మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
బాల‌సాహిత్యం

” పసి పిల్లలు ” (బాలగేయం)

by Gadwal Somanna October 25, 2021
written by Gadwal Somanna
పసి పిల్లలు వేల్పులు
జగతి ప్రగతి బాటలు
వెలుగునిచ్చు భానులు
నింగిలోని  తారలు
       ముద్దులొలుకు పిల్లలు
       ముద్దబంతి పువ్వులు
       మురిపించే మువ్వలు
       విహరించే గువ్వలు
ఇంటిలోన దివ్వెలు
కంటిలోని పాపలు
ప్రాణమున్న బొమ్మలు
ఫలములిచ్చు తరువులు
         వెన్నెలమ్మ జల్లులు
         వెన్న వంటి మనసులు
         సొగసుల హరివిల్లులు
         తెల్లని సిరిమల్లెలు
కన్నవారి ఆశలు
వారి గుండె శ్వాసలు
బాధ్యతగల పౌరులు
భారతమ్మ వీరులు
-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు, సెల్:9966414580
—–హామీ పత్రం——
మయూఖ పత్రిక సంపాదకులకు నమస్కారం. ఈ గేయం నా సొంత రచన.అనువాదం, కాపీ కాదని హామీ-గద్వాల సోమన్న
October 25, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

సైరంధ్రి

by Bhavani October 25, 2021
written by Bhavani

సర్గ : 2

అక్కడే మేలుకొన్నది ఆలోచనాలోకం ,

ఎక్కడికో పరిగెడుతున్నది మానసం ;

భిన్నభ్రమలను కూడదీసుకుని ,

తనకుతానే నిలిచెను ఒంటరిగా  !

 నిత్య వికసిత యవ్వనదీప్తి ,

ముగ్ధవసంత బాల్యవిముక్త ;

అరుణచాప అపురూప విలసిత,

ఎగిసిపడినది యజ్ఞజ్వాలలా!

 కలత చెందిన కోరికలు ,

క్రూర వాస్తవ విలోకనలు;

సర్వం కరిగిన కాలంతెరలు,

                                       -2-

స్వరబద్ధాలంకృత శిధిల వాద్యాలు!

 లోపలి సూర్యుని నిద్రలేపెను,

వడిగా చీకటి పారిపోయెను ;

ఎప్పటినుంచో హత్తిన నీడ ;

అన్నిటినుండీ లిప్తను వీడెను!

 సకల అస్మితలు ఓడిపోయినవి,

మాన్యతాయుత  ముకుటము తొలగె ;

యాచన  కోరిన శరణాగతిగా,

వికృతరూపము దీక్షగబూనె!

 అటు ఇటు ఏవో ఆలోచనలు,

అతులిత సమయస్మృతి కదలె;

స్వయంవరం అది ఎవరి కోసమో ,

ఆమెయే నేడు అభిశప్త భాగ్య!

                                     -3-

జనకుడు వరుని వెదకిన వేళ ,

ఆహ్వానించెను రాజవీరులను;

చివరకు పడినది దావానలమున,

నూతనరూప శపిత మోసమున!

 పరమ ప్రియతముని వరించవలయు,

అయినను కానదు మనోహరుని;

పాండుపుత్రుని ప్రతిష్ట వెలిగె,

సూతపుత్రుడు కళంకమొందె!

 అచ్చట నిలిచిరి ఇద్దరు వీరులు, అద్వితీయ దీప్తిమంతులు,

విజయునే  వరింపవలసె , రాధేయుని  వెడలగద్రోసె;

క్షాత్రతేజమున విరాజిల్లినా, నాధుడుమాత్రం కాలేడు,

కిరీటికి  సరిసమానుడు , వివశవదనుడై వెనుదిరిగె!

                         ******

గుజరాతీ మూలం , హిందీ అనువాదం : డా. వినోద్ కుమార్ జోషి  

 

 

 

 

October 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఓ నా పవిత్ర దేశపు సైనికుడా!

by ఎలనాగ, సురేంద్ర నాగరాజు October 25, 2021
written by ఎలనాగ, సురేంద్ర నాగరాజు

ఓ నా పవిత్ర దేశపు సైనికుడా!

నీ భుజంమీద నువ్వు పెట్టుకున్న తుపాకీకి

కళ్లు లేవు, కాళ్లూ లేవు

నా అడుగుల్ని గమనించేందుకు

అది నీ కళ్లను దొంగిలిస్తుంది

నా అడుగుల జాడల కోసం,

నా ఛాతీని ఛిద్రం చేయడం కోసం

నా చావుకేకను నీ వీనులతో వినడం కోసం

అది నీ పాదాలను తస్కరిస్తుంది

 

ఓ నా పవిత్ర దేశపు సైనికుడా!

నీ భుజం మీద నువ్వు మోసే ఆ తుపాకీ

అవిటిదా చెవిటిదా గుడ్డిదా?

నీ కళ్లను చెవులను పాదాలను తగిలించుకునేందుకు

అది తన కళ్లను చెవులను పాదాలను రాల్చుకుందా?

 

నీకేమీ తెలియకపోవచ్చు ఆ తుపాకీ గురించి

కానీ మనం మన అన్నదమ్ములను అంతమొందించేలా

మన దవడలను ఒకరినొకరం దారుణంగా విరగ్గొట్టేలా

తను మాత్రం దొరకకుండా క్షేమంగా ఉండేలా

మనిద్దరి శత్రువు ఒక దూరప్రాంతంలో

పథకాన్ని రచిస్తున్నాడు

తన రక్తం చిందకుండా

మన రక్తం మాత్రం మట్టిలో కలవాలని అతని కోరిక

తన శరీరాన్ని షర్టులాగా ఇంటిదగ్గర వదిలి

తుపాకీ రూపంలో రావాలన్నది అతని పన్నాగం

 

ఓ నా పవిత్ర దేశపు సైనికుడా!

కాళ్లుచేతులు లేని మన దుష్టశత్రువు

ఒంటరిగా రాడు, మనకన్న పెద్దసంఖ్యలో

గుంపులుగుంపులుగా వస్తాడు

ప్రతి తుపాకి విచ్చలవిడిగా తిరుగుతూ

ఎడతెగకుండా పేలుతుంటుంది

తన ఎముకలు విరగకుండా, తన చర్మం కాలకుండా

తన రక్తనాళాలు నెత్తురోడకుండా

తుపాకీ అంగాలన్నీ ఇంటిదగ్గర క్షేమంగా ఉంటై

అది మన అవయవాల్ని ఉపయోగిస్తుందిక్కడ

ఒక తుపాకీ నీ పాదాలతో నన్ను వెంటాడుతుంటే

మరొకటి నా కన్నుతో నిన్ను గురి చూస్తుంది

మూడోది నీ భుజం మీద ఉన్నట్టుగానే

ఇంకొకరి భుజం మీద ఉంటుంది

దాని అంగాలన్నిటినీ ఇంటిదగ్గర వదిలేసి

అది కేవలం నోరుతోనే వచ్చిందిక్కడికి

భుజం నీది కానీ నోరు మాత్రం దానిదే

దంతాలు లేని ఆ నోరు తూటాలను

పదాలుగా మార్చి మాట్లాడుతుంది

కానీ ఒక తూటా మనవాడిని చీల్చినప్పుడు

అతడు దంతాలు లేని తుపాకీ నోరును చూడడు,

నీ భుజాన్ని, నీ చేయిని చూస్తాడు

నిన్ను శత్రువుగా భావిస్తాడు, గన్నును కాదు!

నీ నుండి ప్రతీకారాన్ని కోరుతాడు

 

ఓ నా పవిత్ర దేశపు సైనికుడా!

నీ భుజం మీది తుపాకీ మన నేలమీద

ఎంత రక్తాన్ని చిందించింది?

అయినా సంజాయిషీ ఇవ్వలేదెందుకు?

ఈ రక్తపాతానికి నువ్వే నిందింపబడుతావు

నీనుండే ప్రతీకారం ఆశింపబడుతుంది

వాళ్లేమో మరో తుపాకీని భుజం మీద పెట్టి

దాని నోట్లోంచి వచ్చే తూటాను నీ గుండెకు గురి చూస్తారు

 

రాజ్యాధికారం కోసం అర్రులు చాస్తున్నవాడా!

ఏదో ఒకరోజు తూటా నీ గుండెను చీలుస్తుంది

నువ్వు సింహాసనం కంటె శవపేటికకు

ఎక్కువగా దగ్గరవుతున్నావు జాగ్రత్త

నీ శత్రువు నిన్ను సమాధిలోకి విసరకముందే

నువ్వు యోచించి జాగ్రత్త పడు

ఈ విషాదకర విధిరాత నుండి రక్షించుకునేందుకు

నీ చావుకోసం పథకం వేసేవాణ్ని గుర్తించాలి నువ్వు

నేను నీ సోదరుణ్ని. మనిద్దరి శత్రువైన తుపాకి

అవిటిదానిగా, చెవిటిదానిగా,

గుడ్డిదానిగా ఉంది నీ భుజం మీద

అది నా అడుగులను నీ కళ్లతో గమనిస్తోంది

నా గుండెలోంచి దూసుకుపోయేందుకు,

నా చావుకేకల్ని నీ చెవుల్తో వినేందుకు

నన్ను వెంటాడుతోంది నీ పాదాలతో

పష్తో మూలం: దర్వేష్ దురాని

                                                  ఆంగ్లం: దావూద్ ఆజమి

                                                  తెలుగు సేత: ఎలనాగ

***

       

October 25, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

నిశీధి

by Sudharshan Chintapatla October 25, 2021
written by Sudharshan Chintapatla

అర్ధరాత్రి.
డాక్టర్.. డాక్టర్..
ఎవరో పిలుస్తున్నారు కాదు అరుస్తున్నారు.
నేను కళ్ళు తెరిచి స్థానిక జమీందారు దక్షిణాచారణ్ బాబును చూశాను. లేచి నిలబడి చేతులు విరిగిన కుర్చీలో ఆయనను కూర్చోబెట్టి గాభరాగా ఆయన ముఖం లోకి చూశాను. గడియారం రెండున్నర గంటల సమయం చూపింది. ఆయన ముఖం పాలి పోయి ఉంది. సూటిగా నన్ను చూస్తూ” మళ్లీ అదే సమస్య మీ మందు పనిచేయలేదు” అన్నాడు.” బహుశా మీరు మద్యం సేవించి ఉంటారు అందువల్లనేమో”
అన్నాను జంకుతూ. ఆయన ముఖం ఎర్రబడింది
” కాదు కాదు తాగడం వల్ల కాదు కథ మొత్తం మొదటి నుంచి చివరి దాకా  చెప్తే కానీ కారణం ఏమిటో నీకు అర్థం కాదు” అన్నాడు. గూట్లో ఉన్న గుడ్డి దీపం వత్తిని ఇంకొంచెం పైకి జరిపాను. అది వెలుతురుని కొంచెం పెంచింది.  ధోవతి బిగించి దినపత్రికల కట్ట ఉన్న అట్ట పెట్టె మీద కూర్చున్నాను.
దక్షిణాచారణ్ బాబు మొదలుపెట్టాడు. నా మొదటి భార్య లాంటి ఉత్తమ ఇల్లాలు చాలా అరుదుగా కనిపిస్తుంది. నేను మంచి వయసులో ఉన్నాను  కవిత్వం మోజులో ఉండటంవల్ల కల్తీ లేని స్వచ్ఛమైన ఇల్లాలు నాకు పెద్దగా నచ్చేది కాదు. ఆమె ముందు నేను ఒక ప్రేమికుడులా ప్రవర్తిస్తే పగలబడి  నవ్వేది. గంగానది బురదలో చిక్కుకున్న ఇంద్రుడి ఐరావతం లా గిజగిజలాడేవాణ్ణి . ముత్యాల్లాంటి పదాలను కూర్చి ఎంత ప్రియమైన మాటలు చెప్పినా ఆమె ఒకే ఒక్క నవ్వుతో ఊడ్చి పారేసేది.
నాలుగు సంవత్సరాల జీవితం గడిచింది. నేను జబ్బు పడ్డాను. జ్వరం తీవ్రమై సంధి ప్రేలాపనదాకా వచ్చింది. నేను బతుకుతానని ఎవరూ అనుకోలేదు. డాక్టర్ కూడా లాభం లేదన్నాడు. ఆ సమయాన మా బంధువు ఒకడు ఎక్కడి నుంచో ఒక సన్యాసిని మా ఇంటికి తీసుకు వచ్చాడు. ఆయన ఒక మూలికను నేతిలో ముంచి నా చేత తినిపించాడు. మందు ప్రభావం వల్లో ఆయుష్షు తీరకపోవడం వల్లో బ్రతికి బయట పడ్డాను.
నేను జబ్బుతో ఉన్నప్పుడు  నా భార్య తీరిక లేకుండా గడిపింది. ఆరోజుల్లో యమదూతలు మా ఇంటి ముందు గుంపు గా ఉండేవారు. ఒక అబల అయి ఉండి ఆమె కేవలం మానవ శక్తితో నా మీద ప్రేమతో నా పనికి మాలిన ప్రాణాలు నిలబెట్టటానికి వారు లోపలికి రాకుండా నిరంతరం పోరాడింది.   ఒక చిన్న పిల్లాడిని సంరక్షించినట్టు నన్ను రక్షించింది.  తిండి తినలేదు నిద్ర పోలేదు. ప్రపంచంలో నన్ను కాపాడుకోవడంతప్ప మరో ధ్యాస లేదు.
విజయం సాధించి తృప్తిచెందిన పులిలా మ్రృత్యువు
నోటకరిచిన నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. కానీ పోతూ పోతూ అది నా భార్యని పంజాతో బలంగా కొట్టి పోయింది. అప్పుడు ఆమె గర్భవతి. ప్రసవ సమయంలో ఒక మృత శిశువును కన్నది. ఆ తర్వాత రకరకాల జబ్బులు ఆమెను పీడించడం మొదలుపెట్టాయి. నేను ఆమె బాగోగులు చూసుకోవలసి రావడం ఆమెకు ఇబ్బంది కలిగించింది ‘ఏం చేస్తున్నారు అందరూ ఏమనుకుంటారు’ అనేది ‘మగవారు మీరు నాకు సేవలు చేయడం తప్పు’ అనేది. బారానగర్ లో మా ఇంటి ముంగిట ఇంటికి గంగానదికి మధ్య ఒక తోట ఉండేది. ఇంటికి దక్షిణం వైపు ఉన్న పడక గది పక్కన చిన్న స్థలంలో ఆమె గోరింట పొదలు పెంచింది. తోట లో  గులాబీ, మల్లె, రజనీగంధ మొక్కలు ఉండేవి. ఒక పెద్ద పొగడ వృక్షం ఉండేది. దాని చుట్టూ పాల రాతి అరుగు ఉండేది. నా భార్య రోజుకు రెండు సార్లు ఆ చెట్టు కింద  శుభ్రం చేసేది .తన పనులన్నీ పూర్తయ్యాక అక్కడ కూర్చుని గంగా నదిలో కదిలే కంపెనీ పడవలను చూస్తుండేది.
మంచానికే పరిమితం అయిపోయిన చాలా రోజుల తర్వాత  చైత్రమాసంలో వెన్నెల కురుస్తున్న ఒక సాయం సమయంలో హఠాత్తుగా ఆమె నాతో ‘ఇలా లోపలే ఉండి ఉండి విసుగొస్తుంది ఇవాళ తోటలో కాసేపు కూర్చో వాలనిపిస్తున్నది’ అంది. నేను నెమ్మదిగా జాగ్రత్తగా ఆమెను తీసుకు వెళ్లి పొగడ వృక్షం కింది అరుగుమీద పడుకోబెట్టాను. నా తొడ మీద ఆమె తల పెట్టుకుంటే సంతోష పడేవాడిని. కానీ ఆమెకు  వింత గా అనిపిస్తుందని లోపలనుంచి  ఒక దిండు తెచ్చాను. వీచే గాలికి ఉండి ఉండి ఒకటీ రెండు  పొగడ పుష్పాలు పైనుంచి కిందికి రాలుతున్నాయి. కొమ్మల మధ్య నుంచి వెన్నెల నీడలు ఆమె ముఖం మీద పడుతున్నవి.చుట్టూ నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది. సువాసన నిండిన నీడ లో ఆమె పక్కన కూర్చుని నేను ఆమె ముఖంలోకి చూశాను. నా కళ్ళ నుంచి కన్నీళ్లు రాలాయి. ఆమెకు దగ్గరగా జరిగి సన్నబడిన ఆమె వేడి చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. అభ్యంతరం చెప్పలేదు. కాసేపు నిశ్శబ్దంగా గడిచాక అన్నాను’ నీ ప్రేమను జీవితాంతం గుర్తుంచుకుంటాను’ అని. వెంటనే ఆ మాట అని ఉండాల్సింది కాదని నాకు అర్థమైంది. నా భార్య నవ్వింది. ఆ నవ్వులో ఆనందం ఉంది. ఆ నవ్వులో నమ్రత ఉంది. ఆ నవ్వులో కొంత ఆసక్తి కొంత ఎగతాళి కూడా ఉన్నాయి. ఒక్క మాట మాట్లాడలేదు. నవ్వింది .నన్ను ఎప్పటికీ మర్చిపోవా  అది అసాధ్యం అలా అని నేను అడగను’ అనే అర్థం  ఉంది ఆ నవ్వులో. తీయగా గుచ్చుకునే ఈ నవ్వుకు భయపడే నేను నా భార్యతో ప్రేమకు సంబంధించిన మధురమైన మాటలు మాట్లాడే వాడిని కాదు. అచ్చులో ఎంతో అందంగా కనిపించే మాటలు కన్నీరు కార్పించే మాటలు ఆమెకు ఎందుకు హాస్యాస్పదంగా కనిపించేవో నాకు ఇప్పటికీ అర్థం కాదు. వాదించడానికి మాటలు అవసరం కానీ నవ్వును ఏ వాదనతో ఎదుర్కొంటాం మౌనంగా ఉండటం తప్ప ఏమీ చేయలేం.వెన్నెలకాంతి పెరిగింది.  ఎక్కడి నుంచో కోయిల అసహనంగా మళ్లీ మళ్లీ కూస్తున్నది. ఇలాంటి వెన్నెల రాత్రి కూడా ఆడ కోయిల చెవులు వినిపించడం లేదా  అని నాకు ఆశ్చర్యం కలిగింది.
ఎన్ని రకాల మందులు వాడినా నా నా భార్య ఆరోగ్యం కుదుట పడలేదు. డాక్టర్ సలహా తో గాలి మార్పు కోసం ఆమెను అలహాబాద్ తీసుకు వెళ్ళాను. దక్షిణాచారణ్ హఠాత్తుగా చెప్పటం ఆపి రెండు చేతుల మధ్య తల పెట్టుకుని ఏదో ఆలోచనలో పడ్డాడు. గూట్లో ఉన్న గుడ్డి దీపం మసకబారింది. నిశ్శబ్దంగా ఉన్న గదిలో దోమల రొద స్పష్టంగా వినిపించింది. నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ ఆయన మళ్లీ చెప్పసాగాడు. అలహాబాదులో డాక్టర్ హరన్ గారు  నా భార్యకు చికిత్స చేసేవారు. ఆయన అన్ని విధాల ప్రయత్నించి ఆమె ఆరోగ్యం బాగుపడదని మిగిలిన జీవితమంతా ఇలాగే ఉండిపోతుందని చెప్పాడు. ఒక రోజు ఆమె నాతో  ‘ఇక నేను కోలుకునేది లేదు నేను  అలాగని తొందరగా నాకు చావూ వచ్చేట్టు లేదు. మీరు ఎందుకు ఒక జీవచ్ఛవం తో బ్రతుకు గడపాలి మళ్లీ పెళ్లి చేసుకోండి’ అంది. మా సమస్యకు ఇదే పరిష్కారమని ఆమె భావించింది. నవ్వడం లో ఆమెకు ఉన్న ప్రతిభ నాకు లేకపోయినా ఇప్పుడు నాకూ నవ్వే అవకాశం వచ్చింది. ఒక నవలలోని కథానాయకుడిలా గంభీరంగా రాజసంగా అన్నాను.’ నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు…’ ‘చెప్పండి చెప్పండి నన్ను మధ్యలోనే ఆపి’ ఆపకండి మీరు ఇలా మాట్లాడటం చాలు నన్ను చంపేయడానికి’ అంది. నేను కొనసాగించాను.’ నిన్ను తప్ప ఇంకెవరినీ ప్రేమించలేను’ ఆమె బిగ్గరగా నవ్వడం తో ఆపక తప్పలేదు. బాగుపడుతుందని నమ్మకం లేని దానికి సేవలు చేసి  అలసిపోయాను అని జీవితమంతా ఇలాగే నిస్పౄహలోనే గడపాలాఅని, వయసులో ఉన్న వాడికి అవసరమైన అందం ఆనందం ఆకర్షణ ప్రేమ అనేవి ఇప్పుడు కనబడటం లేదని, నా ముందు  ఒక  ఎండమావి ఒక బీడు భూమి ఒక ఎడారి కనిపిస్తున్నదని నేను అనుకుంటున్నానని పసిగట్టిందేమో  నా భార్య.ఒక చిన్న పిల్లవాడు మొదటి వాచకంలో విడి విడి అక్షరాలను చదివినట్టుగా నన్ను చదివేయ గలదు. అందువల్ల నేను శృంగార నాయకుడిలా కవితా వాక్యాలు చెప్పినప్పుడు ఆమె నిస్సహాయంగా నవ్వేసేది. ఆమె నా అంతరంగంలోని ఆలోచనలను పసిగట్టడం తలుచుకుంటే ఇప్పటికీ నాకు అవమానంతో చచ్చిపోవాలని  అనిపిస్తుంది.
డాక్టర్ హరన్  మాకులస్థుడే. అప్పుడప్పుడు నన్ను తన ఇంటికి రమ్మని పిలిచే వాడు. ఒకనాడు తన కూతురును పరిచయం చేశాడు. పదిహేనేళ్ల వయసులో ఉన్న యువతి ఆమె. డాక్టర్ తనకు నచ్చిన వరుడు దొరకలేదని ఆమెకు ఇంకా పెళ్లి చేయలేదు. ఆమె అందంగా ఉండడమే కాక చాలా ప్రతిభావంతంగా మాట్లాడేది. ఇద్దరం అనేక విషయాలు చర్చించుకునే వాళ్ళం. మాటల్లో పడి నేను భార్యకు సేవ చేయాల్సిన సమయం దాటిపోయాక ఇంటికి వచ్చేవాణ్ణి. నేను డాక్టర్ ఇంటికి వెళ్లి వస్తున్న సంగతి ఆమెకు తెలుసు. కానీ ఎన్నడూ ఆలస్యానికి కారణం అడగలేదు. ఎడారిలో ఒక కొత్త ఎండమావిని చూడటం మొదలు పెట్టాను. దాహంతో తపించి పోతున్న నాకు ఇసుక లో గల గల పారే నీరు కనిపించింది. దాని నుంచి మనసు మరలించలేక పోయాను.  నా భార్య గదికి వెళ్లాలని నాకు అనిపించకపోవడంతో ఆమెకు సేవ చేయడం మందులు అందించడం క్రమం తప్పాయి
. డాక్టర్ హరన్ నయంకాని జబ్బు ఉన్నవారు మరణించడమే మంచిది. వారికీ సుఖము ఉండదు ఇతరులకూ ఉండదు అంటూ ఉండేవాడు .ఆయన నా భార్య గురించి ఇలాంటి మాటలు అంటున్నాడని నేను అనుకోలేదు. ఇది లోకంలో సర్వసాధారణమైన విషయమే కదా అనుకునేవాణ్ణి .మానవుల మరణం డాక్టర్లకు పెద్దగా విచారాన్ని కలిగించదు అనుకుంటా వారికి మానవుల అనుభూతులు అర్థం కావు. ఒకనాడు పక్కగదిలో ఉన్న నా భార్య డాక్టర్ తో అన్న మాటలు వినబడ్డాయి ‘ఎందుకు డాక్టర్ నా చేత ఇలా మందులు తినిపించి మీ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు జీవితం దుర్భరం అయిపోయింది ఏదైనా ఇచ్చి నాకు విముక్తి కలిగించండి’ ఆమె మాటలకు డాక్టర్ ‘వద్దు వద్దు ఇలాంటి మాటలు మాట్లాడవద్దు’ అని సమాధానం చెప్పి వెళ్లిపోయాడు. నా మనసు  బాధతో విల విల లాడి ఆమె గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చుని ఆమె నుదుటి మీద చేత్తో రాస్తూ ‘ ఈ గదిలో చాలా వేడిగా ఉంది కదా!’ అన్నాను ‘మీకు వాకింగ్ టైం అయింది వెళ్ళండి వెళ్లకపోతే సాయంత్రం మీకు ఆకలి వేయదు’ అంది. వాకింగ్ కు వెళ్ళడం అంటే డాక్టర్ ఇంటికి వెళ్లడమే. నాకు ఆకలి వేయడానికి ఇలా వాకింగ్ చేయాల్సిన అవసరం ఉందని ఆమెకు నేనే చెప్పాను. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆమె నా మోసాన్ని కనిపెట్టి ఉండాలి. నేనొక తెలివి తక్కువ వాణ్ణి కనుక ఆమెను కూడా తెలివి తక్కువదనే  అనుకున్నాను. దక్షిణాచరణ్ మళ్ళీ చేతుల మధ్య తల పెట్టుకుని గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి  అని తాగి  కొనసాగించాడు. ఒకసారి డాక్టర్ కూతురు  మనోరమ నా భార్య ని చూడాలని ఉంది అని అడిగింది నేను అందుకు ఏమాత్రం సిద్ధంగా లేను కానీ వద్దు అనడానికి కారణం ఏమీ లేదు కదా! ఆ సాయంత్రం నాతో పాటు మనోరమ మా ఇంటికి వచ్చింది నా భార్య ఎప్పటికంటే ఎక్కువగా నొప్పితో బాధపడుతున్నది. నొప్పి బాగా ఎక్కువ అయినప్పుడు ఆమె పిడికిళ్ళు బిగించేది. ముఖం నీలి రంగులోకి మారేది. ఆమె కళ్ళకి వెలుతురు గుచ్చుకుంటుందని  దీపం ఎప్పుడూ గది తలుపు దగ్గరే ఉంచేది. చీకట్లో ఆమె బాధతో మూలుగుతూ ఉన్నది.  భారమైన మూలుగు బయటకి వినిపిస్తున్నది. నేను  గదిలోకి వెళ్ళాను. గది ముందు నిలబడింది మనోరమ.దీపపు వెలుతురు ఆమె ముఖం మీద పడింది. ఆమె చీకటీ వెలుతుర్ల మధ్య తటపటాయిస్తూ నిలబడింది. ఎవరో కొత్తమనిషి కనపడటంతో నా భార్య కదిలి నా చెయ్యి గట్టిగా పట్టుకుని బలహీనమైన స్వరంతో ‘ ఆమె ఎవరు? ఆమె ఎవరు? ఆమె ఎవరు?’ అని అడిగింది మూర్ఖుడిలా నేను మొదట నాకు తెలియదు అనాలి అనుకున్నా కానీ ఎవరో కొరడాతో వీపు మీద కొట్టినట్లు అనిపించింది.’ ఆమె .. ఆమె డాక్టర్ గారి కూతురు’ అన్నాను. నా భార్య నా వైపు సూటిగా చూసింది నేను ఆమె వైపు చూడలేకపోయాను ఆమె మనోరమను లోపలికి రా అంది. నన్ను దీపం పైకెత్తి పట్టుకో  అంది. మనోరమ లోపలికి వచ్చి కింద కూర్చుని నా భార్యతో కాసేపు మాట్లాడింది. అప్పుడు వచ్చాడు డాక్టర్ రెండు రకాల సీసాలతో. ‘ఈ నీలం రంగు సీసాలోని లోషన్ ను వంటికి రాసుకోవాలి మరో సీసాలోని మందు తాగాలి జాగ్రత్త ఒంటికి రాసుకునే మందు విషపూరితమైనది ఒక దాని బదులు మరొకటి వాడకూడదు.’ అన్నాడు. నన్ను  కూడా ఈ విషయం గురించి హెచ్చరించి సీసాలు మంచం పక్కనే ఉన్న బల్ల మీద పెట్టాడు. తర్వాత సెలవు తీసుకుంటూ కూతుర్ని కూడా రమ్మన్నాడు. ఆమె ‘నాన్నగారూ!  ఈమెకు సేవ చేయడానికి మరో ఆడమనిషి లేదు కదా’ అంది. ‘వద్దు వద్దు నువ్వేమి ఇబ్బంది పడవద్దు మాకు ఒక వృద్ధురాలైన సేవకురాలు ఉంది ఆమె నన్ను తల్లిలా చూసుకుంటుంది’ అన్నది నా భార్య. ‘నీ భార్య ఎంత మంచిది ఇతరులకు సేవ చేయాలని అనుకుంటుంది కానీ తనకు ఎవరూ సేవచేయడానికి ఒప్పుకోదు.’ అన్నాడు డాక్టర్ నవ్వుతూ. డాక్టర్ కూతురుతో వెళ్ళిపోతుంటే ‘మా ఆయన ఈ గదిలో చాలా సేపటినుంచి ఉన్నారు ఆయనను మీతో పాటు తీసుకు వెళ్ళండి’ అని అంది. ‘ రండి
మాతోపాటు  అలా నది ఒడ్డుకు వెళ్లి వద్దాం’ అన్నాడు డాక్టర్. నేను ఏ మాత్రం ఆలస్యం చేయలేదు.    మేము వెళ్తుంటే డాక్టర్ ఆ రెండు మందుసీసాల విషయం మళ్లీ హెచ్చరించాడు. డాక్టర్ ఇంట్లో భోజనం చేసి ఇంటికి వచ్చేటప్పటికి చాలా రాత్రయింది నేను వచ్చేటప్పటికి నా భార్య మంచం మీద బాధతో మెలికలు తిరుగుతున్నది. తప్పు చేశాననే భావన నన్ను కత్తిలా గుచ్చుకుంది. మంచం పక్కనే నిలబడి’ నొప్పి చాలా ఎక్కువగా ఉందా?’ అని అడిగాను. ఆమె ఉలుకూ పలుకూ లేకుండా నా వైపు సూటిగా చూసింది. జవాబు చెప్పడానికి ఊపిరి ఆడలేదు. నేను వెళ్లి డాక్టర్ను తీసుకు వచ్చాను ఏం జరిగిందో డాక్టర్ కు అర్థం కాలేదు. తర్వాత ఏదో స్ఫురించి ఒక సీసాను చూపిస్తూ
‘ పొరపాటున ఈ సీసాలోని మందు తాగావా?’ అని అడిగాడు. ఆమె మాట్లాడకుండా అవును అన్నట్టు తల ఊపింది. కడుపులో వేసే  పైపు తీసుకురావడానికి డాక్టర్ ఇంటికి పరుగెత్తాడు. నేను స్ఫృహలో ఉన్నానో లేదో తెలియకుండా మంచం మీద పడిపోయాను. ఒక చిన్న పిల్లవాడి తలలా నా తలను తన పక్షం మీదకు తీసుకుని ఏదో చెప్పాలనుకుంది కానీ నోరు పెగల్లేదు. బాధపడకండి ఇది మన మంచికే! మీరు సంతోషంగా ఉంటారు నేనూ సంతోషంగా వెళ్లి పోతాను అని ఆమె చేతి స్పర్శ నాకు చెప్పింది.
డాక్టర్ తిరిగి వచ్చేటప్పటికి నా భార్యకు ఎన్నాళ్ల నుంచో అనుభవించిన హింస నుంచి విముక్తి లభించింది.
గదిలో ఉక్కపోతగా ఉందని  దక్షిణాచరణ్ వరండా లోకి వెళ్లి నాలుగైదు సార్లు అటూ ఇటూ పచార్లు చేసి వచ్చి మరో గ్లాసు నీళ్లు తాగి మళ్లీ చెప్పసాగాడు. నేను మనోరమను పెళ్లి చేసుకుని బెంగాల్ కు తిరిగి వచ్చాను. తండ్రి అనుమతితో పెళ్లి చేసుకుంది కానీ నేను ఆమె తో ప్రేమగా మాట్లాడినప్పుడల్లా చిరు నవ్వు కూడా నవ్వకుండా గంభీరంగా ఉండేది. బహుశా ఆమె నన్ను అపార్థం చేసుకుందేమో అనుకున్నా. నేను ఆశించినట్టుగా ఆమె ప్రవర్తన లేకపోవడంతో నా తాగుడు హద్దులు దాటిపోయింది.
అది శరదృతువు. సాయంత్రం వేళ బారానగర్ లోని మా తోటలో మనోరమ తో కలిసి నడుస్తున్నాను. చీకటి ఎందుకో భయం కలిగించేదిగా ఉంది. దారికి రెండు పక్కలా ఉన్న పొదలు  ఒకదానికొకటి తాకుతున్న శబ్దం తప్ప గూళ్ళల్లో పక్షుల రెక్కల చప్పుడు కూడా వినిపించనంత నిశ్శబ్దంగా ఉంది.   అలసిపోయిన మనోరమ పొగడ వృక్షం కింద పాలరాతి అరుగుమీద మోచేతిపై తలపెట్టి పడుకుంది. నేను ఆమె పక్కనే కూర్చున్నా. అక్కడ చీకటి ఇంకా చిక్కగా ఉంది. చెట్టు కొమ్మల మధ్య నుంచి అక్కడక్కడ ముక్కలుగా కనిపిస్తున్న ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకు మంటున్నవి. కీచురాళ్ళు ఆకాశం నుంచి కిందకు జారిన నిశ్శబ్దమనే చీరకు శబ్దం అనే సన్నటి  అంచును కుడుతున్నవి. నేను ఆ మధ్యాహ్నం అంతా తాగుతూనే ఉండడంవల్ల నా మెదడు మొద్దుబారి పోయింది. నామీద నాకే జాలి కలుగుతున్న మానసిక స్థితి లో ఉన్నాను. నా కళ్ళను ఒత్తిపట్టి ఉంచుతున్న చీకటిని  పక్కకునెట్టి చూస్తే నీడలా కనిపిస్తున్న నా భార్య దేహం నాలో బలమైన కోరికను కలిగించింది. కానీ నీడలా కనిపిస్తున్న్త ఆమెను  నా చేతులతో చుట్టేయడం సాధ్యం కాలేదు. హఠాత్తుగా దగ్గరలో ఉన్న పొదలో మంటలు అంటుకున్నట్టు అనిపించింది. పసుపు చంద్రవంక ఆకాశంలోకి మెల్ల మెల్లగా వచ్చి   తెల్లటి అరుగు మీద తెల్లటి చీరలో ఉన్న స్త్రీ ముఖాన్ని వెలిగించింది. ఆ ముఖం నీరసంగా తెల్లగా పాలి పోయి ఉంది. నేను ఆగలేక ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ‘మనోరమా చెప్తే నమ్మవు కానీ నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను .నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను అన్నాను. నా మాటలు నాకే భయం కలిగించాయి ఇవే మాటలు ఒకప్పుడు నేను మరొకరితో అన్నాను ఆ క్షణంలో పొగడ వృక్షం పైనుంచి  ఆ పక్కన ఉన్న పొదల మీదినుంచి  కోసిన పండు ముక్క లాంటి పసుపురంగు చంద్రుడి నుంచి,  గంగానది తూర్పు వైపు నుంచి పడమర వరకు ఒక నవ్వు అతి వేగంగా దొర్లుతూ వెళ్ళింది. ఆ నవ్వును నేను వర్ణించలేను.  అది హృదయవిదారకంగా ఉంది. అది ఆకాశాన్ని రెండుగా చీలుస్తున్నట్టనిపించింది. నేను అరుగు మీద నుంచి కింద పడి  స్పృహ తప్పాను.
మెలకువ వచ్చాక చూస్తే ఇంట్లో నా మంచం మీద పడి ఉన్నాను. మనోరమ ‘ఏమైంది ఎందుకలా పడిపోయారు’ అంది. ‘నీకు వినబడలేదా ఆ నవ్వు ఆకాశమంతా వ్యాపించిన ఆ నవ్వు’ అన్నా.  ‘నవ్వా? దాన్ని  నవ్వు అంటారా? ఒక పెద్ద పక్షుల గుంపు మనపై నుంచి వేగంగా ఎగిరిపోయింది నేను వాటి రెక్కల చప్పుడు విన్నాను అంతమాత్రానికే మీరు భయపడ్డారా?’ అంది నవ్వుతూ. ఉదయం   నది ఒడ్డుకు ఉత్తరం వైపునుంచి ఆహారం కోసం ఒక పక్షుల గుంపు వచ్చిందని నాకు అర్థమైంది. కానీ సాయంత్రం అవుతుంటే నేను చూసింది ఎగిరే పక్షుల గుంపు కాదని అనిపించసాగింది. గుండె కోసే ఆ నవ్వు చీకటి పడటం కోసం వేచి ఉన్నట్టు అనిపించేది. అవకాశం దొరికీ దొరకడంతో అది విరుచుకుపడుతుంది అనిపించేది. సాయంత్రం అవుతుంది అనగానే భయం శరీరాన్ని వణికించేది. ఆ సమయంలో మనోరమ తో మాట్లాడటానికి కూడా భయం వేసేది.ఇక అక్కడ ఉండాలనిపించలేదు.  మనోరమను బారానగర్ నుంచి దూరంగా పడవలో తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాను. నది నుంచి వీచే చల్లని గాలుల్లో  పడవ సాగుతుంటే నా భయం క్రమంగా తగ్గి పోసాగింది.
కొన్ని రోజుల వరకు మేము సంతోషంగానే ఉన్నాం మేము గంగను ఖారిని దాటి పద్మా నది కి చేరాం. అద్భుతమైన ఆ నది ఉత్తరాన కుబుసం కప్పుకొన్న నాగులా తన శీతాకాలపు నిద్రను ఆరంభించి  ఇసుక తిన్నెల నుంచి  క్షితిజరేఖ వైపు విస్తరించి నిశ్చలనంగా మసకమసకగా  ఉన్నది. అలాగే నిటారుగా ఉన్న దక్షిణపు ఒడ్డునుంచి గ్రామాలలోకి ఉగ్రరూపంతో విరుచుకు పడుతున్నది. మామిడి తోటలు కంపిస్తున్నవి. వరదలు గ్రామాలను ముంచెత్తున్నవి.ఒకవైపు నిద్రమత్తులో ఉన్నట్టున్న పద్మ మరొకవైపు ఒడ్డును విసిరి కొడుతూ కోస్తూ విరిగిపోతున్నది.
మేం పడవను ఒకచోట కట్టేశాం. తర్వాత పడవ నుంచి చాలా దూరం  నడిచి వెళ్ళాం.  సూర్యాస్తమయపు బంగారు నీడలు కనిపించకుండా పోయాక మా కళ్ళ ఎదుట ఒక స్పష్టమైన పూర్ణ చంద్రబింబం ఉదయించింది. కట్టలు తెంచుకున్న  వెన్నెల వరద ఆకాశం భూమి కలిసే చోటు వరకు వ్యాపించింది. విశాలమైన తెల్లటి ఇసుక లో నాకు మేమిద్దరమే ఒక స్వప్న లోకంలో విహరిస్తున్నా మనిపించింది.  మనోరమ ముఖానికి చుట్టు కున్న ఎర్రని శాలువా ఆమె తల మీద నుంచి కిందకు జారి ఆమె శరీరం మొత్తాన్ని  కప్పేసింది. చిక్కని నిశ్శబ్దం లో దారి ఎటు నుంచో ఎటో తెలియని తెల్లదనంలో  కనుచూపుమేరా వ్యాపించిన శూన్య ప్రదేశంలో మనోరమ తన చేతిని బయటకు తీసి నా చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె నాకు బాగా దగ్గరగా జరిగి తన మనస్సు మొత్తం శరీరం యవ్వనము అన్ని నావే నంది. నా హృదయపు వేగం పెరిగింది. ప్రేమ అనేది ఇంటి నాలుగు గోడల మధ్య పరిపూర్ణం కాదు అనిపించింది. ఇలాంటి విశాలమైన చోట అనంతంగా దిగంబరంగా ఉన్న వినీలాకాశం తప్ప ప్రేమకు అనువైన చోటు లేదు అనుకున్నాను. ఇల్లు లేదు తలుపులు లేవు తిరిగి వెళ్లాలనే తొందర లేదు ఈ వెన్నెల వెలిగించిన విశాలమైన ప్రదేశంలో చేతిలో చేయి వేసుకుని ఎక్కడికి పోతున్నామో తెలియకుండా విహరించడమే ప్రేమ అనిపించింది.
ఇద్దరం  నడుస్తూ ఇసుక మధ్యలో ఉన్న నీటి కొలను వద్దకు వెళ్లాం.పద్మ తన దారి మార్చుకుంది అందువల్ల ఇలా వచ్చి ఇక్కడ ఇసుక లో చిక్కుకుంది. నిద్రపోతున్న ఎడారిలో అలలు లేని ఈ కొలనులో ఒక పొడవైన చంద్రరేఖ మూర్ఛపోయినట్టు పడుకుంది. మనోరమ నా వైపు చూసింది. ఆమె శాలువా జారిపోయింది. ప్రకాశిస్తున్న వెన్నెల వెలుతురు లో ఆమె తన ముఖం పైకెత్తింది. ఆ శూన్య ప్రదేశంలో ఒక్కసారిగా ఒక శబ్దం ప్రతిధ్వనించింది.  ఆమె ఎవరు? ఆమె ఎవరు? ఆమె ఎవరు? అన్న మాటలు మూడుసార్లు గాలిలో ప్రకంపనలు రేపాయి. నేను భయంతో అడుగుల వేగం పెంచాను.  మనోరమ కూడా భయపడ్డది.తర్వాత మాకు అర్థమైంది అది మానవ స్వరం కాదని అతీంద్రియ ధ్వనికూడా కాదని అది   మా అలికిడికి నీటి ఒడ్డున ఇసకలో పక్షుల రెక్కల చప్పుడని.  భయంతో వణుకుతూ మేం మా పడవ  వైపు పరిగెత్తి వెళ్లి మా పడకల మీదికి చేరుకున్నాం. బాగా అలసిపోయి ఉన్న మనోరమ వెంటనే నిద్ర లోకి జారుకుంది. కానీ ఆ చీకట్లో ఎవరో వచ్చి నా పక్కనే నిలబడ్డారు. ఆ ఆకారం పొడవైన సన్నని ఎముక వేలుతో మనోరమను చూపుతూ నా చెవిలో స్పష్టంగా  ఆమె ఎవరు? ఆమె ఎవరు? ఆమె ఎవరు?  అన్నది. నేను లేచి  దీపం వెలిగిద్దామని  అగ్గిపుల్ల గీశాను.ఒక భయంకరమైన తుఫాను  శబ్దం లాంటి నవ్వు వినిపించింది. ఆ నీడ లాంటి ఆకారం మాయమైంది. ఆ నవ్వు నా దోమతెరను మొత్తం పడవను సుడిగాలితో ఊపేసింది. చెమటతో తడిసిన నా శరీరంలోని రక్తాన్ని మంచుగడ్డ గా మార్చి ఆ చీకటి రాత్రి లో కలిసి పోయింది. అది పద్మను దాటి ఇసుక తిన్నెలను దాటి నిద్రిస్తున్న పొలాలను గ్రామాలను పట్టణాలను దేశాలను ప్రజలను దాటి క్రమక్రమంగా అస్పష్టమై పోయింది. ఆ నవ్వు ఊహకు అందనంత దూరానికి చేరి చివరికి జననమరణాల పొలిమేరను కూడా దాటి పోయింది.

నేను  దీపం ఆర్పేస్తే తప్ప నిద్రపోలేనని అనుకున్నాను. దీపం ఆర్పేసి పడుకున్నాను. చీకట్లో ఆ ధ్వని మళ్ళీ నా పక్కకు వచ్చి నా చెవి దగ్గర నా గుండెలోని రక్తపు లయను అనుసరిస్తూ  ఆమె ఎవరు? ఆమె ఎవరు? ఆమె ఎవరు? అంది. ఆ చీకటి రాత్రి నిశ్శబ్దంగా ఉన్న పడవలో  నా ఎదురుగా ఉన్న గుండ్రటి గడియారానికి  కూడా ప్రాణం వచ్చి దాని చేతులను మనోరమ వైపు చాచ సాగింది. గడియారపు టిక్కు టిక్కుమనే ధ్వని ఆమె ఎవరు ఆమె ఎవరు ఆమె ఎవరులా వినిపించింది.
మాట్లాడుతున్న దక్షిణాచరణ్ బాబు పసుపురంగులోకి మారాడు. నేను అతనిని కొంచెం నీళ్లు తాగండి అన్నాను కుదుపుతూ. గుడ్డి దీపం ఆరిపోయింది. బయట సన్నటి వెలుతురు జాడ కనిపించింది.  కాకులు కావు కావు మంటున్నయి.  పక్షులు ఈలలు వేస్తున్నాయి.   మా ఇంటి ఎదురుగా ఉన్న బాటమీద  ఓ ఎద్దు బండి నేలను రాసుకుంటూ పోతున్న శబ్దం వినిపిస్తున్నది. దక్షిణాచరణ్ ముఖంలో భావాలు మారాయి రాత్రి చేసిన చేతబడి కారణంగానూ తెలిసీ తెలియని స్థితిలోనూ ఇదంతా నాకు చెప్పడం అవమానంగా భావించినట్టున్నాడు. మరొక మాట లేకుండా అంశంగా లేచి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు  మరునాటి రాత్రి …
అర్గ్థరాత్రి
ఎవరో పిలుస్తున్నారు కాదు అరుస్తున్నారు.
డాక్టర్ !డాక్టర్  !

మూలం: రవీంద్రనాథ్ టాగూర్

October 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఆలస్యపు పరిణితి’-క్రిస్టో మిటోజ్ అనువాద కవితలు

by Jwalitha October 25, 2021
written by Jwalitha

అనువాద కవయిత్రి – జ్వలిత

LATE RIPENESS
By Czesław Miłosz

Not soon, as late as the approach of my mintieth year, I felt a door opening in me and I entered the clarity of early morning

One after another my former lives were departing.
like ships, together with their sorrow

And the countries, cities, gardens, the beys of seas assigned to my brush came closer, ready now to be described better than they were before

I was not separated from people. grief and pity joined us We forget-I kept saying that we are all children of the king

For where we come from there is no division

Into Yes and No, into is, was, and will be

We were miserable, we used no more than a hundredth part of the gift we received for our long journey

Moments from yesterday and from centuries ago a sword blow, the painting of eyelashes before a mirror of polished metal, a lethal musket shot, a caravel staving its hull against a reef they dwell in us waiting for a fulfillment.

I knew, always, that I would be a worker in the vineyard
as are all men and women living at the same time.
whether they are aware of it or not.

of the King
*(())**
ఆలస్యపు పరిణితి

త్వరలో, నాకు తొంభై సంవత్సరాలు రాబోతున్న కొద్దీ, నాలో జ్ఞానపు తలుపు తెరిచినట్లు అనిపిస్తుంది.
నేను ఉదయాన్నే ఆ విషయాన్ని గ్రహించాను.

ఒకదాని తర్వాత ఒకటిగా నా పూర్వ జీవితాల జ్ఞాపకాలు దూరమవుతున్నాయి.
ఓడల వలె, వారి దుఃఖాలతో పాటు.

నా ప్రయాణాలకు కేటాయించిన దేశాలు, నగరాలు, ఉద్యానవనాలు, సముద్రపు తీరాలు దగ్గరగా వచ్చాయి, మునుపటి కంటే మెరుగ్గా వివరించడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి.

నేను ప్రజల నుండి విడిపోలేదు,
దుఃఖం జాలి మాలో మిగిలి ఉన్నాయి.
మేము మరచిపోయాము కానీ మేమంతా బంధువుల పిల్లలమే, అదే విషయం నేను చెపుతూనే ఉన్నాను,

ఎందుకంటే మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడ ఏ భేదాలు లేవు
సత్యమేదో అసత్యమేదో తెలియని సందిగ్దతలో ఉన్నాం
అది గతంలో ఉన్నది,
ఇక ముందు కూడా ఉంటుంది.

మేము అశాంతిలో ఉన్నాము,
మా సుదీర్ఘ ప్రయాణం కోసం
మేము అందుకున్న బహుమతిలో వందవ వంతు కూడా మేము ఉపయోగించలేదు.

నిన్నటి క్షణాలు, శతాబ్దాల క్రితం నాటి కత్తి దెబ్బ,
కను రెప్పలు చిత్రించిన పాలిష్ చేసిన మెటల్ అద్దం, ప్రాణాంతకమైన మస్కట్ షాట్,
సముద్రపు దిబ్బకు వ్యతిరేకంగా
పడవ తన పొట్టును నిలబెట్టుకున్నట్టు
అవే వ్యామోహాలు మనలో కూడా నివసిస్తాయి,
తమ మాట నెరవేర్చుకోడానికి అవి వేచి ఉన్నాయి.

అదే సమయంలో నివసిస్తున్న స్త్రీ పురుషుల అందరికీ తెలిసినా, తెలియకపోయినా..
నాకు తెలుసు, ఎల్లప్పుడూ, నేను ద్రాక్షతోటలో కార్మికుడిగా ఉంటానని,

RAYS OF DAZZLING LIGHT

Light off metal shaken, Lucid dew of heaven, Bless each and every one To whom the earth is given.

Its essence was always hidden. Behind a distant curtain. We chased it all our lives Bidden and unbidden.

Knowing the hunt would end, That then what had been rent Would be at last made whole: Poor body and the soul,

మెరిసే కాంతి కిరణాలు

లోహపు కాంతి కదిలింది,
స్వర్గం యొక్క స్పష్టమైన మంచు,
భూమి పై జీవించే ప్రతి ఒక్కరినీ ఆశీర్వదిస్తూన్నది.

దాని సారాంశం ఎల్లప్పుడూ అజ్ఞాతమై ఉంటుంది
మేము మా జీవితమంతా నడస్తూనే ఉంటాం
ఆజ్ఞాపించిన, ఆజ్ఞాపించని అంశాలను పాటిస్తూ

వేట ముగుస్తుందని తెలిసిన తర్వాత
అప్పుడు అద్దెకు తీసుకున్నదేదో చివరికి పూర్తి అవుతుంది
పాపం శరీరం… ఆత్మ ఎగిరి పోతుంది….

 

నియోబ్‌జెటా జిమియా (“చేరుకోలేని భూమి”)అనే రచనకు 1980లో నోబెల్ బహుమతి పొందిన పోలిష్ రచయిత ‘సెజ్ వా మిలాస్జ్(Czesla Milosz)’
ఒక పోలిష్-అమెరికన్ కవి, గద్య రచయిత, అనువాదకుడు మరియు దౌత్యవేత్త. 20 వ శతాబ్దపు గొప్ప కవులలో ఒకరిగా పరిగణించబడ్డాడు, అతను 1980 సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు. స్వీడిష్ అకాడమీ తన ఉల్లేఖనంలో, మిలోజ్‌ను “తీవ్రమైన సంఘర్షణల ప్రపంచంలో మనిషి బహిర్గత స్థితికి గాత్రదానం చేసిన కవి” అని పేర్కొన్నది.

ద కాప్టివ్ మైండ్, ఏ బుక్ ఆఫ్ ల్యూమియస్ థింగ్స్, రోడ్ సైడ్ డాగ్, రాడ్జిన్నా యూరప్, ఏ ఇయర్ ఆఫ్ ది హంటర్, ద విట్నెస్ ఆఫ్ పోయెట్రీ, ఫ్లాష్ ఫిక్షన్ ఇంటర్నేషనల్, సెకండ్ స్పేస్ న్యూ పోయెమ్స్, ద బిగిన్ ఇన్ వేర్ ఐ యాం (ఎస్సేస్)
నియోబ్‌జెటా జిమియా (“చేరుకోలేని భూమి”) అనేది నోబెల్ బహుమతి పొందిన పోలిష్ రచయిత సెజ్‌వా మినాస్జ్ రచించిన గద్య, సూత్రాలు, అక్షరాలు మరియు శకలాలతో కూడిన కవితా సంకలనం. ఇది మొదట 1984 లో ప్రచురించబడింది. దీనిని రచయిత మరియు రాబర్ట్ హాస్ 1986 లో ఆంగ్లంలోకి అనువదించారు.

Czeław Miłosz,
వీరు 30 జూన్ 1911 సెటెనియా, కోవ్నో గవర్నరేట్, రష్యన్ సామ్రాజ్యం జన్మించారు

వారి 93 వ ఏట, 14 ఆగస్టు 2004 న  క్రాకోవ్, పోలాండ్ లో మరణించారు
వృత్తి: కవి. గద్య రచయిత. ప్రొఫెసర్. అనువాదకుడు. దౌత్యవేత్త.

ప్రముఖ రచనలు
రెస్క్యూ (1945) న్యూస్టాండ్ (1953), ది క్యాప్టివ్ మైండ్ ఎ ట్రీటిస్ ఆన్ కవిత్వం (1955),  నియోబ్‌జెటా జిమియా( చేరుకోలేని భూమి), న్యూ అండ్ కలెక్టెడ్ పోయెమ్స్ 1931 – 2001,

ప్రముఖ అవార్డులు
సాహిత్యానికి అంతర్జాతీయ బహుమతి (1978) సాహిత్యంలో నోబెల్ బహుమతి (1980) నేషనల్ మెడల్ ఆఫ్ ఆర్ట్స్ (1989) ఆర్డర్ ఆఫ్ ది వైట్ ఈగిల్ (1994) నైక్ అవార్డు (1998)

జీవిత భాగస్వాములు

జనినా డౌస్కా 1956ను వివాహమాడెను. ఆమె 1986 లో మరణించారు. మొదటి భార్య మరణించిన తర్వాత కరోల్ తిగ్‌పెన్ 1992 పెళ్ళి చేసుకున్నాడు. ఆమె కూడా 2002 లో మరణించారు)

పిల్లలు

ఆంథోనీ (జననం 1947) జాన్ పీటర్ (జననం 1951)

మినోజ్ రెండవ ప్రపంచ యుద్ధంలో వార్సా జర్మనీ ఆక్రమణ నుండి బయటపడింది మరియు యుద్ధానంతర కాలంలో పోలిష్ ప్రభుత్వానికి సాంస్కృతిక అనుబంధంగా మారింది. కమ్యూనిస్ట్ అధికారులు అతని భద్రతను బెదిరించినప్పుడు, అతను ఫ్రాన్స్‌కు ఫిరాయించాడు మరియు చివరికి యునైటెడ్ స్టేట్స్‌లో బహిష్కరణను ఎంచుకున్నాడు, అక్కడ అతను బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయ్యాడు. అతని కవిత్వం అతని యుద్ధకాల అనుభవం గురించి రాయబడింది.

October 25, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

పాన్ కథ

by ఒద్దిరాజు మురళీధరంరావు October 25, 2021
written by ఒద్దిరాజు మురళీధరంరావు

అనగనగా భాను మరియు వీరు అనే ఇద్దరు సోదరులుండిరి. వారి బాల్యంలోనే వారి తల్లిదండ్రులు స్వర్గస్థులయిరి. భాను తమ్ముడు వీర్ ను ప్రేమతో మరియు జాగ్రత్తగా పెంచెను. భానుకు యుక్తవయసు వచ్చాక భారతిని వివాహం చేసుకున్నాడు. ఆమె చాలా నమ్రత కలది. ఆమె వీర్ ను భర్తను చూచినంత జాగ్రత్తగా ప్రేమతో చూస్తుండేది.

ఎప్పుడైతే వీర్ 20 ఏండ్ల వయసువాడైనాడో, రాజు తన సైన్యంతో సైనికులను భర్తీ చేస్తున్నట్లు తెలుసుకొని రాబోయే యుద్ధంలో చేరదలచాడు. ఓహ్, అన్నా మరియు వదిన తమ వెంటనే ఉండమని ఎంతో నచ్చచెప్పారు. తాము ఎంతో ప్రేమతో పెంచిన అబ్బాయివారి నుండి చాలాదూరం వెళ్ళిపోవడం అనే ఆలోచనే వారు తట్టుకోలేక పోయారు. కాని వీర్, సైనికుడు కావాలనే కోరికను బట్టి వారు ఎంతో మనోబాధతో కన్నీటితో అతడిని పోనిచా్చరు.

చాలా రోజులవరకు అతడి గురించిన వార్తలు తెలియలేదు. రాజు యుద్ధానికి వెళ్ళాడు,  తన శత్రువును ఓడించి తిరిగి వచ్చాడు. అతడితో వెళ్ళిన సైనికులు ఇంటికి తిరిగి వచ్చారు. కాని వీర్ గురించి ఏ జాడ తెలియకుండెను. ప్రతిదినం అన్న వదినె అతను ఇంటికి వస్తాడని ఎదిరి చూస్తుండిరి. కాని అతడు రాలేదు. తరువాత ఒకరోజు సైనికుల గుంపు వారి గ్రామంగుండా యుద్ధం నుండి తిరిగి ఇండ్లకు వెళ్ళుతుండిరి. భాను అతని తమ్ముణ్ణి గురించి వారిని అడిగాడు. వీర్ ఓహ్ అవును, చాలా విచారం, అతను చనిపోయాడు మీకు తెలుసా? యుద్ధభూమిలో అని ఒకతను అన్నాడు. తన తల ఆడిస్తూ. కాదు కాదు, అతను గాయపడినాడు, మరియు తేరుకునా్నడు. అతను ఇంటికి రాలేదా? అని ఇంకొకతను అన్నాడు. అతను అనారోగ్యంతో ఇంటిదారి పట్టాడు, అని మూడవతను తెలిపాడు.

ఇటువంటి భయంకర వార్తలు విని భాను చాలా రంధి పడినాడు. అతను తన తమ్ముడి రాక కొరకు ఎదిరిచూస్తూ ఇంటివద్ద వుండలేనని నిశ్చయించుకున్నాడు. అతను తమ్ముడి కొరకు వెతుకుతూ బయలుదేరాలని నిశ్చయించాడు. ఎప్పుడైతే అతని భార్యతో చెప్పాడో భారతి కూడా అతనితో వెళ్ళుటకు నిశ్చయించుకుంది. ఓ రోజు వారిద్దరు కలిసి తప్పిపోయిన వీర్ ను చూచి ఇంటికి తీసుకురావాలని బయలుదేరాడు.

వారు, రాజు యుద్ధభూమిలో ఎక్కడైతే వీర్ ను చివరకు చూచామన్న అతని కంపెనీవారు చెప్పారో అక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. ఆ స్థలం చాలా దూరం. వీరం వెళ్ళిన దారిలో అడవి గుండా, లోయల గుండా, గుటు్టలు మరియు ఎడార్ల గుండా పయనించాలి. వారిద్దరు నడిచారు మరియు నడిచారు, ఎన్నో మైళ్ళు. కాని భారతి తగిన బలం లేకుండెను. ఒకరోజు, దట్టమైన అడవి గుండా నడిచాక వారు ఒక చిన్న కుగ్రామానికి చేరారు. భారతి అలసిపోయి కూర్చుండిపోయింది. అక్కడ అట్లె మరణించింది. అప్పుడు భానుకు తీవ్రమైన మానసిక బాధ కలిగి అతను కూడా అక్కడే ప్రాణం వదిలాడు.

చాలా ఏండ్ల తరువాత ఎక్కడైతే ఆ జంట చనిపోయిందో, ఆ స్థలంలో రెండు చెట్లు మొలిచాయి. ఒకటి చాలా పొడుగాటి చెట్టు మరియు వేరొకటి తీగ, ఆ చెట్టును చుట్టుకుంది. అది భాను మరియు భారతి మరణంలో కూడా కలిసి ఉండిరని తోస్తుంది.

ఈ మధ్య, వీర్, వాస్తవంగా మరణించలేదు. అతను యుద్ధంలో తీవ్రంగా గాయపడి చాలా సంవత్సరాలు కోలుకుంటూ చాలా దూరంలో ఒక చిన్న గ్రామంలో వుండిపోయాడు. ఎప్పుడైతే అతను చివరకు కోలుకున్నాడో అతను, అతని కొరకు తన కుటుంబం ఎంతో ఆవేదనతో ఎదిరి చూస్తున్నారనుకొని అతి త్వరగా తన పాత ఇల్లు చేరాడు.

ఎప్పుడైతే తన ఇల్లు తాళం వేసి వుండెనో మరియు ఎన్నో ఏండ్లు వదిలిపెట్టబడి యుండెనో అతని ఆశ్చర్యానికి అవధులు లేకుండెను. నెమ్మదిగా ఇరుగు పొరుగువారు గుమికూడి భాను తప్పిపోయిన తమ్ముడి కొరకు వెతుక్కుంటూ పోవాలని నిశ్చయించుకొని వెళ్ళిపోయాడు అని చెప్పిరి.

ఆ రాత్రి వీర్ తన ప్రియమైన అన్న మరియు వదిన ఎట్లు ఇప్పుడు పొందగలనని బాగా దుఃఖించాడు. తెల్లవారగానే అతను వారికొరకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అతని అన్న మరియు వదిన వెళ్ళిన దారిలో పయనించాలని వారిని కలిసేందుకు వెంటనే బయలుదేరాడు.

వీర్ ఒక సైనికుడు, కాని చాలా గాయాలతో ఆలస్యంగా కోలుకున్నారు, కాని తగిన బలంగా లేకుండెను. అతనికి భాను మరియు పయనించిన ప్రదేశం చేరుటకు చాలా రోజులు పట్టింది. అప్పుడు అతను ఒకనాడు అడవికి దగ్గరిలో ఒక చిన్న గుడివద్దకు చేరాడు. ఆ గ్రామస్తులు అతనికి విచారకరమైన ఆ గుడికథ చెప్పారు. ఎన్నో సంవత్సరాలకు పూర్వం ఒక జంట ఎన్నోరోజులు నడిచి అలసిపోయి ఇక్కడికి చేరారు. ఒక కథ ఏంటంటే ఆ జంట వారి తప్పిపోయిన తమ్ముడు కొరకు వెళ్లుతుండిరి. వారి కోరిక తీరక ముందే వారిద్దరు ఇక్కడ చనిపోయారు. అదేచోట రెండు ఆశ్చర్యకరమైన చెట్లు, ఎవరికి అంతకుముందు తెలియనివి మొలిచాయి. ఆ ఆకులు మరియు గింజలు ఆ చెట్ల నుండి వచ్చినవి చాలా తీయగా, రుచిగా మరియు తింటే ఉల్లాసం కలిగించేవిగా ఉండేవి. అప్పుడు అక్కడ గ్రామస్తులు ఒక చిన్నగుడి, ఆ స్థలంలో ఆ జంట జ్ఞాపకార్థం కట్టించాలని నిశ్చయించారు. కట్టించారు గూడా.

వీర్ ఆ కథను ఎంతో రంధిగా విన్నాడు. అతను గ్రామస్తులు చెప్పిన జంట తన అన్న మరియు వదినె తప్ప మరెవరు కారని గ్రహించాడు. ఆ వార్తలు విని భరించలేక తను సున్నపు విగ్రహంగా మారాడు.

మీకు తెలుసా, అప్పటి నుండి వారు ఎట్లు జ్ఞాపకం వుంచుకోబడుతున్నారో? ఆ పొడుగాటి చెట్టు పో చెక్క (అరేకానట్లు) తీగ మొక్క ఆకులు తమలపాకులు మరియ విగ్రహం నుండి వచ్చింది సున్నం పేస్టు. ఈ మూడింటిని పాన్ తయారీలో వాడుతారు.

మరియు ఈ తీరుగ ప్రేమ జంట చనిపోయిన తరువాత గూడా తలచుకోబడుతున్నది. వారు ఈ కథ ద్వారా ప్రజలకు ప్రేమ విలువ, కలిసి వుండటం, మరియు ఒకరిపై ఒకరు విశ్వాసం కలిగి వుండటం గురించి తెలిసినది, పాన్ నములుతున్నప్డు జ్ఞాపకం వస్తుంటుంది.

శరణ తల్లి ఈ కథ విని ఆశ్చర్యపడింది. తనకు గూడా పాన్ తయారీలో ఈ మూడు వస్తువులు ఎల్లప్పుడూ పాన్ తయారీలో వాడుతారని తెలియదు.

ఇప్పటి నుండి నీ కథలు వినటందుకు నేను కూడా వస్తామరి.

అయితే పాన్ మాత్రం దంతాలకు హాని చేస్తుందని జాగ్రత పడాలి.

ఈ కథ సుధామూర్తి కథలలో ఒకటి.

October 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

Though … there is Peace Everywhere ?! – English Translation by Dr. Palakurthy Dinakar

by Palakurti Dinakar October 25, 2021
written by Palakurti Dinakar

When the day breaks

The hills are turned to ashes

Water and sand from rivers are evaporated

Forest is wailing for losing the hands of its trees

Legs of a walking man are amputated and reattached

Beautiful faces are turned into flamed wounds of acid attacks

Tree branches are covered with bleeding lumps of birds

Hospitals are filled with fumes of lamenting slogans

Though there is ‘Peace Everywhere’?!

Beheadings at the centre of the town

Procession of bare bodies at the outskirts of the village

Wounds of six rapes and injuries of three murders

Caste conflicts and communal riots

Innovative practices in cruelty!

Of course, we are accustomed to this novel brutality!

Paranormal transformations of parties and agendas during midnight

Cries of agrarian fields for witnessing hangman’s ropes

Childhood is casting off ‘drugs-skin’ like a dead snake

Human being became a laboratory

Can he survive without medicines?

Everywhere there is a stench of silent violence

Modernization emerges between the shadows of wicked umbrellas

Amidst the unending agitations

In the life of a common man ….
Peace is Everywhere?!

 

(Translated from Original Telugu poem Anthaa Prashanthame?! By Dr. Palakurthy Dinakar)

 తెల్లారే సరికల్లా

గుట్టు సప్పుడు కాకుండా పొడిపొడైన గుట్టలు

గుల్ల గుల్లైన నదుల, వాగుల ఇసుక కుప్పలు

చెట్ల చేతుల్ని కోల్పోయిన అడవుల ఆర్తనాదాలు

నడుస్తున్న మనిషి కాళ్లు అమాంతంగ విరగొట్టి, అతికిచ్చుడు

అందమైన ముఖాలు ఆసిడ్ దాడుల మంటల పుండ్లు…

కొమ్మ మీది పిట్టల గుంపులు రక్తపు ముద్దలు…

ఆసుపత్రులన్నీ ఆర్తనాదాల నినాదాల రొదల సెగలు…

అయినా అంతా ప్రశాంతమే?!

నడి నగరంల శిరశ్చేదనలు

ఊరవతల నగ్న ఊరేగింపులు

ఆరు రేపుల గాయాల మూడు హత్యల దాష్టికాలు

కులాల చిచ్చులు, మతాల మత్తులు

హింసలో కొత్త తొవ్వలు

మరీ మనకు అలవాటైపోయిన హింసే!

అర్ధరాత్రి జండాల, కండువాల మార్పిడీల గారడీలు

ఉరితాళ్ల సాక్షిగా ఏడుస్తున్న పొలాలు

చచ్చిన పాముల్లా డ్రగ్గు కుబుసం విడిచే బాల్యం

మనిషాక ప్రయోగశాలైనపుడు

ఔషధాల్లేని జీవనమెక్కడిది

అంతా రహస్య హింసోన్మాద కమురు వాసనలు

మోసపు గొడుగు నీడల సందులల్ల నవీకరణలు

అంతు చిక్కని అలజడుల సుడుల నడుమ

సామాన్యుని జీవితం…. అంతా… ప్రశాంతమే?!

 

POET’S – BIONOTE

 KALVAKUNTA RAMAKRISHNA

 

Dr. Kalvakunta Ramakrishna (B 1969) is a poet, critic, writer and motivational speaker. He did his Masters in Telugu, English and Sanskrit languages. He obtained M.Phil from University of Hyderabad and Ph.D. from Osmania Univesity. He was conferred D.Litt. by University of South America. At present he is extending his services as Principal, S.R.R Govt. Arts & Science College, Karimnagar of Telangana state. He received 4 Gold medals in MA (Telugu) from Osmania University, Hyderabad. He presented research paper in 25 National seminars and published 20 research articles in scholarly journals and edited anthologies. He was on the editorial board for Junior and Senior Intermediate Telugu Textbooks. He edited Adarsha Darshanam (Vidwan Krishnamacharya’s 60 years Literary book), Amrutha Murthi (Sant Sukandara Swamy Life History), Vignana Deepika, Sahithi Chetana, Shatavahana Poetry and Maneti Kavitha. He published Sri Vasara Saraswathi Shatakam, Akshara Deepalu, Prema Naa Chirunama, Kaluvukunta Naneelu and Haritha Yatra. His works of Telugu Literary Criticism includes Sahithya Souhithyam, Aalokana, Vimarsha Vignanam and Sri Krishan Yathindra Jeeyar Rachanalu – Parisheelana. He was awarded Indira Gandhi National Level Best NSS Officer Award, State Best Teacher Award, Antharjathiya Acharya Spoorthi Rathna Award Gurajada Foundation, America, Dr. Ande Venkatrajam Smaraka State level Literary Award, Teja Arts State level Literary Award, MVNR – Satavahana University’s Best Critic Award, Andhra Ratna Award, Dr. Sarvepalli Radhakrishnan Antharjateeya Acharya Ratna Award. Address: Dr.K.Ramakrishna, H.No. 9-5-191/5, Shiva Nagar, Karimnagar-505 001 Cell: 9440152405 Mail: rkkalvakunta7@gmail.com.

 

 

October 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

కథా పంచకం (చిన్నకథలు)

by Dr. Lakshmanacharyulu M October 25, 2021
written by Dr. Lakshmanacharyulu M

మార్పు

నూతనంగా నిర్మించబడిన ఆ దేవాలయం దగ్గర భక్తులు చాలామందే ఉన్నారు. అంతా ఎంతో భక్తిభావంతో దేవుడికి వంగి వంగి నమస్కారాలు చేస్తూ తమ అభీష్టాలు తీర్చమంటూ వేడుకుంటున్నారు. ప్రతిరోజూ అక్కడ భక్తులంతా పెద్ద సంఖ్యలో చేరుకుంటూ అర్చనలు, ఆరాధనలు చేస్తున్నారు.

సేఠ్ దీనదయాళ్ గారు ఈ దేవాలయం నిర్మించారు. ఆయన లాంటి మహా పిసినారి, పాపాత్ముడు అసలు ఒక దేవాలయం నిర్మించడమే ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. “ఇక నా స్థానం భగవంతుని చరణాల చెంతనే. రోజూ రాత్రి 7 గంటల తర్వాత దేవాలయంలోనే కూర్చుంటా” అని ఆయన అందరితో చెప్పాడు.

సేఠ్ తో నాకున్న పరిచయం ఇప్పటిది కాదు. ఆయన నాకు పాత స్నేహితుడే. అతనిలో మార్పుని చూసిన నేను ఉండబట్టలేక ఓ రోజున అతనిలోని ఈ మార్పుకి కారణం అడిగా – దానికి ఆయన గంభీర స్వరంతో – “జీవితమంతా నా ఇష్టమొచ్చినట్టు బ్రతికాను. ప్రజల్ని ఇష్టమొచ్చినట్టుగా త్రొక్కుకుంటూ పోయా. ఈ మధ్య కొన్ని రోజులుగా జనం ఎందుకో నాకు దూరం అవుతున్నట్టు, నన్ను దూరం పెడుతున్నట్టనిపించింది. ఆలోచించాను. ఇదిగో! ఇలా చేశాను. పగలంతా పూర్వంలాగానే వ్యాపారం ద్వారా సొమ్ములు పాత పద్ధతిలోనే సంపాదించుకుంటూ ఇక రాత్రి వెళ్ళి గుళ్ళో కూర్చుంటా. అప్పుడు ప్రజలు కేవలం దేవుడికే కాదు, నాకూ – అంటే ఈ సేఠ్ దీనదయాళంకి కూడా – వంగి, దణ్ణాలు పెడతాడు. ఇలా ప్రాణాల్తో ఉండగానే నేను స్వర్గసుఖాల్ని అనుభవిస్తా” అని అంటంటే విని నేను తెల్లబోయాను.

***

విగ్రహం

నేనొక శిల్పిని. ఒకరోజున సీతారామ్ నా దగ్గరకొచ్చి తన మనసులో ఉన్న మాట చెప్పాడు. సరే, నేను నా మిత్రుడి కోర్కె తీర్చాలని అనుకున్న, సీతారాముణ్ణి అభిమానించ వారితో మాట్లాడాను. సరే, మాటలు చేతల రూపం దాల్చాయి. ఆయన విగ్రహం ఒకటి పెట్టాలని నిర్ణయించడం జరిగింది. శిల్పం చెక్కించే పని మొదలైంది.

చివరికి సీతారామం తను బ్రతికుండగానే తన కోరిక – అదేనండీ – తన విగ్రహ నిర్మాణం, స్థాపన – రెండూ చూసుకున్నాడు. ఆనందించాడు. ఇది జరిగిన కొద్దిరోజుల తర్వాత ఆయన కాలధర్మం చెందాడు.

ఓ రోజున సీతారామ్ నా కలలోకి వచ్చి ఎంతో బాధపడుతూ – “మిత్రమా! ఆ విగ్రహం కారణంగా నేను చాలా బాధపడుతూన్నానోయ్! విగ్రహం ఏర్పాటైన కొద్దిరోజులు బాగానే ఉంది కాని… ఇప్పుడే చాలా బాధగా, అవమానంగా ఉందోయ్! ఎంతైనా బొమ్మ, బొమ్మే కద! అది ఎప్పటికీ ప్రాణం పోసుకోలేదు. అవునా! ప్రస్తుతం కేవలం అది పశువులకి, పక్షులకీ ఆశ్రయం కలిపిస్తోంది, ఆనందం అందిస్తోంది! ప్చ్’’

అదిగో! అప్పట్నించే నాకూ చాలా బాధ కలిగింది.  నా మిత్రుడి శిలావిగ్రహం చూసి చూసి బాధపడుతున్నా. ఇలా విగ్రహస్థాపన జరగడం అతడికీ అవమానమే, నా కళకి కూడా అవమానమే. కాని….ఏం చేస్తాం! ఆ విగ్రహం లాగా నేను కూడా వివశుణ్ణే, మరో దారి లేదు మరి!

*   *

చీవాట్లు

గోపాల్ గోపాలస్వామి పరువు ఇవాళ గంగలో కలిసిపోయింది. జూదం ఆడుతూ వాడు పట్టుబడ్డాడు. వాళ్ళమ్మ నాన్నలు వాడి ముందు కూర్చుని గద్దిస్తున్నారు, చీవాట్లు పెడుతున్నారు.

డా. హరీష్ గోపాల్ వాళ్ళ నాన్నగారు. నగరంలో ఆయన ఒక గొప్ప పేరున్న డాక్టరు. సామాన్యంగా ఆయన మౌనంగానే ఉంటారు. కాని తిట్టవలసిన, చీవాట్లు పెట్టవలసిన అవసరం పడితే, ఇక అంతే! అలా తిడుతూనే ఉంటారు. ఓసారి గోపాలంతో – “చూడు! గోపాల్! నీ సంగతేంటో నాకేమీ అర్థం కావడం లేదు. నీ చదువేంటో నాకేమీ బోధపడడం లేదు. ఎప్పుడూ ఏదో గొడవ చేస్తూనే ఉంటావ్. మా తరంలో ఇలా ఉండేది కాదురా!  వళ్ళోంచి చదివేవాళ్ళం. చదువు తప్ప నువ్వు చెయ్యడానికి మరో పని ఏముంటుందసలు? దాంట్లో నువ్వు జీరోవే కదా! పైగా… ఇలాంటి చెడు వ్యసనాలు, దురలవాట్లు….”

ఇప్పుడు  గోపాల్ వాళ్ళమ్మ వంతు వచ్చింది. ఆమె కూడా నగరంలో బాగా పేరున్న స్త్రీల వ్యాధుల నిపుణురాలు. శ్రీమతి మాల అంటే చాలామందికి తెలుసు. గొప్ప మాట కారి, తిట్టడంలోనైతే చాలా నైపుణ్యం ఉంది. ఇక ఆమె మొదలుపెట్టంది – “చూడు! నువ్వు మాకు ఒకే ఒక్క సంతానం. నీ కోసమని నేను మీ నాన్నగారు ఎన్నో త్యాగాలు చేసాం. ఎన్నో వదులుకున్నాం. ఈ భవనం, ఈ డబ్బు, వైభోగం, అంతా నీదే కద! పొద్దుట్నుంచీ రాత్రివరకూ మేం పడుతున్న శ్రమ కేవలం నీ కోసమే కద! మరెందుకని నువ్విలా జూదం ఆడడం లాంటి చెడు వ్యసనాలు మరిగావ్?” అని అన్నది.

గోపాల్ మౌనంగా వింటున్నాడు వాళ్ల మాటల్ని. అసలేం మాట్లాడతాడు వాడు? అమ్మా నాన్న లంటే చచ్చేంత భయం. అలా తలొంచుకుని మౌనంగా వింటూనే ఉన్నాడు. అటు వాళ్ళమ్మా నాన్నల తిట్లూ చీవాట్లు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇక వాళ్ళిద్దరూ కలిసి ఒక్కసారిగా అందుకున్నారు –

“చెప్పరా! నీకేం తక్కువైందని ఇలా జూదం, పేకాటలు మొదలుపెట్టావ్? అసలు జీవితంలో నీకేం తక్కువైందిరా? మేం నీకివ్వనిదంటూ ఏముందిరా? చెప్పు ఇంకా ఏం కావాలి?”

ఇక గోపాల్ ఉండబట్టలేక ఏదన్నా మాట్లాడాలనుకున్నాడు. మెల్లగా నోరు తెరిచి – “అవును! నాకు జీవితంలో అన్నీ ఇచ్చారు. అయితే మీ తీరికలేని జీవితంలో నాకు కేవలం రెండే రెండు కావాలి? ఇస్తారా?”

అమ్మ నాన్నలిద్దరూ ఒక్కసారిగా – “ఏం కావాలి నీకు?” అని అన్నారు ఆశ్చర్యంగా.

నాకు – – నాకు కావాల్సినవి…. ఒకటి నాతో గడపడానికి కొంత సమయం… అలాగే కొంచెం ప్రేమ. అంతే!” అని అన్నాడు.  గోపాల్ కళ్ళంలో కన్నీళ్ళు చిప్పిల్లాయి.

ఫ్రేమ్

రోజులాగానే ఇవాళ కూడా శివచరణ్ పనిలోకి వెళ్తుండగా హఠాత్తుగా గుండెలో తీవ్రంగా నొప్పి వచ్చింది. ఆయన్ని వెంటనే పక్కమీద పడుకోబెట్టి ఏవో ఉపచారాలు, చేసినా ఫలితం లభించలేదు. పదిహేను నిముషాల్లోనే పాపం! ఆయన ఆ బాధ పట్టుకోలేక కన్నుమూసాడు.

అంతే! అప్పటిదాకా నవ్వుల్తో నిండి ఉన్న ఆ ఇల్లు ఏడుపులు, పెడబొబ్బలతో ప్రతిధ్వనించింది. ఒక్కసారిగా  వాతావరణం మారిపోయింది. ఆయన ముగ్గురూ కొడుకులూ కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చారు, ఒక ముఖ్యమైన విషయంలో. అదేమంటే… ఇవాళ్టి నుంచి మనం నాన్నగారి ఫోటోకి నమస్కారం పెట్టాకే మనం, మన మన పనులకి వెళ్దాం. నాన్నగారు వాళ్ళ నాన్నకి అంటే తాతగారికి ఏం చేసేవాడో అదే మనమూ ఈయన విషయంలో చేద్దాం” అని అనుకున్నారు.  శివచరణ్ జీవించి ఉన్నప్పుడు ఎప్పుడు బయటకు వెళ్ళాల్సి వచ్చినా, వాళ్ల నాన్నగారీ ఫోటోకి దణ్ణం పెట్టుకునేవాడు.

“అది సరే! పూజా గృహంలో స్థలం ఏదీ ఖాళీగా లేదు కదా? నాన్నగారి ఫోటో ఎక్కడ పెడతాడు?” అడిగింది పెద్ద కోడలు.

మళ్ళీ ముగ్గురు ‘సుపుత్రులూ’ ఆలోచించి ఓ రెండు నిముషాల్లోనే ఒక నిర్ణయానికి వచ్చేసారు. “ఆఁ దానిదేవుంది? తాతగారి ఫోటో తీసేసి, అదే ఫ్రేంలో నాన్నగారి ఫోటో పెడదాం. మళ్ళీ క్రొత్త ఫ్రెం కొనాల్సిన అవసరం ఉండదు. పాత ఫ్రేంతోనే మనం పని కానిచ్చేద్దాం. ఏమంటారు” అని అన్నాడు పెద్ద కుమారుడు.

నేత్రదానం

ఆ కాలేజి స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఆ వూళ్ళోని ప్రముఖ నేత్ర వైద్యుడు డా. శుక్లాగారిని ఆహ్వానించగా ఆయన వచ్చి తన ఉపన్యాసంలో – “అసలు నేత్రదానానికి ఉన్న గొప్పదనమే వేరు. దీన్ని మించిన దానమే లేదు నిజానికి. మీరంతా మీ మీ పేర్లను నేత్రదానం చేసే పవిత్రమైన కార్యానికి నమోదు చేసుకోండి” అని అన్నాడు.

విద్యార్థులంతా చాలా ఆసక్తిగా ఆయన మాటలు వింటున్నారు. అక్కడే ఉన్న జ్ఞాన్ ఆహుబా తన కుర్చీలో చాలా అసహనంగా అటూ ఇటూ కదలసాగాడు. చివరికి ఉండబట్ట లేక డాక్టర్ గారి మాటలకు అడ్డొస్తూ –“ ఆపండి ఇంక! మీ డాక్టర్లు అందరూ కపటులే. చెప్పాల్సిన నిజానికి కూడా మీరు ఏవేవో చిలవలు – పలవలు కలిపించి చెప్తారు. ఉన్నదొకటైతే మరొకటి చెప్తారు. నాటకీయంగా చెప్తారు. అలా చేసి ఆనందం పొందుతారు. నా చెల్లెలి అంధత్వాన్ని మీలో ఎవ్వరూ పోగొట్టలేకపోయారు. పైగా నేత్రదానం నేత్రదానం అంటూ మాటలు చెప్తాడు. ఇక్కడున్న వాళ్ళంతా మీ మాటల ప్రభావంతో తప్పట్లు కొడతారు, కాని ఎవ్వరూ కూడా నా చెల్లెల్ని గ్రుడ్డితనం పోగొట్టాలనే విషయం గురించే ఆలోచించరు” అని అన్నాడు.

“అంతే! ఆ మాటలకి అక్కడి వాతావరణం మౌనం వహించింది. అంతా తలొంచుకుని ఏం ఆలోచించుకున్నారో ఏమో?” కొన్ని క్షణాలు గడిచాయో లేదో ఆ సభలో ఒక మూల నుండి ఒక చెయ్యి పైకి లేచింది. తరువాత ఇంకో మూలం నుండి మరో చెయ్యి లేచింది పైకి. అంతే!! ఆ హాల్ మొత్తం పైకెత్తిన చేతులతో నిండిపోయింది. అంతా కలిసి ఒకే స్వరంతో మేమంతా జ్ఞాన్ సోదరి నేత్రాలకు చికిత్స చేసి చూపు తిరిగి ఇప్పించాలనుకుంటున్నాను” అని అన్నాడు.

విస్మితుడై జ్ఞాన్ ఆహుజా అలా కూర్చుండి పోయాడు.

నేత్రదానం అంటే ఏమిటో, అతనికి అర్థమైంది.  అతని కళ్ళలో కన్నీళ్ళు ఉబికి వచ్చాయి. తన చిన్నారి చెల్లెలు ఇక చూడగలదనే నమ్మకం అతనికి కలిగింది. అంతే! వెంటనే తను కూడా తన చెయ్యెత్తి, “నేను కూడా నా కళ్ళని దానం చేస్తా ఎవరి తల్లిగాని, చెల్లెలుగాని, ఎవరి బంధువైనాగాని చూపు పోగొట్టుకుని ఉంటే వాళ్ళకి నా నేత్రాలు అంకితం చేస్తున్నా”  అని అన్నాడు ఆవేశంతో, అందరికీ వినబడేట్టుగా-

 

 

October 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఆరోగ్యం, ఆనందం ఇచ్చే దివ్య దీపావళి

by బ్రాహ్మణపల్లి జయరాములు October 25, 2021
written by బ్రాహ్మణపల్లి జయరాములు

“దీపాయ బ్రహ్మరూపాయ, విష్ణు రూపాయతే నమః |

రుద్రరూప నమస్తుభ్యం, దీప రూపాయతే నమః ||

దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపం త్రిమూర్తి స్వరూపం. దీపం జ్ఞానానికి, ఐశ్వర్యానికి, ఆనందానికి ప్రతీక. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దుర్గతులను తొలగించడం, పూర్వీకుల క్షేమాన్ని ఆశించడం, దారిద్ర్యం నాశనమై ఐశ్వర్యాన్ని పొందడం అనే మూడు భావాల సమ్మేళనం ఈ దీపావళి. ఈ పండుగలో జ్ఞానం పొందడం, పితృదేవతారాధన, లక్ష్మీ ఆరాధన ప్రధానమైనవి.

ఈ దీపావళి ఉత్తర భారతదేశంలో అయిదు రోజుల పండుగ. దక్షిణ భారతంలో ముఖ్యంగా మన తెలుగువారికి మూడు రోజుల పండుగ. నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి అని మూడు రోజులు మనం పండుగ జరుపుకొంటే ఉత్తరాది వారు, ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాతీయులు ఈ మూడు రోజులకు తోడు ధనత్రయోదశి (ధన్ తేరాస్), యమ ద్వితీయలను కూడా జరుపుకొంటారు. దీపావళి గుజరాతీలకు సంవత్సరాది కూడా.

పండుగ నేపథ్యం :

దీపావళికి సంబంధించిన పౌరాణిక, చారిత్రకాంశాలు గాథలుగా చెబుతారు. వాటిలో –

  1. విష్ణుపురాణం ప్రకారం – విష్ణువు వామన రూపంలో వచ్చి, బలిచక్రవర్తిని పాతాళానికి పంపి ధర్మాన్ని రక్షించిన రోజున దీపావళి జరుపుకోవడం ప్రారంభమైంది.
  2. రావణ వధానంతరం శ్రీరాముడు అయోధ్యకు తిరిగిరాగా, ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడే ఆయనకు పట్టాభిషేకం జరగ్గా ప్రజలంతా ఆనందంతో దీపాలు నగరమంతా వెలిగించి పండుగ జరుపుకున్నారని, నాటినుండి ప్రతియేటా ప్రజలు దీపావళి జరుపుకుంటున్నారట.
  3. శ్రీకృష్ణుడు సత్యభామతో వెళ్ళి నరకాసురుని చంపగా ప్రజలు ఆనందంతో దీపావళి జరుపకున్నారట.
  4. ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి జన్మదినం ఈ రోజు కావున ఆనందంగా దీపాలు వెలిగించి ఈ పండుగ జరుపుకుంటున్నారట.
  5. విక్రమాదిత్యుడు ఈ రోజుననే నవరత్న ఖచిత సింహాసనం అధిష్ఠించాడని, విక్రమ శకం ఆరంభమైన నేడు దీపావళి జరుపుకున్నారని, అదే సంవత్సరాదియని చెబుతారు.
  6. జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఈనాడు శరీరాన్ని పరిత్యజించగా, దేవలోక వాసులు దీపకాంతులతో ఆయనను ఆహ్వానించారనే విశ్వాసంతో ఇక్కడ దీపావళి జరుపుకుంటారు.

ఈ గాథలు గాక, కఠోపనిషత్ ప్రకారం నచికేతుడు యమధర్మరాజు దగ్గర ఉపదేశం పొంది భూలోకానికి రాగా ఆనాడు జనం దీపావళి జరుపుకున్నారని, ధర్మరాజు పట్టాభిషేకం నాడు దీపావళి జరుపుకున్నారని, క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి జన్మించగా దీపాలు వెలిగించారని – ఇలా అనేక పురాణ కథలు ప్రచారంలో వున్నాయి.

వీటన్నిటినీ పరిశీలిస్తే ప్రతియుగంలోనూ ప్రజలు తమ ఆనందాన్ని ఒకరితో ఒకరు పంచుకోవడానికి దీపాలు వెలిగించి పండుగ జరుపుకున్నారని తెలుస్తుంది.

నరక చతుర్దశి : ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నాడు అభ్యంగస్నానం చేసి, దీపదానం, యమ తర్పణం చేయడం వల్ల మానవులు తమకు నరకం లేకుండా చేసుకుంటారని, అందువల్ల దానికి “నరక చత్తురశి” అనే పేరు వచ్చిందంటారు. కాని లోకంలో దీపావళి పండుగకు సంబంధించి “నరకాసురుని వధ” గురించి ప్రముఖంగా చెబుతారు. భాగవత, హరివంశాల్లో ఈ కథ ఉంది. ఇది అందరికీ తెలిసిన కథే. కాని దీన్ని జ్యోతిశ్శాస్త్రంతో సమన్వయించి, డా. తిరుమల రామచంద్రగారు చక్కగా వివరించారు. ‘………. స్వాతి నక్షత్రానికి వాయువు దేవత. దాన్ని అధిష్ఠించి (నరకుడు భూదేవి కుమారుడు. మేషరాశి భౌముని రాశి. అది నరకునిలా మూర్ఖత మూర్తీభవించింది), నరకుని మీదకు యుద్ధానికి వెళ్ళిన కృష్ణుడు అంటే సూర్యుడు, సత్యభామ = చంద్రుడు, నరకుడు పడిపోగానే ఆకాశపుటంచుల మీద దీనచ్ఛాయలతో ఉన్న కన్యారాశి (కన్యల గుంపు) నరకుని (మేషరాశి) బంధం నుంచి విడివడి, తమను విడిపించిన సూర్యుని (కృష్ణుని) నాయకునిగా చేరుకొంది. దీన్ని పురాణ కథతో అతికించినారు” అని చెప్పారు.

ఈ నరకాసుర వధ ఘట్టాన్ని శ్రీ పాటిల్ నారాయణరెడ్డి గారు, స్త్రీ స్వాతంత్ర్యం – వైజ్ఞానిక విషయాలతో సమన్వయించి చూపారు. స్త్రీల స్వాతంత్ర్యాన్ని హరించిన రాజును సంహరించి శ్రీకృష్ణుడు “సమాజ సుధాకరుడు” అయ్యాడన్నారు. పోలిశెట్టి బ్రదర్స్ ప్రకృతిలో జరిగే మార్పులకు ఈ కథ ప్రతీక అని విశ్లేషించారు. మొత్తంమీద “నరకాసుర వధ” కథ దీపావళికి సంబంధించిన కథ అయినా కాకపోయినా దీన్నుంచి మనకెన్నో విషయాలు తెలుస్తాయి. నరక శబ్దానికి “దుర్గతి” అని అర్థం. దాన్నుంచి తరింపచేయగల చతుర్దశి “నరక చతుర్దశి”. నరకం అంటే కష్టం, దుఃఖం. వాటి నుంచి ఉద్ధరించేది అని చెప్పుకోవచ్చు.

ఈనాటి కర్తవ్యం : అభ్యంగ స్నానం చేసి, యమతర్పణం చేసేవారికి యమదర్శనం ఉండదని శాస్త్రవచనం. “చంద్రోదయ కాలే నరక చతుర్దశీ ప్రయుక్త తైలాభ్యంగం కుర్యాత్ ”. ఆరోజు చంద్రోదయ కాలం అంటే తెల్లవారు జామున తలంటి పోసుకోవాలి. అభ్యంగ స్నానం ఎందుకంటే,

“తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథైవసేత్ |

అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే ||”

దీపావళినాడు నువ్వుల నూనెలో లక్ష్మి, జలంలో గంగాదేవి వసిస్తారు. కాబట్టి అలక్ష్మి (దరిద్రం, అభాగ్యం) తొలగిపోవడానికి తైలంతో ఒళ్ళంతా రుద్దుకొని స్నానం చేయాలి. అంతకుముందే ఇంటిని శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టాలి. నూతన వస్త్రాలు ధరించాలి. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక 11 లేదా 21 దివ్వెల్ని వెలిగిస్తారు. కొన్నిచోట్ల నరకుని దిష్టిబొమ్మల్ని తగలబెడతారు.

వామన పురాణంలో ఈ చతుర్దశి నాడు “దీపదానం” చేస్తే పితృదేవతలకు స్వర్గనివాసం కలుగుతుందని జనులు విశ్వసిస్తారని చెప్పబడింది.

“చతుర్దశ్యాంతుయేదీపాన్ నరకాయ దదాతిచ

తేషాం పితృగణాస్సర్వే నరకాత్ స్వర్గమవాప్నుయాత్ ||”

ఈ రోజు “పితృదేవతారాధన” కూడా కర్తవ్యమన్నారు. అలాగే “యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయచ” అని యమధర్మరాజును పూజించి, ఆయనకు తర్పణం ఇవ్వాలి. ఈ చతుర్దశిని “ప్రేత చతుర్దశి” అని కూడా అంటారు. ఈరోజు నువ్వులతో, మినుములతో చేసిన పిండివంటలు ఆహారంగా తీసుకోవాలని చెప్పారు. శీతాకాలం ప్రవేశించిన సమయం కాబట్టి ప్రజల ఆరోగ్య రక్షణకు కావలసిన ఆహారాన్ని స్వీకరించమని మన శాస్త్రాలు చెప్పాయి.

దీపావళి విశిష్టత : దీపమాలికలతో లక్ష్మికి నీరాజనమీయబడే దినం కావడం చేత దీనికి దీపావళి అనే పేరు వచ్చింది. దీపాలను అలంకరించి వెలిగించడం ఈనాటి ప్రధాన కార్యక్రమం. పాల సముద్రం నుంచి వచ్చిన వెలుగే లక్ష్మీదేవి అని, భూమి మీద సంపద అభివృద్ధి చెందడానికి కారణం ఆ వెలుగే కాబట్టి దాన్నందించిన లక్ష్మిని “ధనలక్ష్మి”గా భావించి, దీపావళినాడు లక్ష్మీ పూజ చేయడం సంప్రదాయంగా వచ్చిందని పద్మపురాణం చెబుతూంది.

బలి చక్రవర్తి చివరి కోరిక ప్రకారం జనులు ఏటా మూడు దినాల పాటు పండుగ జరుపుకునేందుకు, అతని పేర దీపాలు వెలిగించేందుకు విష్ణువు అతనికి ప్రసాదించిన వరం ఫలితంగా దీపావళి నాడు దీపాలు వెలిగించే సంప్రదాయం ఏర్పడిందని “సనత్కుమార సంహిత” చెబుతూంది.

దీపావళి కర్తవ్యం – సందేశం : పాలసముద్రం నుంచి వెలువడ్డ దివ్యశక్తి శ్రీమహాలక్ష్మి, మన దగ్గరున్న ధనం పాలనుంచి వచ్చినట్లు స్వచ్ఛంగా ఉండాలని చెబుతుంది శాస్త్రం. అంటే, ప్రతి మనిషీ నీతి, నిజాయితీతో బతకాలని దీనిలోని అంతరార్థం, సందేశం.

ప్రదోష కాలంలో లక్ష్మీదేవిని మనసారా పూజించి, ఆమెనిలా ప్రార్థించాలి.

“శ్రీరూపేంద్ర సదనే మదనైకమాతా

జ్యోత్స్నా ఇసి చంద్రమసి చంద్రసహోదరస్యే

సూర్యే ప్రభాసిత జగత్ త్రితయే

ప్రభాసి లక్ష్మీ ప్రసీద సతతం సమతాం శరణ్యే !”

దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం శుభప్రదం. వృక్షరూపంలో అలంకరించి దానిపై దీపాలుంచాలి. తులసి దగ్గర, గుమ్మాల దగ్గర, వాకిట్లో దీపాలు వెలిగించి, అర్ధరాత్రి తప్పెట్ల మోతతో అలక్ష్మిని వెళ్ళగొట్టాలి.

బాణాసంచా కాల్చడం :

“చిటపట టుప్పుటప్పనెడి సీమ టపాకుల పెట్టె లెన్నియు

ద్భటముగ ఢమ్ముడమ్మను టపాకులవెన్ని మతాబులెన్ని పి

క్కటిలెడి ఝల్లులెన్ని, మతి కాకరపూవతులెన్ని గాలురో

దిటముగ దెల్పనా తరమె దివ్వెల పండుగ రేయి నర్భకుల్” – దాసు శ్రీరాములు

దీపావళినాడు వెలుతురిచ్చే, చప్పుడు చేసే బాణాసంచా కాల్చడం దేనికి? మహాలయ పక్షంలో స్వర్గం నుంచి దిగివచ్చి, భూలోకంలో తిరుగుతూ ఉండే పితృదేవతలు ఈ రోజు తిరిగి పితృలోకానికి ప్రయాణమై వెళతారు. వారికి వెలుతురు చూపడం కోసం నరలోకవాసులు చేతులతో కాగడాలు పట్టుకొని ఆకాశంవైపు చూపాలని శాస్త్రవచనం. ఆ కాగడాలే నేడు దీపావళినాడు మతాబులు కాల్చడంగా మారింది. అలక్ష్మిని వీధుల వెంట సాగనంపే వాద్యధ్వనులకు మారుగా టపాకాయలు కాలుస్తున్నారు.

సస్యాలను పాడుచేసే కీటకాలు పుట్టే సమయం ఇది. ఆ కీటకాలు నశించడానికి దీపాలు, టపాకాయలు దోహదం చేస్తాయి. ఈనాటినుంచి ఆకాశదీపం వెలిగించడం ప్రారంభిస్తారు. కార్తీక మాసాంతం వరకు ఇది సాగుతుంది. దీనివల్ల పితృదేవతలకు దారిచూపడమే కాకుండా, సస్యరక్షణకు దోహదం కలుగుతుంది.

ఉపసంహారం : దివ్వెల పండుగ దీపావళి. మనిషిలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానమార్గంలో పయనించమని చెప్పే పండుగ. “తమసోమాజ్యోతిర్గమయ” అనే ఉపనిషద్వాక్య సందేశం దీనిలో కనిపిస్తుంది. దేశ, విదేశాల్లో ఆనందోత్సాహాలతో ప్రజలు ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఆరోగ్యం, ఆనందం, సామాజిక (సస్య) ప్రయోజనాలతో కూడుకున్న ఈ పర్వదినం మానవాళి జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని కోరుకుందాం.

“సర్వే భవంతు సుఖినః సర్వేసంతు నిరామయాః |

సర్వే భద్రాణి పశ్యంతు, మాకశ్చిత్ దుఃఖభాక్ భవేత్ ||

October 25, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మాస విశిష్టతలో “ కార్తీకం’

by కావ్యసుధ (ఆర్. హరిశంకర్) October 25, 2021
written by కావ్యసుధ (ఆర్. హరిశంకర్)

అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది కాగా, అన్ని మాసాలలో కార్తీక మాసం శ్రేష్ఠమైనది. ఈ మాసములో యే స్వల్ప కార్యమైనా నియమంగా చేస్తే అక్షయమైన ఫలితాన్ని కలగజేస్తుంది. శివుడు త్రిపురాసురుని సంహరించింది కార్తీక పౌర్ణమినాడే. విశ్వకర్మ త్రిపురాసురునికి త్రిపురమనే విమానమర్పించి, అందులో ఉండి ఆ దైత్యుడు హింసిస్తున్న దేవతల మొరవిని పరమేశ్వరుడు వానికి ఏకబాణమున త్రిపురముతో సహా దహించి చంపాడు. జ్వాలా తోరణమును, త్రిపురోత్సవాన్ని కార్తీక పౌర్ణమి నాడు ఒనరిస్తే పాపహారము అని అంటారు.

శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన ‘కార్తీక’ మాసం చాంద్రమాన ప్రకారం ఎనిమిదవ మాసం. స్త్రీలు ఈ మాసంలో ఆచరించే కార్తీక వ్రతం, నోము స్వల్ప కార్యమైనా గొప్ప ఫలితాన్నిస్తుంది. కార్తీక స్నానం, దీపదానం, దీపారాధన, కన్యాదానం, ఉపవాసం చేయడం వల్ల అనేక జన్మజన్మల్లో చేసిన సకల పాపాలు హరించుకుపోయి అనంతమైన అక్షయమైన పుణ్యఫలితం పొందుతారని, కార్తీకపౌర్ణమి అన్నింటికంటే అత్యంత విశేషఫలదాయకమైన పుణ్యకాలమని మనకు స్కాంద, పద్మ పురాణాంతర్గతమైన కార్తీక పురాణం ద్వారా తెలుస్తోంది.

శివకేశవ ప్రీతికరమైన ‘కార్తీకం’ సమస్త ధర్మాలకన్నా శ్రేష్ఠతరమైనది. కార్తీకంలో సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపము ధరించి సమస్త నదీ జలాలయందు చేరుతుంది. శ్రీమహా విష్ణువు సమస్త జలాశయాలలో వ్యాపించి ఉంటాడు. కాబట్టి ఈ మాసమంతా సూర్యోదయానికి పూర్వమే పుణ్య నదులలోను,పుణ్యక్షేత్రాలలోగానీ, నదిలో, కాలువలో,నూతులలో గానీ నిత్యం కార్తీక స్నానమాచరించటం వలన పాప నాశనమై, మోక్షం కలుగుతుందని మన పురాణాలు, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సాక్షాత్తూ గంగాదేవే సర్వజనుల పాపాలు తనలో ఉంటాయని భయపడి పరమేశ్వరుని ఉపాయాన్ని అడుగగా ‘కార్తీక మాసంలో కావేరినది, స్నానముచే సకల పాపాలు తొలగి పోతాయని చెప్పగా, గంగాదేవి అట్లాచేసి తన సంశయాన్ని తొలగించుకొన్నదని ధర్మసింధు వచనము. మీన పౌర్ణమి, మేష పౌర్ణమి, మిధున, కర్కాటక, సింహ, కన్య, తులా, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ అనేవి సంవత్సరానికి పన్నెండు పూర్ణిమలు. ఇందు కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిని ప్రవేశించే పూర్ణిమ కార్తీక పూర్ణిమ. ఈ కార్తీక పూర్ణమిలో ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ పూర్ణిమను వ్యాసపూర్ణిమని చెప్తారు. కాబట్టి అన్ని మాసాలలోని పూర్ణిమల కంటే కార్తీక పూర్ణిమ ప్రశస్తమైనది. పూర్ణిమ అంటే మిక్కిలి పర్వదినమని వేదాలలో చెప్పబడింది.

ఈ కార్తీక పౌర్ణమినాడు చేయవలసిన విధి ఒకటి ఉంది. ఉసిరి మూలయిన శ్రీహరి, స్కందమున శివుడు, ఊర్ధ్వమున బ్రహ్మ, సమస్త దేవతలు కూడా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరిచెట్టును ఆశ్రయించి వుంటారు. కాబట్టి కార్తీక దామోదరుడిని పూజిస్తారు. కార్తీక పౌర్ణమినాడు నిర్వహించే కార్యక్రమాల ద్వారా మానసికమైన ప్రశాంతత, ఆనందమూ లభిస్తాయి. కార్తీకమాసం హరిహరాత్మకమైన అద్వైత విశిష్టమైన మాసం. స్నానం, దీపారాధన, దానం, ఉపవాసం, వనభోజనం ఈ మాసంలో పుణ్యాన్ని అగణ్యంగా కలగచేస్తాయి. కార్తీక పౌర్ణమినాడు చేసే ఉత్సవానికి ‘జ్వాలాతోరణ’ ఉత్సవమని పేరు.
“ఉపవాసంబైక భుక్తం ! నక్తం ఛాయా చితవ్రతం స్నానం చతిలదానంద! షద్విధం కవయో విదు! అని ఉపవాసం, ఏకభుక్తం, నక్తభోజనం లేదా నక్తం, ఆయాచితం, స్నానం, తిలదానం. (1) శక్తి ఉన్నవాళ్ళు పూర్తి ఉపవాసం చేయటం, శివునికి అభిషేకం చేసి తులసి తీర్థం మాత్రమే తీసికొనుట, (2). ఉపవాసం చేయలేని వాళ్లు జపం, దీపారాధన చేసి, మధ్యాహ్నం భోజనం చేసి, రాత్రి మాత్రం భోజనం చేయకూడదు. పాలు, పళ్ళు తీసుకోవచ్చు. దీనిని ఏకభుక్తం అంటారు. (3) మూడో పద్ధతిలో ఉదయాన్నే స్నానజపాదులు చేసి, పగలంతా ఉపవాసం చేస్తూ నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయాలి. దీనిని నక్తం అంటారు. (4) పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం ఎవరైనా అడగకుండా పెట్టిన దానిని తినటం. దీనిని ఆయాచిత వ్రతం అంటారు. (5) మంత్రయుక్తంగా స్నాన జపాదులు గావించవచ్చు. (6) కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసిన వ్రతం చేసినట్లు అవుతుంది ఇది కార్తీక మాసంలో ఉపవాస పద్ధతులు.

భూమిమీద గల జీవులు శరీరం లోని ప్రాణమయ, బుద్ధిమయ, మనోమయ కోశంలోని శక్తి ప్రవాహాలు పూర్ణిమనాడు ఎంతో ఎక్కువ ఉత్తేజాన్ని పొంది ఏకోన్ముఖములై ఉంటారని కూడా చెప్పబడినది. కార్తీక శుద్ధ పూర్ణిమను వ్యాసపూర్ణిమ అనీ అంటారు. ఈ దినం చంద్రుడు కృత్తికా నక్షత్రం లో ఉంటాడు. రవి కూడా వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రము లేక అనురాధా నక్షత్రాలలో ఉంటాడు. కృత్తికా నక్షత్రము రవి యొక్క నక్షత్రము, కృత్తికా నక్షత్రానికి అగ్ని, ఆది దేవత రుద్రుడు కాబట్టి ఇంత విశేషం.

చంద్రుడు కృత్తికలో పూర్ణుడై వుంటాడు. కాబట్టి కృత్తికా నక్షత్రంలో ఉండే ‘పూర్ణిమ’ వలన ఈ మాసానికి ‘కార్తీకం’ అని నిర్ణయించారు మన మహర్షులు. అగ్నికి అధిష్టాత ‘సూర్యుడు’ , చల్లదనానికి అధిష్టాత ‘చంద్రుడు’ కావడంచే ఈ రోజున సూర్యచంద్రులిద్దరూ పూజింపబడతారు.

కార్తీక మాసము శివకేశవులిద్దరికీ ప్రీతికరం. వృక్షాలలో అశ్వత్థ వృక్షము, తీర్థాలలో నారాయణ తీర్థము, తేజస్సులందరిలో సూర్యుడు, మాసములలో కార్తీక మాసానికి మించినవి లేవు. ఈ మాసములో సోమవార వ్రతం సర్వోత్తమము. కార్తీక సోమవారాలలో పంచామృతముతో, చమకముతో, శివాభిషేకం చేస్తే అశ్వమేథ యాగఫలం పొందుతారని, అన్ని సోమవారాలు ఆచరించినవారు ఇహమున సకలైశ్వర్యములను అనుభవించి, పరమశివుని అనుగ్రహానికి పాత్రులౌతారని కార్తీక పురాణోక్తి. పౌర్ణమి నాడు విష్ణాలయంలోగాని, శివాలయంలోగాని స్థంభం పైన దీపాలుంచిన వారి పుణ్యం వర్ణనాతీతం.

ప్రతి పండుగకు కొన్ని నియమాలున్నట్లే ఈ కార్తీక పౌర్ణమికీ ఉన్నాయి. కథలూ ఉన్నాయి. కార్తీక మాసమంతా బ్రహ్మముహూర్తానికి పూర్వమే స్నానం చేయాలి. అట్లా చేసే స్నానమే కార్తీక స్నానమవుతుంది. ఈ కార్తీక మాసమంతా స్నానం, దానం, ఉపవాసం చేసే శక్తి లేని వారు కనీం ఒక్క కార్తీక పౌర్ణమినాడైనా వీటిని ఆచరిస్తే ‘కార్తీక పుణ్యఫలం’ లభిస్తుందని శాస్త్రోక్తి.

కార్తీక మాసంలో ఉపవాసం చేయడమంటే ఆహారం మానేసి ఆకలితో కాలం గడపడం కాదు. ఉప= భగవత్సమ-వాస= శరీరేంద్రియమనః ప్రాణదిభిః నివాసః ఉపవాసః అని అంటే “శరీరం, మనస్సు, ఇంద్రియాలు, ప్రాణాధి శక్తులు అన్నింటితో సహా భగవంతుని సమీపంలో ఉండడం అని అర్థం.”

చల్లని వెన్నెలలు హృదయోల్లాసాన్నిచ్చినట్లే పండుగలూ ఇస్తాయి. మన హైందవ సంస్కృతి, సాంప్రదాయం విశిష్టమైనది. చైత్రమాసం నుండి ఫాల్గుణ మాసం వరకు ప్రతి మాసం ఒక విశిష్టతను సంతరించుకోగా, ‘కార్తీక’ మాసం సంవత్సరములోని అన్ని మాసాల కంటే మహిమాన్వితమైనదిగా, ప్రశస్త్యమైనదిగా భావిస్తూ తరువాతి తరాలకూ చెప్పుకోవాలి.

October 25, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us