Home వ్యాసాలు ఉద్యమ సారధి 02

ఉద్యమ సారధి 02

by Vijaya Kandala

ఉద్య మాలకు పురుటి  గడ్డ  వరంగల్లు.  చరిత్ర కందని కాలం నుంచి ప్రజాఉద్యమా లు ఈ ప్రాంతంలో ఊ పిరి పోసుకున్నాయి . ఒక రంగం అని కాదు . శిల్ప కళ ,కవిత్వం నాట్యం ,నీటి పారుదల ,భవన నిర్మాణం మొదలుకొని సామాజిక ఉద్యమాల వరకు  ఎందరో కళా కారులను,ఉద్యమకారులను, నాయకులను అందించిన ఘనత ఈ ప్రాంతానిది.

 కాకతీయ  చక్రవర్తులయిన  గణపతి దేవుడు ,రుద్రదేవ మహారాజు , ప్రతాపరుద్రుడు మొదలుకొని బమ్మెర పోతన వంటి కవులు ,జాయప సేనాని వంటి యుద్ధ వీరుల వరకూ -ఆధునిక కాలంలో మాజీ ప్రధాని నరసింహ రావు గారు,కాళోజీ నారాయణరావగారు,,దాశరధి సోదరులు నేరెళ్ళ వేణు మాధవ గారు ఇలా ఎందరో వరంగల్లు ప్రాంతా నికే వన్నె తెచ్చారు . ఇలా ఎందరో . తెలియని మరెందరో .

ఈ  list ఇలా సాగిపోతూనే ఉంటుంది. ఆ గడ్డలో పుట్టిన ఓ మహానుభా వుని గురించి   గుర్తు చేసుకుందాం. వారే శ్రీ పెండ్యాల రాఘవ రావు గారు .  15 మార్చి 1917 నాడు  వరంగల్  జిల్లా లోని చిన్న పెండ్యాల  గ్రామంలో జన్మించారు .హై స్కూల్ చదువంత వరంగల్ లో సాగింది . బాల్యం గురించిన వివరాలు ఎక్కువగా దొరకట్లేదు . కానీ నూనూగు మీసాలు వచ్చినప్పటి నుంచి ప్రజాసంక్షేమమే ఆయన మాట,బాట ,గమ్యం కూడా .1935-36 నుండే మతమార్పిడులను  వ్యతిరేకించారు. అందులో భాగంగా హరిజన వా డలకు  వెళ్ళి ,వాళ్ళతో స్నేహం చేసి , నచ్చచెప్పే వారు . వారిలో నమ్మకం , విశ్వాసం కలిగించడానికి సహ పంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు . నిరక్షరాస్య తను పోగొడితే వారిలో మార్పు మరింత త్వరగా వస్తుందని , హరిజన  పాఠశాలను ప్రారంభించారు .

అగ్ర వర్ణాల పురుషులకే అరకొరగా వసతు లున్న ఆ రోజులలో హరిజనుల విద్య కోసం పాటుపడడం ఓ సాహసం . ఇలా ఎన్నో సాహసాలకు లకు ఆయన జీవితమే ఓ చిరునామా .

కుల వ్యవ స్థను  ఖండిస్తూ, పోరాడారు . ఆజంజాహీ  మిల్లు కార్మికులకోసం ఎన్నో ఉద్యమాలు నడిపారు.

తెలంగాణా  సాయుధ పోరాటానికి మూలం అ యిన విసునూరు పోరాటం లో ముఖ్య భూమిక వహించారు .

వెట్టి చాకిరీనీ నిరసించారు .

గుండాలను సంస్కరించారు .

రజాకార్  ఉద్యమానికి వ్యతిరేకంగా సుధీ ర్ఘ మైన    పోరాటం జరిపారు  .

1938 లో కాంగ్రెస్స్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు . కోపంతో బ్రిటిష్ ప్రభుత్వం జైలు శిక్ష తో బాటు 300 రూ  జరిమానా విధించింది. 90 సంవత్సరాల క్రితం 300 రు అంటే ఆలోచించండి . తర్వాతి కాలంలో ఆంధ్ర మహా సభలో చేరారు .1946 లో దాన్ని రద్దు చేసినప్పుడు ఆజ్యత వాసం  చేశారు . ఆయిన జీవితమే ఓ సాహసాల  పందిరి .

వితంతు వివాహాలతో  నైజాం రాజ్యంలో చైతన్యాన్ని జ్వలింప చేశారు .

గ్రం ధాలయ ఉద్యమం  లో పా లు పంచుకున్నారు .

ఎన్నికల్లో విజయం వారి జీవితంలో ఒక అధ్భుత ఘట్టం . ఈ రోజుల్లో ఎలక్షన్లలో గెలవడం కోసం అన్నీ పార్టీలు ,అందరు  అభ్యర్థులు

అనుచరుల సాయంతో వీధి వీధి తిరిగి వోట్లను అడుగుతున్నారు . వారికి ప్రజలపై నమ్మకంలేదు . అందుకే దేశ ఆర్థిక ప్రగతిని తలకిందులు చేసేలా తాయిలా లను  ప్రకటిస్తున్నారు . అలానే ఓటర్లకు  నాయకులపై నమ్మకం లేదు .  ఇచ్చినవన్నీ  పుచ్చుకొంటున్నారు . కొసరు కోసం  బేరసా రాలను  సాగిస్తున్నారు . ఫలితాలను ప్రకటించే వరకూ నేతలను టెన్షన్ లో  ముంచెత్తుతున్నారు . ఇ లాంటి వ్యవస్థలో ఉంటూ ఇదే నిత్యాసత్యమనే భ్రమలో బ్రతికేస్తున్నాం మనం . 1952 సాధారణ ఎ న్నికలలో  కమ్యూనిస్ట్ నాయకునిగా ఒక అపురూప రికార్డ్ ను సాధించారు . రాఘవరావు గారు వరంగల్ లోకసభ స్థానం తో బాటు హన్మకొండ ,వర్ధన్నపేట శాసన సభా  స్థానాలనుంచి పోటీ చేశారు . మూడింటి లోనూ గెలిచారు . వరంగల్ లోకసభస్థానానికి ప్రాతినిధ్యం వహించారు.

 అవునా?

అంతేకాదు . ఈ ఎన్నికలలో నామినేషన్ ను జైలు నుంచి వేశారు .

ఎందుకలా?

ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేసినందుకు అప్పటి ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలులో పెట్టింది . ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా జైలు నుంచి పోటీ చేసి గెలిచిన ప్రజనాయకునికి ప్రజల తీర్పు అది .

నిజంగానా ?

అంతేకాదు ఈ విజయం సాధిం చేనాటికి   ఆయన వయస్సు 35 ఏళ్ళే . దేశ చరిత్రలోనే ఇది అరుదైన రికార్డు . నా టి నుంచి ఒకేసారి 3 స్థానాల్లో పోటీ చేసి 3 చోట్ల గెలిచిన నేతలు ఇద్దరే . ఒకరు పెండ్యాల రాఘవరావు గారు ,మరొకరు నందమూరి తారక రామారా వు గారు .

అంటే

మీ అనుమానం  నిజమే . 1952 లో నెలకొల్పిన రికార్డ్ సమానం కావడానికి 33 సంవత్సరాలు పట్టింది.

రాఘవరావ్ గారిది ఆకర్షణీ యమైన విగ్రహం . ముఖంలో చెరగని చిరు మందహాసం . మాటల్లో చా తుర్యం ,చమత్కారం ఉట్టిపడేవి . సమాజం లోని  దుర్మార్గాన్ని ,అన్యాయాలను ప్రతిఘటించడానికి తీ వ్రవాదిగా  మరి తుపాకి పట్టినా , కంఠంలో కారుణ్యం ,మనసులో మానవతా తొణికిసలాడేవి.

,అత్యున్నత చట్టసభలో ఎన్నో కీలకమైన చర్చల్లో పా లుపంచుకున్నారు .  ఆయన ప్రసంగాలు శక్తి నిండిన  ప్రవా హాలు .

M P గా పని చేసినంత శ్రద్ధగా గ్రామ పంచాయితీ సర్పంచ్ గాను పని చేశారు. గ్రామ వికాసానికి తా  గు నీరు ,సాగునీరు, విద్యుత్ సౌకర్యం అతి ముఖ్య మైనవి . వీటి ప్రాధాన్యతను ఆనాడే గుర్తించి , కృషి చేసిన ప్రజానాయకుడు.

ఒక  ఉత్కృష్టమైన జీవితం తన కధనాన్ని తానే రాసుకుంటుంది అనడానికి గొప్ప ఉదాహరణ వారి ఆత్మ కథ . దాని పేరు నా ప్రజాజీవితం . ఆయనకు తన కన్నా ,తన కుటుంబం కన్నా ప్రజలంటేనే మక్కువఎక్కువ . అందుకే భగవంతుడు ఆయన ఆత్మకధను అసంపూర్తిగా ఆపేశాడు .

ఏ  నాయకుని జీవితము అసంపూర్తిగా మిగిలిపోదు . మరెన్ని  ఉద్యమాలకో ఊపిరి పోస్తుంది . మరేందరికో స్ఫూర్తినిస్తుంది.

అలాంటి త్యాగమూర్తుల కృషి  అనే  పునా దులపైనే మనమీ నాడు జీ విస్తున్నాము .

కొస మెరుపు 

మన ప్రియతమ సోదరి శ్రీమతి కొండపల్లి నీహరిణి గారు వీరి సుపుత్రికే . అవే లక్షణాలు వీరిలో  శా ఖో ప శాఖలై పుష్పించి, ఫలిస్తున్నవి  ఈ నాడు.

You may also like

Leave a Comment