు అతనితో సంతోషంగా మాట్లాడుతూ ఆ కథలన్నీ వింటూ ఒక సంవత్సరంపైన ఒక దినం కాలం గడిపింది.
భర్త చెప్పిన కాలం గడిచింది కాబట్టి, గుమాస్తాతో తనను వివాహం చేసుకోమని కోరింది రాణి. దానికి గుమాస్తా నేను ధన్యుడను మహారాణి. కానీ నేను చాలా మామూలు వాడిని. మీరు రాజ వంశీయులు. అదీగాక రాజు ఏదైన జైలులో బంధింపబడి ఉండవచ్చు. నాకు ఇష్టం లేదని చెప్పను కాని, ఇంకొక సంవత్సరం, ఒక దినం వేచి ఉండటం మంచిదన్నాడు. ఆ సమయం కూడా గడిచింది. కానీ రాజు రాలేదు.
రాజు పగ్నాషియస్ యుద్ధంలో చంపబడలేదు. కానీ అతడ్ని గాయపరిచి రెండు సంవత్సరాలు జైలుశిక్ష విధించాడు రాజు లిటిల్ గోర్ము. అతను మూడు ప్రక్క రాష్ట్రాల ప్రతినిధి రాజు. ఆ సమయం గడిచాక రాజు పగ్నాషియస్ ను అతను జైలు నుండి విడిపిస్తూ ఇప్పుడు నీకు యుద్ధకాంక్ష జబ్బు కుదిరందనుకుంటా అన్నాడు. ఇకముందు నీపై జాలి చూపను. యుద్ధభూమిలో పట్టుబడితే నీ తల నరికేయబడుతుంది. ఇప్పుడు నిన్ను వదిలి పెడుతున్నాను. రాజు లిటిల్ గోర్ము, పగ్నాషియస్ గుఱ్ఱాన్ని జుర్మానా కింద తన వద్దనే ఉంచుకున్నాడు. కాబట్టి పగ్నాషియస్ తన ఇంటికి నడిచి పోవలసి వచ్చింది.
అతను నడిచి నడిచి చివరకు తన కోట చేరేవరకు అక్కడ పెండ్లికి జోరుగ తయారీలు అవుతున్నాయి. ఎందుకనగా గుమాస్తా పెట్టిన రెండు సంవత్సరాల ఒక దినం గడువు పూర్తి అయింది. పగ్నాషియస్ అప్పటికి రాలేదు, కాబట్టి గుమాస్తా వివాహానికి ఒప్పుకున్నాడు.
అప్పుడు ఆ రాణి ఆ గుమాస్తా తను మామూలువాడినన్న మాటను మదిలో ఉంచుకొని, అతడిని రాజవంశంలో చేర్చి, రాజ్య వ్యవహారాలు చూచే అర్హత ఇచ్చింది. ఇప్పుడు అతను ఆమెకు తగిన వాడైనాడు. వారు వారి పెండ్లి వేడుకలకు గొప్ప ఏర్పాటు చేశారు. దానికి దూర దూరాలనుండి రాజులు, ధనికులు, గొప్పవారు అక్కడికి చేరారు. వచ్చిన వారిలో రాజు లిటిల్ గోర్ము రాణి మావుడ్ కు శుభాకాంక్షలు తెలిపాడు, కాని రాజు పగ్నాషియస్ గురించి ఏమీ అడగలేదు. కేవలం ఒక ముసిముసి నవ్వు నవ్వాడు.
విందు భోజనాలు చివరకు వచ్చేవరకు పగ్నాషియస్ కోట వద్దకు చేరాడు. ఆ చింపిరి వెంట్రుకల నెత్తితో, చిరిగిన గుడ్డల్లో ఉన్న తమ రాజును ఖడ్గం మరియు గుఱ్ఱం లేనందున ఎవరూ కూడా గుర్తించలేదు. పగ్నాషియస్ బాధతో కన్నీరు కార్చాడు. తను యుద్ధం వలన రాజ్యాన్ని, ధనాన్ని, చివరకు తన భార్యను కూడా పోగొట్టుకున్నానని అంటూ మూల్గాడు. నా పని అయిపోయిందన్నాడు. నౌకర్ల ఇండ్లలో అతనికి ఒక కోడి కాలును తినేందుకు ఇచ్చారు. అది తిని నోరు మరియు కండ్లు తుడుచుకొని వెళ్ళిపోయాడు ఎక్కడికో. ఎక్కడికి పోయాడో ఎవరికి తెలియదు. కనీసం తన పాత రాజ్యంలో మరెప్పుడూ కనబడలేదు. అతను చివరకు అనుకున్నాడు. స్నేహం ముద్దు, యుద్ధం వద్దు. అది ఆనాటికే కాదు, ఏనాటికైనా అదే సత్యం .అదే క్షేమం. ఇదే అతనిలో కలిగిన పరివర్తన.
ఒద్దిరాజు మురళీధరంరావు
పూర్వం ఒక క్రూరమైన మారుతల్లి. ఆమె భర్తపేరు మ్యాలెట్. ఆమెకు ఇద్దరు కూతుర్లు. రోజీ ఆమె స్వంత కూతురు. జానీ ఆమె చనిపోయిన సవతి కూతురు. పొద్దున్నే ఆమె కూతురు రోజీకి కడుపు నిండా రుచికరమైన కోడి కూర, మాంసముతో నింపబడిన పావురము తినడానికి ఇచ్చింది. ఏదో మిగిలింది చాలీ చాలనిది జానీకి ఇస్తుండేది.
రోజీ ఏ చిన్న పని కూడా ముట్టుకోకపోయేది. మొత్తం ఇంటిపని ఉదయం నుండి సాయంత్రం వరకు జానీతో చేయించేది మారుతల్లి. అయినా మెచ్చుకోకపోయేది.
రోజీ ఎప్పుడు మంచి సిల్కు మరియు ఖరీదైన వులన్ దుస్తులు ధరించేది. జానీకి మాత్రం మామూలు కాటన్ దుస్తులు ఉండేవి.
అది జనవరి మాసం. బయట మొత్తం మంచు, విపరీతమైన చలి. చాలా మటుకు అందరు చలికి తాళలేక మంటల దగ్గర కూర్చునేది. ఒకసారి మారుతల్లి బయటికి తొంగి చూసేవరకు చలికి ముక్కు ఎర్రబడింది.
ఎంతో ప్రేమ నటిస్తూ నోట్లో పంచదార ఉన్నట్లు ఓ నా ముద్దుల జానీ అని పిలిచి నాకు మన ఇంట్లో టేబుల్పై గాజు వేజులో లిల్లీ పూల సువాసన ఆనందించాలని ఉంది. నీవు వెళ్ళి అడవి లోయలో పూసే లిల్లీ పూలు తీసుకరా అని అంది. అందుకు జానీ అమ్మా ఇది జనవరి మాసం, ఇప్పుడు లిల్లీలు వుండవు కదా. ఆ మాట పట్టించుకోకుండా జానీని డోర్ తీసి బయటికి నెట్టి వెనుక నుండి డోరు ఢబీల్న మూసేసింది. విధిలేక జానీ ఆ చలిలో అడుగుపెడితే జారే మంచుపై, అతి కష్టంగా నడుస్తూ అడవిలోకి చేరింది. ఆ అడవిలో ఆమె పన్నెండు మంది యువకులను చూసింది. వారు వేసవికాల దుస్తుల్లో వున్నారు. ఒకడు మాత్రం మేకతోలు కోటు వేసుకొని ఉన్నాడు. అతనే వారి లీడరు. వాళ్ళు ఈ అమ్మాయిని చూసి ఆశ్చర్యపడి జాలితో ఎక్కడికి వెళ్తున్నావని అడిగారు. ఆమె కథంతా వాళ్ళకు చెప్పింది. అప్పుడు వారిలో ఒకతని జేబు నుండి లిల్లీ పూలు తీసి ఇచ్చాడు. అవి పట్టుకొని ఇల్లు చేరింది. మారుతల్లికి ఈమె తిరిగి వచ్చినందుకు కోపమే కాని లిల్లీలు తెచ్చిందని లోనికి రానిచ్చింది.
మరుసటి రోజు ఎంతో ప్రేమను నటిస్తూ నా ప్రియమైన జానీ, నాకు బాస్కెటు నిండా స్ట్రాబెర్రీసు అడవి నుండి తీసుకురా అంది మారుతల్లి. దాదాపు కన్నీరు పెట్టుకుని జానీ అంది, అమ్మా అవి జనవరిలో అవి పండవు కదా. నోరు ముయ్యి అని గద్దించింది మారుతల్లి. నీవు లిల్లీసు తెచ్చినవు గదా. అదే మాదిరిగ స్ట్రాబెర్రీసు తే అని జానీని బయటికి నెట్టి తలుపు మూసేసింది. పాపం అమ్మాయి మోకాళ్ళ మటుకు మంచులో, చలి గాలిలో మామూలు దుస్తుల్లో అడివికి చేరింది. అక్కడ ఆ పన్నెండు మంది యువకులు కలిశారు. వారితో ఆమె తన మారుతల్లి చెప్పిన విషయం చెప్పింది. ఆ యువకులకు కోపం వచ్చింది. మేకతోలు కోటు వేసుకున్నతను సరే నీకు స్ట్రాబెర్రీసు ఇస్తాను, కాని నీ మారుతల్లి జాగ్రత్త పడాలి. అతను తనవారిలో ఒకతనితో అమ్మాయి బ్యాగ్ నిండా రుచికరమైన స్ట్రాబెర్రీసు నింపమన్నాడు. నింపినాక వాటిపై అతను ఊదాడో, అదేంటో తెలియదు కానీ ఇది నీ మారుతల్లిని బాగు చేస్తుందన్నాడు. జానీ వారికి కృతజ్ఞతలు తెలిపి ఇల్లు చేరింది. ఆమె దారిలో వెచ్చదనం అనుభవించింది. మారుతల్లికి జానీ తిరిగి రావడం ఇష్టంలేక కోపించింది, కానీ స్ట్రాబెర్రీసు బాగా ఇష్టమైనవి. వాటిని తీసుకుని ఆమె, ఆమె కూతురు రోజీ గబగబా ఒక్క పండు మిగలకుండా తినేశారు. జానీకి పాపం ఒక్క పండు కూడా ఇవ్వలేదు. కానీ తల్లి బిడ్డ ఆ రాత్రి వానరాళ్ళు తిన్నట్లు చాలా కడుపునొప్పితో బాధపడ్డారు.
మరునాడు ఉదయం రోజీ మరియు ఆమె తల్లికి కొంత ఆరోగ్యం బాగయ్యింది. మారుతల్లి జానీని బయటకు పంపేందుకు ఏదో ఉపాయం ఆలోచించసాగింది. ప్రేమ ఒలకపోస్తూ ఓ నా ప్రియమైన జానీ, నువ్వు గోనెసంచీ తీసుకొని అడవికి అవతలివైపు వెళ్ళి అక్కడ పండే మంచి వెరైటీ వోర్ సిస్టర్ పియర్ మేన్స్ ఆపిల్సు సంచీ నిండ తెంపుక రా. జానీ ఈసారి ఏ అడ్డూ చెప్పకుండా ఒక నిట్టూర్పు తీసి బయటికి వెళ్ళింది. మంచులో మూడుసార్లు జారిపడింది. కాళ్ళకు దెబ్బలు తగిలి గాయాలయినాయి. ఎలాగో అడవి చేరింది. అక్కడ ఆ 12 మంది యువకులు కలిశారు. ఈమె చెప్పినట్లు సంచి నిండా ఆపీల్సు పెట్టించాడు మేకతోలు కోటులో ఉన్నతడు. ఓహో ఆమె గార్కి మంచి వెరైటీ ఆపిల్సు కావలసి వచ్చిందా అన్నాడు. సంచిలో పండ్లు నింపిన తరువాత వాటి మీద మూడుసార్లు చల్లని ఆవిరి వచ్చేట్లు ఊదాడు. ఇప్పుడు మారుతల్లి వీటిని అంతగా ఆనందించకపోవచ్చు అన్నాడు అతడు. ఆ బరువైన సంచి జానీకి ఒక ఈకవలె తేలికగా ఉండి ఆమె మంచు మీద మెత్తటి దారి మీద నడిచినట్లు నడిచి ఇల్లు చేరింది. అతను మీ చెల్లెలును వీటిని తినవద్దని చెప్పమన్నారు. ఆమె ఆ విషయం చెప్పినందుకు చెల్లెలు ఆమెను నెట్టివేసి తామే తినేశారు గబగబా. వారికి కడుపులో బాగా నొప్పి లేచింది. ఈ విశ్వాసం లేని అమ్మాయి దయ్యంతో కలిసి మనమీద కుట్ర చేసిందని మారుతల్లి అంది. వారి కడుపులో పేగులకు ఏమీ తెలీదు. కానీ వారు దూదిపింజల లాగ ఇంటి పొగ గొట్టం నుండి బయటపడి ఎంతో దూరం తేలిపోయారు. ఇంటిదారి ఎప్పటికీ దొరకలేదు. ఇంటి వద్ద తండ్రి, కూతురు వివాహమై తన మంచి భర్తతో కలిసి ముగ్గురు ఎప్పటికన్నా ఎక్కువ సంతోషంగా వుండిపోయారు. మారు తల్లికి తగిన శాస్తి జరిగింది.
ఇటలీ దేశంలో వెరోనా అనే పట్టణం. అక్కడ ధనికులైన క్యాపులెట్లు మరియు మోన్ ట్యాగో కుటుంబాలు ఉండేవి. వారి ఇద్దరి మధ్యన చాలా వైరం ఉండేది. వారే కాదు, వాళ్ళ నౌకర్లు కూడా ఒకరినొకరు సహించేవారు కాదు. వారు తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరిగేది.
క్యాపులెట్ల కుటుంబంలోని ఒక అందమైన అమ్మాయి జూలియట్. మొంటాగ్ కుటుంబంలోని రోమియో అనే అబ్బాయి.
లార్డు క్యాపులెట్ ఒక పార్టీ ఏర్పాటు చేసి అందరిని ఆహ్వానించమని నౌకర్లతో చెప్పాడు. అప్పుడు మారువేషంలో ఉన్న రోమియో కూడా పార్టీలో చేరాడు. అక్కడ అతను ఒక మూలన కూర్చున్న అందమైన అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆమె కూడా అతణ్ణి ఇష్టపడుతుంది. ఆమే జూలియట్.

వారి వివాహానికి మత సభ్యుడు (ఫ్రియర్) సరే అంటాడు. దీనితో ఆ రెండు కుటుంబాల మధ్య వున్న వివాదం కూడా సమసిపోగలదని అనుకొని వారి వివాహం చేసేందుకు ఒప్పుకున్నాడు. ఆమె నౌకర్ల సహాయంలో రోమియో తోటలోకి దూకాడు. ఆమె బంగ్లా పైనుండి చీర కిందికి జార విడిచింది. అది పట్టుకొని అతడు బంగ్లా పైకి ఎక్కి ఆ రాత్రి వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు. అది ఎవరికి తెలియదు. ఒకరి కొరకు ఒకరు తపించేవారు. అయితే జూలియట్ తండ్రి ఆమె వివాహం పారిస్ అనే అబ్బాయితో నిశ్చయించాడు. కాని ఆ సంబంధం తప్పించుకునేందుకు ఫ్రయర్ సహాయం కోరారు. జ్యూలియట్ మరియు రోమియో లది స్వచ్ఛమైన గ్రహించిన ఫ్రయర్ ఒక ఉపాయం చెప్పాడు.
జూలియట్ తండ్రి వీరి పెండ్లి కొరకు గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాడు. తీరా పెండ్లిరోజు ప్రయర్ సలహా ప్రకారం ఆమె చనిపోయినట్లు ఉండేందుకు నిద్రగోలీలు వేసుకొని పడుకుంటుంది. ఆమెను స్మశానం గొయ్యిలో పడుకోబెడుతారు. అప్పుడు ఫ్రయర్ సలహా ప్రకారం ఆమెకు నిద్ర నుండి తెలివి వచ్చేవరకు రోమియో వచ్చి ఆమెను లేపి తీసుకుపోవాలి. కానీ ఈ సలహా లేఖ అతనికి అందలేదు. ఎందుకంటే అతడు తన మిత్రుడు మెరికూషియోన్ను టైబాలుటు చంపినందుకు అతడిని రోమియో చంపేశాడు. అందుకు అక్కడి రాకుమారుడు ఎస్ క్యాలస్ రోమియోను దేశ బహిష్కరణ చేశాడు. అందువలన ఫ్రయర్ వేసిన ప్లాన్ అతనికి అందలేదు. అయినా ప్రపంచంలో చెడువార్తలు త్వరగా చేరుతాయి మంచివాటికన్నా ముందు. జూలియట్ మరణవార్త తెలిసి రోమియో ఆమె సమాధి వద్దకు వెళుతున్న సమయంలో పారిస్ అడ్డుపడుతాడు. ఇద్దరి మధ్య కొట్లాట జరిగి పారిస్ చనిపోతాడు. ప్రాణం పోయే చివరిథలో తనను జూలియట్ దగ్గరిలో పడుకోబెట్టమని కోరుతాడు. అట్లే చేశాడు రోమియో. రోమియో జూలియట్ మరణించి గొయ్యిలో పడివున్న దాన్ని చూసి మానసిక బాధ భరించలేక విషం తాగి చనిపోయాడు. ఇంతలో జూలియట్ మెలకువ వచ్చి ప్రక్కన ఉన్న శవాలను చూసి తీవ్రమైన బాధతో రోమియో బాకుతో తననుతాను పొడుచుకొని చనిపోతుంది.
ఎస్ క్యాలస్ రెండు కుటుంబాలను శాంతింప చేశాడు. అందువలన వాళ్ళ మధ్య వైరం పోయి స్నేహం ఏర్పడింది. మోన్ ట్యాగులు బంగారంతో జూలియట్ విగ్రహం మరియు క్యాపులెట్లు రోమియో బంగారు విగ్రహం ప్రక్కపక్కన నిలబెడుతామని వాగ్ధానం చేశారు.
”ఇటువంటి విషాధ ఘటన కథ జూలియట్ మరియు రోమియోలది, బహుశా ఇంతకుముందు ఎక్కడ జరగలేదేమో అని” రాకుమారుడు ఎస్ క్యాలస్ ప్రకటించాడు.
షేక్స్ పియర్ ఆంగ్లంలో 22 పేజీల్లో రచించిన కథ 2 పేజీల్లో తెలుగులో దాని సారాంశం ఇది. ఇక షేక్స్ పియర్ గురించి కొంత తెలుసుకుందాం.
ఒక చిన్న గ్రామంలో ఒక దర్జీ ఉండెను. అతనికి దేవాలయం దగ్గర చిన్న దుకాణం ఉన్నది. ఒక ఏనుగు ప్రతిరోజు ఇతని దుకాణం ముందునుండి నదిలో స్నానానికి పోతుంటుంది. ఆ దయగల దర్జీ దానికి అరటిపండ్లో లేక కొబ్బరికాయనో లేక బెల్లమో ఇస్తుండేవాడు. ఆ ఏనుగు ఆ వస్తువులను అతని చేతినుండి తీసుకుని తొండముతో దీవించేది. ఆ ఏనుగుకు ఆ దుకాణం ముందు ఆగి ఎదురు చూడడం అలవాటయ్యింది.

ఒకనాడు దర్జీ ఏదో చిరాకులో ఉన్నాడు. యథాప్రకారం ఆ ఏనుగు అతని దుకాణం ముందుకు వచ్చి నిలబడింది. ఆ దర్జీ దానికి ఏమీ ఇవ్వలేదు. ఏనుగు చాలా ఓపికగా నిలబడింది కానీ దర్జీ కనీసం దానివైపు కూడా చూడలేదు. ఏనుగు ఏదో ఒకటి తినేందుకు దర్జీ ఇవ్వాలని లాశిగా ఘీంకరించింది . ఇది దర్జీకి బాగా కోపం తెప్పించింది. అతను ఒక సూది తీసుకుని దాని తొండాన్ని గట్టిగా కుచ్చాడు. పాపం ఆ ఏనుగు చాలా బాధపడి వెళ్ళిపోయింది. దానికి దర్జీ ఎందుకు ఇలా చేసాడో అర్థం కాలేదు. కానీ అతనికి తగిన పాఠం చెప్పాలని నిశ్చయించుకుంది.
మరునాడు ఆ ఏనుగు స్నానానికి నదికి వెళ్ళింది. తిరిగి వస్తున్నపుడు దాని తొండం నిండా బురద నీరు నింపుకుంది. ఆ దర్జీ దుకాణం ముందు ఆగి బురద నీరంతా దుకాణంలోని కొత్త బట్టలపై కుమ్మరించింది. ఈ చర్యతో దర్జీ తన తప్పు తెలుసుకొని చాలా బాధపడ్డాడు. అతను మరల ఏనుగుతో స్నేహం చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ఏనుగు పట్టించుకోకుండా తిరిగి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి ఏనుగు దర్జీ దుకాణం వైపు వెళ్ళడం మానేసింది.
నీతి : మనం జంతువులను హింసించకూడదు.
ఎప్పటివలెనే పిల్లలు బిగ్గరా వాదించుకుంటున్నారు. ”ఈరోజు మీకు శ్రవణ్ కుమార్ కథ చెపుతాను”, అని తాతగారు చెప్పారు. ఆయన మాటలు మంత్రంలా పనిచేసింది. పిల్లల అల్లరి వెంటనే ఆగిపోయింది. తాతగారి కథ వినే కంటే ముందు వారి పాఠశాల పనులు పూర్తి చేయాలనుకున్నారు.
”శ్రవణ్ కుమార్ ఎవరు?” అని సుమన్ అడిగాడు, ఎప్పటిలా ఆగలేక. ఆ రాత్రి తాతగారు కథను చెప్పడం ప్రారంభించారు.
శ్రవణ్ కుమార్ ఒక బ్రాహ్మణ అబ్బాయి. అతని తల్లిదండ్రులు చాలా ముసలి వాళ్ళు, ఇద్దరూ గ్రుడ్డివారు. వారికి ఒక్కడే కుమారుడు శ్రవణ్ కుమార్. అతను చాలా ఓపికతో తల్లిదండ్రులకు సేవ చేసేవాడు. తన తల్లిదండ్రులను చాలా భక్తి, ప్రేమతో చూసేవాడు. వారు కూడా అతని గురించి గర్వంగా ఉండేవారు.
ఒకరోజు శ్రవణ్ కుమార్ తన తల్లిదండ్రులు మాట్లాడుకోవడం విన్నాడు.
”ఓహ్ా, నేను బనారస్ మరియు పుణ్యక్షేత్రాలు ఎలా వెళ్ళగలను” అని తల్లి అన్నది. ”అవును అది మాకు అసంభవమైన కథ”.
మనకు శ్రవణ్ కుమార్ వంటి కొడుకు ఉండటం మన అదృష్టం. అతను మనల్ని చాలా బాగా చూసుకుంటున్నాడు. మన కోరికల్ని అతని మీద మోపి అతనికి భారం కాకూడదని తండ్రి సౌమ్యంగా సమాధానం ఇచ్చాడు.
శ్రవణ్ కుమార్ తన తల్లిదండ్రుల కోరిక ఎలాగైనా తీర్చాలనుకున్నాడు. దూర ప్రయాణానికి అన్నీ సమకూర్చడం మొదలెట్టాడు. అతను వాళ్ళకు యాత్రలకు తీసుకుని పోగలడు. వారిని తన భుజాల మీద మోసుకుపోగల బలిష్టుడు శ్రవణ్ కుమార్. అతను వెదురుతో రెండు బుట్టలు తయారు చేసాడు. వాటిని ఒక కర్రకు అటూ ఇటూ కట్టాడు. తల్లిదండ్రులను చెరొక బుట్టలో కూర్చోబెట్టాడు. ఆ కఱ్ఱను తన విశాలమైన భుజాల మీద ఎత్తుకుని బయలుదేరాడు. (దీన్ని మనం కావడి అంటాం.)

శ్రవణ్ కుమార్ తన తల్లిదండ్రులను మోసుకుంటూ చాలారోజులు ప్రయాణం చేశాడు. అతను అడవులు, పర్వతాలు, గ్రామాలు, పట్టణాలను దాటి నడిచాడు. అతను అలసిపోయేంతవరకు ఆగకుండా నడిచాడు. అతను తన తల్లిదండ్రులను దింపి వారికి తినేందుకు ఏమైనా తేవాలనుకున్నాడు. ఆ అడవిలో తినేందుకు పండ్లు, దుంపలు ఉన్నాయి. రాత్రి విశ్రాంతి తీసుకున్న తరువాత శ్రవణ్ కుమార్ మళ్ళీ తల్లిదండ్రులతో సహా కర్రను లేపి మళ్ళీ నడక ప్రారంభించాడు.
వారు దారిలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నాడు. అలా వారు అయోధ్య చేరుకున్నారు. ఆ రోజు ఎండ ఎక్కువగా ఉంది. వారు అయోధ్య దగ్గరి అడవిని దాటుతునానరు. అతని తల్లిదండ్రులు దాహంతో తాగేందుకు నీళ్ళు అడిగారు. అతను వెంటనే వారిని జాగ్రత్తగా ఒక చెట్టునీడలో దింపి నీళ్లను వెతుక్కుంటూ వెళ్ళాడు.
అక్కడ అయోధ్యను పాలిస్తున్న థరథ మహారాజు ఆ అడవిలో వేటకు వచ్చాడు. అతను ఉదయం నుండి వేటకు తిరుగుతున్నాడు కానీ, ఏ జంతువు కూడా కనబడలేదు. ఆయన గొప్ప విలుకాడు. అతని వేట సామర్థ్యంపై విల్లు, బాణం కూడా ఎంతో గర్వపడేవి. వేటకోసం వెళుతూ తన పరివారాన్ని దాటి చాలాముందుకు వెళ్ళి ఒక్కడే అయినాడు.
శ్రవణ్ కుమార్ ఈలోపు సరయూనది యొక్క చిన్న కాలువను చూసాడు. అతను తన కుండలో నీళ్ళు నింపుకుంటున్నాడు. అక్కడికి దగ్గరలో వున్న థరథ మహారాజుకు నీళ్ళ శబ్దం విన్నాడు. ఆ ధ్వని వస్తున్న వైపుకు బాణం వేసాడు. వెంటనే ఒక మనిషి నొప్పితో గట్టిగా ఏడుస్తున్న శబ్దం వినబడింది. ఆ రాజు భయపడి ఆవైపు వేగంగా వెళ్ళాడు. ఆయన భయం నిజమైంది. అతను శరీరంలో గుచ్చుకున్న బాణంతో రక్తంలో పడి ఉన్నతన్ని చూసాడు.
”అయ్యో నేనెంత పని చేశాను? ఓ దేవుడా, నేనేమి చేశాను?” అని థరథ మహారాజు ఆ యువకున్ని తన ఒడిలోకి తీసుకుని తాగేందుకు నీళ్ళు ఇచ్చాడు. ఆ యువకుడు గాయపడి, కొద్దిపాటి ధ్యాసతో ఉన్నాడు.
”కుమారా, నీవెవరు? ఎక్కడినుండి వచ్చావు? త్వరగా చెప్పు, నేను నీ బాధ్యతను తీసుకుంటాను” అని ఎంతో విచారంగా అడిగాడు రాజు. దయతో నన్ను క్షమించు, నేను వేటకు వచ్చాను. ఈ అడవిలో ఎవరూ ఉండరనుకున్నాను. నేను థరథ మహారాజును, ఇప్పుడు నిన్ను నాతో తీసుకపోగలను.
నొప్పిలో కూడా శ్రవణ్ కుమార్ చిరునవ్వు నవ్వాడు. అతి కష్టంగా ”ఓ థరథ మహారాజా, మిమ్ముల చూడటం నాకు సంతోషం. మీ గురించి గొప్పగా విన్నాను. నేను మీరు తప్పు చేశారని అనుకోవడం లేదు. నాకు తెలుసు అది ఒక పొరపాటు. నా బాధ ఒకటే. అది నా తల్లిదండ్రులను ఇప్పుడు ఎవరు చూసుకుంటారు. ఇద్దరు గుడ్డివారు, వృద్ధులు. నేను వాళ్ళను యాత్రలకు తీసుకెళ్తున్నాను”
ఆ మహారాజు ఇది విని ఇంకా ఎక్కువ బాధపడినాడు. అతను తన చుట్టూ చూశాడు. మనుషుల జాడ కనపడలేదు. ఆ రాజు ఆ అడవిలో శ్రవణ్ కుమార్ కు సహాయపడేందుకు ఎవరూ లేనందున నిస్సహాయుడయ్యాడు.
”కుమారా, చెప్పు. నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు” అని అడిగాడు.
ఎంతో ప్రయత్నంతో శ్రవణ్ కుమార్ తల్లిదండ్రులను కూర్చోబెట్టిన వైపు చూపాడు. అతను చాలా నొప్పితో ఉన్నాడు. ”నీ తల్లిదండ్రుల గురించి బాధపడకు” థరథ మహారాజు అన్నాడు. ఇప్పటి నుండి వారి సంరక్షణ నేను చూసుకుంటాను. నేను వారి బాగోగులు నీ స్థానంలో ఉండి చూసుకుంటాను. శ్రవణ్ కుమార్ చూపిన వైపుకు గాయపడిన ఆయనను రాజు తన చేతులపై మోసుకుంటూ వెళ్ళాడు.
రాజు మాటలు విని తృప్తి చెందాడు. శ్రవణ్ కుమార్ రెండుచేతులు ఎత్తి రాజుకు నమస్కరించాడు. రాజు తన తల్లిదండ్రులను చూసుకుంటాడని తృప్తి చెంది, ప్రశాంతంగా శ్రవణ్ కుమారుడు చివరి శ్వాస విడిచాడు.
ఈలోపు శ్రవణ్ కుమార్ తల్లిదండ్రులు కుమారుని కోసం వేచి చూస్తున్నారు. ఇద్దరు గ్రుడ్డివాళ్ళు, తెలియని చోటు కాబట్టి కుమారుని కొరకు ఎటువైపుకు వెళ్ళాలో తెలియడం లేదు. ఒకరినొకరు పట్టుకుని శ్రవణ్ కుమార్ ను ఎన్నోసార్లు పిలిచారు. కానీ ఏ జవాబు రాలేదు. వారి అబ్బాయికి ఏదో ప్రమాదం జరిగి వుండవచ్చని భయపడ్డారు. కొన్ని నీళ్ళు తెచ్చేందుకు ఇంత సమయం పట్టదు.
థరథ మహారాజు వారి ఎదురుగా వచ్చేవరకు తమ కుమారున్ని పిలుస్తూ ఉన్నారు. అడుగుల చప్పుడు విని తల్లి ”ఇది నీవేనా నా అబ్బాయి? నీకు ఇంత సమయం ఎందుకయ్యింది. అక్కడ జవాబు లేదు. ”మేము భయపడుతున్నాము” దానికీ సమాధానం లేదు. అడుగుల చప్పుడు దగ్గరికి వస్తున్నప్పుడు అది వారి కుమారుడు కాదని గ్రహించారు. ఏదో తప్పు జరిగిందని గ్రహించారు.
”ఆగు అక్కడ!” శ్రవణ్ కుమార్ తండ్రి అరిచాడు. ”నీవెవరవు? శ్రవణ్ కుమార్ ఎక్కడ?”
థరథ మహారాజు తెలియకుండా తాను చేసిన పనికి మానసిక క్షోభ పడ్డాడు. వారి కుమారుని మరణం గురించి ఎలా చెప్పాలో తెలియడం లేదతనికి. కళ్ళల్లో నీరుతో ఆయన మర్యాదపూర్వకంగా ”నాన్నగారు, నేను అయోధ్య రాజు థరథుడను. నా వద్ద మీకొక దుర్వార్త ఉన్నది. దయచేసి కూర్చోండి వార్త వినేముందు. ఇది మీ కుమారుని గురించి”.
”ఏమంటున్నావు? మా కుమారున్ని ఏం చేశావు?” ఇద్దరూ భయంతో అడిగారు.
థరథ మహారాజు ముందుకు అడుగేసి మర్యాదగా శ్రవణ్ కుమార్ శరీరాన్ని వారి ముందు ఉంచాడు. ఆ రాజు శ్రవణ్ కుమార్ తల్లిదండ్రుల పాదాలపై పడి ”నాన్నగారు, అమ్మగారు దయచేసి మొదట నేను చెప్పేది వనండి. తర్వాత మీ ఇష్టమొచ్చినట్లు చేయవచ్చు. ఏం జరిగిందో నన్ను చెప్పనీయండి”.
అతను వారిని చెట్టునీడకు తీసుకపోయి కూర్చోబెట్టాడు. నేను ఈ అడవిలో వేటకు వచ్చాను. నీటి శబ్దం విన్నానో….” అతను మొదలు పెట్టి, వారికి జరిగినదంతా వివరించాడు.
”మా అబ్బాయి, నా కుమారుడు ఎక్కడ?” శ్రవణ్ కుమార్ తండ్రి అడిగాడు.
”ఒక తప్పు జరిగింది. అది తెలియక చేసినప్పటికీ, దయచేసి నా జీవితాంతం మీ సేవ చేయనీయండి” అని థరథ మహారాజు అన్నాడు.
”ఓ రాజా, నీకు క్షమాపణ లేదు. నీ అశ్రద్ధ ఒక్కడిని తీసుకోలేను. కానీ ముగ్గురు ప్రాణాల్ని. మేము సంపూర్ణంగా మా కుమారునిపై ఆధారపడి ఉన్నాము. అతను లేకుండా మేము చచ్చినవారితో సమానం. ఓ రాజువై నీ బాధ్యత మనుషులను, జంతువులను రక్షించుట నీ కర్తవ్యం. దానికి బదులుగా నీవు అమాయక జంతువులను నీ వినోదం కోసం చంపుతున్నావు. అవి నీకు ఏం హాని చేశాయని వాటిని నీవు చంపుతున్నావు?”
ఆ వృద్ధుని మాటలు రాజు కండ్లు తెరిపించాయి. అతను ఇకముందు ఎప్పుడూ జంతువులను వేటాడనని ఒట్టు పెట్టుకున్నాడు. ”దయతో నన్ను ఆశీర్వదించండి” అని రాజు థరథుడు అన్నాడు.
నీవు ఏమి చేసినా, మా అబ్బాయిని బతికించగలవా? అతను మా ప్రాణాలకు ధనాగారం నీకు తెలుసా? ఇన్ని సంవత్సరాల నుండి మమ్మల్ని ఎలా కాపాడుతున్నాడో తెలుసా? అతని స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు. ఓ రాజా, నీవు కూడా.
మీరు అనేది నేను ఒప్పుకుంటాను, ఎవరు కూడా శ్రవణ్ కుమార్ లా ఉండరు. అతను నిజంగా కర్తవ్యపాలకుడు మరియు బాగా ఇష్టపడే కుమారుడు. మరియు అతను అందుకు ఎప్పుడూ గుర్తుకుంటాడు” అని రాజు అన్నాడు.
దయచేసి నన్ను మిమ్మల్ని చూసుకోనీయండి. నేను మిమ్ముల్ని జాగ్రత్తగా చూసుకుంటానని మీ శ్రవణ్ కుమార్ కు మాటిచ్చాను”
”ఓ రాజా, మా కుమారున్ని పోగొట్టుకున్నాక మేము బతకడం వ్యర్థం? ఈ వయసులో మా అబ్బాయిని తీసేసుకున్నావు. నీవు కూడా ఇదే మాదిరిగా నీ పిల్లలు ఎవరూ నీ సంరక్షణకు దగ్గర లేనప్పుడు చనిపోతావు” అని శ్రవణ్ కుమార్ తండ్రి శపించాడు. మేము ఇప్పుడు పడుతున్న బాధ నీవు అప్పుడు అర్థమవుతుంది”
భరించలేని బాధతో శ్రవణ్ కుమారుని తల్లిదండ్రులు చనిపోయి తమ కుమారుని శవం పక్కనే పడిపోయారు.
థరథ మహారాజు ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. అతను శ్రవణ్ కుమార్, అతని తల్లిదండ్రుల అంత్యక్రియల కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు. ఇంతలో రాజు మనుషులు అతన్ని కలిశారు. వారు కూడా ఆ దురదృష్ట సంఘటన గురించి బాధపడినారు. తర్వాత వేటకు వెళ్ళిన అందరూ అయోధ్యకు తిరిగి చేరుకున్నారు. థరథ మహారాజు ఎంతో నిరుత్సాహంతో, విచారంతో దేనిపై ఆసక్తి లేకుండా ఉన్నాడు. అతన్ని శ్రవణ్ కుమార్ మరణం బాధిస్తుంది. ప్రజా సేవ కూడా జ్ఞాపకం చేయాల్సి వచ్చింది.
అనుకున్నట్లే శ్రవణ్ కుమార్ తల్లిదండ్రుల శాపం కార్యరూపం ధరించింది. అతని చివరి రోజుల్లో థరథుని కుమారులు ఎవరూ అతనితో లేరు. రాముడు మరియు లక్ష్మణుడు వనవాసానికి వెళ్ళారు. భరతుడు మరియు శత్రఘ్నుడు కూడా అతని మరణ సమయంలో అతనితో లేరు.
చివరికి రామా రామా అంటూ బాధతో ప్రాణాలు వదిలాడు థరథ మహారాజు.
ఈరోజు కూడా తల్లిదండ్రులపై చూపిన ప్రేమ మరియు చేసిన సేవ గురించి శ్రవణ్ కుమారుడిని జ్ఞాపకం చేసుకుంటారు.
ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు పశ్చిమ బెంగాల్ లో ఒక గొప్ప పండితుడు. వారు చాలా కఠినంగా క్రమశిక్షణ పాటిస్తూ సాదాసీదా జీవితాన్ని గడిపారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు వారిని ఎంతో గౌరవిస్తూ, ప్రేమతో చూసేవారు.
ఒకరోజు కలకత్తాలో వారిని గౌరవించేందుకు గొప్ప సభను ఏర్పాటు చేశారు. ఎంతోమంది ముఖ్యులను ఆ సభకు ఆహ్వానించారు. ప్రజలందరు మంచి డ్రెస్సుల్లో వారి వారి ఖరీదైన కార్లలో రావడం మొదలయింది. గేటు దగ్గర గేటు కీపర్ ఆహ్వానితుల కార్లను సభాస్థలానికి పంపిస్తున్నాడు. ఒక మనిషి నడుస్తూ గేటు వద్దకు వచ్చాడు. గేటు కీప్ ధోతీ, కుర్తా, శాలువా తన భుజాల చుట్టు వేసుకున్న ఆయనను చూశాడు. అతడు ఒక ఆహ్వానితుడిలాగా కనబడలేదు.
ఆ మనిషి గేటు కీపర్ ను ”ఇక్కడ ఏమి జరుగుతున్నదని” అడిగాడు.
”ఏం నీకు తెలియదా, ఒక గొప్ప వ్యక్తి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఇక్కడికి వస్తున్నారు. అతను ఈరోజు ఇక్కడ గౌరవింపబడుతున్నాడు. ఇక దయచేసి పక్కకు జరగండి. చాలామంది వస్తున్నారిప్పుడు” గేట్ కీపర్ జవాబిచ్చాడు.

”నేను ఈ ఆడిటోరియంలోకి వెళ్ళాల్సి ఉంది. ఇదిగో చూడు. నేను ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ని” అని ఆ మామూలు డ్రెస్ లో ఉన్న మనిషి అన్నాడు.
”నువ్వా !” గేట్ కీపర్ నవ్వడం ప్రారంభించాడు. ”నీవు నన్ను తెలివితక్కువ వాడిగా అనుకుంటున్నావా? విద్యాసాగర్ అనే మనిషి మామూలు డ్రెస్ లో కార్యక్రమానికి నడుచుకుంటూ వస్తాడని నన్ను నమ్మమంటావా? ఇప్పుడు. నువ్వు నా సమయాన్ని వృథా చేస్తున్నావు” అని అనుకుంటూ గార్డు ఆ మనిషిని పక్కకు తోసేసాడు.
ఈశ్వరచంద్ర విద్యాసాగర్ తనే గొప్ప మనిషి అయి కూడా మాట్లాడకుండా తిరిగి నడిచి వెళ్ళాడు. ఎవరో ఇతడ్ని గుర్తించి బయటికి పోతున్నవాడిని ఎంతో గౌరవంగా వెంట తీసుకొని ఆడిటోరియంలోకి వెళ్ళాడు. గార్డు చేసిన తప్పుకు సభ ఏర్పాటు చేసిన వ్యక్తులు క్షమాపణ కోరారు.
ఆ గొప్ప వ్యక్తి గార్డుపై కోపం తెలుపలేదు. ”అతను కేవలం అతని డ్యూటీ చేస్తున్నాడు” అన్నాడు. మరియు గార్డును తిట్టకుండా వారిని ఆపేశాడు.
వారికోసం ఏర్పాటు చేసిన సభ తరువాత, వారిని కొన్నిమాటలు మాట్లాడమని కోరారు.
”నా మిత్రులారా” అని మొదలుపెట్టారు. నేను ఈ రోజు ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాను. ఒక మనిషి తను వేసుకున్న బట్టలతో గుర్తింపబడతాడు. కానీ వాస్తవంగా లోపల అతడు / ఆమె ఏమిటో కాదు.
కార్యక్రమానికి వచ్చిన జనులు ఈ మాటలు విని తలలు వంచుకున్నారు. వారు గార్డు అతడిని పక్కకు నెట్టివేసిన ఘటన విన్నారు. ఆ సభకు వారందరూ మంచి మంచి డ్రెస్సుల్లో వచ్చారు. కానీ ఈ గొప్ప వ్యక్తి ఎవరైతే గౌరవింపబడుతున్నాడో చాలా మామూలు బట్టల్లో వచ్చారు.
పూర్వం సిద్ధార్థుడు అనే ఒక రాకుమారుడు ఉండేవాడు. అతడు దయగలవాడు. అతడు వయసులో చిన్నవాడైనప్పటికీ ఎవరు బాధపడుతున్నా ఇష్టపడేవాడు కాదు. అతను జంతువులను కూడా ప్రేమించేవాడు. అతను ఎప్పుడూ అందరినీ దయగా చూసేవాడు కాబట్టి అందరు అతన్ని ఇష్టపడేవారు.
ఒకరోజు రాజుగారి తోటలో సిద్ధార్థ నడుస్తుండగా, ఏదో బాధతో ఏడుస్తున్న శబ్దం విన్నాడు. వెంటనే తనముందు ఏదో పడింది. అతను అక్కడికి వెళ్ళి చూస్తే, ఒక అందమైన తెల్లని హంస ఉంది. అది నొప్పితో మూల్గుతున్నది. ఒక బాణం ఆ పక్షి శరీరంలో గుచ్చుకుని రక్తం కారుతుంది.
దాని అవస్థ చూసి బాధపడి రాకుమారుడు సిద్ధార్థ చాలా జాగ్రత్తగా ఆ పక్షిని లేపి తన చేతులపై పెట్టుకొన్నాడు. ”దాన్ని ముట్టుకోకు, అది నాది” అనే అరుపు విన్నాడు. సిద్ధార్థ అటు చూసేవరకు అతని మేనమామ కొడుకు దేవదత్ తనవైపు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతని ఒక చేతిలో ఒక బాణం ఉంది. రెండవ చేతిలో బాణాల పొదిలో నిండా బాణాలు ఉన్నాయి.
”ఆ పక్షి నాది, నాకు తిరిగి ఇచ్చేయి” అని అన్నాడు.
”ఈ పక్షి నాకు దొరికింది. నేను పాపం ఈ పక్షిని జాగ్రత్తగా చూసుకుంటాను” అన్నాడు సిద్ధార్థ.
”నేను ఆ పక్షిని బాణంతో కొట్టి పడేశాను, కాబట్టి అది నాది” అన్నాడు దేవదత్.

ఇద్దరు వాదులాడుకొంటున్నారు. చివరకు వారు తీర్పు కోసం రాజుగారి దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. రాజు శుద్ధోదనుడు దర్భారు నడిపిస్తున్నాడు. ఇద్దరు బాలురు లోనికి వెళ్ళి వారికి తీర్పు కావాలని కోరారు.
”చెప్పండి మాకు, మీ సమస్య ఏమిటి, మేము వింటున్నాము”, రాజు శుద్ధోధనుడు అన్నాడు.
దేవదత్ ”మహారాజా! సిద్ధార్థ నా పక్షిని తీసుకున్నాడు. నేను బాణంతో ఆ పక్షిని పడేశాను, కాబట్టి అది నాదే. దయచేసి నా పక్షిని నాకు ఇప్పించండి” అన్నాడు.
”రాకుమార సిద్ధార్థ ఇది నిజమేనా?” అడిగాడు శుద్ధోధనుడు.
”మహారాజా, ఈ పక్షి ఘోరంగా గాయపడి తోటలో పడి ఉంది. నేను దాన్ని పైకి లేవదీశాను” అన్నాడు సిద్ధార్థ.
”తరువాత” సిద్ధార్థ చెప్పసాగాడు, ”నేను దాని గాయాన్ని శుభ్రపరిచాను. ఇప్పుడు అది కోలుకుంటున్నది. నేను దాన్ని చంపనీయను. ఎవరికి కూడా ఇతరుల ప్రాణం తీసే హక్కు లేదు. నేను దాన్ని అతనికి ఇవ్వను” అన్నాడు.
రాజ దర్భారు (కోర్ట్)లో ఉన్న ప్రజలందరు రాకుమారుడు సిద్ధార్థ చూపిన దయకు ముగ్ధులైనారు. వారు రాజు గారి తీర్పు కొరకు ఎదురు చూస్తున్నారు.
రాజు సమస్యపై విచారణ చేసి, అతని నిర్ణయం వెలిబుచ్చాడు.
కేవలం సృష్టికర్తకే ప్రాణాన్ని తీసుకునే హక్కు ఉంటుంది. ఒకరు చేసిన సృష్టిని వేరే వారు నాశనం చేసే హక్కు ఉండదు. ఈ కేసులో దేవదత్ పక్షిని చంపే ప్రయత్నం చేశాడు. కాని సిద్ధార్థ దాన్ని రక్షించాడు.
కాబట్టి ప్రాణం తీసే వ్యక్తి కన్నా, ప్రాణాన్ని కాపాడిన వారికి ఎక్కువ హక్కు ఉంటుంది. కనుక ఆ పక్షి సిద్ధార్థకు చెందుతుంది కానీ దేవదత్ కు చెందదు.
రాకుమారుడు సిద్ధార్థ ఇది విని చాలా సంతోషించాడు. దర్భారులో ఉన్న ప్రజలు కూడా అంత తెలివైన, దయగల రాజు పాలనలో ఉన్నందుకు చాలా ఆనందించారు.
”ఆ యువ రాకుమారుడు ఎవరో మీకు తెలుసా?” కథ చెప్పిన తరువాత తాతగారు అడిగారు. ”అతను ఇంచా చాలా నెమ్మదస్తుడు మరియు దయగల వాడిగా ఎదిగాడు. అతను కేవలం దయగల వాడేగాక తన చుట్టు ఉన్నవారికి కూడా బోధించేవాడు. అతను గౌతమ బుద్ధుడు”.
మూలం:- డా॥ బి.జి రమేష్ గారు.
అనువాదకులు:- ఒద్దిరాజు మురళీధర్ రావు గారు.
పాశ్చాత్య దేశాలతో పోల్చుకున్నప్పుడు మన తెలుగు భాషలో బాలలసాహిత్యం తక్కువనే చెప్పాలి. ముఖ్యంగా ఉన్న ఆ కొద్ది రచనలు పిల్లలకు చేరువ కావడం లేదు.. దానికి కారణం
” తిలాపాపం తలా పిడికెడు” అన్నట్టు సృజనాత్మక త అంతగా లేని మూస విద్యావిధానంలో విద్యార్థులు “హోం వర్కు” తోనే అధిక సమయం మరియు అధిక భారంతో గడపడంతో సమయం లేక పోవడం, తల్లిదండ్రులు ఉద్యోగస్తులైతే ఇల్లు చేరే సరికే పిల్లలు నిద్రలోనూ…. నిద్రావస్థలో ను ఉండడం, ముఖ్యంగా కొందరు తల్లులకు పిల్లల చేత ఎలాంటి పుస్తకాలు చదివించాలనే ఎంపికలో అవకాశాలు లేకపోవడమనే నాకనిపిస్తుంది… ఆ లోటు పూడ్చడానికా? అన్నట్టుగా డా.బి.జి రమేష్ గారి ఆంగ్లంలో రాసిన పిల్లల కథలు విలువలు నేర్పే దిశగా సాగాయి.

మూల రచయిత రమేష్ గారు కన్నడ ప్రాంతానికి చెందిన రచయిత, మైసూరు జిల్లా లోని హోనాసోగే గ్రామానికి చెందిన వారు. వీరు ఎన్నో గ్రంథాలను రచించారు. అందులో ఈ ” Bed time stories ” అనే కథల పుస్తకాన్ని గౌరవనీయులు ఒద్దిరాజు మురళీధర్ రావు గారు తేలిక తెలుగు భాషలో పిల్లలకు ఎవరి సహాయం లేకుండానే అర్థమయ్యేటట్టు గా అనువదించారు.
అనువాదం చేయడం అంత సులువేమీ కాదు. ఒక భాష వస్తే సరిపోదు! అక్కడి కథను ఇక్కడ అన్వయిస్తూ చెప్పాలి. ఎందుకంటే మూలంలోని పరిసరాలు, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలువేరు. అయినా వాటికి లోటు లేకుండా… మూల రచయిత భావం, సహజత్వం చెడకుండా తనదైన భాషా శైలి లో బాల బాలికలకు అందించడం కష్టమే అయినా మురళీధర్ రావు గారికి ఇదివరలో రవీంద్రనాథ్ ఠాగూర్, లియో టాల్స్టాయ్ వంటి రచనలను అనువదించిన అనుభవం ఉంది. అంతేకాదు మూల భాష మరియు లక్ష్య భాష రెండూ చక్కగా తెలుసుకాబట్టి మూలంలోని విషయం చెడకుండా కథలంటే ఇష్టపడే చిన్నారులకుచక్కగా అనువదించ�
ఒకనాడు తీవ్రమైన ఎండలో మధ్యాహ్నం ఒక ముసలతను పల్లెటూరు
బాటెంబడి నడిచి వస్తున్నాడు. అతను అలసిపోయాడు. దాహంతో ఉన్నాడు. రోడ్డు
ప్రక్కనే అతను ఒక చిన్న నిత్యవసరాల కొట్టు చూశాడు. దాని పైకప్పు రేకులది,
గోడలు మట్టివి. దాుకాణ్దారు లోపల విసురుకుంటూ ఈగలను పారదోలుతూ
భరించరాని వేడిలో కూర్చొని ఉన్నాడు. కొట్టు ముందాు ఒక బెంచ్ వుంది. సాయంత్రం
అయ్యాక గ్రామస్థులు అక్కడకు చేరి కలుస్తుండేవారు. ఆ ముసలతను చేతకాక ఆ
బెంచ్ మీదా వాలిపోయాడు. కొద్దిసేపు కూడ మాట్లాడలేనంతగా అలసిపోయాడు.
చివరకు అతను నోరు తెరచి ఒక్కమాట అన్నాడు, ”నీరు!” అని.
ఇప్పుడు ఈ గ్రామం తీవ్ర సమస్యను ఎదాుర్కుంటున్నది. ఇది ఎడరికి
దాగ్గరలో ఉంది. ఇక్కడ వర్షాలు సంవత్సరానికి ఒకసారి వచ్చి కుంటలు, బావులు
నింపుతాయి. కానీ వర్షాలు రాక రెండు సంవత్సరాలు అయ్యింది. గ్రామస్తులు
దాూరాన ఉన్న కాలువ నుండి నీరు తెచ్చుకుంటున్నారు. ప్రతి ఉదాయం మగవారు,
ఆడవారు గుంపులుగా చాలాదాూరం నడిచి ఆ చిన్నకాలువలో వారి కుండలలో నీరు
నింపుకొని వచ్చి రోజంతా ఆ నీరే వాడుకునేవారు. ఆ విలువైన నీటిబొట్టును కూడ
అతి జాగ్రత్తగా వాడుకునేవారు.
అయినప్పటికి దాహంతో ఉన్న ముసలతనికి నీరు లేదాని ఎలా చెప్పగలవు
నీవు? వేరే ఆలోచించకుండ కొట్టతను రవి చాలా దాయగలవాడు, తన కుండ
నుండి ఒక గ్లాసెడు నీరు ముసలతనికి ఇచ్చాడు. ఆ మనిషి అత్యాశతో ఆ నీరు
తాగేశాడు. అప్పుడు అతను ఇంకొక శబ్దం పలికాడు. ‘ఎక్కువ!’ అని, రవి కొరకు
ఆగకుండ అతను ఒక గంతు వేసి కుండను లేబట్టి పెదావులకు ఆనించి మొత్తం నీరు
ఒక చుక్క కూడ రవికి లేకుండ తాగేశాడు.
పాపం రవి ఏం చేయగలడు? అతను కేవలం భయంతో కనురెప్ప
వాల్చకుండ చూశాడు. అప్పుడు అతను తనలోతను అనుకున్నాడు, ‘ఫర్వాలేదాు,
నేను ఒకతని అవసరానికి సహాయం చేశాను, ఇంతే గదా.
ఆ కొత్తతను, ఇంతలో తృప్తిగా కనిపించాడు. అతను కుండను రవికి
తిరిగి ఇచ్చాడు సంతోషంగా. అందాుకు రవికి తృప్తి అయింది. రవితో ఆ వృద్ధుడు,
నా ప్రియమైన అబ్బాయి, ఎల్లపుడు ఇట్లే దాయతో వుండు. నాకు చేసినట్లే నావలె
వచ్చేవారికి సహాయపడు, నిన్ను దీవిస్తారు. అప్పుడు అతని చేతిక్ఱోను తీసుకొని
నెమ్మదిగా రోడ్డు వెంబడి కుంటుతూ నడిచి వెళ్ళాడు. రవి కొత్త ముసలతను కనబడేంత
వరకు చూసి, తను షాపులోకి తిరిగి వచ్చాడు.
ఆ మధ్యాహ్నం వేడి విపరీతంగా ఉంది. కొద్దిసేపయ్యాక రవికి తీవ్రమైన
తలనొప్పి వచ్చింది. అతని పెదావులు ఆరిపోయాయి. గొంతు ఎండిపోయింది,
విపరీతమైన దాప్పిక అయింది. అతనికి వాస్తవంగా తానేరు అవసరమైంది. కాని ఆ
యాత్రికుడు మొత్తం నీళ్ళు తాగేశాడు. ఒకటో, రెండో చుక్కలు దొరకవా అని కుండను
లేపి పెదావుల దాగ్గర వంచాడు. అతనికి ఆశ్చర్యమేసింది. ఎప్పుడైతే కుండలోని
నీటిధార తన ముఖంపై పడిందో ? అది తీయగా ఉంది, కొత్త శక్తినిచ్చే ఆ నీరు
అతని దాప్పిక తీర్చడమే గాక అతని తలనొప్పిని కూడ పోగొట్టింది.
రవి ఆ నీటికుండను కనురెప్ప వాల్చకుండ చూస్తున్నాడు ఏమయిందాని.
అప్పుడే కుంటుకుంటూ షాపుకు చేరాడు కరీం. కరీం యువకుడు. అతనికి కొన్నేండ్ల
క్రితం జరిగిన ప్రమాదాంలో కాలుకు దెబ్బ తగిలి కుంటివాడయ్యాడు. ఎప్పుడైతే
అతను ఆరోగ్యంగా లేక మరియు అలసట చెందాడో, అతని కుంటికాలు చాలా
బాధా పెట్టింది. కరీం కూడ షాపు ముందాు బెంచ్పై పడిపోయి, ముసలతని వలె
గాలి పీల్చుకోలేకపోయాడు. అప్పుడు అతను తన జేబు నుండి కావలసిన సరుకుల
లిస్టు రవికి అందించాడు. రవి సరుకులను ప్యాక్ చేస్తున్నపుడు కరీం ఒక చిన్నమూట
విప్పి దానిలోని పదార్థాన్ని భోజనంగా తిని బెంచ్పై కూర్చున్నాడు. చివరకు అతను
దాస్తీతో మూతి తుడుచుకొని రవి నీటికుండ వైపు చెయ్యి చూపాడు. ‘నేనొక గుటక
నీరు తీసుకోవచ్చా? ఇప్పుడు బాగా వేడిగా ఉంది’.
రవి ఏదో పప్పు కొలుస్తున్నాడు. అతను చూడకుండ, ‘నేను నీకు కొంత
నీరు ఇవ్వడనికి సంతోషిస్తాను. కానీ ఎవరో ఒకతను దానిలోని నీరు చాలావరకు
తాగేశాడు. అప్పుడు నాకు బాగు లేకుండెను, అప్పుడు నేను అందాులోని చివరి
బొట్టు కూడ తాగేశాను.’ అన్నాడు.
‘ఏమంటున్నావు మిత్రమా? నేను కుండ నిండ నీరు నిండి బయటికి
వస్తున్నట్లు చూస్తున్నాను!”
రవి పైకి చూశాడు, నమ్మలేక రెప్పవాల్చకుండ చూశాడు. అతని కండ్ల
ముందే కరీం గ్లాసెడు నీరు తీసుకొని తాగాడు, తరువాత సరుకుల డబ్బులు ఇచ్చి
38
వెళ్ళిపోయాడు.
అతని కుంటితనం దాదాపు పోయిందా? అని రవి కరీం వెళుతుంటే
చూశాడు బయటికి వచ్చి. ఎండ వల్ల అతను సరిగా చూడలేకపోతున్నానని అనుకొని
షాపులోకి తిరిగి వచ్చి చల్లగా ఉన్నందాున కునుకు తీశాడు.
ఎవరో తన పేరుపెట్టి అర్జెంటుగా పిలుస్తున్నట్లు విని లేచాడు. అతను
కండ్లు తెరిచి కరీంను చూశాడు. ఈసారి అతను తన చెల్లెలు ఫాతిమా చెయ్యి
పట్టుకొని ఉన్నాడు. అన్నా, నిద్రా లే, మాకు నీతో అవసరం ఉంది అని కరీం
కోరాడు.
‘ఎ ఎ ఏంటి? ఏమైనా బాగు లేదా?”
‘ఫాతిమా జ్వరంతో మాడిపోతున్నది!’
‘అయితే డక్టర్ దాగ్గరికి తీసుకపో, ఆమెను ఈ షాపుకు ఎందాుకు తీసుకు
వచ్చావు?’
కరీం ఇతని వైపు నిలకడగా చూస్తూ అన్నాడు, నీవు నాకు ఎట్లు బాగు
చేశావో తెలియదా? నా కాలు చాలా సంవత్సరాలు నన్ను ఇబ్బంది పెడుతున్నది.
దానంతట అదే బాగయింది, నీ గారడి కుండ నుండి తాగిన నీరుతో, ఫాతిమాకు
కొన్ని నీళ్ళు ఇవ్వు. నాకు నమ్మకం ఉంది, దానితో ఫాతిమా జ్వరం తగ్గుతుందాని.
రవి ఆశ్చర్యపడినాడు. గారడి కుండయా? నయం చేసే నీరా? కరీంకు
ఏమి తోచడం లేదాు. అయినప్పటికి ఫాతిమాకు కుండలో నీరు అందించాడు. ఆమె
కొద్దిగా తాగింది, తరువాత విశ్రాంతి కోసం కూర్చుంది. నిముషాల్లోనే ఆమె తల
ఎత్తి అంది, ఇది నిజమే అన్నలారా! వాస్తవంగా నా జ్వరం తగ్గింది.
త్వరలోనే గ్రామంలో ఈ వార్త వ్యాపించింది. రవి, తినుబండరాల
మామూలు షాపు యజమాని. అతను ఇప్పుడు గారడి కుండ యజమాని. ఆ నీటితో
ఎవరికైనా ఏ వ్యాధినైనా బాగు చేయగలదాు. ప్రతి రాత్రి రవి ఆ కుండను షాపులోనే
వుంచి పోయేవాడు, ఉదాయాన అది తీయటి మరియు చల్లని నీటితో పూర్తిగా
నిండిపోయేది. ప్రతిరోజు అతని షాపు ముందాు రోగులు, వారి బంధాువుల క్యూ
ఉండేది. ఒక్కొక్కరికి రవి కుండలోని కొద్ది నీళ్ళు ఇచ్చేవాడు మరియు వారంతా
ఇప్పుడు బాగున్నాము అనుకుంటూ వెళ్ళిపోయేవారు. ఆ కుండ ఎప్పుడు కూడ
ఖాళీగా లేదాు. రవి, ఆ ముసలతనికి తను సహాయం చేసినందాుకు ఆయన కృతజ్ఞతా
39
పూర్వకంగా ఈ బహుమతి నాకు ఇచ్చి ఉండవచ్చు అని గ్రహించాడు. ఎంత పెద్దా
బహుమతి ఇచ్చాడో అని ప్రతిరోజు ఆయనకు మనసులోనే కృతజ్ఞత చెప్పుకునేవాడు.
త్వరలోనే అతని చిన్నషాపు హాస్పిటల్గా మారింది. రవి ఆ నీటికి ఒక్క
పైస కూడ చార్జ్ చేసేవాడు కాదాు. ప్రజలు తృణమో, పణమో, కొందారు బహుమానాలు
అతని కొరకు వదాలి వెళ్ళేవారు, కొందారు ఏమి ఇవ్వకనే వెళ్ళిపోయేవారు. అయినా
అతను దానితోనే సంతోషంగా ఉన్నాడు.
ఒకరోజు ఒక ధానికుని నౌకరు వచ్చి ‘నా యజమానికి బాగులేదాు. నా
వెంట వచ్చి అతనికి కొన్ని నీళ్ళు ఇవ్వండి’ అని అన్నాడు.
రవి జవాబు చెప్పాడు. ‘చూడు నీ వెనుక ఎంత లైను ఉందో, వారి వంతు
కొరకు ఎదిరి చూస్తున్నారు. నేను వారికి సహాయం చేయకుండ వదిలేసి నీ యజమాని
వద్దాకు ఎలా రాగలను? ఈ రోగులు ఎండలో చాలాసేపు ఎలా నిలబడగలరు నీవు
ఊహించావా? నీ యజమానిని ఇక్కడికి రమ్మను. నేను అక్కడికి వచ్చిన దానికన్న,
నేను అతనికి ఇక్కడే నీరు యిస్తాను.
ఆ నౌకరు ‘రవి, ఈ బీదావాండ్లకు సహాయం చేయడం వలన నీకేమీ
వస్తుంది? ఏవో కొన్ని రూపాయలు, కొన్ని బియ్యం మరియు కొంత పప్పు? నా
యజమాని ఇంటికి రా. అతను నీకు రూపాయలు, బహుమతులు కురిపిస్తాడు. నీకు
అవసరాలు ఎలా తీరుతాయే అనే ఆవేదాన కనీసం ఒక నెల వరకు కూడ ఉండదాు’.
రవి ప్రేరేపింపబడినాడు. అది నిజమే, ఒక ధానికుడిని బాగు చేసి, తన
రోజు వారి ఖర్చుల సంపాదించుకోవచ్చు గదా? రవి అక్కడ బయట ఎదాురుచూస్తున్న
జనులను మర్నాడు రమ్మని తను భూస్వామి నౌకరు వెంట వెళ్ళాడు.
నెమ్మదిగా, రవి మారిపోయాడు. ఆయన ఎప్పుడైతే ఇబ్బంది పడుతున్న
రోగులను చూసి భరించలేకపోయాడో, ఇప్పుడు ప్రతిరోజు ఒక ధానిక రోగి కోసం
ఎదాురు చూస్తున్నాడు, అందాువలన అతనికి చేతినిండ డబ్బు వస్తుందాని ఊహించాడు.
రోజులు గడిచాయి. ఆ తీరుగ కాలాలు మారాయి, మరల వేసవి వచ్చింది.
రవి తన పాత షాపులో పద్దాులు రాసుకుంటున్నపుడు ఒక ముసలతని వణుకు
పిలుపు ”కుమారా, నీళ్ళు” అని వినిపించింది.
ఆశ్చర్యపడి అతను పైకి చూశాడు. ఇది తనకు బహుమతిగా గారడి
కుండను ఇచ్చిన ముసలతనిదేనా? కాని వచ్చినతని వెనుక రాజు వార్త తెలిపేవాడు
40
ఉన్నాడు. ‘త్వరగా రా!’ రాజుగారి మనిషి గట్టిగా అరిచాడు. ”రాణి గారిని దోమ
కుట్టింది!” అని.
‘నీళ్ళు!’ ఆ ముసలతను మళ్ళీ అడిగాడు.
‘ఆ రాణిగారు మంచిగా లేరు!” రాజు మనిషి మళ్ళీ అరిచాడు.
ఒక బీదా ముసలతను తనకు సహాయపడిన వాడో కాదో లేక తనకు
నీటికుండ ఇచ్చినతనేమో అని ఆలోచిస్తున్నాడు. మరోవైపు రాజు పంపిన మనిషి,
అతను ఊహించాడు, బంగారు నాణాల వర్షం అతనిపై కురుస్తుంది. బాగు చేసే
నీరు రాణి గారి దోమకాటు నొప్పి తగ్గించగానే, ఏది మంచిదో తెలుస్తూనే ఉంది.
అతను కుండను తీసుకున్నాడు మరియు కొత్తతనితో అన్నాడు. ‘ఇక్కడే
వేచి ఉండండి మామయ్యా, నేను వెంటనే తిరిగి వస్తాను’.
వేగంగా పరుగెత్తే రాజు గ్ఱుోాలు రాజభవానికి అతడిని చేర్చాయి. అక్కడ
అతను త్వరగా రాణిగారిని సమీపించాడు. ఆమె చేతిపై దోమ కుట్టినచోటును
ఆశ్చర్యంతో చూశాడు. అతను గ్లాసులో కొన్ని నీళ్ళు వంచాడు, కానీ ఏమీ రాలేదాు!
మరల మరల కుండ వంచాడు. దాన్ని కింది మీదికి చేశాడు, లోతులోకి చూశాడు.
అది ఎముకవలె ఎండి ఉన్నది.
”ఓ మోసగాడ!” అని రాజు అరిచాడు. అయితే నీవు నా రాజ్యంలోని
ప్రజలను ఇలా మోసం చేస్తున్నావు! వెళ్ళిపో, నాకు ఇకముందాు మంత్రపు కుండల
నీరు ప్రభావం గురించి వినరావద్దాు. నీవు ఒకవేళ మరల ప్రకటించావో, నిన్ను
శాశ్వతంగా ఆ ఊరినుండి వెళ్ళగొడతాను. తరువాత అతను రాణిగారి కన్నీరు తుడుస్తూ
ఆమె చేతిపై ఏర్పడిన వాపుపై చేయి రుద్దాుతూ కొంత ఉపశమనం కలిగించాడు.
రవి నెమ్మదిగా తన గ్రామానికి నడిచి వెళ్ళాడు. అతను తన షాపు వద్దాకు
వెళ్ళాడు. అక్కడ ఎవరు లేరు. అతను తనను నీళ్ళడిగిన ముసలతని కోసం వెతికాడు.
అతను అక్కడ ఎక్కడ కనిపించలేదాు. అతను కేక వేశాడు, ‘మామయ్యా, నన్ను
క్షమించు, నేను తప్పు చేశాను. దాయచేసి రండు, నేను మీకు నీళ్ళు ఇస్తాను”. కాని
దానికి జవాబు లేదాు. ఇప్పుడతను గ్రహించాడు, ఈ ముసలతను సంవత్సరం క్రిందా
తనను కలిసినతనే.
అతను దాయతో బాగుచేసిన జనులను మరియు వారు తిరిగి ఇష్టపడి
దీవించిన వారిని గుర్తు చేసుకున్నాడు. వారు చేసిన దాతృత్వం, కొన్ని డబ్బులు
41
ఇవ్వడం మరియు వారి తోటలోని కూరగాయల మూటలను ఇచ్చినవారిని గుర్తు
చేసుకున్నాడు. ఎప్పుడు అతను స్వార్థపరుడైనాడో, అత్యాశ పరుడైనాడో, అతను
చాలా అవసరమైన వారిని అశ్రద్ధా చేశాడో మరియు ఆ ముసలతను ఇచ్చిన శక్తిని
రవి సరీగ ఉపయోగించకపోయాడో తను ఆ శక్తిని తిరిగి తీసేసుకున్నాడు.
ఏం బాధాలేదాు, రవి తనలోతానే నవ్వుకున్నాడు. తనకు నీటి ద్వారా
వచ్చిన డబ్బుతో గ్రామానికి నిజమైన డక్టరును ఏర్పాటు చేస్తాను, అతను మెడిసిన్లు
మరియు రోగాల గురించి బాగా తెలిసినవాడై ఉంటాడు. ఇకపై జనులు గారడివాడు
బాగుచేస్తాడని వేచి చూడల్సిన అవసరం ఉండదాు.
ఆరోజు నుండి రవి తన కుండను మామూలు నీటిని కాలువ నుండి
తెచ్చుకొని తన చిన్నషాపులో పెట్టుకొని ఆ ముసలతని కోసం ఎదాురు చూస్తున్నాడు.
ఏదో ఒకనాడు అతను తిరిగి రావచ్చు. కాని అప్పటివరకు రవి నిజమైన డక్టర్ను
తన గ్రామానికి తేవాలని నిశ్చయించుకున్నాడు.
˛˛˛˛˛˛˛˛˛˛˛˛˛˛
అనువాద రచయిత – ఒద్దిరాజు మురళీధర్ రావు గారు
మూల రచయిత – సుధా మూర్తి
పుస్తకం-గ్రాండ్ మాస్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్
సిద్ధార్థ అనే ఒక యువకుడు మంచి నడవడి గల వ్యాపారి. మంచి వ్యాపారం కోసం వేరే ఊరు వెళ్ళాడు. అతడు ఆ గ్రామస్తులను ఎంతో ఇష్టపడి తను అక్కడే స్థిరపడాలని నిశ్చయించుకున్నాడు. తను కూడబెట్టుకున్న డబ్బంతా పెట్టి అక్కడనే ఒక ఇల్లు కొందామనుకున్నాడు. ఇల్లు వెతకడానికి వెళ్ళినప్పుడు అతనికి ఉదయ్ అనే యువకుడు కలిశాడు.
ఉదయ్ అప్పుడు ఒక బీదవాడు. అతనిది ఒకప్పుడు ధనిక కుటుంబం. కాని ఇప్పుడు అంతంతమాత్రంగానే ఉన్నారు. ఉదయ్ తన కుటుంబ పాతబంగ్లా అమ్మేసి తన కుటుంబ అప్పులు తీర్చాలని అనుకుంటున్నాడు.
ఉదయ్ చూపిన ఇల్లు సిద్ధార్థకు నచ్చి వెంటనే కొనేశాడు. శిథిలంగా ఉన్న ఆ ఇంటిని రిపేరు చేయడం మొదలు పెట్టించాడు. అతను పాత ఫ్లోరింగ్ను తవ్విస్తున్నపుడు ఒక సీల్డు పెట్టె భూమిలో పాతిపెట్టబడినది కనిపించింది. దాన్ని తెరిచినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు, దాని నిండా కదులుతున్న వృశ్చికములను (తేళ్లను) చూశాడు. భయపడి వెంటనే ఆ పెట్టెను దూరంగా విసిరేశాడు.
సాయంత్రం అతను తేళ్ళపెట్టె గురించి తెలుసుకుందామని ఆ ఊళ్లో ఒక పండితుని వద్దకు వెళ్ళాడు. ఆ పండితుడు కొంతసేపు విచారించి బహుశ ఉదయ్ పూర్వీకులు ఎవరో తమ కుటుంబంలో ఎవరికైన అవసరం ఏర్పడినపుడు ఆ ధనం ఉపయోగపడుతుందనే భావంతో ఆ పెట్టెను పాతిపెట్టి ఉండవచ్చు అన్నాడు. చాలా సంవత్సరాల తర్వాత ఆ పెట్టె గురించి మరిచిపోయి ఉండవచ్చు.
సిద్ధార్థకు ఏమి తోచలేదు. కాని పెట్టెలో డబ్బుగాక తేళ్ళు ఉండటమేమి?
అప్పుడు ఆ వృద్ధుడు నవ్వాడు. “ఆ పెట్టె ఎంతోకాలం నుండి కాపాడబడి ఉంది. దాన్ని కుటుంబీకులు తప్ప ఇతరులకు తేళ్ళతో నిండిన పెట్టె కనబడుతుంది. కేవలం ఆ కుటుంబీకుల్లో ఎవరైనా చూస్తే వారికి పెట్టెలో డబ్బు కనిపిస్తుంది. ఇది ఒక మంత్రబలం కావచ్చు” అన్నాడు ఆ పండితుడు.
సిద్దార్థ ఇది విని బాధపడ్డాడు. ఉదయ్ తన పూర్వీకుల ఇంటిని చివరి సారిగా చూసి ఊరు వదిలిపెట్టి పోతున్నప్పుడు కన్నీరు ఉబికిరావడం సిద్ధార్థకు జ్ఞాపకం ఉంది. ఒకవేళ అతనికి దాచబడిన ధనం తెలిసిఉంటే అతనికి ఇల్లు అమ్మే అవసరం ఉండకపోయేది. సిద్ధార్థ ఇల్లు చేరాక, అతను పెట్టెను ఎవరైన ఉదయ్క సంబంధీకులు వచ్చి అడిగేవరకు భద్రంగా దాచిపెట్టాలని అనుకున్నాడు. పెట్టెకు సంబంధించిన నిజమైన ఉదయ్ కుటుంబ వారసులను గుర్తించేందుకు, పెట్టెనుండి నాల్గు తేళ్ళను తీసుకొని పోయి, అతను కొత్తగా తెరిచిన షాపుముందు నాల్గు మూలల్లో నాల్గు తేళ్ళను వేలాడదీసాడు.
అతని గిరాకులందరు షాపులోని వచ్చినపుడు ఏదో వ్యాఖ్యానం చేసేవారు. ‘సిద్ధార్థ గారు, మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? మీ షాపు ముందర ఎందుకు ప్రమాదకర తేళ్ళను వేలాడదీశారు? మీరు షాపుకు వచ్చేవారిని భయపెట్టాలనుకున్నారా?” అని అనేవారు.
కాని సిద్ధార్థ ఏమీ అనకుండా కేవలం నవ్వేవాడు. అతని షాపులోని వస్తువులు చాలా మంచివని చుట్టు కొన్ని మైళ్ళవరకు తెలుసని తనకు తెలుసు. జనులు తేళ్ళను లెక్కచేయకుండా తన షాపుకే వస్తారు అనే గట్టి నమ్మకం అతనిది.
క్రమక్రమంగా ఆ షాపు తేళ్ళషాపని అనబడేది. గ్రామస్తులు అతని వెనకాల నవ్వుకునేవారు. కాని సిద్ధార్థ ఏమీ పట్టించుకోకపోయేది.
చాలా సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు సిద్ధార్థ నడివయసు వాడు, భార్యాపిల్లలతో మరియు చాలినంత ధనంతో తృప్తిగా ఉంటున్నాడు. కాని అతనికి ఒక అసంతృప్తి ఉంది. ఇంతవరకు ఆ తేళ్ళపెట్టె హక్కుదారులు ఎవరు కూడా లేదు అని.
ఒకరోజు ఒక యువకుడు షాపుకు వచ్చి, సార్, నేను మీరు ధనికులని, అవసరమున్నవారిని సహాయపడుతారని తెలిసి వచ్చాను. నేను ఫీజు కట్టలేనందుకు స్కూలుకు పోవడం ఆపేయవలసి వచ్చింది. నేను చదువు పూర్తి చేసుకునేందుకు మీరు దయతో కొంత డబ్బు సహాయపడగలరా?
సిద్ధార్థ రంధిగా తల అడ్డం తిప్పాడు. గ్రామస్తులు నా గురించి అతిగా చెప్పారు అని అన్నాడు. అవును, నేను బాగానే సంపాదిస్తున్నాను. కాని నీకు సహాయ పడేంత కానీ లేక అప్పు ఇచ్చేంత కానీ ధనం లేదు, నేను సంతోషంగా ఇచ్చేందుకు.
ఆ అబ్బాయి అది విని కోపంతో మండిపడ్డాడు. ‘సార్, ఒకవేళ మీరు సహాయ పడదలచుకోకుంటే, దయతో అలానే చెప్పండి నిర్మొహమాటంగా. ఎందుకు అబద్ధం ఆడుతారు? మీకు ఎంత ధనం ఉందంటే దానితో ఏంచేయాలో మీకు తెలియదు. అటువంటప్పుడు మీ షాపుకు ఎదురుగా బంగారు నాణాలు నాల్గు మూలల్లో ఎందుకు వేలాడదీసారు? తప్పకు మీరు నా వంటి బీదవిద్యార్థికి కొన్ని నాణాలు ఇవ్వగలరు’.
సిద్ధార్థ అతన్ని కనురెప్ప వాల్చకుండా తేరిపార ఆశ్చర్యంతో చూశాడు. ఏంటీ? ఏంటి? నువ్వు ఇప్పుడేం అన్నావు? తన కనుగుడ్లు ఉబ్బించి ఉద్రేకంతో అడిగాడు.
‘ఒకవేళ మీరు సహాయపడననుకుంటే’ అని అన్నాను. అబ్బాయి మరల చెప్పాడు. ఆం, అవును, అవును అది విన్నాను. కాని దాని తరువాత ఏమన్నావు, నా షాపు ముందర బంగారు నాణాల గురించి?
ఇప్పుడు అబ్బాయి సిద్ధార్థకు కోపం వచ్చిందని భయపడి రెండడుగులు వెనక్కు వేసి, మీరు షాపు ఎదురుగా నాల్గుమూలల్లో బంగారు నాణాలు వేళాడ దీసేంత ధనికుడవని అన్నాను. కాని సిద్ధార్థకు, ఇతర జనులకు అవి ప్రాణమున్న తేళ్ళుగానే అక్కడ కనిపిస్తున్నాయి.
సిద్ధార్థ చాలా సంతోషంగా బిగ్గరగా నవ్వాడు. అతను ముందుకెళ్ళి ఆ అబ్బాయిని ఆలింగనం చేసుకున్నాడు. నీవు ఉదయ్ కమలాకర్ వంశీయుడివా? మీ కుటుంబం ఎప్పుడైనా ఈ గ్రామంలో ఉండిందా? అని అతను దాదాపు అబ్బాయి చెవులో అరిచాడు.
ఆ అబ్బాయి భయపడి వెనకడుగు వేశాడు. బహుశ ఈ ధనికుడు కోపిష్టి, ప్రమాదకరుడు అనుకున్నాడు.
ఆఁ ఆఁ ఆఁ అవును, నా పేరు ఉదయ్. మా తాతగారి పేరు నాకు పెట్టారు. అతని కుటుంబం ఇక్కడ చాలాతరాలు ఉండేదని విన్నాను. తర్వాత, వారికి ఇబ్బందులు వచ్చి, మా తాతగారు ఇల్లు అమ్మి వెళ్ళిపోయారు. అతను తన పూర్వీకుల ఆస్తి అమ్మిన బాధతో కోలుకోలేక గుండె బగిలి మరణించాడు.
సిద్ధార్థ తన కండ్లనీరు తుడిచేసుకున్నాడు. ‘ఇక్కడే ఆగు, నా కుమారా’ అని అతను పరుగు పరుగున తన ఇంటికి వెళ్ళి, పాత పెట్టెతో తిరిగి వచ్చి దాన్ని ఆ యువకునికి ఇచ్చాడు. వెళ్ళు, పెట్టె బంగారు, వెండి నాణాలు మరియు ఆభరణాలతో నిండి ఉంది.
అతను, అతి సంతోషంతో ఉన్న సిద్ధార్థ వైపు ఆశ్చర్యంగా చూశాడు. అవును, ఇది నీకు చెందినదని సిద్ధార్థ వివరించాడు. నేను చాలా సంవత్సరాల నుండి దీన్ని జాగ్రత్తగా దాచాను, ఎన్నడైనా ఎవరైనా ఒకరు ఉదయ్ కుటుంబీకుడు దీన్ని అడిగేందుకు రాగలడని నమ్మకంతో. ఇప్పుడు నీ కష్టాలు తీరిపోయాయి. ఇంటికివెళ్ళి నీ పూర్వీకుల ఆస్తిని జాగ్రత్తగా వాడుకొని జీవితంలో హాయిగా ఉండు.
అప్పుడు అతను ఎలా పెట్టె పొందాడో, దాన్నిండా కదులుతున్న తేళ్ళు ఉదయ్ కుటుంబం వారికి తప్ప ఇతరులకు ఎలా కనిపించాయో వివరించాడు కథగా.
ఉదయ్ కథ విని విపరీతమైన ఆశ్చర్యం పొందాడు. అతను సిద్ధార్థకు అతని ధనంలో సగం కృతజ్ఞతతో ఇవ్వబోయాడు. కాని సిద్ధార్థ ఆ మాట ఏమాత్రం వినలేదు. ఇది నీది అని అతను నొక్కిచెప్పాడు. వెళ్ళు, వెళ్ళి నీ జీవితాన్ని ఆనందంగా మలుచుకో.
ఉదయ్ పెట్టెతో వెళ్ళిపోయాడు. తన జీవితాంతం ఆశ్చర్యకరమైన నిజాయితీ గల ముదుసలతను ఎవరైతే తమ ధనాన్ని జాగ్రత్తగా దాచిపెట్టాడో అతడిని జ్ఞాపకం చేసుకున్నాడు.
XXXXXX