బాలసాహిత్యం

మారుతున్న కాలానికి అనుగుణంగా బాలల అభిరుచుల్లో, అలవాట్లలో మార్పులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి మార్పులకు అనుగుణంగా పెద్దలలో కూడా మార్పు రావాలి. పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలి. పరిసరాలు, జంతువులు , పళ్ళు , కూరగాయలు, చెట్లు, పూలు, .. ఇలా ఒక్కటొక్కటిగా పిల్లలకు చెబుతుండాలి , నడవడిక, మర్యాద, స్నేహం, మిత్రులు, బంధువులు ,దుస్తులు. పరిశుభ్రత తదితరాలను పరిచయం చేస్తుండాలి.
విదేశాల్లో పిల్లలకు పాఠశాలకు వెళ్లక ముందే. డే కేర్ కు పంపిస్తారు. అక్కడ ఇవన్నీ అలవాటు చేస్తారు. ఇంగ్లీష్ భాష కూడా బాగా వస్తుంది. ఐదేళ్ల కు స్కూల్ కు వెళ్ళగానే నేర్చుకోవడం సులువవుతుంది.
ఇక మనకు గతం లో చదివిన చందమామ, బాల మిత్ర, బొమ్మరిల్లు కథలు ఈ తరం పిల్లలకు నచ్చక పోవచ్చు . వారికి తగిన కథలు, అర్థమయ్యే రీతిలో చెప్పవలసిన అవసరం వుంది. వారు ఇష్టపడే మాధ్యమాల ద్వారా చెప్పాలి. మనం అనుకున్నట్టుగా వారు ఉండాలనుకోవడం తగదు. వారి అభిరుచులకు అనుగుణంగా చదువులు, ఉండాలి. ఈ విషయం లో మనం విదేశాల వారు అనుసరించే విధానాలను అధ్యయనం చేయవలసిన అవసరం వుంది. మన దేశం లో పిల్లల అభివృద్ధిని కాంక్షించే వారంతా భవిష్యత్ కు అందమైన రూపు రేఖలు దిద్దేవారే. కానీ అటు సమాజం, ఇటు తల్లి తండ్రులు, మరో వైపు ఉపాధ్యాయులు, రచయితలు బాల్యాన్ని విస్మరిస్తున్నారు. మరో మాటలో చెప్పాలం

కాలం తో పాటు మనుషులు, అవసరాలు, ఆలోచనా విధానాలు మారుతుంటాయి. అదే విధానంగా ఈ తరం బాలల్లో కూడా ఎంతో మార్పు వచ్చింది. కానీ వారి అవసరానికి సరిపడా వనరులు లేవు. ఈ మధ్య కరోనా వలన పిల్లల్లో మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వచ్చింది. మరి వారి కోసం ఎవరు ఏమి ఆలోచిస్తు
ప్రస్తుతం బాల సాహిత్య రచనలు చేసే వారు కేవలం తమకు పేరు రావాలని, అవార్డులు కావాలని రాస్తున్నట్టుగా అనిపిస్తుంది.
ఇంగ్లీష్ లో ఆర్కే నారాయణ్, మార్క్ ట్విన్ వంటి వారి పుస్తకాలు ఎవరైనా చదివారా. ఎక్కడో జె. కె. రోలింగ్ లండన్ లో ఉంటూ హరీ పాటర్ పుస్తకాలు రాస్తే హైదరాబాద్ లో క్యూ ల్లో నిలబడి పుస్తకాలు కొనుగోలు చేసిన సంఘటనలు వున్నాయి కదా.మరి పిల్లలను ఆకట్టుకునే రచనలు ఎందుకు రావడం లేదు.
తెలుగు బాల సాహిత్యం లో రాసి పెరుగుతుంది కానీ వాసి ఉండటం లేదు. ఇంగ్లీష్ మాధ్యమం ప్రభావం మరింత పెరిగితే తెలుగు బాల సాహిత్యం మనుగడ కష్టం.
ఈ విషయం లో నిజాయితీ గల బాల సాహితీ వేత్తలు ముందుకు వచ్చి ఒక కార్యాచరణ రూపొందించు కోవాలి. పాత కథలను ఆధారం చేసుకుని పిల్లలకు అర్థం అయ్యే రీతిలో మార్చి రాయాలి, ఈ తరం పిల్లలు ఇష్టపడే రచనలు చేసి వారిని ఆకట్టుకోవాలి . అందరు కలిసి కట్టుగా ముందుకు వచ్చి మంచి సాహిత్యం కోసం కృషి చేయాలి, అలాంటి వారిని, సమాజం, ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.
ReplyForward
|
అనగనగా రామాపురం అనే ఊరిలో రాధమ్మ అనే స్త్రీ ఉండేది .ఆమె చాలా మంచిది,తెలివైనది. ఆమె భర్త పేరు గోపాల్. అతడు చాలా మంచివాడే కానీ అహంకారం ఎక్కువ. అతడు బ్యాంకులో పని చేస్తూ ఉండేవాడు. వారు ఇద్దరికీ నలుగురు పిల్లలు. వారిలో ఇద్దరు మగవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్లు. వారి పేర్లు. రవి, ఆనంద్, ఊర్మిల, శృతి. ఆనంద్ వాళ్ళ అమ్మ పోలిక. కాబట్టి అతడు చాలా మంచివాడు. కానీ ఆనంద్ కు కోపం ఎక్కువ. తనముందు తప్పు జరిగితే అక్కడికక్కడే వారిని శిక్షిస్తాడు.అతనికి అమ్మ మీద ప్రేమ ఎక్కువ. రవి,ఊర్మిల, శృతి వాళ్ళ నాన్న పోలిక కాబట్టి వారికి అహంకారం ఎక్కువ. రవి రాధమ్మ మీద ఎప్పుడూ కోప్పడుతూ ఉండేవాడు. తను మంచి చెప్పినా చెడు చెప్పినట్లుగానే అర్థం చేసుకునేవాడు. రవి ఎప్పుడూ రాధమ్మను తిడుతూనే ఉండేవాడు. ఆ మాటలకు రాధమ్మ చాలా బాధపడేది. ఊర్మిల తనకు ఎవ్వరూ సరిలేరు అంటూ గర్వపడుతూ ఉండేది. తను రాధమ్మతో తల్లి అని కూడా చూడకుండా తనతోనే అన్ని పనులు చేయిస్తూ ఉండేది. రాధమ్మ తనకు గర్వపడడం తప్పు అని చెప్తున్నా కూడా తను వినిపించుకునేది కాదు. ఊర్మిల ఏదైనా తప్పు చేసినా రాధమ్మ మీదకు నెట్టేసేది. ఇంట్లో వాళ్ళందరూ రాధమ్మను అవమానించేవారు. ఆ తిట్లు విని ఊర్మిల సంతోషించేది. రాధమ్మ తనలో తాను కృంగిపోయేది.
శృతి చాలా బద్ధకస్తురాలు.తను ఎప్పుడూ బయటనుండి ఏదైనా ఆహారం తెప్పించుకుని తింటూనే ఉండేది. తను ఎంత తినేదంటె రోజూ సుమారు ₹2000/-దాకా తిండి కోసం ఖర్చు చేసేది. రాధమ్మ తనకు“అమ్మా శృతి అలా తినవద్దు అమ్మా”,అని చెప్పినా వినిపించుకునేది కాదు. పైగా తను దొంగచాటుగా తినేది ఎందుకంటే గోపాల్ తను తినడం చూస్తాడని. ఒకవేళ గోపాల్ చూస్తే శృతి“నాన్న!నన్ను ఇవన్నీ అమ్మ తినమని చెప్పింది”,అని చెప్పేది. గోపాల్ ఆ మాటలను నమ్మి రాధమ్మను తిడతాడు. శృతి మాత్రం అమాయకురాలిగా నటిస్తూ ఉండేది. రోజూ ఇలా గొడవ జరుగుతుండడంతో ఇరుగు-పొరుగు వాళ్ళు గోపాల్ ఇంటికొచ్చి“మీరిలా గొడవ పడితే మా పిల్లలకు నిద్ర పట్టడం లేదు కాబట్టి మీరు గొడవ పడకండి”,అని హెచ్చరిస్తూ ఉండేవారు. ఈ విషయంలో కూడా గోపాల్ రాధమ్మదే తప్పు అన్నట్లు రాధమ్మను తిడుతూ ఉండేవాడు. ప్రతిరోజూ అలాగే జరుగుతుండేది. రాధమ్మ ఇవన్నీ చూసి“నేనెవ్వరికీ అవసరం లేదు”,అని అనుకుంటూ బాధపడేది. రాధమ్మ తన పిల్లలెవ్వరికి ఏ అనారోగ్య సమస్య వచ్చినా తను వారికి సేవ చేసి మామూలు స్థాయికి తీసుకొచ్చేది. కొన్ని రోజుల తర్వాత రాధమ్మకు జ్వరం వచ్చింది. ఆనంద్ చాలా బాధపడుతూ ధైర్యం చెబుతున్నాడు. ఆనంద్ గోపాల్ దగ్గరకు వచ్చి“నాన్న అమ్మకు జ్వరం వచ్చింది కాబట్టి నువ్వు వెంటనే డాక్టర్ కు ఫోన్ చేయి”,అంటూ కంగారుగా చెప్పాడు.గోపాల్ వినలేదు. ఎందుకంటే తనకు మాధవపురం అనే ఊరికి బదిలీ చేశారు. ఆనంద్ ఏడుస్తూ ఉన్నాడు. గోపాల్ అక్కడి నుండి మాధవపురానికి వెళ్ళిపోయాడు. ఆనంద్ కు ఏం చేయాలో తెలియక శృతి,ఊర్మిలల దగ్గరకు వెళ్ళాడు వారు నిద్రపోతున్నాడు. ఆనంద్ ఎంత నిద్ర లేపినా వాళ్ళు లేవలేదు. ఆనంద్ తన అన్నయ్య అయిన రవి దగ్గరకు వెళ్ళాడు. తను కూడా నిద్ర పోతున్నాడు. ఆనంద్ తనను లేపి జరిగిందంతా చెప్పి“అన్నయ్య! డాక్టర్ కు ఫోన్ చేయి అన్నయ్య,”అని వేడుకున్నాడు. రవి కోప్పడుతూ“జ్వరం మాత్రమే కదా వచ్చింది రెండు రోజులైతే అదే తగ్గిపోతుంది”, అనన్నాడు. ఆనంద్ బాధపడుతూ పక్కింటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి డాక్టర్ నంబర్ తీసుకుని, డాక్టర్ కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పాడు. కొద్ది సేపుతర్వాత డాక్టర్ ఇంటికి వచ్చి రాధమ్మను చూసి“పని ఎక్కువగా చేయడం వల్ల ఈ జ్వరం వచ్చింది”,అని చెప్పింది. మందులు ఇచ్చి డబ్బులు అడిగింది. ఆనంద్ తను రాధమ్మ ఇచ్చి దాచిపెట్టుకోమన్న డబ్బులను ఇచ్చాడు. డాక్టర్ ఆ డబ్బులు తీసుకుని వెళ్ళింది. ఆనంద్ డాక్టర్ ఇచ్చిన మందులను రాధమ్మకు వేసాడు. తను పడుకుంది. రవి, ఊర్మిల, శృతిలు నిద్రలేచి పాలు, బూస్ట్, హార్లిక్స్ అంటూ గట్టిగా అరిచారు రాధమ్మ ఆ మాటలు విని వెంటనే లేచి ఆనంద్“లేవొద్దమ్మా!”,అని చెబుతున్నా వినకుండా పాలు, బూస్ట్, హార్లిక్స్ సిద్ధం చేసి వారి దగ్గరకు వెళ్ళి పాలు, బూస్ట్, హార్లిక్స్ ఇచ్చింది. ఊర్మిల, శృతి లు బూస్ట్, హార్లిక్స్ తాగుతంటే రవి మాత్రం పాలు తాగి“జ్వరం వస్తే ఆలస్యంగా తీసుకొస్తారా?!”,అంటూ గట్టిగా అరిచాడు. రాధమ్మ ఏడుస్తూ రవి గదిలో నుండి వెళ్ళిపోయింది.కొద్ది రోజుల తర్వాత రాధమ్మకు జ్వరం తగ్గింది.గోపాల్ మాధవపురంలో బ్యాంకులో పని చేస్తుండగా రాజు అనే వ్యక్తి వచ్చాడు.అతడు ఒక రౌడీ అతడు చాలా చెడ్డవాడు. అతడు గోపాల్ దగ్గరకు వచ్చి అప్పు కావాలని అడిగాడు. గోపాల్ పక్కనే ఉన్న ఒక వ్యక్తి“ఇదిగో గోపాల్ గారు! ఇతని పేరు రాజు ఇతను చాలా చెడ్డవాడు,ఇతనొక రౌడీ,”అని మెల్లగా చెప్పాడు. గోపాల్ “రాజు గారు మీరు ఏ పని కోసం అప్పు అడుగుతున్నారు”,అని అడిగాడు. రాజు“ఇవ్వకపోతే నిన్ను చంపేస్తా! ”, అంటూ బెదిరించాడు. గోపాల్ జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పమని అంగరక్షకుడికి సైగ చేశాడు. పోలీసులు వచ్చి రాజును తీసుకుబోతుండగా రాజు“రేయి గోపాల్!నేను జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తాను,”అని బెదిరించాడు. గోపాల్ ఆ మాటలను విని కంగారుపడి తన పై అధికారులతో మాట్లాడి మళ్ళీ రామాపురాని బదిలీ చేపించుకున్నాడు. గోపాల్ ఇంటికొచ్చాడు. ఇంట్లో చూస్తే రాజు ఎప్పుడో వచ్చేశాడు. గోపాల్ లోపలికి వచ్చాడు. రాజు“రా గోపాల్! రా, జైలులో నుంచి ఎలా వచ్చాను అని అనుకుంటున్నావా, ఇదంతా నాకు మామూలే”,అని అన్నాడు. గోపాల్ “ఇప్పుడు ఏం చేయడానికి వచ్చావు?”,అని అడిగాడు. రాజు“నీ కుటుంబాన్ని చంపేయడానికి వచ్చాను”,అని అన్నాడు. గోపాల్ ను రాజు మనుషులు బంధించారు. ఆ సమయంలో రాధమ్మ వంటగదిలో వంట చేస్తుంది. ఆనంద్ లెక్కలు వ్రాస్తున్నాడు. రవి ఆట ఆడుతున్నాడు. ఊర్మిల టీ.వీ చూస్తుంది. శృతి తింటుంది. రాజు గోపాల్ పిల్లల గదిలోకి వెళ్లి పిల్లలను లాక్కొచ్చి వారి మీద కత్తి పెడుతూ“నీ పిల్లలను నేను చంపేస్తాను”,అంటూ గట్టిగా అరిచాడు.ఆ అరుపులు విని రాధమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. రాధమ్మ బాబు! నీకు దండం పెడతాను, వయసులో నీకంటే పెద్దదాన్ని అయినా నీ కాళ్ళు పట్టుకుంటున్నాను,నా పిల్లలను వదిలేయి”,అని వేడుకుంది.రాజు వినకుండా కత్తితో పొడుస్తుండగా రాధమ్మ అడ్డుగా వచ్చింది. కత్తి రాధమ్మకు బలంగా గుచ్చుకుంది.రాధమ్మ క్రింద పడింది. అందరూ కంగారు పడ్డారు. రాజు శృతిని పొడవబోతుండగా గోపాల్ రాజును కిందకి తోసాడు. కత్తి రవికి గుచ్చుకుంది రవి కూడా కింద పడ్డాడు. రాజూకి బల్ల తాకి క్రింద పడ్డాడు. గోపాల్ రాజు మనుషుల నుంచి తప్పించుకుని రాధమ్మను, రవిని ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. రవికి ముందే రక్తం చాలా తక్కువ. డాక్టర్ వచ్చి“గోపాల్ గారు రవికి రక్తం ఎక్కించాలి”,అని చెప్పింది. గోపాల్ కు మిగతా వారికి రవి యొక్క రక్తం లేదు. రాధమ్మ స్పృహలోకి వచ్చింది. డాక్టర్ జరిగిన విషయమంతా రాధమ్మకు చెప్పింది. రాధమ్మ వద్దన్నా వినకుండా రవికి రక్తం ఇచ్చింది. కొన్ని గంటల తర్వాత రవి స్పృహలోకి వచ్చాడు. డాక్టర్ జరిగిన విషయమంతా రవితో పాటు అందరికీ చెప్పింది. అందరూ కొన్నేళ్లుగా చేసిన తప్పులను తెలుసుకుని రాధమ్మకు క్షమాపణలు చెప్పారు. రాధమ్మ సంతోషించింది. కొద్ది రోజుల తర్వాత అందరూ ఇంటికొచ్చారు.రవి రాధమ్మ మీద కోప్పడడం మానేశాడు. ఊర్మిల గర్వపడడం మానేసి తల్లిని గౌరవించడం మొదలుపెట్టింది. శృతి ఎక్కువగా తినడం మానేసి తల్లిమాట వింటుంది. గోపాల్ కూడా తనను అర్థం చేసుకున్నాడు. అలా కుటుంబం అంతా సంతోషంగా ఉంది.
నీతి:అమ్మ ఏం చెప్పినా అది మన
మంచి కోసమే. కాబట్టి అమ్మ
ఏం చెప్పినా వినాలి.
శ్రీరామచంద్రమూర్తి
శ్రీ గురుభ్యోన్నమః. సభకు నమస్కారం. నా పేరు రొంపిచర్ల శ్రీ రంగ సిద్ధార్థ. నేను ఎనిమిదో తరగతి, ఏఏఎన్ఎం అండ్ వివిఆర్ఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, గుడవల్లేరు, విన్నకోట గ్రామము, కృష్ణాజిల్లా, ఆంధ్రపదేశ్ నుండి వచ్చాను. నేను ఈరోజు రామాయణంలోని శ్రీరామచంద్రమూర్తి పాత్ర గురించి చెప్పబోతున్నాను.
మనిషి ఎక్కడ, ఎలా ప్రవర్తించాలో, ధర్మాన్ని ఎలా అనుసరించాలో, ధర్మాన్ని ఎలా అనుసరించాలో ధర్మాన్ని పట్టుకున్నవాళ్ళు ఎంత గొప్పవాళ్లు అవుతారో యుగాలు మారిపోయిన శ్రీ రామచంద్రమూర్తి యొక్క జీవిత వృత్తాంతం నేటికీ పసిపిల్లలకు కూడా తమ తల్లుల చేత రామాయణ కథగా చెప్పబడుతోంది. అందులోని పాత్రలు, స్వభావాలు నేటి మానవాళికి మచ్చు తునకలు.
రామో విగ్రహవాన్ ధర్మః సత్యధర్మ పరాక్రమః అనగా రాముని వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో న భవిష్యత్. అయోధ్య నగరానికి రాజయిన దశరథ మహారాజు, కౌసల్యదేవిల పుత్రుడు, శ్రీరామచంద్రుడు. శ్రీరాముడు ఒక రాశి భూతమైన ధర్మము. ఆయన సత్యము చేత లోకాన్ని గెలిచాడు. శుశ్రూష చేత గురువులను గెలిచాడు. తన యొక్క దాన గుములతో దీనులను గెలిచాడు. శ్రతువులను తన యొక్క పౌరుష పరాక్రమాలు చేత గెలిచాడు. ధర్మము చేత సమస్తాన్ని గెలిచాడు. ఇలా 16 గుముల కలయికతో నరునిగా నడయాడిన పరిపూర్ణ అవతారఁ శ్రీరామావతారం. బుద్ధి, సాత్వికత, మధురమైన భాష, నిరాడంబర జీవితం, నిర్మలమైన మనస్సు తత్వం, నిస్వార్థత, మితభాషి, నిగర్వి, ఏకపత్నీవ్రతుడు, పరాక్రమవంతుడు, సదాచారాము పాటించేవాడు, సమయస్ఫూర్తి కలవాడు, పిత్రు ఆజ్ఞాపరిపాలకుడు, గురువు మాట శాసనం, తండ్రి మాట శిలాశాసనంగా భావించేవాడు, ఇన్ని సుగుణాలను మకుటంగా ధరించి ప్రజారంజకంగా పాలించి రామ రాజ్యంగా పేరొందిన శ్రీరామచంద్రమూర్తి గురించి మూడు నిమిషాలు కాదు మూడు గంటలు చెప్పినా చాలదు.
శ్రీరాముని గురిఁచి నేను మీకు ఇచ్చే సందేశం
ఒకటవ తరగతి నుండి ఐఏఎసం, ఐపీఎసంవరకూ రామాయణాన్ని ఒక పాఠ్యాంశంగా బోధించాలి.
రాముని నమ్ముకున్నవారికి అంతా విజయమే ఉదాహరణకు హనుమంతుడు.
రాముని ఆశ్రయించిన వారు కీర్తిని, ఉత్తమ గతులను పొందుతారు. ఉదాహరణకు జటాయువు పక్షి.
ధర్మోరక్షతి రక్షితః ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మమే మనల్ని రక్షిస్తుంది.
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
ఇంతటి అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారములు. ధన్యవాదములు తెలుపుకుంటూ శ్రీరామ రక్ష సర్వజగ్రదక్ష.
జై శ్రీరామ్
శ్రీ గురుభ్యోన్నమః సభకు నమస్కారం నా పేరు రొంపిచర్ల శ్రీరంగ సిద్ధార్థ. నేను ఎనిమిదో తరగతి గుడవలేరు ఏ.ఏస్.ఎస్ & వి.వి.ఆర్.ఎస్.ఆర్. హైస్కూల్, గుడ్డవల్లేరు, విన్నకోట గ్రామము, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాను.
నేను ఈ రోజు మహాభారతంలోని ప్రధానకర్త అయిన వ్యాసభగవానుని గురించి చెప్పబోతున్నాను.
పుట్టుకతోనే వేదములను అవగతం చేసుకుని, పంచమ వేదమైన మహాభారతాన్ని ప్రపంచానికి అందించిన, బ్రహ్మంశ సంభూతుడైన వ్యాసమహర్షి వాఙ్మయాన్నికంతటికీ వెలుగుల దివ్వె లాంటివారు. ఆయనే లేకపోతే కటిక చీకటి గాఢాంధకారము.
నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర యేన త్వయా భారత తైల పూర్ణ హ ప్రజ్వాలితో జ్ఞానమ య ప్రదీపః
అనగా ఒక ప్రమిదలో మహాభారతం అనే తైలాన్ని పోసి, జ్ఞానమనే వత్తిని వెలిగించి మనకందరికీ ప్రకాశాన్ని అందించి ఆ వెలుగులో ధర్మమార్గాన్ని నిర్దేశించారు వ్యాసమహర్షి. మహాభారతం ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన సంఘర్షణ. మహాభారతం ప్రపంచాన్ని శాసించే భారతీయ ఇతిహాసం.
వ్యాసమహర్షి లోకంలో వెలిగిన మొట్టమొదటి జ్ఞానజ్యోతి. ఆ జ్యోతి నుండి మిగిలిన జ్యోతులన్నీ వెలిగాయి. ఏ గురు స్వరూపమైన వ్యాస వాక్కుతో పరవశించిపోతుంది. అన్ని గురుస్వరూపాలు వ్యాసుని హృదయాన్నే ఆవిష్కరిస్తాయి. మహా తపోజ్ఞాని అయిన పరాశర మహర్షి జాలరి కన్య అయిన సత్యవతీదేవి యందు తమకము చెందడం వలన సద్యోగర్భుడైన కుమారుడు యమునా ద్వీపంలో జన్మించారు. ఆయనే వేదవ్యాసుడు, త్రిమూర్తి స్వరూపుడు, బాదరాయణుడు, కృష్ణద్వైపాయనుడుగా పేరుంది. తల్లి ఆశీస్సులతో ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పి తపస్సుకి వెళ్ళిపోతాడు వ్యాసుడు. కొన్ని ఆర్షమైన ధర్మములను నిరూపణ చేయడానికి అనేకసార్లు వ్యాసమహర్షి మనకు మహాభారతంలో కనిపిస్తారు. ఆయన ప్రతి రాకకు ఒక కారణం, ప్రయోజనం ఉంటుంది. జ్ఞానఖని అయిన వ్యాసుడు తల్లి అభ్యర్థన మేరకు భీష్ముని కోరిక మేరకు దేవర న్యాయం చేత, ధార్మికంగా, కురువంశ అభివృద్ధికి, కురువంశ రక్షణకు కారణమయ్యారు.
గాంధారిదేవికి గర్భసోకము కలిగినప్పుడు శివుని యొక్క వరము మేరకు పిండమునకు నూటొక్క ముక్కలుగా చేసి నూటొక్క మంది సంతానం కలగడానికి కారణమయ్యారు. త్రికాలజ్ఞాని అయిన వ్యాసుడు తన తల్లి సత్యవతిదేవి, అంబికా, అంబాలికలు రాబోయే కఠిన పరిస్థితులను తట్టుకోలేరని భీష్మునికి చెప్పి, వారిని తపస్సుకు పంపి, వారికి శాంతి మార్గము చూపి, వారి మోక్షానికి కారణమయ్యారు. కౌరవులు, పాండవులు విలువిద్యా ప్రదర్శన సమయంలో వ్యాసుని రాక ఒక కుటుంబపరమైన కర్తవ్యాన్ని నిర్వహింపచేయడానికి మార్గదర్శకమైంది. అనేకసార్లు పాండవులు, కౌరవుల దుశ్చర్యలు వలన మానసికంగా ఆందోళన చెందుతున్నప్పుడు, దైన్య పరిస్థితులను అనుభవిస్తున్నప్పుడు, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే సమయంలో త్రిమూర్తి స్వరూపుడైన వ్యాసుడు వచ్చి సమస్య పరిష్కారానికి మార్గం చూపి, పాండవులకు ధర్మమార్గాన్ని నిర్దేశించారు. అలాగే కౌరవులు తప్పు చేస్తున్నప్పుడల్లా వ్యాసుడు వచ్చి కౌరవులకు హితబోధ చేసినా వారు పెద్ద వారి మాటలను ధర్మచక్రంలో ఇముడ్చుకోక తమ నాశనాన్ని తామే కోరుకున్నారు. కానీ పాండవులు ధర్మంతో ఉండుట వలన భగవంతుడు వారి పక్షాన ఉండుటవలన విజయాన్ని, ఖ్యాతిని పొందారు.
వ్యాసమహర్షి నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు :
వ్యాసమహర్షి సమయానుకూలంగా పరిణితి చెందిన పెద్దరికంతో కురువంశ రక్షణ చేశారు. కురువంశ అభివృద్ధికి పాటుపడ్డారు.
అలాగే పాండవులు కూడా వ్యాసమహర్షి చెప్పిన ధర్మసూక్ష్మాలను పాటించి ఆయన్ని సమున్నత స్థానంలో నిలిపారు. కాబట్టి ఎవరికైతే ఓర్పు, నేర్పు, సహనం, శాంతి, సత్యం, ధర్మం, వినయం, విధేయత, పెద్దల యందు గౌరవం ఉంటాయో వారికి పెద్దల దీవెనలు, వారి సూచనలు ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటాయి.
మహాభారతంలో అంతర్భాగమైన కీలకపాత్ర పోషించిన వ్యాసమహర్షిని గురించి మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. వ్యాసుడు అంటే పదవి, ఈ సభలో వ్యాసపదవి అలంకరించిన నా గురుస్వరూపులందరికీ నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదములు తెలుపుకుంటూ
‘వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ నమః నమో బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః’
కృష్ణం వందే జగద్గురుం
అందరికీ నమస్కారం. నా పేరు అవంతిక. నేను టైనీ స్కాలర్స్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. నేను మహా భారతంలో అశ్వత్థామ గురించి చెప్పబోతున్నాను.
అశ్వత్థామ కురుపాండవులకు గురువైన ద్రోణాచార్యుని కుమారుడు. ఇతని తల్లి కృపి. ఇతని మేనమామనే కృపాచార్యుడు. అశ్వత్థామ పుట్టుకతోటే నుదుట మీద మణితో జన్మిస్తాడు. యితడు సప్త చిరంజీవులలో ఒకడు. చిరంజీవులంటే మరణం లేని వారు అని అర్థం. చిరంజీవులు ఏడుగురు. వారు బలి చక్రవర్తి, పరశు రాముడు, హనుమంతుడు, విభీషణుడు, వ్యాస మహర్షి, కృపాచార్యుడు మరియు అశ్వత్థామ. ద్రోణాచార్యుడికి కడు ప్రియమైనవాడు. తన తండ్రి ద్రోణాచార్యుడికి అర్జునుడు ప్రియ శిష్యుడు కావడం వల్ల తనకే నేర్పని విద్యను అర్జునిడికి నేర్పడంతో పాండవుల మీద ద్వేషంతో కౌరవులతో స్నేహం చేసి వారి పక్షాన ఉండేవాడు.
కురుక్షేత్ర సంగ్రామం చివరిలో కౌరవుల పక్షాన మిగిలిన ముగ్గురిలో అశ్వత్థామ ఒకడు. మహాభారత కాలంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన నిలిచి పాండవులతో యుద్ధం చేస్తాడు. ద్రోణాచార్యుడు యుద్ధంలో ఉంటె పాండవులు గెలవలేరని భావించిన శ్రీ కృష్ణుడు అశ్వత్థామ మరణించాడన్న పుకారును వ్యాపింపచేస్తారు. ఈ విషయాన్ని నిర్ధారణ చేసుకునేందుకు ద్రోణాచార్యుడు ధర్మరాజు దగ్గరకు వెళతాడు. ద్రోణాచార్యుని ప్రశ్నకు ధర్మరాజు బదులిస్తూ అశ్వత్థామ హతః అని ఆ తరువాత ద్రోణునికి వినపడకుండా కుంజరః అని అంటాడు. చివరి పదాన్ని గమనించని ద్రోణుడు పుత్రుడు మరణించాడన్న విషయాన్నీ విన్న వెంటనే ఆయన అస్త్ర సన్యాసం చేసి ధృష్టద్యమ్నుని చేతిలో మరణిస్తాడు. నిజానికి అశ్వత్థామ మాత్రం మరణించలేదు. అశ్వత్థామ అన్న పేరుగల ఏనుగు సంగ్రామంలో మరణిస్తుంది. కక్షతో రగిలిపోయిన అశ్వత్థామ యుద్దానంతరం ధృష్టద్యమ్నుడిని చంపాలని అనుకుంటాడు.
మహాభారత యుద్ధానంతరం తానూ ఎలాగైనా పాండవులని చంపుతానని అశ్వత్థామ దుర్యోధనునికి మాట ఇచ్చాడు. యుద్ధం చివరి రోజున అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యునితో కలిసి రాత్రి వేళ దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళతారు. ద్రౌపది పుత్రులైన ఉపపాండవులను పాండవులనుకొని ఇంకా ధృష్టద్యమ్నుడిని నిద్రిస్తుండగా చంపివేస్తాడు. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు. అర్జునుడు అశ్వత్థామతో యుద్దానికి తలపడతాడు. ఇద్దరు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తారు. ఆ రెండూ ఢీకొంటే ప్రళయం తప్పదని భావించిన ఋషులు ఇద్దరినీ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమంటారు. అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. కానీ అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోలేక పాండవుల వంశం అక్కడితో ఆగిపోవాలని అభిమన్యుడి భార్య అయిన ఉత్తర కడుపులోకి మళ్లిస్తాడు. ఆ అస్త్రప్రభావం వలన శిశువు తల్లి గర్భంలోనే మరణిస్తాడు. కానీ శ్రీకృష్ణుడు తన శక్తులని ఉపయోగించి శిశువుని తిరిగి బ్రతికించి అతనికి పరీక్షిత్తు అని నామకరణం చేస్తాడు.
అలాగే అశ్వత్థామ నుదుటి మీద ఉన్న మణిని తీసుకొని అశ్వత్థామని మూడు వేల సంవత్సరాల పాటు కుష్ఠు వ్యాధిగ్రస్తుడు కమ్మని శ్రీకృష్ణుడు శపిస్తాడు. శ్రీకృష్ణుని శాపం వాళ్ళ అశ్వత్థామ నుదుటి మీదనుంచి చీము రక్తం కారుతూ ఇప్పటికీ హిమాలయాలలో బ్రతికే ఉన్నాడని అంటారు.
ధన్యవాదములు.
మూగజీవాల పరిరక్షణ చెయ్యా లి అని ఈ రోజుల్లో అందరూ ముక్త కంఠంతో చెపుతున్నారు. దీని కోసం జీవకారుణా దినోత్సవాలు చేస్తూనే ఉన్నా రు. కానీ ఈ విషయం మహాభారతం ఆదిపర్వంవల్లనే వేదవ్యాసుడు “సరము” అనే దేవ శునకం ద్వారా మూగజీవాలను పరిరక్షించాలనే సందేశాన్ని తెలిపాడు. మూగజీవాలకి వాటి భావాలను వ్యక్తం చేసే భాష లేదు కానీ వాటికి కూడా బాధలు ఉంటాయి. సంతోషం, దుఃఖం, పుత్ర వాత్శల్స్యం అన్నీ ఉంటాయి అని తెలిపేదే ఈ సరమ కథ.
పరీక్షణ్మ మహారాజు కుమారుడు, అర్జునుని మునిమనవడు, అభిమన్యుని మనవడైన, జనమేజయ మహారాజు కురుక్షేత్ర యుద్ధం ముగిశాక ఒక యజ్ఞం తలపెడతాడు. ఆ యజ్ఞ ప్రాంగణంలోకి వచ్చి న ఒక కుక్క ని, జనమేజయ మహారాజు తమ్ముళ్ళైన ఉగ్రసేనుడు, భీమసేనుడు, శ్రుత సేనుడు అనే వారు తీవ్రంగా గాయపరిచి తరిమి కొడతారు. ఆ కుక్క పేరు సారమేయము. అది దేవతా శునకమైన సరమ కుమారుడు. సరమ అతి కోపం తో యజ్ఞ భూమికి వెళ్ళి, జనమేజయున్ని నిలదీసింది… “నా బిడ్డ ను నీ తమ్ముళ్లు అకారణంగా చావబాదారు, నీవు చక్రవర్తివి, సర్వ జీవాలకు అధిపతివి, ధర్మరాజు మనవడివి, నీకు ధర్మం తెలియదా?” అంటూ
తగునిది తగదని యెదలో
వగవక సాధులకు బేధవారెలకెగ్గుల్
మొగిజేయు ధుర్వి నీతుల
కగునని మిత్తాగమంబులై న భయంబుల్
అమాయకులను, మూజీవులను, దీనులను, అబలలను, స్త్రీలను, పిల్లలను హింసిస్తే వారి ఉసురు శాపమై తగులుతుందని, మావంటి దీనులను
బాడపెట్టిన పాపం ఊరికే పోదు! అని శపించింది.
ఇలా కుక్క కి జరిగిన అవమానంతో భారత్ కథ మొదలవుతుంది. ఇక కుక్క ని సన్మానించిన ఘట్టం మహాభారతంలోని స్వర్గారోహణ పర్వంలో కనిపిస్తుంది. శునక సన్మానంతోనే వేదవ్యాసుడు మహాభారతాన్ని ముగుస్తాడు.
వ్యాసమహర్షి ఆదేశానుసారము, పాండవులు ద్రౌపదీ సమేతంగా స్వర్గానికి బయలుదేరగా వారి వెనుక ఒక కుక్క కూడా ప్రయాణవుతుంది. ఆ ప్రస్థానంలో వరుసగా ద్రౌపదీ, నకుల, సహదేవులు, భీమార్జునులు పడిపయి ప్రాాలు వదులుతారు. ధర్మరాజు మాత్రం వెనుదిరిగి చూడకుండా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. కుక్క కూడా అనుసరిస్తూనే వుంటుంది. ఇంద్రుడు వచ్చి ధర్మరాజుని రథం ఎక్కుమన్నాడు. నా వారంతా నన్ను వదిలి వెళ్ళారు, కాని ఈ కుక్క మాత్రం నాతో యే సంబంధం లేకపోయిన నన్నే అంటిపెట్టుకొని నాతోనే వచ్చింది. ముందు ఈ శునకాన్ని రథం ఎక్కించమన్నాడు. సాధువులను హింసించడం బ్రహ్మహత్యాపాతకం అని బోధించాడు. ఇంద్రుడు చేసేది లేక, కుక్కకి కూడా ఉత్తమ గతులు కల్పించాడు.
ఇలా మహాభారతాన్ని కుక్క తో మొదలు పెట్టి, కుక్కతో ముగించాడు వ్యాసమహర్షి. సరమ కథలో మానవీయ విలువలు కోల్పోకూడదనీ, విధ్వంస
కాండ చేయరాదని, నీతి మార్గాన్నిఅనుసరించాలని సందేశం ఇవ్వ బడింది. అదే విధంగా స్వర్గారోహణపర్వం వల్ల ధర్మరాజు ద్వారా
మూగజీవాలని పరిరక్షించాలని, వాటిని చులకనగా చూడరాదని సందేశం ఇవ్వ బడింది.
సుమిత్ర కాశీరాజ్యపు రాకుమారి. పుత్ర కామేష్టియాగం చేసిన తరువాత యజ్ఞఫలం మూలంగా ఈమెకు లక్ష్మణుడు, శతృఘ్నుడు జన్మించారు. ఈమె పుత్రుడైనందున లక్ష్మణున్ని సౌమిత్రి అంటారు.
సుమిత్ర అనగా మంచి మైత్రి కలిగినది. అనగా మంచి స్నేహభావం కలిగినది అని అర్థం. రామాయణంలో సుమిత్ర ప్రస్తావన చాలా కొంచెంగా వస్తుంది. ఆమె పాత్రలో చాలా ఉదాత్తత, వివేకం కన్పిస్తాయి. వనవానికి వెళ్ళేముందు సీతారామలక్ష్మణులు ఆమె వద్దకు సెలవు తీసుకోవడానికి వెళ్ళారు. అప్పుడామె దుఃఖిస్తూనే లక్ష్మణునితో,
“రామం దశరథం విద్ది మాం విద్ది జనకాత్మజాం,
అయోధ్యయ మటవీం విద్ధిగచ్ఛతాత్ యధాసుఖం”
అంటూ, “నాయినా! ఇకపై రాముడే నీకు తండ్రి. నీ వదిన సీతే నీకు తల్లి. నీకు అడవే అయోధ్య. అరణ్యాలలో ఏమరుపాటు లేకుండా రాముణ్ణి కాపాడుకో. క్షేమంగా వెళ్ళి రా తండ్రి” అంటూ లక్ష్మణుని శిరస్సును ముద్దాడింది. “ఇక్ష్వాకు వంశంలో పుట్టావు. దానాలు చేయటం, యజ్ఞాలు చేయటం, యుద్ధంలో వీరోచిరంగా పోరాడటం , ఈ వంశంలో పూర్వం నుండి వస్తున్న ధర్మ పద్ధతే! అన్నగారిని అనుసరించి నడవటం అనుజునిగా నీ ధర్మం” నీతి బోధ చేసింది.
పుత్రవియోగంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కౌసల్యను సుమిత్ర ధర్మయుక్తమైన మాటలతో,
మాటలతో ,
“పునుః ప్రవిష్టం ధృష్ట్వాతమ భిషిక్తం మహాశ్రియం,
సముత్ర్యక్షసి నేత్రాభ్యాం క్షిప్రమానం ధ్వజం పయః”
అంటూ, “అక్కా! రాముని కంటే సన్మార్గాన నడిచే గొప్పవాడు లేడు. పదునాలుగు ఏళ్ళ వనవాసం పదునాలుగు రోజుల్లాగా గడిచిపోతాయి. నీ కుమారుడు త్వరలో వచ్చి నీ పాదాలకు నమస్కరిస్తాడు. అది చూచి నీవు ఆనందంతో పొంగిపోతావు” అని ధైర్యం చెప్పింది.
సుమిత్ర గొప్ప వీరమాత. ఇద్దరు బిడ్డలని కన్నప్పటికి ఒక కొడుకుని రామునికి, ఇంకొక కొడుకుని భరతునికి అప్పగించింది. సుమిత్ర తన బిడ్డలు, సవతి బిడ్డలు అనే భేదభావం లేనిది. రామునియందు అమితమైన ప్రేమ కలది. లోకంలో ఎవ్వరైనా తమ సవతి బిడ్డల కోసం తమ బిడ్డలను త్యాగం చేయలేరు. సుమిత్ర అంతటి త్యాగశీలి. గుణవతి. ఈమె చరిత్ర రామాయణంలో ఆచంద్రతారార్కం నిలిచి ఉంటుంది.
అందరికి నమస్కారములు. నా పేరు చిరుహాసిని. నేను ఏడవ తరగతిలో చదువుకుంటున్నాను. నేను ఈ రోజు గజేంద్రుని గురించి చెప్పబోతున్నాను.
క్షీరసాగరంలో త్రికూట పర్వతం మీద ఒక పెద్ద అడవి ఉన్నదీ, ఆ అడవిలో ఒక గజరాజు అనేక ఆడ ఏనుగులతో కలిసి తిరుగుతూ అక్కడే ఉన్న సరోవరంలోకి దిగి దాహం తీర్చుకుంటూ ఉండగా అందులోనున్న మొసలి గజేంద్రుని కాళ్ళుపట్టుకున్నది. అసలు ఎవరి గజరాజు?
పూర్వం ఇంద్రాజ్ఞామునుడు అనే రాజు అగస్త్యమునిని ఉదాసీనంగ చూడటంవల్ల ఏనుగు జన్మ ఎత్తి నానా బాధలు పడమని అగస్త్యుడు శపించాడు, మరి ఈ మకరం ఎవరు? దేవలుడనే ముని శాపం వల్ల హు హు అనే గంధర్వుడు మొసలి రూపం ఎత్తాడు. ఈసారి మకారులు విధివశాత్తు ఒకచోట చేరి ఈ విధంగా ఘోర పోరాటం సాగించారు.
కరి దిగుచు మకరి సరసికి
కారదరికిని మకర దిగుచు కరికరి బెరయన్
కరికి మకరి మకరికి గరి
బరమగుచును నతల కుతల భటులరుదు వడన్
అన్నట్లుగా ఒకసారి కరి రాజుది పైచేయి అయితే మరొకసారి మకరిపై చేయిగా నిలుస్తూ వారు జరుపుతున్న పోరాటంవల్ల సరస్సులోని జలచరాలన్నీ ప్రాణాలు కోల్పోయాయి.
మోహమనే పెద్ద తీగతో కట్టబడిన పాదాన్ని విడిపించుకోలేని జీవుడి లాగా గజేంద్రుడు మొసలి వాడి కోరలకు చిక్కవేయి ఎల్లకాలం తీవ్రపోరాటం సాగించాడు. తన బలమంతా ఉడిగిపోతున్నది.
గజేంద్రునికి తనలో శక్తి ఉన్నంతవరకు ఏ దేవుడు గుర్తుకు రాలేదు. నిజానికి గజేంద్రుడు విష్ణుభక్తుడు. కానీ అహంకారంతో తనని గెలిచిన వారు లేరన్న ధీమాతో వేయి సంవత్సరాలు పోరాడి
లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబట్ట ప్రాణముల్ ఠావుల్ దప్పెను మూర్చ వచ్చి అంటూ అప్పుడు నివే దప్ప ఇతఃపరం బెరుగ అని శ్రీమన్నారాయణుని ప్రార్థించాడు. రావే ఈశ్వర కావవె వరదా అంటూ అనేక రీతులుగా మొరపెట్టుకున్నాడు.
కలదందురు దీనులయెడ – కలడందురు పరమయోగి అంటూ అనేక రీతులుగా వేడుకున్నాడు.
ఒక మలాప్త ఓ వరద నన్ను కావవే అని ఎలుగెత్తి పిలుస్తున్న తన భక్తుడైన గజరాజు ఆర్తనాదం విష్ణువుకి వినిపించింది. శంఖ చక్రాలను పరివారాన్ని కూడా వదిలి శ్రీ లక్ష్మికైనా చెప్పకుండా ఉన్న ఫలంగా వచ్చాడు, ఆ మొసలిని సంహరించి గజరాజును కాపాడాడు శ్రీహరి.
మానవుడు తనకి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు నాయంత బలవంతులు, పరాక్రమవంతులు లేరని విర్రవీగుతారు, సత్తువ తగ్గి, కష్టకాలం వచ్చినపుడు భగవంతుడు గుర్తుకు వస్తాడు అనే నగ్న సత్యం గజేంద్రమోక్షం కథ వల్ల మనకి తెలుసు్తన్నది. భగవంతున్నీ సర్వకాలం సర్వావస్థలందు ధ్యానించుకోవాలని, కేవలం కష్టాలు వచ్చినపుడు కాదనే నీతిని బోధిస్తుది గజరాజు కథ.
ఓ ఇంటి పెరట్లో పొట్లకాయ పాదు, దొండకాయ పాదు ఇంకా రకరకాల కూరగాయల మొక్కలు ఉన్నాయి. ఆ ఇంటి యజమాని చక్కగా అన్నిరకాల కూరగాయల మొక్కల్ని ప్రేమగా పెంచుకుంటున్నాడు. పక్కపక్కనున్న పందిళ్లపై పాకి ఉన్న పొట్లకాయ, దొండకాయ తీగలు రోజు మాట్లాడుకుంటూ ఉంటాయి. పైకి మామూలుగా మాట్లాడుతున్నప్పటికి పొట్లకాయకు తాను బాగా పొడుగ్గా ఉంటానని అహంకారం ఉంది. పొడుగ్గా ఉంటే అందంగా ఉంటారని అనుకుంటుంది ఇలా మొదలైన దాని అహంకారం పెరిగి పెరిగి పొగరుగా రూపుదిద్దుకున్నది.
పొట్లకాయకు తాను పొడుగ్గా అందంగా ఉంటాననే కాకుండా, దొండకాయ పొట్టిగా, అందవికారంగా ఉంటుందని అనిపించసాగింది. అలా ఆలోచన వచ్చిందే తడవుగా తాను దొండకాయకన్నా గొప్పదాన్నిని అనుకోవడంతో పాటు దొండకాయను అవహేళన చేయడం మొదలు పెట్టింది. ఈ మాత్రం సమయం దొరికినా, ఏ చిన్నపాటి అవకాశం లభించిన దొండకాయను వదలడం లేదు. పొట్లకాయ మాటలకు దొండకాయ చాలా బాధపడుతోంది. కానీ ఏం చేయలేకపోతున్నది. దూరంగా పారిపోదామా అంటే జంతువులకు ఉన్నట్లు తమకు కాళ్ళు చేతులు లేవాయే. ఎక్కడ ఉన్నవాళ్లం అక్కడే ఉండాలి. తమ తల్లిదండ్రులు ‘ఇరుగుపొరుగుతో మంచితనంగా ప్రేమగా ఉండాలి’ అని చెప్పారు. అందుకే పొట్లకాయతో ఎంత ప్రేమగా ఉన్న అది ఊరుకోవడం లేదు. దాని పొడుగును చూసుకొని విర్రవీగుతోంది. దొండకాయ తననింతపొట్టిగా పుట్టించినందుకు దేవుణ్ణి తిట్టుకొంది. ‘నేనెందుకింత అందవిహీనంగా ఉన్నాను’ నేను చేసిన పాపమేమిటి? అనుకుంటూ రోజు తనలో తాను కుమిలిపోసాగింది.
ఈ వ్యవహారన్నంతా ఆ పక్కనే ఉన్న కాకరపాదు గమనించింది. విషయం కొద్దిగా అర్థమైన పూర్తిగా తెలుసుకుందామని దొండకాయను పలకరించింది. అడిగిందే తడవుగా తన మనసులోని బాధనంతా చెప్పేసుకుంది దొండకాయ. ‘నేను పొట్టిగా ఉండటం నా తప్పా? పొట్లకాయ ఎలా కూరగాయగా మానవులకు పనిచేస్తుందో నేను కూడా అలాగే కూరగాయగా పనికొస్తున్నాను కదా!’ అంటూ బోరుబోరున ఎడ్చింది. కాకరకాయ దొండకాయను ఊరడిస్తూ ఇలా చెప్పింది. ‘దేవుని దృష్టిలో గొప్ప, తక్కువ తేడా లేదు. అందరూ సమానమే. ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది! కాబట్టి మొదట నువ్వు ఏడవడం మానేసి ప్రశాంతంగా ఆలోచించు! అన్నీ నీకే అర్థమవుతాయి!’ అన్నది.
దొండకాయ కొద్దిగా ఏడుపు ఆపి కళ్ళ నీళ్ళు తుడుచుకొని సరిగా కూర్చుంది.అప్పుడు కాకరకాయ మరలా ఇలా చెప్పింది. “చూడు! నన్ను కూడా అందరూ చేదు చేదని అసహ్యించుకుంటారు. పిల్లలైతే నన్నసలు ముట్టుకొనే ముట్టుకోరు. ఇంకా నా చర్మం మూడుతలు పది ఉంటుందని ముసలమ్మని అంటూ ఎగతాళి చేస్తారు. అయినా నేను ఇవేవి పట్టించుకొను. నన్ను ఇంతగా అసహ్యించుకున్నా షుగర్ వ్యాది ఉన్నోళ్ళు నన్ను ఎంతో ప్రేమగా తింటారు. నాలో షుగరు వ్యాధిని తగ్గించే గుణాలు ఉన్నాయట. మానవులు తినటానికి కూరగాయగా పనికిరావడమే కాకుండా వారి వ్యాధుల్ని కూడా తగ్గించగలుగుతున్నానన్నసంతోషం ముందు ఈ ఎగతాళులు ఎంత మాత్రం నన్ను బాధించవు! అలాగే నువ్వు కూడా ముందు బాధపడటం మానెయ్యి. చక్కగా తిని ఆరోగ్యంగా ఉండు. చూడు నీరసంతో ఎలా చిక్కి శల్యమయ్యావో!”. దాంతో దొండకాయ కొంత ఊరట చెందింది. ‘అంతేనంటావా! నాకు ఈ లోకంలో గుర్తింపు ఉందంటావా?’ ఇంకా పూర్తిగా అనుమానం పోక అడిగింది.
చూడు దొండకాయ మిత్రమా! అసలు నీ గొప్పదనం నీకు తెలియడం లేదు. మానవుల్లోని మహా మహాకవులు అందగత్తెలైన స్త్రీల పెదవుల్ని ‘దొండకాయ వంటి పెదవులు’ అని నీతో పోలుస్తారు తెలుసా! నేవ్వెమో కధలు చదవవు. నీకేమో పుస్తకాలు చదివే అలవాటే లేదాయే! అతిలోక సుందరులైన రంభ, ఊర్వశి, మేనకల్నైనా ఎర్రగా పండిన దొండపండు వంటి పెదవులు’ అంటూ పొగడాల్సిందే. నీ ప్రత్యేకత ఎవరికీ లేదు! అంటూ వివరిచింది.
ఇప్పుడు దొండకాయకు ఇంకాస్త ధైర్యం వచ్చింది. ‘ నేనీ అందమైన ఆడవాళ్ళ పెదవుల్లా ఉంటానా’ అనుకుంది. ‘నేను ప్రత్యేకమైనదాన్నని నాకు తెలిసొచ్చింది. నాకు పిరికితనం పోయి ఆత్మవిశ్వాసం వచ్చింది. మరి ఈ పొట్లకాయ ఆగడాలు ఇలా భరించాల్సిందేనా! దీనికేం దారిలేదా!’ మళ్ళీ బేలగా అడిగింది. దానికి కాకరకాయ సమాధానంగా దొండకాయ తల నిమురుతూ ఇలా చెప్పింది. ‘చూడు మిత్రమా! ప్రతిదానికీ ఒక సమయమంటూ ఉంటుంది. ఆ సమయం వచ్చినపుడు ఏది ఎలా జరగాలో అలా అరుగుతుంది. దాని మాటలు పట్టించుకోవద్దు. సృష్టిలో ఎన్నో మొక్కలు ఉన్నాయి. ఏడిపించేవారిని వదిలేసి నీతో మంచిగా ఉండేవారితో స్నేహం చెయ్యి. ఏమి బాధపడకు. ధైర్యంగా ఉండు’ అంటూ ఉపదేశించింది. దాంతో దొండకాయ పూర్తిగా శాంతించింది. పొట్లకాయను మరిచి మిగతా స్నేహితులతో సంతోషంగా ఉండసాగింది.
ఇలా ఉండగా ఒకరోజు ఉదయం నిద్రలేచేసరికి ఇంటి యజమాని పొట్లపాదును తీసేస్తున్నాడు. తీగలన్నీ పీకెసి చెట్టు మొదలును తవ్వేస్తున్నాడు. పొట్లకాయ విపరీతమైన బాధతో ఏడుస్తున్నది. తనను చంపొద్దని యజమానిని ప్రాధేయపడుతుంది మౌనంగా. యజమాని అలా దొండకాయకు అర్థం కాలేదు. ఎంటా అని పక్కనే ఉన్న కాకరచెట్టు వంక చూసింది.
అప్పుడు కాకరచెట్టు ఇలా చెప్పింది. రాత్రి యజమాని వాళ్ళ చిన్న కొడుకు చీకట్లో పొడుగ్గా పెరిగిన పొట్లకాయను చూసి పాము అని జడుసుకున్నాడట. రాత్రి నుంచి జ్వరం తగ్గలేదు. పిల్లాడు బాగా భయపడ్డాడు అందుకే యజమాని పొద్దున్నే ఈ చెట్టును పీకెస్తున్నాడు. చూశావా ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నువ్వు దాని పొగరు చూసి భయపడ్డావు. దాని ఆకారాన్ని చూసి పొట్లకాయ గర్వించింది కానీ పిల్లాడు పామని ఎలా భయపడ్డాడో చూడు. మన గొప్పదనాన్ని ఇతరులు గొప్పగా చెప్పుకోవాలి కానీ మనకు మనమే గొప్పనుకోకూడదు. నువ్వు ఇకనుంచైనా ఆత్మవిశ్వాసంతో మెలుగు. ఎవరేం చెప్పినా, ఎవరేం అన్నా పట్టించుకోవద్దు. నీ సంతోషమే నీకు ముఖ్యం.