బతుకుబండి నడకంతా భయాల బాటలోనే
సెలబ్రిటీస్ లలో
అభద్రతా భయం
తల్లిదండ్రులలో
ఓల్డ్ ఏజ్
హౌస్ భయం
ఉద్యోగాలులేక
యువతలో
బతుకు భయం
నిజాయితీపరులకు
లంచం భయం
పేదవాడికి వడ్డీ భయం
ఆటో వాడికి
ఫైనాన్సర్ భయం
తాగుడు వల్ల
భార్యా పిల్లలకు
భయం
ప్రయాణీకుడికి
టిక్కెట్టు ధర
బాదుడు భయం
ఖాళీ జాగా వాడికి
భూ కబ్జాదారుల
భయం
ఓట్ల కోసం
హిందూ ముస్లింల
విభజన భయం
ధర్మ సంసద్ లో
తీవ్రవాద భయం
ప్రభుత్వానికి
ఉచితాల భయం
స్కూల్ ఫీజులవల్ల
పేరెంట్స్ కు భయం
చిన్నారులకు
మొబైల్ ఫోన్ ల
భయం
పార్టీలో
నిజాయితీపరులకు
గెంటివేత భయం
ప్రార్థనాల
యాలలో
నిర్వాహకుల భయం
కరోనా కోర్సుకు చిక్కుతామేమోనని
ప్రపంచ మానవాళికి
భయం
కోవిడ్ షీల్డ్
తీసుకున్నా భయం
Covid 19
తీసుకోకపోయినా
భయం
మారు పేరుతో
వచ్చిన వోవిుక్రోన్తో
భయం
చివరికి దేశ దేశాల ప్రధానరక్షకులకూ
ప్రాణ భయం
మరి సామాన్యుడికి ఇక
ఏది భద్రత సుఖం ?
అందరికీ
ఇక దైవమే అభయం.

పెదవులపై నవ్వు
టి రైలు ప్రయాణం. కుతూహలంతో ఆ రాత్రంతా మేల్కొని ఉండి దారిలో తటస్థించిన ప్రతి స్టేషన్ పేరును, రెండు స్టేషన్ల మధ్య కాలాన్ని గుర్తు పెట్టుకుంటూ (నోట్ చేసుకుంటూ) వచ్చాను. మద్రాసులో 40 రోజులు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో మా పని. అక్కడి ప్రదేశాలు, ధరపరలు, విశేషాల గురించి ఏ రోజుకారోజు రాత్రి టూకీగా దినచర్య రాసుకునేవాణ్ణి. ఈ విధంగా ప్రదేశాల గురించి దినచర్య రాయటం, రైలు ప్రయాణంలో స్టేషన్ల వివరాలు నోట్ చేసుకోవటం అనేది యాత్రా చరిత్ర రచనలో కొంతవరకు ఒక భాగమేనని నాకు అప్పటివరకు తెలియదు. తర్వాత పిహెచ్.డి. చేయాలనుకొని “కరీంనగర్ గ్రామ నామాలు”, “గ్రంథ పరిష్కరణల పద్ధతులు” – ఈ రెండు అంశాల్లో ఏదైనా ఒకదాని గురించి మీ అభిప్రాయమేమిటని గోపికి అడిగినప్పుడు, ఆయన ఈ రెండింటి పైన పరిశోధనలు జరుగుతున్నాయి. నీవు “తెలుగులో యాత్రా చరిత్రలు” అనే అంశం మీద చేయి, అది నీ స్వభావానికి బాగా నప్పుతుంది అని సలహా ఇచ్చాడు. అదే అప్లై చేసాను, సీటు వచ్చింది. నాకు తోచిన అంశం కాకున్నా, దానిపై ఇష్టం పెంచుకొని, మనసు పెట్టి రాసి, పరిశోధనాంశానికి తగిన న్యాయం చేసాననే భావిస్తున్నాను.
రాలను వెలికి తీసిన వైనం పొందుపరచబడింది.