సమాజం గాయపడినప్పుడల్లా కవిత్వాన్ని ఔషధంగా ప్రయోగించి, సామాజిక చైతన్యాన్ని కాంక్షించి సాధించిన మహాకవులు, మేధావులు ఎందరెందరో ఆధునిక తెలుగు సాహిత్యరంగంలో ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ నేలపై ఎంతోమంది మహాకవులు, చైతన్యవంతులు పుట్టి తమ సృజనాత్మకతాశక్తితో సాహిత్యరంగాన్ని సుసంపన్నం చేశారు. మహాకవులైన దాశరథి, సి. నారాయణరెడ్డి లాంటి వారి ప్రభావంతో యువకవులు కూడా కలంపట్టి జన్మతః వారిని అనుసరిస్తూ, వారి మార్గదర్శనంతో సాహిత్యరంగంలో కొత్త ఒరవడిని దిద్దిన కవులు ఉన్నారు. వారిలో వడ్డేపల్లి కృష్ణ ఒకరు. తెలంగాణ సాహితీరంగంలో నూతన శకాన్ని స్థాపించిన వారిగా ఆయన మనకు కనిపిస్తాడు.
1994లో పిహెచ్.డిలో చేరి ఆచార్య ఎస్వీ. రామారావు పర్యవేక్షణలో ‘తెలుగులో లలితగీతాలు’ అనే అంశం మీద పరిశోధన చేసి 1998లో డాక్టరేట్ పట్టా పొందారు. అది 2000 సం॥లో ‘‘తెలుగులో లలితగీతాలు’’ పుస్తకంగా వెలువడి, ప్రామాణిక గ్రంథంగా గుర్తింపు పొందింది.
వడ్డేపల్లి కృష్ణ లలితగీతాల మహాకవిగా, పరిశోధకుడిగా తెలుగునేలపైన ప్రసిద్ధులు. తన సాహిత్యకృషితో రాశిలో, వాసిలో తనకుతానై విస్తరించి, విశ్వవ్యాప్తమై ఎదిగారు. మాట వరుసకు మాత్రమే లలితగీతాల మహాకవి కానీ ఇవేగాక గేయనాటికలు, నాటకాలు, సినిమా పాటలు, నృత్యరూపకాలు, కథలు, భక్తిగీతాలు, లలితగీతాలు వంటి అనేక ప్రక్రియల్లో కృషిచేసిన రచయిత. సినిమాదర్శకులు కూడా. వడ్డేపల్లి కృష్ణ నాలుగు తరాల వారధి. మహాకవి సినారె సాహిత్య వారసత్వ సంపదలో పెన్నిధి, పుట్టిపెరిగిన ప్రాంతమే కాదు, ప్రక్రియల్లోను అడుగుజాడ సినారెది.
‘‘మానేరు నీరు మహిమో
మాతల్లి పాల మహిమో’’ అంటూ వివిధ సందర్భాల్లో సాహిత్య ప్రస్థానాన్ని గుర్తు చేసుకునే వడ్డేపల్లి తన సాహితీ ప్రవేశం చిన్నతనంలోనే చేశాడు. విద్యార్థి దశలోనే అనగా 6వ తరగతి చదువుతున్న రోజుల్లోనే శ్రీ కనపర్తి లక్ష్మీనరసయ్యగారు సినారెగారి ఏకైక నాటిక ‘‘సినీకవి’’లో (కథకుడు) తారాపతి పాత్రధారణ చేయించాడు. ఆ పాత్ర పోషణలో చిన్ననాటనే అప్పటి జిల్లా కేంద్రమైన కరీంనగర్లో (1960) పలువురి ప్రశంసలు అందుకున్నాడు. ఆనాటి నుండి అనేక రంగస్థల నాటకాలలోనేగాక దూరదర్శన్లో ‘స్త్రీ’, ‘మిస్టర్’ (సీరియల్స్) మరియు ‘మంచు తెరలు’, ‘వెన్నెలకాపురం’ మొదలైన నాటికల్లో నటించాడు.
గేయమనేది మాత్రాఛందోవిశేషం. వడ్డేపల్లి కృష్ణ సాహిత్యసంస్కారమంతా అతని గేయరచనలోనే కనబడుతుంది. అంతేకాదు ఆయన రచనల్లో అధిక భాగం గేయాలే. గురువులైన కనపర్తి లక్ష్మీనరసయ్య, నందగిరి అనంత రాజశర్మగార్ల ప్రోత్సాహంతో గేయఛందస్సును ఆకళింపు చేసుకొని కవితారచనను మొదలుపెట్టారు. నిరంతర సాధనతో, అధ్యయనంతో నిగ్గుతేలిన వీరి ప్రథమకవిత ‘‘ఎవడెరుగును?’’ అనే గేయం ‘స్రవంతి’ మాసపత్రికలో 1968 జూన్లో ప్రచురితమైంది.
‘‘అతని మనస్సునందలి
ఆంతర్యమ్మెవడెరుగును?
వీడిన ప్రేమికులలోని
బడబాగ్ని నెవడెరుగును?’’
సామాజిక స్పృహతో వడ్డేపల్లి రాసిన గేయమిది. ఇది తొలి గేయమైనా ఎంతో పరిణతి చెందినవారు రాసినట్లుగా ఉంది. ఇందులోని అభివ్యక్తి, పదప్రయోగవైచిత్రి, పైపైకి కనిపించే అందాల గురించి కాక లోలోపల ఉన్న వెతలను గురించి, కథలను గురించి ఈ గేయములో కళ్లకు కట్టినట్లు వివరించాడు. ‘‘చితికిన బ్రతుకులలోపలి వెతల గూర్చి ఎవడెరుగును?’ అన్న వాక్యం పాఠకుల్ని ఆలోచింపజేస్తుంది. గుండెల్ని ద్రవింపజేస్తుంది. 1969లో వీరి ప్రథమ ప్రబోధ గేయాలు ‘‘కనరా నీదేశం వినరా సందేశం’’, ‘‘వర్షించవేమేఘమా!’’ మొదలైన గేయాలు ఆకాశవాణిలో ప్రసారితమయ్యాయి.
1976లో ‘వెలుగొచ్చింది’ అనే నాటికను తెలంగాణ మాండలికంలో రచించి, దర్శకత్వం వహించి, కరీంనగర్ జిల్లాలో పలుమార్లు ప్రదర్శించి జిల్లా స్థాయి నాటిక పోటీలలో కూడా బహుమతులు అందుకున్నాడు. ఆయన వెలుగుమేడ (1976), గాంధీ గణాధిపత్యం (బాలల గేయనాటికలు-2015), రంగ తరంగాలు (రంగస్థల నాటికలు 2018) మొదలైన గేయనాటికలు రచించాడు. ఆయన ఆయా సందర్భాల్లో రచించిన గేయనాటికలెన్నో ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల్లో ప్రసారితమయ్యాయి. భక్తకవి పోతన, భాగ్యనగరం, వెలుగువెన్నెల మొదలైన నాటకాలు అముద్రితంగా ఉన్నాయి.
వడ్డేపల్లి కృష్ణ అనేక సంగీత నృత్యరూపకాల్ని రచించాడు. మొదటగా ‘వడ్డేపల్లి రూపకాలు’ అనే పేరుతో అనేక సంగీత నృత్యరూపకాలను సంపుటిగా వెలువరించాడు. ఇందులో స్వదేశీయం’, ‘విశ్వకళ్యాణం’, ‘వివానంది విజయం’, ‘ఆమ్రపాలి’, ‘మాతృదేవోభవ’, ‘పితృదేవోభవ’, ‘మహిళాభ్యుదయం’, ‘శ్రీకృష్ణదేవరాయలు’, ‘స్వర్ణభారతి’, ‘నృత్యభారతి’, ‘సంక్రాంతి లక్ష్మీ’, ‘ఉగాది వేళ-వసంతహేల’, ‘తెలుగు తేజ’, ‘అభినయం’, ‘చండాలిక’, ‘మానవత్వం’ వంటి రూపకాలు చేర్చాడు. ఎయిడ్స్ మీద కూడా ‘వెన్నెల వెలవెల’ అనే పేరుతో రూపకాలు రూపొందించాడు.
అలాగే వడ్డేపల్లి కృష్ణ మరొక సంగీతనృత్యరూపక సంపుటి అయిన ‘తెలంగాణ రూపకములు-త్రివిక్రములు’లో ఎక్కువగా తెలంగాణ నేపథ్యానికి సంబంధించినవే కావడం విశేషం. ఇందులోని తెలంగాణ వైభవం, తెలంగాణ పుణ్యక్షేత్రాలు, తెలంగాణ తేజోమూర్తులు, గోలకొండ, రామప్ప, కాకతీయ వైభవం, తరతరాల తెలంగాణ, యాదాద్రి వైభవం మొదలైనవన్నీ తెలంగాణ వేదికవే. అందుకే ఈ సంపుటికి ‘ తెలంగాణరూపకములు’ అనే పేరును స్థిరపరిచాడు. ఇదే సంపుటిలో సమాజంలోని అక్రమాల్ని, సమస్యల్ని ఖండిస్తూ విక్రమంగా సంస్కరించి మహానీయులుగా నిలిచిన ముగ్గురు త్రిమూర్తులు అయిన మహాత్మాజ్యోతి బాపులే, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్, భాగ్యరెడ్డివర్మ అని సంస్కర్తల జీవితచరిత్రలని సంగీత నృత్య రూపకాలుగా మలిచి ‘త్రివిక్రములు’ పేరుతో ఈ సంపుటిలో చేర్చడమైనది. మరొక సంగీత నృత్య రూపకమైన ‘బతుకమ్మ-జయజయహే తెలంగాణ’ సంపుటిని కూడా వడ్డేపల్లి కృష్ణ తెలంగాణ నేపథ్యంలోనే నడిపించాడు. ఈ విధంగా సమకాలీన సమాజంలో గతచరిత్రను, సంస్కృతిని, మానవీయ సంబంధాలను ఉదాత్రీకరిస్తూ రూపొందించిన ఈ రూపకాల్ని వేదిక మీద నృత్య, గాన, సంగీత సమ్మేళనంతో చూస్తే, అవి కొన్ని వందలరెట్లు ప్రభావితం చేస్తాయి అలరిస్తాయి. చైతన్యపరుస్తాయి. కావ్యానందం కలిగిస్తాయి. ఇంత వస్తువైవిధ్య పూరితంగా రాయడం వడ్డేపల్లి కృష్ణకే చెల్లింది.
వడ్డేపల్లి కృష్ణ చేసిన సాహిత్యసేవకు గాను ఎంతోమంది, ఎన్నో సంస్థలు ఆయనను బిరుదులతో గౌరవించారు. 1995లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం వారు ‘‘గౌతమీ కిరీటి’’ అనే బిరుదుతో సత్కరించారు. 1997లో కళాంజలి ఆర్ట్స్ వారు ‘‘బాలసాహిత్య రత్న’’ అనే బిరుదుతో, 2004లో అమెరికా ఆటా సంస్థవారు ‘లలితశ్రీ’ అనే బిరుదుతో, 2012లో తెలంగాణ భాషా పరిరక్షణ సమితి వారు ‘‘లలితగీత ప్రపూర్ణ’’ బిరుదు. 2014లో గ్రేటర్కన్యాస్ సిటీ తెలుగు అసోసియేషన్ వారు ‘కవనప్రజ్ఞ’ అనే బిరుదు. 2015లో భారత్ కల్చరల్ అకాడమీ వారు ‘కవి శిరోమణి’ అనే బిరుదుతో, 2016లో హ్యూస్టన్ తెలుగు అసోసియేషన్ వారు ూఱఙఱఅస్త్ర ూవస్త్రవఅస శీట ూఱస్త్రష్ట్ర్ ూశీఅస్త్రం అనే బిరుదులతో, 2018లో వంశీ ఆర్ట్స్ థియేటర్స్ వారు ‘కళారత్న’ అనే బిరుదులతో గౌరవంగా సత్కరించారు.
వ్యాసాలు
డాక్టర్ కె.జి. వేణు రచించిన 10) మినీ కవితల పై విశ్లేషణా వ్యాసాలు.
ప్రముఖ కవి,డాక్టర్ కె.జి.వేణు రచించిన విశ్వాసం గెలుపు మినీ కవిత. విశ్వాసం అంటే ఒక వ్యక్తిపై నమ్మకం కలిగి ఉండడం.ఆత్మవిశ్వాసం అంటే తనపై నమ్మకం.ఒక నిర్దిష్టమైన పని లేదా లక్ష్యాన్ని సాధించగలను అని తన సామర్థ్యంపై నమ్మకం కలిగి ఉండడం విశ్వాసం. గెలుపు అంటే విజయం.ఏదైనా పోటీలో విజయం సాధించడం గెలుపు.పోటీలో నెగ్గుట గెలుపు. ఓడిపోకుండా ఉండటం గెలుపు.విశ్వాసం,గెలుపు చాలా లోతైన అర్థాన్ని ఇస్తుంది.ఇది వ్యక్తిగత జీవితంలోను,వృత్తిపరమైన విజయాలలోను అన్ని రంగాల్లో కనిపిస్తుంది.విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అనేది మనం ఎంచుకున్న మార్గంపై అవిశ్రాంతంగా నమ్మకంతో ముందుకు సాగడం.ఇది నమ్మకం మరియు పట్టుదలతో సాగాలి.ఎందుకు విశ్వాసం గెలిపిస్తుంది?ఏ పని చేసినా మధ్యలో ఆటంకాలు వస్తాయి.విశ్వాసం ఉంటే ఆ ఆటంకాలను అధిగమించి విజయాలు సొంతం అవుతాయి.సందేహాలు,భయాలు మన ప్రయాణాన్ని నిలిపివేస్తాయి.విశ్వాసం ఉంటే లక్ష్యం ఎప్పుడు మన కళ్ళ ముందు కదలాడుతుంది.మనం ఏదైనా గొప్ప పని చేయాలంటే మన మీద మనకు అపారమైన నమ్మకం ఉండాలి.అదే గెలుపునకు మార్గం చూపుతుంది.జీవితంలో ఎన్నోసార్లు మనం విఫలమవుతాం.మనపై మనకు విశ్వాసం ఉంటే మళ్లీ లేచి ప్రయత్నిస్తాం.విజయం ప్రతి ఒక్కరికి సమానంగా అందుబాటులో ఉంటుంది.చిత్తశుద్ధితో ప్రయత్నించే వారు మాత్రమే విజేతలు అవుతారు. మనం నమ్మిన ఆశయాల పట్ల విశ్వాసం ఉంటే ఖచ్చితంగా గెలుపు మనదే అవుతుంది.కవి డాక్టర్ కె.జి.వేణు రచించిన విశ్వాసం గెలుపు కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతుల లోకంలో విహరించండి. ”మైదానంలో పరుగు పందెం/మనిషికి కుక్కకు మధ్య పోటీ/ఇది ఒక ఉత్కంఠ భరితమైన పోటీని సూచిస్తుంది.మైదానం అంటే ఇక్కడ ప్రపంచాన్ని లేదా మనుషుల జీవిత రాటాలను సూచించవచ్చు.మనిషికి కుక్కకు మధ్య పోటీ.ఇది ఒక సరళమైన కవితా పంక్తి.ఇందులో మనిషి మరియు శునకం నైజం మధ్య గల తేడాను సులభంగా గుర్తించవచ్చు. ”శునకం సునాయాసంగా గెలిచింది/శునకం పోటీలో సులభంగా గెలవడం,దాని సహజమైన నైపుణ్యాన్ని, శక్తిని,ఏకాగ్రతను తెలుపుతుంది. ”కారణాన్ని వెతికితే దొరికింది/కుక్క విశ్వాసం మనిషిని జయిస్తూ../ఇది మనలో జిజ్ఞాసను కలిగిస్తుంది.ఎందుకు శునకం గెలిచింది?కుక్క విశ్వాసం మనిషిని జయించింది.ఇది అసలు సందేశాన్ని వెల్లడిస్తుంది.మనిషి ధీమాగా ఉన్నాడు. మనిషి తనలోని స్వార్థంతో,అహంకారంతో తాను ఎలాగైనా గెలుస్తాను అనే ఆలోచనలతో ముందుకు సాగుతున్నాడు.కుక్క మాత్రం తన లక్ష్యంపై గురి పెట్టింది.స్వార్ధం ఎరుగని కుక్క విశ్వాసంతో పరుగు తీసింది.కుక్క నిబద్ధత,అంకితభావం,దృఢమైన విశ్వాసంతో గెలిచింది.ఈ కవితా పంక్తులు మనిషి జీవితానికి విలువైన సందేశాన్ని అందిస్తాయి. విజయం కోసం శక్తి,బుద్ధి మాత్రమే కాకుండా విశ్వాసం,అంకితభావం మరియు నిజాయితీ అవసరం అని సూచిస్తుంది.మనిషికి తనలో సందేహాలు,భయాలు ఉంటాయి.కానీ,కుక్క తన లక్ష్యాన్ని మాత్రమే చూస్తుంది.అదే దాన్ని విజేతగా నిలబెడుతుంది.కవి వేణు విశ్వాసం గెలుపు కవిత ద్వారా లోతైన భావాన్ని అందించారు.

డాక్టర్ కె.జి.వేణు రచించిన ఆకాశానికి నైవేద్యం (మినీ కవిత) పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
“కోతికి బట్టలు తొడిగారు/చప్పట్లతో వీధిలో వినోదం/
అంటున్నారు.లోకంలోని మనుషుల తీరు గురించి చెబుతున్నారు.కోతికి బట్టలు వేయడం అవసరం లేదు.మనుషులమైన మనం బట్టలు వేసుకోవాలి. కోతికి బట్టలు వేసి వినోదంగా చూసే మనుషుల గురించి చెబుతున్నాడు.పాశ్చాత్య దేశాల సంస్కృతి ప్రభావం మన దేశంలోకి వ్యాపించింది.కోతికి బట్టలు తొడగడం,ఆడంబరాన్ని చాటుకోవడం,వ్యర్థ వినోదం అని సూచించవచ్చు.కోతికి బట్టలు వేసిన ఆనందంలో ప్రజలు చప్పట్లు కొడతారు.ఇది సమాజంలో ఉన్న విలాస వ్యామోహాన్ని తెలుపుతుంది.సమాజంలో నెలకొన్న అసలైన మౌలిక సమస్యలు పట్టించుకోకుండా కోతులకు బట్టలు వేసి ఆనందించే మానసిక స్థితిని తెలియజేస్తుంది.
“అక్కడ ఓ పిల్లాడు దీనంగా/ఒంటిమీద చొక్కా లేక ఏడాదిగా/వొంటిని ఆకాశానికి నైవేద్యంగా/ అంటున్నారు.కోతికి బట్టలు వేసి ఆనందిస్తున్న తీరును కవి ప్రశ్నిస్తున్నాడు.ఇదే సమాజంలో నివసిస్తున్న ఒక నిరుపేద బాలుడు నిరాశగా ఒంటిమీద చొక్కా లేక ఏడాది కాలం గడిచింది. పేదరికంతో ఆ నిరుపేద బాలుడు వేసుకోవడానికి బట్టలు లేని స్థితి కొనసాగుతుంది.ఆ బాలుడు కనీస అవసరాలైన చొక్కా లేకుండా గడపడం బాధను కలిగిస్తుంది. . ”వొంటిని ఆకాశానికి నైవేద్యంగా/అంటున్నారు.ఈ దేశంలో వేసుకోవడానికి బట్టలు లేక ఆ బాలుడు తన శరీరాన్ని ఆకాశానికి నైవేద్యంగా అర్పించినట్లు తోస్తోంది.ఇది తీవ్రమైన పేదరికం,మనుషుల మధ్య వ్యత్యాసాన్ని హృదయ విదారకంగా చూపుతుంది. ఈ కవిత సమాజంలోని కొందరు పెద్ద మనుషుల విపరీత ప్రవర్తనను,ఆడంబరాన్ని ఘాటుగా విమర్శిస్తుంది.అలాగే నిరుపేదల దుస్థితి ఆవేదన కలిగిస్తుంది.ఒక వైపు కోతికి బట్టలు తొడిగేంత సంపద,వినోదం,మరోవైపు కనీస వస్త్రాలు లేని బాలుడు కనిపిస్తాడు.ఇది మన సామాజిక అసమానతలపై కవి పదునైన ప్రశ్నను సంధించారు. ఆకాశానికి నైవేద్యం అనే ఉపమానం లోతైన భావాన్ని వ్యక్తం చేస్తుంది.నైవేద్యం అంటే దేవుడికి సమర్పించే ప్రసాదం.ఒక వ్యక్తి బట్టలు లేక ఒంటి మీద ఏమీ లేకపోతే అతని శరీరం పూర్తిగా బయటికి కనిపిస్తుంది.ఆకాశానికి నైవేద్యం అనేది అతని బట్టలులేనితనాన్ని కవ్వించే విధంగా ఉపయోగించబడింది.ఒక వైపు ప్రజలు కోతికి బట్టలు వేస్తూ వినోదం చూస్తుంటే మరో వైపు ఆ బాలుడు తన దారిద్ర్యాన్ని అంగీకరించినట్లుగా, శరీరాన్ని ఆకాశానికి అర్పించినట్లుగా ఉంటాడు.ఇది సమాజంలో నెలకొన్న తీవ్రమైన అసమానతలను తెలియజేస్తుంది.మనిషికి భూమి,ఆకాశం,ప్రకృతి తప్ప మరో ఆశ్రయం లేకపోవడం,అతను వాటికి అర్పించబడి జీవించడం అనే భావన దాగి ఉంది. ఆకాశానికి నైవేద్యం అనేది పేదరికం,సమాజపు ద్వంద్వ ధోరణి,అసమానతలు,జీవన తాత్వికత ఇందులో అనేక కోణాలను కలిగి ఉంది.కవితలో ఇది ఒక వ్యంగ్య ప్రయోగంగా మనుషుల ఉదాసీనతపై ఒత్తిడి కలిగించే విధంగా ఉపయోగించబడింది.
డాక్టర్ కె.జి. వేణు రచించిన ఆ సంతకాలు ప్రమాదం మినీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
“భూమి,ఆకాశాల మీద/సామాన్యుడి హక్కుకు/ శ్వేత పత్రం రాసే సిరా చుక్క “ప్రశ్న”/అంటున్నారు. ఈ కవితా పంక్తులలో ప్రశ్న యొక్క శక్తిని మరియు సామాన్యుడి హక్కులకు అది కలిగించే ప్రాముఖ్యతను చక్కగా వివరించారు.శ్వేత పత్రం అనేది ఒక నివేదిక లేదా గైడ్.ఇది పాఠకులకు ఒక సమస్యను అర్థం చేసుకోవడానికి సమస్యను పరిష్కరించడానికి లేదా నిర్ణయం తీసుకోవడానికి సహాయపడటానికి ఉద్దేశించబడింది.ఇక్కడ భూమి,ఆకాశం,సమాజంలో ఉన్న సామాన్యుడికి చెందిన హక్కులను సూచిస్తాయి.సామాన్యుడికి స్వేచ్ఛ,సమానత్వం,న్యాయంలాంటి హక్కులు ఉన్నాయి అని బల్లగుద్ది చెబుతున్నారు.శ్వేత పత్రం రాసే సిరా చుక్క ప్రశ్న.ఇక్కడ ప్రశ్న ఒక సిరా చుక్కగా సూచించబడింది. ప్రశ్నించడం ద్వారానే నిజాలు వెలుగులోకి వస్తాయి.
“మేధావులు మాత్రం ప్రశ్నకు దూరంగా/చెదకు దగ్గరగా సంతకాలు చేస్తూ ../అంటున్నారు.సత్యాన్ని వెతకాల్సిన మేధావులు మాత్రం ప్రశ్నించకుండా మౌనం పాటిస్తున్నారు. చెదకు నాశనం చేసే గుణం ఉంటుంది.చెదను ఇక్కడ చెడిపోయే ప్రాతినిధ్యంగా ఉపయోగించారు.చెడుపై తిరుగుబాటు చేయాల్సిన మేధావులు అన్యాయాలు,అక్రమాలు,అవినీతికి అనుకూలంగా వ్యవహరిస్తూ నిశ్శబ్దంగా ఆమోద ముద్ర వేస్తున్నారు అని కవి సుతిమెత్తగా విమర్శించారు.సామాన్య ప్రజల హక్కులను రక్షించడంలో ప్రశ్నించాల్సిన అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.ప్రశ్నించే గుణం సామాన్యుడికి సత్యాన్ని తెలుసుకునే సాధనం.మేధావులు తమ బాధ్యతను వదిలేసి నిశ్శబ్దంగా అంగీకరిస్తున్నారని కవి వాపోతున్నారు. మేధావులు ప్రశ్నించకుంటే సమాజంలో అన్యాయం,అవినీతి, అక్రమాలు పెరిగిపోతాయి.ఆ సంతకాలు ప్రమాదం అనే కవితా శీర్షిక లోతైన అర్ధాన్ని కలిగి ఉంది.ఇది ముఖ్యంగా మేధావుల నిశ్శబ్ద అంగీకారాన్ని,వ్యతిరేకించాల్సిన దానికి మద్దతు ఇవ్వడాన్ని,తప్పు జరిగితే ప్రశ్నించకుండా ఉండటాన్ని సూచిస్తుంది.మేధావులు తమ ఆలోచనా శక్తిని ఉపయోగించి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.అలాంటి మేధావులు ప్రశ్నించడం మానేసి తప్పును అంగీకరించే విధంగా సంతకాలు చేయడం ప్రమాదం.ఇది కేవలం సంతకానికే మాత్రం పరిమితం కాదు.కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని చూసి చూడనట్లుగా ఉండడం,అన్యాయం జరిగిందని తెలిసినా స్పందించక పోవడం,దానికి మౌనంగా ఉండటం,ఒక రకమైన ప్రమాదం కల్గించే సంతకమే.మేధావుల మౌనం అంగీకారం కిందికి వస్తుంది.అది న్యాయ పోరాటాన్ని నిలిపివేస్తుంది.చెద అనేది నాశనం చేస్తుంది.మేధావులు సత్యం పక్కన పెట్టి అన్యాయపు వ్యవస్థకు మద్దతుగా సంతకాలు చేయడం సమాజాన్ని ప్రమాదంలో పడేస్తుంది. తప్పును ప్రశ్నించకుండా ఉండటం,దానిని అంగీకరించడం అత్యంత ప్రమాదకరం.ఇది సమాజంలో ఉన్న అన్యాయాలను మరింత బలపరిచే అవకాశం ఉంది. అందుకే ఆ సంతకాలు ప్రమాదం అని చెప్పిన తీరు బాగుంది. మేధావులు ప్రశ్నించడం,ధైర్యంగా నిలబడటం అవసరం అనే బలమైన సందేశాన్ని కవి అందిస్తున్నారు.
డాక్టర్ కె.జి.వేణు రచించిన తెలిస్తే చెప్పండి మినీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
తెలిస్తే చెప్పండి (మినీ కవిత)
“ఆమె కోసం వెతుకుతున్నారు/చూస్తే,దేశం నిండా ఆమె బూడిదే/ఎవరు తగులబెట్టారో తెలియదు/ కన్నీళ్లతో వేడుకుంటున్నాను/తెలిస్తే చెప్పండి .. ఆమె పేరు ‘శాంతి’/ఈ కవిత భావోద్వేగభరితంగా హృదయాన్ని కదిలించేలా ఉంది.దీన్ని విభిన్న కోణాల్లో విశ్లేషించవచ్చు.వ్యక్తిగత వేదన,సామాజిక పరిస్థితులను ప్రతిబింబించే ఒక సామూహిక బాధ అని వ్యక్తం అవుతుంది.
“ఆమె కోసం వెతుకుతున్నాను/చూస్తే,దేశం నిండా ఆమె బూడిదే/అంటున్నారు.వ్యక్తిగతంగా తాను ఆమె కోసం వెతుకుతున్నట్లు చెబుతున్నారు.ఇది కోల్పోయిన ప్రియమైన వ్యక్తి కోసం వెతుకుతున్న వేదన కావచ్చు.సమాజంలో లేకుండా పోయిన ఒక విలువైన అంశాన్ని వెతుకుతున్నట్టుగా భావించ వచ్చు.ఇది ఒక వ్యక్తిగతమైన కోరికలా అనిపించి నప్పటికీ సమాజానికి సంబంధించిన సమస్య అని అర్థం అవుతుంది. చూస్తే దేశం నిండా ఆమె బూడిదే/ఇది చాలా శక్తివంతమైన భావ చిత్రం.ఇది గాఢమైన భావనను వ్యక్తం చేస్తుంది.ఇది నాశనాన్ని సూచిస్తుంది.దేశం నిండా అనే పద ప్రయోగం ఆమె మరణాల వ్యక్తిగత ఘటన మాత్రమే కాదు.ఇది సమాజాన్ని ప్రభావితం చేసే సంఘటన.దహనం చేయబడిన శరీరం బూడిదగా మారుతుంది. కవి బూడిదను రూపకంగా మరియు శాంతి నశించడాన్ని సూచించేందుకు వాడి ఉండవచ్చు.నాకు దేశమంతటా ఆమె బూడిద మాత్రమే కనిపిస్తుంది. ఈ కవితా పంక్తిలో ఆమెను ఎవరో తగులబెట్టారు. కానీ,అది వ్యక్తిగత హింస మాత్రమే కాదు.దేశం మొత్తానికి చెందిన విషాదం.బూడిద అంటే విధ్వంసానికి సంకేతం.ఇది యుద్ధం,అల్లర్లు, సామూహిక విధ్వంసాన్ని సూచించవచ్చు.
“”ఎవరు తగులబెట్టారో తెలియదు/అంటున్నారు.ఇది అత్యంత బాధాకరమైన విషయం.ఈ విధ్వంసాన్ని సృష్టించింది ఎవరో తెలియదు?ఇందుకు బాధ్యత ఎవరిది?ఇది సమాజంలో నెలకొన్న అనిశ్చితిని తెలియజేస్తుంది. బాధ్యులు ఎవరో తెలియకపోవడం వంటి పరిస్థితిని సూచిస్తుంది.ఎవరు ఆమెను నాశనం చేశారో తెలియదు?ఎవరు శాంతిని భగ్నం చేశారో తెలియదు?ఇది యుద్ధం,హింస,అశాంతికి సంకేతం కావచ్చు. నేరం చేసిన నేరస్తులు ఎవరో తెలియక పోవడం సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తుంది.
“కన్నీళ్లతో వేడుకుంటున్నాను/అంటున్నారు.కవి బాధలో మునిగిపోయి సహాయం చేయమని కోరుతున్నారు.దీనిలో ఒక బాధితుని ఆవేదన మాత్రమే కాక న్యాయం కోసం చేసే విజ్ఞాపన కూడా ఉంది.ఇది ఒక అభ్యర్థన,ఒక అశాంతి నడుమ మానవత కోసం చిత్తశుద్ధితో చేసిన ప్రార్థన.
తెలిస్తే చెప్పండి .. ఆమె పేరు ‘శాంతి’/అంటున్నారు. చివరకు కవి ఆమె పేరు శాంతి అని వెల్లడిస్తున్నారు. ఇది కవితలో అసలు మర్మం.కవి మానవ సమాజంలో శాంతి కోసం వెతుకుతున్నారు. కానీ, దాని స్థానంలో బూడిద మాత్రమే కనిపిస్తోంది.ఇది వ్యక్తిగత కోణాన్ని మించి సమాజంలోని నాశనమైన శాంతికి ప్రతీకగా మారుతోంది.ఇందులో శాంతి అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు.దేశంలో కనుమరుగైన ప్రశాంతతను,హింసకు బలైన సామాజిక స్థితిని సున్నితంగా వ్యక్తీకరించారు.ఈ కవిత వ్యక్తిగతంగా ప్రారంభమైనా అంతకు మించిన సామాజిక సందేశాన్ని అందిస్తుంది.ఇందులో ఉన్న శాంతి అనే పేరు ద్వంద్వ అర్ధాన్ని కలిగి ఉంది. నిజంగా ఒక వ్యక్తి పేరు శాంతి అయి ఉండొచ్చు. ఇందులో శాంతిని ఒక రూపకంలా ఉపయోగించారు. ఇది యుద్ధం వల్ల జరిగిన విధ్వంసం,సమాజంలో శాంతి మాయం అవుతున్న దుస్థితిని సూచించే సామాజిక విమర్శగా కూడా భావించవచ్చు.కవి చివరి పంక్తిలో శాంతి పదాన్ని ఉపయోగించడం ద్వారా అందరికీ ఆలోచన కలిగించేలా చేశారు. ఇక్కడ శాంతి అనేది ఒక వ్యక్తి మాత్రమేనా?లేక ప్రపంచం కోల్పోయిన శాంతి అనే విలువా?ఈ కవిత పాఠకుల హృదయాన్ని కదిలించేలా ఆసక్తికరంగా సాగింది,ఇది వాస్తవిక సంఘటన,నష్టపోయిన శాంతి,హింస వలన కలిగిన బాధ, సమాజంలోని అనిశ్చితిని ప్రతిబింబిస్తుంది.ప్రజల సామాజిక చైతన్యానికి అద్దంపడుతుంది.సమాజంలో ప్రశాంతతను పునరుద్ధరించాలి అని కోరడం ఒక ఆవేదనగా భావించవచ్చు.
డాక్టర్ కె.జి.వేణు రచించిన వాయిదాలెందుకు?మినీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
“ఆడతనం గడప దాటితే చాలు/వేధిస్తూ మానభంగం ఉరి త్రాళ్ళు/అంటున్నారు.మహిళ ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడాన్ని గడప దాటడం అంటారు.సమాజంలో ఇప్పటికీ మహిళలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు.మహిళలు ఇంటి నుంచి బయటకు వస్తే పోకిరీలు వేధింపులకు, మానభంగానికి పాల్పడుతున్నారు.దుర్మార్గుల అఘాయిత్యాలకు గురి అయిన స్త్రీలు అవమానం భరించలేక అర్ధాంతరంగా తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ఈ కవితా పంక్తులు మహిళలపై జరుగుతున్న వేధింపులను,అత్యాచారాలను సూచిస్తున్నాయి.సమాజంలో మహిళలు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా లైంగిక వేధింపులు ఒక పెద్ద సమస్యగా మారింది.
“కామం ఈ దేశంలో నదులై ప్రవహిస్తోంది/ సమాజంలో అనైతికత హద్దులు మీరిపోయింది. మానవ సంబంధాల్లో విలువలు తగ్గిపోతున్నాయి. దుర్మార్గులు కామదాహంతో మానవతా విలువలను మంటగల్పుతున్న పరిస్థితి ఈ దేశంలో నదిలా విస్తరించింది అని కవి ఆవేదనతో వాపోతున్నారు.
“అరాచకానికి అడుగడుగునా గొడుగులు/ అన్యాయానికి,అసాంఘిక చర్యలకు సహకరిస్తున్న పరిస్థితిని సూచిస్తుంది.దోషులను రక్షించే విధానాలు,న్యాయస్థానంలో శిక్షలు ఆలస్యం అవటంలాంటి సంఘటనలు అరాచకానికి బలాన్ని అందిస్తున్నాయి.
“దుష్ట సంహారానికి అన్ని వాయిదాలే/నేరస్తులకు తగిన శిక్ష పడకుండా న్యాయవ్యవస్థలో జాప్యం జరుగుతుండడం వల్ల దుష్టులను శిక్షించడం ఆలస్యం అవుతుంది.మన సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు,లైంగిక వేధింపులకు చరమగీతం పాడాలి.అత్యాచారాలు చేస్తున్న నేరస్తులకు శిక్షలు ఆలస్యం కావడం బాధను కలిగిస్తుంది.దుర్మార్గుల విశృంఖల చేష్టలకు అడ్డుకట్ట వేయాలి.సమాజంలో మార్పు రావాలి.ఈ దేశంలో మహిళలకు రక్షణ కల్పించాలి.సత్వర న్యాయానికి పునాది వేయాలి.మహిళలను వేధించిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి.అప్పుడే సమాజ ఉన్నతికి వీలు కలుగుతుంది.ఈ కవిత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిబింబిస్తుంది.
డాక్టర్ కె.జి.వేణు రచించిన కొత్త గీతాలు పాడండి కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
“అత్యాచారం అబలమీద కాదు/నేరుగా ఈ దేశానికే జరిగింది/అంటున్నారు.ఈ కవితా పంక్తి అత్యంత ప్రభావశీలమైనది.సాధారణంగా,లైంగిక దాడి బాధితురాలిని మాత్రమే ప్రభావితం చేస్తుంది అని భావిస్తారు.కానీ,కవిత ఇక్కడ విస్తృత భావనను ప్రతిపాదిస్తోంది.అత్యాచారానికి గురి అయిన బాధితురాలి వ్యక్తిగత నష్టం మాత్రమే కాదు.ఇది దేశానికి జరిగిన అవమానం.ఒక మహిళపై జరిగిన దాడి అంటే సమాజం తన విలువలను కోల్పోయింది అని తెలిపే సంకేతంగా కనిపిస్తోంది.
“ప్రతి వొంటి మీద ఆ రక్తపు మరకలే/ఇది తీవ్రమైన వాస్తవాన్ని వెల్లడించే కవితా పంక్తి.అబల మీద జరిగిన లైంగిక హింసను సమాజం ఏకపక్షంగా చూసి బాధితురాలిని ఒంటరిగా విడిచిపెట్టడం సాధారణం. కానీ,కవి ప్రతి ఒక్కరి మీద ఈ నేరం తాలూకు మచ్చ ఉందని అంటున్నారు.ఇలాంటి లైంగిక దాడి సంఘటనలు జరగడానికి సమాజమే బాధ్యత వహించాలి.
“సారే జహాసే అచ్చా … అబద్ధమది/అంటున్నారు.
ఇది భారతదేశానికి సంబంధించిన దేశభక్తి గీతం.
కవి సారే జహాసే అచ్చాని వ్యంగ్యంగా ఉపయోగించారు.ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం?ఇది ఎలాంటి న్యాయం?అనే ప్రశ్న లేవనెత్తుతుంది.ఈ దేశం గొప్పది అని చెప్పుకోవడమే కాదు.ఈ దేశంలోని మహిళలకు రక్షణ కల్పించగలిగితేనే అది నిజమైన గొప్పతనంగా భావించ వచ్చు.
“వనిత కన్నీళ్ళతో కొత్త గీతాలు పాడండి/ అంటున్నారు.కవి ఇది ప్రజలకు చేసిన విజ్ఞప్తిగా అనిపిస్తోంది.మహిళల బాధను అర్థం చేసుకొని,ఒక కొత్త సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది అని సూచిస్తుంది.ఈ కవిత కన్నీళ్లను కేవలం దుఃఖానికి ప్రతీకగా చూపించకుండా,చైతన్యానికి కొత్త మార్గాన్ని సూచించే ప్రక్రియగా అభివర్ణిస్తోంది.మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను కేవలం వ్యక్తిగత సమస్యగా కాకుండా దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని అవమానించే దుర్ఘటనలుగా అర్థం చేసుకోవాలి అని కవి స్పష్టం చేస్తున్నారు.మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు,దారుణ దురంతాలకు సమాజం బాధ్యత వహించాలి.అప్పుడే మనం నిజమైన అభివృద్ధిని సాధించగలం అనే ధ్వని ఇందులో వినిపిస్తుంది.ఈ కవిత సామాజిక చైతన్యాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన సందేశాన్ని కలిగి ఉంది.ఇది మహిళలపై జరిగే అత్యాచారాలను వ్యక్తిగత సమస్యగా కాకుండా సమాజానికి,దేశానికి జరిగిన అవమానంగా చూపిస్తుంది.
డాక్టర్ కె.జి.వేణు రచించిన అంగట్లో ఊపిరాడక మినీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
“బిగించిన సీసాల్లో ఊపిరాడక/నీరు రుచిని కోల్పోతుంది/అంటున్నారు.ఇక్కడ నీరు స్వభావసిద్ధమైన స్వేచ్ఛను సూచిస్తుంది.బిగించిన సీసాలో నీరు బంధనాన్ని సూచిస్తుంది.నీటిని ఒక బాటిల్ లో నిల్వ చేస్తే అది కాలక్రమేణా తన సహజ స్వభావాన్ని కోల్పోతుంది.ఒక వ్యక్తిని లేదా సమాజాన్ని నియంత్రించినప్పుడు వారి స్వేచ్ఛ క్రమంగా తగ్గిపోతుంది.
“తాను సరుకై అంగట్లో చేరాక/మనిషి దాహం తీర్చే గుణాన్ని/ ధరల వురికి వ్రేలాడదీస్తూ../ అంటున్నారు.మనిషి దాహం తీర్చే నీరు ఒక వస్తువుగా మారి అంగడికి చేరిన తర్వాత దాని విలువను ధరతో కొలుస్తారు.ఇది మనుషుల జీవితాన్ని ప్రతిబింబించే విధంగా ఉంది.స్వేచ్ఛగా జీవించే మనిషి సమాజపు ఆంక్షల వల్ల ఒక వస్తువుగా మారిపోతాడు.ఇక్కడ ఆ వ్యక్తిని విలువలు నిర్ణయిస్తాయి.కానీ,మనిషి తన అసలు స్వభావాన్ని పట్టించుకోడు.ఈ కవితలో స్వేచ్ఛా బంధనాలు,మార్కెట్ మరియు విలువల గురించి లోతైన సందేశాన్ని అందిస్తుంది.మనిషి స్వేచ్ఛను కోల్పోయి ఒక వస్తువుగా మారిపోయినప్పుడు అతని అసలు విలువ కేవలం ధనంతో మాత్రమే కొలువబడుతుంది.ఈ కవితా పంక్తులలో లోతైన
అంతరార్థం దాగి ఉంది.కవి సమాజంలోని వాస్తవికతను ఎత్తిచూపుతున్నారు.
డాక్టర్ కె.జి.వేణు రచించిన మట్టిగా మారిపోతూ .. మినీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
“వర్షంలో అతడు తడుస్తూ ../నేలకొరిగిన వృక్షాల గాయాలకు/ లేపనాలతో చికిత్స చేస్తున్నాడు/ అంటున్నారు.వర్షంలో తడవడం అనేది అతని జీవితంలోని కష్టాలను,అవాంతరాలను సూచిస్తుంది.వర్షంలో తడుస్తూ ఉండడం అనే పదం శారీరక,మానసిక బాధలను తెలియజేస్తుంది.ప్రకృతి విపత్తుల వల్ల నేల కూలిన వృక్షాల గాయాలకు చికిత్స చేస్తున్నాడు.అది ఒక metaphor రూపకంగా కనిపిస్తుంది.ఇది మానవతా విలువల పునరుద్ధరణ తత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
“రేపటి నీడకు అండగా తాను/భవిష్యత్తు తరాలకు తాను చెట్ల వలె ఆధారంగా ఉండాలి అనే భావాన్ని తెలుపుతుంది.చెట్లు నీడను ఇస్తాయి.పండ్లను ఇస్తాయి.అలాగే తాను కూడా భవిష్యత్తులో ప్రయోజనకరమైన పనులు చేయాలి అనే భావన వ్యక్తం అవుతుంది.
“మనిషిగా కాదు మట్టిగా మారిపోతూ../ అంటున్నారు.ఇది చాలా శక్తివంతమైన ఉపమానం. అతడు వ్యక్తిగతమైన లాభాలను ఆశించకుండా మట్టిగా మారిపోతాను అనే సందేశం ఉంది.నేల, భూమిని మట్టి అంటారు.భూమి పరిపూర్ణమైన త్యాగానికి ప్రతీక.ఈ కవితలో మనిషి త్యాగాన్ని ప్రకృతిలో అతడి మమేకతను భవిష్యత్తు తరాలకు సహాయపడే విధంగా జీవించాలి అనే గొప్ప భావం వ్యక్తం చేశారు.తాను ఒక వ్యక్తిగా కాకుండా భూమిగా ప్రకృతిగా మారి సమాజానికి ఉపయోగపడాలని భావిస్తున్నాడు.
డాక్టర్ కె.జి.వేణు రచించిన త్యాగాల మేఘాలు మినీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
“వర్షం కురుస్తోంది సువాసనతో/వెంటనే బకెట్లో నింపుకున్నాను/అంటున్నారు.వర్షానికి ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది. ముఖ్యంగా భూమిపై వర్షం పడినప్పుడు వచ్చే మట్టి వాసన మనసుకు హాయి గొల్పుతుంది.కవి ఈ వర్షాన్ని కేవలం ఒక సాధారణ ప్రకృతి సంఘటనగా కాకుండా ఆహ్లాదకరమైన అనుభూతిగా భావిస్తున్నారు. వెంటనే బకెట్లో నింపుకున్నాను అనే భావన కవి భౌతికంగా ఆ వర్ష జలాలను బకెట్లోకి సేకరించారు అని చెప్పవచ్చు.భావ ప్రపంచంతో చూస్తే కవి ఈ అనుభూతిని తమ హృదయంలో నింపుకున్నట్టుగా భావించవచ్చు.
“తొంగి చూస్తే ఆ నీటి నిండా/త్యాగాలతో మేఘాల శరీరాలు/ అంటున్నారు.వర్షపు నీటిని పరిశీలిస్తే,అది కేవలం నీరు మాత్రమే కాకుండా మరేదో లోతైన అర్థాన్ని సూచిస్తున్నట్లు కవి భావన దాగి ఉంది. త్యాగాల మేఘాల శరీరాలు అంటే మేఘాలు తమ శరీరాన్ని త్యాగం చేసి భూమికి జీవం పోస్తాయి.ఇది త్యాగ భావనకు ప్రతీకగా నిలుస్తుంది.ప్రకృతి త్యాగశీలి.అది తనలో ఉన్నదంతా పరోపకారం కోసం మాత్రమే వినియోగిస్తుంది.
“కృతజ్ఞతగా నేను హారతిస్తూ ../అంటున్నారు.
కవి తాను ప్రకృతి మాత సేవలకు కృతజ్ఞతాపూర్వకంగా హారతి అందిస్తున్నట్లు భావిస్తున్నాడు.వర్షం వల్ల కలిగిన ఆనందానికి పులకించిపోయినాడు.అందుకు ప్రతిఫలంగా ప్రకృతి మహత్యానికి భక్తితో నమస్కారిస్తున్నాడు.తాను తన్మయత్వంతో ప్రకృతిని వీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ కవితా పంక్తులలో వర్షాన్ని కేవలం ఒక సహజ సిద్ధమైన ప్రకృతి సంఘటనగా కాకుండా తనలో కలిగిన అనుభూతిని,త్యాగానికి ప్రతీకగా మేఘాల గొప్పతనంగా భావిస్తున్నాడు.కవి ప్రకృతికి కృతజ్ఞతను వ్యక్తం చేయడం అద్భుతంగా ఉంది.ఇది ప్రకృతిని మరియు మానవ జీవన తత్వాన్ని లోతుగా అర్థం చేసుకునే మనస్తత్వాన్ని ప్రతిబింబించే ఒక అందమైన భావ వ్యక్తీకరణ.ఈ కవిత పాఠకులను ఆలోచింపజేస్తుంది.ఇందులోని ప్రతి పంక్తి లోతైన భావాన్ని కలిగి ఉంది.
డాక్టర్ కె.జి.వేణు రచించిన పచ్చదనం కోసం శ్వాస మినీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ఈ కవిత పచ్చదనం కోసం శ్వాస పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటును అందిస్తుంది.ప్రకృతిలో భాగమైన చెట్లు అందించే ఆక్సిజన్ ద్వారానే మనం శ్వాస తీసుకోవడం,జీవించడం జరుగుతున్నది.చెట్లు మన మనుగడకు చాలా అవసరం అన్న భావనను తెలియజేస్తుంది.పచ్చదనం కోసం విరివిగా చెట్లు నాటాలి.అట్టి చెట్లను పరిరక్షించడం ద్వారా పచ్చదనాన్ని పెంచుకోవచ్చు.ప్రకృతి మన జీవనాధారం.మనం తీసుకునే ఆక్సిజన్ కు చెట్లే మూలాలు.వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి చెట్ల పెంపకం ఎంతో అవసరం.నీటి కాలుష్యాన్ని నివారించాలి.మట్టి నాశనాన్ని తగ్గించాలి.రోజుకు కనీసం ఒక మొక్క నాటాలి,నీటి వృథాను తగ్గించాలి.పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులను వినియోగించాలి.సామాజికంగా పచ్చదనం పెంపొందించే కార్యక్రమాల్లో పాల్గొనాలి.మన శ్వాస ప్రకృతి కోసం ప్రకృతి మన శ్వాస కోసం మాత్రమే అనేది ప్రగతిశీలతను చాటుతుంది.
“గతాన్ని తానెప్పుడు తవ్వుకోడు/ఆ సమాధుల నిండా కళేబరాలే/కొత్త మొక్కల కోసం శ్వాసిస్తాడు/ మట్టి కణాల గర్భసంచుల్లోకి/తానే ఒక పచ్చదనంగా ప్రవేశిస్తూ../ అంటున్నారు.ఈ కవితా పంక్తులలో గతాన్ని తిరిగి చూడలేని వ్యక్తిగా చిత్రీకరించారు.ప్రతి పంక్తిలో కవి తాత్వికతను,ప్రకృతి తత్వాన్ని జీవితంపై తన దృక్పథాన్ని వ్యక్తపరుస్తున్నాడు.
కవి ఇక్కడ మనిషి గతాన్ని ఎప్పుడు తిరిగి చూడకుండా ఆలోచించకుండా ముందుకు సాగాలి అనే భావనను వ్యక్తం చేస్తున్నాడు.ఎప్పుడో గతంలో జరిగిన విషయాల గురించి చింతిస్తూ కాలాన్ని వ్యర్థం చేసుకోకూడదు అనే సందేశం ఇక్కడ కనిపిస్తుంది.
ఇక్కడ సమాధులు అనే ప్రతీక ద్వారా మృతుల ప్రపంచాన్ని సూచిస్తున్నారు.సమాధుల్లో నిండి పోయిన కళేబరాలు అంటే మట్టిలో కలిసిన అస్తిపంజరాలు మాత్రమే కాదు.మనిషి జీవితంలోని గతకాలపు అనుభవాలు,దుఃఖాలు,బాధలు, మరణించిన వ్యక్తుల ఆశలు,ఆశయాలు అని అర్థం అవుతుంది.మనం గతంలో ఉండి,గతాన్ని గుర్తు చేసుకుంటే మన ఆశలు చనిపోయిన చోటే పాతి పెట్టబడి ఉన్నాయని అర్థం.
కొత్త మొక్కల కోసం శ్వాసిస్తాడు అని చెప్పడం.ఇది ఒక సానుకూలభావాన్ని సూచిస్తుంది.కొత్త జీవితాన్ని స్వాగతించడానికి కొత్త అవకాశాల కోసం ఎదురు చూడటానికి కవి మానవుడిని ప్రేరేపిస్తున్నాడు. భవిష్యత్తు పట్ల ఆశావహ దృక్పథాన్ని కనబరుస్తున్నాడు.కవి ఇక్కడ ప్రకృతితో జీవన సంబంధాన్ని చూపించారు.కొత్త జీవితానికి అవసరమైన విత్తనాలను చేర్చుకోవడం.ఇది పుడమి తత్వాన్ని ప్రతిబింబిస్తోంది.
ఇక్కడ కవి మనిషి తాను పచ్చదనంగా మారి పోవాలని చెబుతున్నాడు.పచ్చదనం అంటే కొత్త ఆశలు,కొత్త ఆలోచనల దిశగా అడుగులు వేయడం. తన జీవితంలో అభివృద్ధి కొరకు ఒక వ్యక్తి గతాన్ని వదిలేసి భవిష్యత్తులోని ఆశతో ముందుకు సాగాలి అని సూచిస్తున్నారు.మనిషి జీవితంలోని సానుకూలమైన మార్పులకై,భవిష్యత్తుపై దృష్టిని సారించాలని ఈ కవితా పంక్తులు తెలియ జేస్తున్నాయి.మనిషి గతాన్ని తవ్వుకోవడం మాని భవిష్యత్తు కోసం కొత్త విత్తనాలు నాటాలి.మనిషి కొత్త ఆశలతో జీవించాలి అనే సందేశాన్ని ఈ కవితా పంక్తులు అందిస్తున్నాయి.
డాక్టర్ కె.జి. వేణు తేది 01 – 05 – 1954 రోజున ప్రొద్దుటూరు గ్రామం,కడప జిల్లాలో జన్మించారు.వీరి తల్లిదండ్రులు కుళాయమ్మ,గంగన్న.వీరు 1 వ తరగతి నుండి డిగ్రీ వరకు ప్రొద్దుటూరు పట్టణంలో చదివారు.వీరు పి.జి. విద్యను ఎం.ఎస్సీ.(కెమిస్ట్రీ) శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ,అనంతపూర్ లో చదివారు.వీరు ఎం.ఫిల్. మరియు Ph.D. డిగ్రీలను, ఆంధ్రా యూనివర్సిటీ,వైజాగ్ నుండి పొందారు.వీరు 17 జనవరి,1979 రోజున శ్రీకాకుళం,ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్రం ఉపన్యాసకునిగా నియమించబడ్డారు.వీరు 2012 లో రిటైర్ అయ్యారు.వీరు 2012 నుండి 2016 వరకు ప్రొఫెసర్,హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ (బేసిక్ సైన్సెస్) సాంకేతిక విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కళాశాలలో బాధ్యతలు నిర్వహించారు.వీరు కవి,వ్యాఖ్యాత, నటుడు,దర్శకుడు,న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.వీరు 2008 నుండి విశాఖ కళాభారతి నాటక పరిషత్ చీఫ్ కన్వీనర్ గా కొనసాగుతున్నారు.వీరు 35 కథలు,53 కవితలు,48 సాహిత్య వ్యాసాలు,12 విమర్శ వ్యాసాలు,320 మినీ కవితలు రాశారు.అవి వివిధ దిన,వార,మాస పత్రికలలో ప్రచురింపబడినవి.
కవి కె.జి. వేణు ప్రచురించిన పుస్తకాల వివరాలు :
1) ఈ తీర్పుకి బదులేది (నాటిక)
2) రక్తాభిషేకం (నాటిక)
3) మహా మంత్రుల పుష్పం ( నాటకం)
4) ఆనంద తాండవం (కథల సంపుటి).
వీరు రచించిన ఆనందతాండవం,గురుబ్రహ్మ నాటకాలకు కువైట్ వారి ఉత్తమ రచన బహుమతులను అందుకున్నారు.
వీరు రచించిన పుష్పవిలాపం నాటకానికి జాతీయస్థాయిలో ఉత్తమ రచన బహుమతి అందుకోవడం జరిగింది.వీరు రచించిన ఈ బిడ్డ నాకు కావాలి కథకు అమెరికా ఆటా వారి బహుమతి లభించింది.వీరు రచించిన 20 కవితలకు,18 కథలకు,10 వ్యాసాలకు బహుమతులు అందుకోవడం జరిగింది.వీరు ఉత్తమ నటుడిగా 24 సార్లు బహుమతి అందుకున్నారు. వీరు ఉత్తమ దర్శకుడిగా 5 సార్లు బహుమతి అందుకున్నారు. వీరు ఉత్తమ నాటక రచయితగా 12సార్లు బహుమతి అందుకున్నారు.వీరు వివిధ పత్రికలకు వ్యాసాలు,కథలు,కవితలు,సమీక్షలు, సాహిత్య విమర్శ వ్యాసాలు రాస్తున్నారు.
కవి కె.జి.వేణు స్వీకరించిన అవార్డుల వివరాలు :
1) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ అధ్యాపక అవార్డు.2) కళా తపస్వి అవార్డు,3) విశిష్ట మూర్తి అవార్డు,4) ఆంధ్ర రత్న అవార్డు,5) కువైట్ తెలుగు సంఘం అవార్డు,6) జీవిత సాఫల్య పురస్కారం, 7)రావూజీ అవార్డు,8) సురభి పనారస గోవిందరావు అవార్డు,9) విశాఖ రత్న అవార్డు,10)సి.పి. బ్రౌన్ బెంగుళూరు అవార్డు,11) నవ సాహితి ఇంటర్ నేషనల్ ఆర్గనైజేషన్,చెన్నై వారిచే ఉత్తమ సాహిత్య విమర్శకుడు అవార్డు (2023),12)రాయపూర్ ఆంధ్రా అసోసియేషన్ వారిచే ‘సాహిత్య ప్రపూర్ణ’ పురస్కారాన్ని 18 – 08 – 2024 రోజున స్వీకరించారు.13)నవ సాహితీ ఇంటర్ నేషనల్ ఆర్గనైజేషన్ చెన్నై వారిచే ఉత్తమ కవిత్వానికి గురజాడ అవార్డు (2024).14) ఆనందతాండవం కథా సంపుటికి 2025 గిడుగు రామమూర్తి జాతీయ పురస్కారం అందుకున్నారు.
కవి కె.జి.వేణు అందుకున్న సన్మానాలు :
వీరు ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరియు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి గారు మొదలైన మహామహుల చేత 178 సన్మానాలు అందుకోవడం జరిగింది.
కవి కె.జి.వేణు విదేశీ ప్రయాణాల వివరాలు :
1)వీరు PhD work కోసం 1997లో కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విజ్ఞాన నౌక సాగర కన్యలో విదేశీ శాస్త్రవేత్తలతో కలిసి మన దేశ శాస్త్రవేత్తల బృందంలో ఒకడిగా మూడు నెలల పాటు సింగపూర్,మలేషియా,శ్రీలంక,మాల్దీవులలో సముద్ర జలాల్లో పర్యటన చేశారు.
2) వీరు 2019లో 3 నెలల పాటు యూరప్ దేశాలు, జర్మనీ, బెల్జియం,నెదర్లాండ్స్,లగ్జమ్ బర్గ్, స్విట్జర్లాండ్,ఫ్రాన్స్ సందర్శన చేయడం జరిగింది.
ప్రస్తుతం ఏ న్యూస్ పేపర్ చూసిన , వార్తా చానల్ చూసిన ,యూట్యూబ్ ఛానల్ చూసిన కుంభమేళా _నాగ సాధువులు _అఖారాలు ర ప్రముఖుల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు , పిండ ప్రదానాలు , ఆధ్యాత్మిక వాతావరణం మన నలువైపులా ఆవరించింది . ఈ సమయంలో ప్రయాగరాజ్ _ హరిద్వార్ _ఉజ్జయిని _ నాసిక్ ప్రాంతాల నదుల్లోకి అపరిమితమైన పాజిటివ్ ఎనర్జీ వచ్చి చేరుతుంది అని మన పెద్దలు చెప్పారు . ఆ హరిద్వార్లో పుణ్యస్నానాలు చేయడానికి మేము ఆరుగురం కలిసి హైదరాబాదులో బయలుదేరి మరునాటి సాయంకాలం హరిద్వార్ చేరుకున్నాం .
ఢిల్లీ రైల్వే స్టేషన్ లోనే కొంచెం ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి ,పక్కగా ఉన్న హల్దీ రామ్ వాళ్ళ హోటల్ గమనించి , టిఫిన్ చేయడానికి వెళ్ళాం . స్టేషన్లో లోపల తినలేము అనుకునే వాళ్లకు , నచ్చిన రుచులు కావాలి అనుకునే వాళ్లకు ఇది ఒక మంచి అవకాశం . టిఫెన్స్ చాలా రుచిగా ఉండినాయి . చాలా వేగంగా సర్వీస్ ఉంటుంది .ఎన్నో రకాలు మనకు దొరుకుతాయి .బాగా రష్ గా కూడా ఉండింది .టిఫిన్ చేసి కాసేపు సేద తీరి హరిద్వార్ బయలుదేరం. ఢిల్లీలో చలి ఉంటుందని తెలుసు అయితే అంతకంటే ఎక్కువగా హరిద్వార్లో ఉండింది . హోటల్లో దిగి ,లగేజ్ పెట్టేసి సాయంత్రం చుట్టుపక్కల తిరిగాము .
తెల్లవారి ప్రొద్దున్నే హ రి కి పౌరీ చేరి అక్కడే స్నానాలు చేశాము . గంగమ్మకు భక్తితో నమస్కరించుకొని ,నీళ్లలో దిగి పసుపు, కుంకుమ రాగి నాణ్యాలు వేసి నమస్కారం చేసుకొని స్నానాలు చేశాము . దగ్గర్లోనే బట్టలు మార్చుకోవడానికి తాత్కాలిక గదులు కూడా ఏర్పాటు చేశారు .
మరో ముఖ్య విషయం నీటి వేగానికి తట్టుకుని స్నానం చేయడానికి వీలుగా ఇనుప గొలుసులు కూడా ఉన్నాయి . చాలామంది ఒక చేత్తో గొలుసు పట్టుకుని ఇంకో చేత నీళ్లలో మునిగి లేచి స్నానా లు చేశారు .

స్నానాఘట్టాల వద్ద రద్దీగా ఉన్నా చుట్టుపక్కల చాలా శుభ్రంగా ఉంది .చెత్తాచెదారం వెంబడి వెంబడే శుభ్రం చేస్తూ వచ్చారు .పూజా ద్రవ్యాలు అమ్మే షాపులు , రంగురంగుల పూసలు ,హారాలు , అలంకరణ సామాగ్రి ,శివలింగాలు , రుద్రాక్షలు కొనాలనుకుంటే ఎన్ని ఉన్నాయో చెప్పలేను . కనులవిందు చేసేవి మరి ఇంకెన్నో . మా హోటల్ నదీ తీరానికి చాలా దగ్గరలోనే ఉండింది . అందువల్ల మళ్లీ హోటల్ కు వచ్చి మానసా దేవి మందిరానికి బయలుదేరాం . ఆ వెళ్లే దారిలో అన్ని ధర్మశాలలే .అవన్నీ ఎంతో ప్రాచీనమైనవి . కనీసం 50 , 60 ఏళ్ల క్రితం కట్టిన వాటిలాగా అనిపించేయి . ధర్మశాలలు అన్నీ కూడా చాలా పాతవి చక్కటి చెక్క పనితనం కనిపించిండి వాటిలో . బాల్కనీలు అవి చూస్తే ఎంత ఆనందంగా ఉండిందో చెప్పలేను మన పూర్వుల భక్తి శ్రద్ధ నైపుణ్యం చూస్తేఆశ్చర్యం తో బాటు ఆనందం కూడా వేసింది .
మానసా దేవి మందిరం ఎంట్రన్స్ మా హోటల్ కి బాగా దగ్గర అక్కడ కొండ మీద గుడి ఉంది . అలాగే మూడు కొండల మీద మూడు దేవాలయాలు ఉన్నాయి . ఒకటి మానసా దేవి మందిరం , రెండవది చండీ దేవి మందిరం . మూడవది అంజనమాత మందిరం . అలా మూడు ఉన్నాయి వీటిని రోప్ వి ల పై చూడడం అపురూపమైన అనుభవం . ఆంజనేయుల గుళ్ళు అనేకం కానీ ఆ తల్లి గుడి ఇక్కడే కనిపించింది . బహుశా నేనే ఇక్కడ మొదటిసారి గమనించి ఉంటాను . ధ్యానం చేసుకోవడానికి ఆ వాతావరణం అనుకూలంగా ఉండింది . ఐదు నిమిషాలు కళ్ళు మూసుకున్న చాలు గొప్ప ప్రశాంతత మన సొంతం .మానసా దేవి మందిరం , చండీ మందిరం కొద్దిగా కో లాహలంగా ఉంటే ఇక్కడ ఒక అలోకి క వాతావరణం ,నిశ్శబ్ద సంగీతం నాకు అనుభవంలోకి వఛాయి .
మూడు చూసుకొని మళ్లీ బయలుదేరి మా బసకు దగ్గరలో ఉన్న హోటల్లో భోజనం చేసి కాస్త రెస్ట్ తీసుకుని , గంగాహారతిని చూడడానికి వెళ్ళాము .ఎంత బాగుందో ఎదురుగా గంగమ్మ గంగకి ఎదురుగా వరుసగా మెట్ల మీద అశేష ప్రజానీకం చక్కటి భజనలు , సామూహిక జయ జయ డ్వానాలూ కొత్త లోకంలోకి ప్రవేశించినట్లు అనిపించింది .అందరూ కలిసి మనకు జీవన ప్రదాతలైన జలసిరులకు మనసా వాచా కర్మణా నమస్కారం చేసే అద్భుత దృశ్యం అక్కడ చూసాం . ఎందుకంటే మన జీవన విధానం వికసించిందినదీతీరాల్లోనే . భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినట్లు గంగ భారతీయ ఆత్మ .
ఎంతో తృప్తితో బయటికి వచ్చి మా హొటెలకు బయలు దేరాము.
దారిలో వెచ్చదనాన్ని ఇచ్చే అనేక సాధనాలు చూసాం. వేడి వేడి సమోసాలు ,కచోరీలు , పూరీల అమ్మకాలు మరోపక్క స్వెటర్లు బ్లాంకెట్లు స్కార్ఫ్లు బ్లౌజులు సాక్సులు ఇంకోపక్క డ్రై ఫ్రూట్ షాప్స్ అంతేనా . అంతేకాదు సుమ ఇంకా…
ఖరీదైన రాళ్లు ,శంఖాలు , రుద్రాక్షలు , స్పటిక రస లింగాలు భగవంతుని పూజకు కావలసినటువంటి అనేకమైన సామాగ్రి కోరినవన్నీ ఒకే చోట దొరికే కన్జ్యూమర్స్ పారడైజ్ అని చెప్పవచ్చు . ప్రతివారికి అవసరమైన వస్తువు అందుబాటు ధరలో దొరకడం ఇక్కడ ప్రత్యేకత .షాపులుకూడా బాగా పొద్దెక్కాక తెరుస్తారు . రాత్రి పొద్దు పోయే వరకు పెద్ద పెద్ద బాణలిలో వేడివేడిగా వేగుతున్న సమోసా , రగడ , కచోరీ , గులాబ్ జాములురారమ్మని అని పిలుస్తూ ఉంటాయి. రోడ్డు మీద నడుస్తూ ఉంటే దాని నుంచి తప్పించుకోవడం కష్టమే .ఆ చలికి ఈ వేడివేడి ఆహారం సరి అయిన జవాబు అనిపిస్తుంది చాలాసార్లు .వాళ్ళు ఎంతో మర్యాదగా మనల్ని ఆహ్వానిస్తారు . షాపులోకి రమ్మని చెప్పే విధానం బలే బలే నచ్చుతుంది .
రాత్రంతా అలా విహరించి లాడ్జికి చేరి అలసి సొలసి నిద్రపోయాం . తెల్లవారి పొద్దున్నే ఋషికేశ్ బయలుదేరామ్ . హరిద్వార్ పదహారేళ్ల పడుచు పిల్లలాగా చెంగుచెంగున గంతు లేస్తుంటే , అనుభవాల మంద గమనంతో భారంగా నడుస్తున్న మధ్య వయసు స్త్రీ లా కనిపిస్తుంది రిషికేష్ . అయితే హరిద్వార్ ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు .పెద్ద వాణిజ్య కూడలి . అక్కడ టెక్స్టైల్ పరిశ్రమ విశ్వరూపం కనిపిస్తుంది .రిషికేష్ లో కూడా త్రివేణి సంగమం ఉందంట . అక్కడికి వెళ్ళాక తెలిసింది . పైన ఉన్న నీలకంఠ మహేశ్వర్ దేవాలయానికి వెళ్ళాం . కొండపైన ఉంది .ఆ కొండలే మన అహంకారానికి అడ్డు కట్టలు . పెద్ద ఘాట్రోడ్ .ప్రాచీనమైన మందిరం . క్రిందికి చూస్తే నయనం దకర దృశ్యం . కొండనుండి కిందికి వచ్చి ఋషి కేష్ లో స్నానం చేశాం . అప్పటికే 12:00 అయినట్టుంది అందువల్ల శరీరానికి అంత ఇబ్బంది కలగలేదు .రోడ్డుకు రెండు వైపులా చిన్నచిన్న దుకాణాలు వాళ్ల కళ్ళల్లో మన పట్ల పెద్ద పెద్ద ఆశలు .
మళ్లీ వ్యాన్ లో కూర్చుని ఒక గంట ప్రయాణం చేసి ఇస్కాన్ వారి రెస్టారెంట్లో భోజనం చేసాం .మెల్లిగా నడుస్తూ అక్కడి నుంచి పరమాత్మానంద ఆశ్రమం , గీతా ఆశ్రమం చూసుకుంటూ నడుచుకుంటూ జానకి జుల చేరుకున్నాం . అక్కడ ఫోటోగ్రఫీ నిషిద్ధం . జానకి ఝులా ఫోటో క్రింద ఈఆస్తాను . చూడండి .ఒకప్పుడు లక్ష్మణఝులా వేరే ఎక్కువగా వినిపించేది . చెక్క వంతెన పై ఇప్పుడు చిన్న కంకర సిమెంట్ లాంటిది కలిపి రోడ్డు లా వేశారు . చిన్న కదలిక అయినా అనుభవం బాగుంటుంది

ఇక్కడ అంటే రిషికేశ్లో ఒక విషయం గమనించాను . బేరం అనేది ఇక్కడ బాగా తక్కువ . అన్ని షాపుల్లో ఇంచుమించు ఒకే రేట్ చెప్తారు . అయితే ఎన్నిసార్లు అయినా వివరిస్తారు .ఎన్ని వస్తువులు అయినా చూపిస్తారు .
మాయాదేవి మందిరం , దక్షిణేశ్వర్ మహాదేవ మందిరం చూసాము . చాలా బాగుందినవి .ఆరోజు అక్కడ ఎలక్షన్స్ జరుగుతుండె . మా హోటల్ స్టేషన్ కి దగ్గరే .కానీ లగేజ్ ఉంటుంది కదా .సాయంత్రం ఆటో ట్యాక్సీ దొరకడం కష్టమని చెప్పారు చుట్టుపక్కల వాళ్ళు . అందువల్ల చాలా త్వరగా రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయాము . సాయంత్రం నాలుగున్నర గంటలకు బి కానిర్ ఎక్స్ప్రెస్ లో బయలుదేరి కురుక్షేత్ర దిగాము . ఆ రోజంతా కురుక్షేత్ర తిరగాలనుకున్నారాత్రి అయిపోయిన అందువల్ల మా హోటల్ కి దగ్గరలో చుట్టుపక్కల కాస్త చూసుకుంన్నా ము. ఇక్కడ పొద్దుటి పూట చలి ఎక్కువగానే ఉండింది .మొదలు చిన్న బ్రహ్మసరోవరం చేరుకున్నాం. ఇక్కడే దుర్యోధనుడు జల స్తంభన విద్యతో నీటిలో దాగి ఉన్నాచోటని చెప్పారు . స్వచ్ఛంగా శుభ్రంగా నీళ్ళు బావుంది .దానికి ఎదురుగా లక్ష్మీనారాయణ గుడి ఉంది .అది చూసుకొని మళ్లీ బయలుదేరి పెద్దబ్రహ్మ మానస సరోవరం వెళ్ళాము .కనుచూపుమేర నీళ్లు చల్లని గాలి అక్కడ స్థానికులు గోధుమ పిండిని చపాతీ పిండిలా తడిపి పొడి పిండిలో దొర్లించి చిన్న చిన్న గుండ్రెడ్డి బాల్స్ లాగా చేస్తారు .
ఈ చిన్నది గుండ్రటి బాల్స్ ని నీళ్లలో విసిరేస్తే చాలా తక్కువ ఖర్చు తో అపురూపమైన అనుభవాన్ని మన సొంతం చేసుకుంటాం . నీటిలో మునిగి ముక్కుతో పట్టి గుటుక్కున మింగుతాయిబాతులు . చూడడానికి బాగుంటుంది
ఆ తరువాత గీతోపదేశం జరిగిన ప్రదేశానికి వెళ్ళాము . ఫోటోలు క్రింద ఇస్తాను చూడండి . ఆ ముఖాల్లో హావ భావాలు ఎంత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయో . చివరికి గుర్రాలు కూడా ఓ నిమిషంలో మన మీదికి దుకాస్తయేమో అన్నంత సహజంగా ఉన్నాయి . కదలికలను ,వేగాన్ని కళ్ళ ముందర కళ్ళకు కట్టినట్టు నిలబెట్టిన అజ్ఞాత శిల్ప లకు పాదాభివందనాలు . అంతకుమించి ఇంకేం చేయలేం కదా .
అక్కడే కూర్చుని గీతలో రెండు అధ్యాయాలు మనసులో చదువుకున్నాను . ఆ తర్వాత జ్యోతి సర్ వెళ్ళాం అంటే పాండవులు ఆయుధాలు దాచిన స్థలం . అక్కడ భారీ ఎత్తున కృష్ణ భగవానుని విశ్వరూప దర్శనం మోడల్ ఉంది . అర్జునుడు ఏమో కానీ మేము విభ్రాంతులమై అలా నిలబడిపోయాము . లౌకికమైన అనుభూతికి అందని భావమది .
అక్కడ ఇంకో రెండు అధ్యాయాలు గీత చదువుకుని భీష్మ పితామహుడు అంప శయ్య మీద పడి ఉండిన ప్రదేశానికి వెళ్ళాం .ఆ పక్కనే అర్జునుడు భీశ్ముని కోసం గంగను తెప్పించిన సంఘటనకు గుర్తుగా పాతది మెట్ల బావి కూడా అక్కడే ఉంది . డాన్ని బాణ గంగ అంటారు . అక్కడి నుంచి భద్రకాళి గుడికి వెళ్ళాము . సాధారణంగా మనం చూసేదానికి భిన్నంగా ఇక్కడ అమ్మవారు శాంతంగా ప్రసన్న వదనంతో , చిరునవ్వుతో చక్కగా మనల్ని పలకరిస్తున్నట్టుగా , ఒక తల్లి అక్కడ ఎదురు చూస్తోంది మనకోసం అన్నట్టుగా అనిపించింది చూస్తుంటే . ఆ పక్కనే చిన్న పద్మవ్యూహం టైపులో మెలికలు తిరిగిన దారి ఉంది. అలా తిరుగుతూ వచ్చి దర్శనం చేసుకోవాలన్నమాట .అక్కడ ఒక చిన్న మంటపంలో పద్మవ్యూహం కూడా చిత్రించబడి ఉంది చివరిలో ఫోటో ఇస్తాను చూసుకోండి
ఒక విషయం నా దృష్టికి వచ్చింది యాత్రను ఇక్కడ ముఖ్యంగాఅంటే కురుక్షేత్ర చు ట్టు పక్కల ప్రాంతాల్లో కాళీ దేవాలయాలు ,కాలభైరవ ఆలయాలు చాలా కనిపించాయి .అయితే ప్రధాన ఆలయం లేక ఉపాలయాల రూపంలో తప్పనిసరిగా ప్రతి గుడిలోనూ కా ళీ లేదా భైరవ ఆలయం కనిపించింది ఆ తృప్తిని గుండెల నిండా నింపుకొని కురుక్షేత్రం నుండి ఢిల్లీకి అక్కడి నుంచి హైదరాబాదు చేరుకున్నాము .
ఇక్కడితో కుంభమేళాలో పుణ్యా స్నానం చేయాలన్న నా పన్నెండేళ్ల కల తిరిగి తీరింది .
అయితే యాత్ర విశేషాలు ఎప్పుడు సశేషాలే . ఇదొక అనంత భావ స్రవంతి .మరో ప్రయాణానికి బయలుదేరే వరకు ఈ విశేషాలు మనసులో మల్లెల పరిమళాలను వెదజల్లుతాయి . తృప్తిగా మరికొంత కాలం ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి .
ఇక్కడితో మా కుంభమేళా యాత్ర రెండవ మరియు చివరి భాగం పూర్తయింది .
మరోసారి మరో మంచి అంశంతో కలిసే వరకు సెలవా మరి
మీ విజయకందాళ
మా మేఘాలయ ప్రయాణం అస్సాంలోని గౌహతి నుండి ప్రారంభమైంది షిల్లాంగ్కు. దీన్ని స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ గా కూడా వ్యవహరిస్తారు. మేఘాలయ వెళ్లేదారిలో డివైడర్ ఎడమవైపు అంతా అస్సాం రాష్ట్రపరిధి అయితే రోడ్డుకు కుడివైపుఅంతా మేఘాలయ పరిధి. ఈ ప్రాంతంలో ఇరువైపులా ఉన్నపచ్చనిచెట్లనుండిస్వచ్ఛమైన గాలి వీస్తుంటేరెండున్నర గంటలమా ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా సాగింది.

షిల్లాంగ్కి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ పర్యాటక స్థలమైనలైట్లం క్యానన్ కి వెళ్ళాం.(PHOTO 1) పచ్చని లోతైన లోయలు,నిటారుగా ఉండే కొండలు,అంతులేని ఆకాశంఈ ప్రాంతం చూస్తుంటేఅమెరికాలోనిప్రసిద్ధి చెందినప్రపంచ పర్యాటక కేంద్రమైన గ్రాండ్కెన్యాన్ గుర్తుకొస్తుంది. ప్రకృతిలో మమేకమై అందమైన ప్రాంతాల్లో జీవిస్తున్న వీళ్ళు ఎంత అదృష్టవంతులు కదా అనిపించింది. ఈ ప్రాంతం ఎప్పుడూ పొగ మంచుతో, మబ్బులతో కప్పబడి ఉండి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎక్కువగా సినిమా చిత్రీకరణ ఈ ప్రాంతంలో జరుగుతుందని స్థానికులు చెప్పారు. ఈ ప్రాంతంలో సూర్యోదయ, సూర్యాస్తమయాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఎంతో అందంగా ఉన్న ఈ ప్రదేశాన్ని చూస్తూ అలానే ఉండి పోవాలని అనిపించేంతగా గొప్ప అనుభూతి కలిగింది.
ఈ ప్రాంతం నుండి షిల్లాంగ్ పట్టణం చేరుకొని డాన్ బోస్కో మ్యూజియం సందర్శించాం.ఈశాన్య భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయ దుస్తులు మరియు వివిధ ప్రాంతాల జీవనశైలి, వివిధ ప్రాంత ప్రజలు వాడుతున్న, వాడిన పూర్వకాలపు పనిముట్లు వారి ఆచార వ్యవహారాలను కళ్ళకుకట్టినట్టుగా తీర్చిదిద్దిన ఐదుఅంతస్తులమ్యూజియం ఎంతో అద్భుతంగా ఉంది. వాటితోపాటు ఇరుగుపొరుగు దేశాలైన భూటాన్, మయన్మార్మరియు నేపాల్ ప్రజల జీవనశైలి ప్రతిబింభించేలా వివిధ చిత్రాలు ఎంతో అద్భుతంగా అలంకరించబడి ఉన్నాయి.
తదుపరి గోతిక్ నిర్మాణశైలిలో 1913లోజర్మనీ రోమన్ క్యాథలిక్లచేనిర్మించబడినమేరీ కేథడ్రల్చర్చిని దర్శించుకున్నాం. ఇది 3 లక్షల మంది క్యాథలిక్ లప్రధాన ప్రార్థనా స్థలం. ఆ తదుపరి ఆ రోజుకి చివరగాఆసియాలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు అయినా ఉమియం సరస్సు చేరుకున్నాం. ఇది చుట్టూ కొండల మధ్య ఉంటుంది. 1960లో ఉమియం నదికి అడ్డుకట్ట వేసినిర్మించిన ఈ సరస్సు పరివాహక ప్రాంతం దాదాపు 225 చదరపు కిలోమీటర్లుగాఉండి,8.4 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన జలవిద్యుత్ ప్రాజెక్టు ఇది. దీని ముఖ్య ఆకర్షణ నీటిపై తేలియాడే ఆటలు, సాహస కృత్యాలకు ప్రసిద్ధి చెందింది. సాయంత్రం ఉమియం సరస్సులో సూర్యాస్తమయ దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంది. సూర్యాస్తమయం తదుపరి ప్రముఖ వ్యాపార కూడలి అయిన పోలీస్ బజార్ కు వెళ్లి మేఘాలయ సాంప్రదాయ ఆహారం రుచి చూసి వసతి గృహానికి వెళ్ళాం.

ఆ మరుసటి రోజు ఉదయం ఉపాహారం తీసుకుని ముందుగా షిల్లాంగ్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏనుగు ఆకారంలో ఉన్న జలపాతం చూడ్డానికి వెళ్ళాం. ముందుగా మేంషిల్లాంగ్ లోని తూర్పు ఖాశీ హిల్స్ లోని సాంప్రదాయ స్త్రీ పురుష దుస్తులు ధరించి ఫోటోలు దిగి అక్కడి నుండి 25 మెట్లు దిగి కొంచెం దూరంలో ఉన్న జలపాతంవైపు వెళ్ళాం.ఆశ్చర్యకరంగా ఒక గుట్టపై ఏనుగు ఆకారంలో అతి ఎత్తు నుండి జల దారులు పడటం, అది కూడా అచ్చం ఏనుగు ఆకారంలో ఉండటంతో దీనికి ఈ పేరు స్థిరపడింది.మరోవైపు ఉన్న రెండు జలపాతాలు కూడా చూసి ప్రయాణం కొనసాగించాం.
తదుపరి ప్రముఖ ప్రపంచ పర్యాటక స్థలమైన చిరపుంజికి బయలుదేరాం. 65 కిలోమీటర్ల దూరంలో 5 వేలఅడుగుల ఎత్తుపైన గల ఈ ప్రాంతానికి దాదాపు రెండు గంటలు ప్రయాణించి చేరాం. ఇది తూర్పు ఖాశీ హిల్స్ జిల్లాలోని ఒక పట్టణం. ఇది భూమిమీద అతి తేమగా ఉండే ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం దీనికి సమీపంలో ఉండే మాసిన్రామ్ లో అత్యధికంగా 26 వేల మిల్లి మీటర్ల వర్షపాతం పడుతున్న ప్రాంతంగా ప్రసిద్ధి చెంది1985లో గిన్నిస్ ప్రపంచ రికార్డు లోకి ఎక్కింది.
ఈ ప్రాంతంలో విహరిస్తుంటే మనం పూర్తిగా మేఘాలలో విహరించినట్టుగా ఉంటుంది. విమానంలో ప్రయాణంచేసేప్పుడు ఎలా అయితే మేఘాల మధ్య మన విమానం ప్రయాణిస్తుందో అలానే మనం ఈ ప్రాంతంలో ప్రయాణించినప్పుడు మేఘాలు మనని తాకుతూ ప్రయాణించడం చూసి గొప్ప అనుభూతిని మిగులుచుకున్నాం.

ఇక్కడి నుండి సమీపంలోని నోహ్కలికైజలపాతం వెళ్ళాం. ఇది భారతదేశంలోనే అతి ఎత్తైన జలపాతం దాదాపు 1115 అడుగుల పై నుండి జాలు వారుతున్న ఈ జలపాతం చూస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపించింది. దీన్ని చూడాలంటే వర్షాకాలం మరియు శీతాకాలంలో మాత్రమే వీలవుతుంది. వేసవి కాలంలో మాత్రం నీటి ఉధృతి చాలా తక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతం నుండి సెవెన్ సిస్టర్స్ జలపాతంగా ప్రసిద్ధి చెందిననోస్నగిలింగ్ జలపాతం కి వెళ్ళాము ఇది షిల్లాంగ్ నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 1033 అడుగుల ఎత్తు నుండి జాలు వారుతున్న ఈ జలపాతం వీక్షించడానికి మేము చాలా సమయం నిరీక్షించాల్సి వచ్చింది.ఆ ప్రాంతమంతా పొగ మంచుతో నిండి పర్వత శిఖరాలు లోయలు పూర్తిగా అదృశ్యమై పూర్తిగా మేఘాలు ఆవరించాయి. పొగ మంచు విడిపోయాక పేరుకు తగ్గట్టే అక్కా చెల్లెళ్ల వయసు వ్యత్యాసంఎలా ఉంటుందో ఆ ఏడు జలపాతాలు కూడా పెద్దగా,మధ్యస్థంగా,చిన్నగా ఉండి ఆ జలపాతాలకు ఆ పేరు స్థిరపడినట్లుగాఉంటుంది.
పక్షుల కిలకిలా రావాలు మరియు కీటకాల వింతవింతధ్వనులతో ఉండే దట్టమైన చెట్ల గుండాప్రయాణిస్తూ తదుపరి యాత్రా ప్రదేశమైనా మాస్మాయ్ గుహలు వీక్షించడానికి వెళ్ళాం (PHOTO 2). 250 మీటర్ల పొడవు పది మీటర్ల ఎత్తు ఉన్న ఈ గుహల్లో కేవలం 150 మీటర్ల వరకు మాత్రమే యాత్రికులను అనుమతిస్తారు. ఇది తూర్పుఖాశీ కొండల్లో చిరపుంజి కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలోనే అతి పెద్ద గుహగా పరిగణిస్తారు.

భూగర్భంలో నీటి ప్రవాహ ఒత్తిడికి కోతకు గురై వివిధ ఆకృతుల్లో ఎంతో అద్భుతంగా ఉన్న ఈ గుహల్లోకి వెళ్లడం మాకు ఒక సాహస కృత్యం గానే అనిపించింది. చిమ్మ చీకటిలో చరవాణి కాంతి సహాయంతో అడుగులో అడుగు వేసుకుంటూ కొన్నిసార్లు పాకుతూ, కొన్నిసార్లు పూర్తిగా కింద కూర్చొని జారుతూ వెళ్లే అనుభూతి, భయం, గగుర్పాటు కలిగిస్తుంది. ఏ మాత్రం గాలి లేకుండా ఉన్న ఈ గుహల్లో మాత్రం ప్రతి భాగం నుండి నీటి చుక్కలు తుంపర్లుగా పడుతూకోతకుగురైన సున్నపురాయి వివిధ ఆకృతుల్లో చూస్తుంటే ఒక అనిర్వచనీయమైన మధురానుభూతి కలుగజేసింది.
ఆ రోజు చివరి పర్యాటక ప్రాంతమైన గార్డెన్ ఆఫ్ కేవ్స్( PHOTO 3) కి వెళ్ళాం. దాదాపు నాలుగు కిలోమీటర్లు పరిధిలో ఉన్న ఈ ప్రాంతానికి ప్రవేశ రుసుము రూ100. ఈ గార్డెన్ ఆఫ్ కేవ్స్ ఒక ప్యాకేజీ రూపంలో అందిస్తుంది. ఇందులో జలపాతాలు,గుహలు, వెదురు బొంగులతో నిర్మించిన వంతెనలు,స్వత:సిద్ధంగా నీటి ఒత్తిడితో తయారై వివిధ ఆకృతులతో అందంగా కనిపిస్తూచిత్రకారుడుచిత్రించినచిత్రాల్లాగా ఉన్న గుహలు.
గుట్టల పైనుండిపడుతున్ననీటిదారలు,వెదురు బొంగులతో మళ్లించిన నీటి దారలు చూడటానికి ఎంతో అద్భుతంగా ఉన్నాయి. స్వాతంత్రానికి పూర్వం ప్రభుత్వ వ్యతిరేక స్వాతంత్ర సమరయోధులుతమను తాము రక్షించుకోవడానికి ఈ ప్రాంతంలోని గుహలనుఆశ్రయించి ఇందులో ఆశ్రయం పొందే వారని స్థానికుల కథనం. దాదాపు 16 గుహలు ఇందులో ఉన్నాయి. మెట్లు ఎక్కడం దిగడం ఈ గుహల్లో విహరించడం అంటే కొంచెం శ్రమతో కూడిన పని. చేతి కర్ర సహాయంతో మాత్రమే ఈ గుహలో మనం తిరుగగలుగుతాం.

అతిరద్దీగావుండేరోడ్లద్వారాప్రయాణించిమావసతిగృహానికిచేరుకునివిశ్రాంతితీసుకున్నాము.
రోడ్లపై విపరీతమైన రద్దీ గమనించి మరుసటి రోజు ఏడు గంటలకు ఉపాహారం ముగించుకొని ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ లోని డాకినది లోవిహారానికి బయలుదేరాం( PHOTO 4). ఇది షిల్లాంగ్ నుండి 81 కిలోమీటర్లదూరంలో ఉంటుంది. ఈ దారిలో సగభాగం పెద్ద పెద్ద గుంటలతో నిండి ఉండి ప్రయాణానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ దారి గుండా ప్రతిరోజు కొన్ని వందల లారీలు నిర్మాణ సామాగ్రితో బంగ్లాదేశ్ ప్రాంతానికి వెళ్లడం రావడం వల్ల రోడ్డు అంతా పాడై గతుకులతో ప్రయాణానికి తీవ్ర అసౌకర్యం కలగచేసింది. మూడు గంటల ప్రయాణం పూర్తి చేసుకొని డాకి నది చేరుకున్నాం. దీన్నే ఉంగాట్నదిగా కూడా పిలుస్తారు. ఈ నదిలో నాటు పడవల్లో మనం విహరించవచ్చు ఇద్దరికీ రూ800 రుసుముగా ఉంటుంది. బంగ్లాదేశ్ బోర్డర్ వరకు తీసుకువెళ్లి బోర్డర్ చూపించి తీసుకువస్తారు పది నుండి 15 మీటర్ల లోతు ఉండే ఈ నదిలోని అడుగు భాగాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు ఇది ఈ నది ప్రత్యేకత.
డాకీ నది నుండి కొంత దూరంలో ఉన్న ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ (PHOTO 5) వరకు వెళ్లి బోర్డర్ పాయింట్లలో ఫోటోలు దిగి ఆ తదుపరి వీక్షించాల్సిన ప్రఖ్యాతమైనలివింగ్రూట్బ్రిడ్జిని చూడ్డానికి ప్రయాణం మొదలుపెట్టాం. స్థానికులు చిన్నచిన్న వాగులు, ఉపనదులు దాటడానికి వీటిని నిర్మించివిరివిగా ఉపయోగిస్తున్నారు.

రంగ్థిల్లియాంగ్లోని మావ్కిర్ నాట్అనే ప్రాంతంలోని 53 మీటర్ల పొడవు ఉన్నలివింగ్రూట్బ్రిడ్జిప్రపంచంలోనే అతి పెద్దది. వంతెన కావలసిన ఉపనదికి ఇరువైపులా రబ్బర్ వృక్షాలను పెంచుతూ వాటి వేర్లనుఒకదానితో ఒకటి జతపరుస్తూఇదే ప్రక్రియ కొనసాగిస్తారు. ఈ ప్రాంతంలో దాదాపు 500 నుండి 600సంవత్సరాలుగా ఈ విధంగా ప్రకృతి సహజంగా నిర్మించబడ్డ అనేక చిన్న, పెద్ద వంతెనలు స్థానిక అవసరాల దృష్ట్యా ప్రవాహ వేగం పరిధిని బట్టి కొన్నిచోట్ల రెండు అంచెల వంతెనలు నిర్మిస్తే చాలా ప్రాంతాల్లో చిరు వంతెనలతో నిర్మించారు. రెండు అంచెలవంతెనలు చూడటానికి పూర్తిగా ఒకరోజు వెచ్చించాలి.దాదాపు 3500 మెట్లు క్రిందకు దిగి మళ్లీ పైకి రావాల్సి ఉంటుంది. మేం మాత్రం సమయాభావం వల్ల మావిల్లాంగ్ సమీపంలోనినోవెట్ నదిపై నిర్మించిన సింగల్ లివింగ్ రూట్ బ్రిడ్జిచూడటానికి ఎంచుకున్నాం. ఇది కూడా 150 మెట్లు దిగి వెళ్ళాం. ప్రకృతిలోసహజీవనంమరియుసహజసిద్ధమైనజలపాతాలుచూడ్డం ధ్యేయంగా ఈ ప్రాంతాలకు యాత్రికులు విరివిగా వస్తుంటారు.మేంకూడాప్రకృతి వనరులతో సహజంగా నిర్మించబడ్డలివింగ్రూట్బ్రిడ్జి( PHOTO 6) పైన విహరించిఅనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యాం. నదీ ప్రాంతంలో కాసేపు విశ్రమించి ఆ రోజుకు చివరి యాత్రా స్థలమైన మావిల్లాంగ్ గ్రామానికి చేరుకున్నాం. ఈ గ్రామం ఆసియాలోనే శుభ్రమైన గ్రామంగా పేరుగాంచింది. ఈ గ్రామానికి దేవతల సొంత ఉద్యానవనం అనే పేరు కూడా ఉంది పూర్తిగా మహిళల చే నిర్వహించబడ్డ కూడలి సందర్శించి వారు వెదురుతో స్థానిక వనరులతో తయారుచేసిన కొన్నిసాంప్రదాయ వస్తువులను కొనుగోలు చేసి తిరుగు ప్రయాణం కొనసాగించాం. ఈ ప్రాంతం పూర్తిగా చూడాలంటే కనీసం 8 నుండి 10 రోజుల ప్రయాణం అవసరం.
మంత్ర నగరి నాటకం రచయిత శ్రీ మాఢభూషి దివాకర బాబు గారు . ప్రముఖ సినీ రచయిత యమలీల, శుభలగ్నం, మావి చిగురు , చూడాలని ఉంది , టాప్ హీరో, నెంబర్ వన్ ,ఆహ్వానం, వినోదం ,సర్దుకుపోదాం రండి ,ఇద్దరు మిత్రులు మొదలైన వంద సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే సంభాషణలు అందించారు. కథలు కవితలు రేడియో నాటకాలు అనేకం రచించారు .నాటక రచయితగా ప్రతి నాటికకు నాటకానికి అనేక పరిషత్తులలో ఉత్తమ రచన తదితర బహుమతులు అందుకున్నారు. యువ వాహిని డి.వి. నరసరాజు స్మారక పురస్కారం , అక్కినేని నాటక కళా సమితి అక్కినేని జీవన సాఫల్య పురస్కారం, బాపు రమణ వారి ముళ్ళపూడి వెంకటరమణ సాహితీ పురస్కారం ,సంస్కృతి సాంస్కృతిక సంస్థ గుంటూరు వారిచే ‘ఆచార్య’ బిరుదులు అందుకున్నారు.

వీరు రచించిన ప్రతి నాటిక నాటకం పలువురి ప్రశంసలను అందుకోవడం షరా మామూలే. అంత పదునైన మంచి వస్తు వైవిధ్యంతో కూడిన నాటిక నాటకాలలో మంత్ర నగరి నాటకం ఒకటి . రసరంజని నెలనెలా నాటకం ప్రేక్షకుడికి వినోదం పేరుతో నటుడికి ఆనందం అదే మా బాట అదే మా మాట అనే సంకల్పంతో నిర్వహించే నాటక ప్రదర్శనలలో భాగంగా 28-1-20 25న రవీంద్ర భారతిలో చైతన్య కళాశాలవంతి ఉక్కునగరం విశాఖపట్నం వారి సమర్పణలో మంత్ర నగరి నాటకం ప్రదర్శన జరిగింది . ఇప్పుడు మానవాళి అంతా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మాయలో పడి తాము మనుషులమన్న సంగతి మరిచిపోయి విం తగా బతుకుతున్నారు. ప్రేమలు పలకరింపులు ఆప్యాయతలు మరిచిపోయారు .మన సౌకర్యాల కోసం కనిపెట్టిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ మనల్ని శాసించే స్థితికి ఎదిగింది! ప్రపంచమంతా ఆక్రమించి భావితరాలను బానిసలుగా చేసే ప్రమాదం ఉంది. అందుకే ఈ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో పాటు హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకోవాలి . రెండూ అవసరమే ఈ రెండు సమపాళ్ళలో ఉంటేనే ప్రపంచం యంత్ర నగరంలా కాకుండా మంత్ర నగరాల ప్రపంచంగా మారుతుందని తెలియజేయడం ఈ నాటకంలో మూలాంశం.

నాటకానికి దర్శకత్వం వహించిన శ్రీ బాలాజీ నాయక్ ముఖ్యపాత్రధారులైన తాత పాత్రను అద్భుతంగా పోషించారు . కథానాయకుడైన నవీన్ గా శ్రీ వై అనిల్ కుమార్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అరాచకం పాత్రతో పేరులోనే అరాచకం పాత్రకు తగిన పేరును పెట్టుకున్న పాత్రధారి శ్రీ పి. రామారావు తన పాత్రకు తగిన న్యాయం చేశారు . మేదో పాత్ర పేరుతో కృత్రిమ మనిషిగా శ్రీ కే ఉమా మహేష్ మంచి నటనను ప్రదర్శించాడు. వివేకం పేరుతో శ్రీ ఎం .వాసు తెలివైన స్నేహితుడిగా మంచి చెడు తెలిసి వివేకంతో ఎలా ఆలోచించాలి ప్రత్యక్షంగా చూపించడంలో సఫలీకృతుడైనాడు . తనఖా పాత్రతో రోబో గా ఉంటూ జర్మనీ భాషలో మాట్లాడుతూ అందర్నీ అలరించారు శ్రీ బి వెంకటరావు నాయక్ . నాటకంలో కథానాయకి ఆశాలత కుమారి రూప శ్రీ పాత్రకు తగిన విధంగా నటనను ప్రదర్శించి ప్రశంసలు పొందారు.


ఈ నాటకానికి సాంకేతిక సహకారం అందించిన వారు సంగీతం శ్రీ లీలామోహన్ ప్రతి సన్నివేశంలో ఆయా సందర్భాలలో వీరు అందించిన సంగీతం నాటకంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . ఆహార్యం అందించిన వారు శ్రీ థామస్ రోబోనూ మేధోపాత్రను మరింత ప్రత్యేకంగా చూపించవచ్చని అనిపించింది . నాటకంలో మంత్రనగరి పేరుతో ఉన్న మాయా లోకాన్ని తన లైటింగ్ తో శ్రీ ఫణీంద్ర ,రంగాలంకరణతో శ్రీ ఎం సత్తిబాబు ,బి శ్రీనివాసులు ఎప్పటికప్పుడు ఆ దృశ్యం మన కళ్ళకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నం చేయడంలో విజయం సాధించారు.
ఈ నాటకం శ్రీ బాలాజీ నాయక్ దర్శకత్వంలో కళల కాణాచి తెనాలి పరిషత్తులు ప్రదర్శించినప్పుడు 2024 నవంబర్లో ఉత్తమ ద్వితీయ పరిషత్ ప్రదర్శన ఉత్తమ క్యారెక్టర్ నటుడు ఉత్తమ విలన్ ఉత్తమ లైటింగ్ ఉత్తమ ఆహార్యం , నవీన్ పాత్రకు జ్యూరీ బహుమతులు లభించాయి. ఈ నాటకం ప్రదర్శన గురించి
కవి ,గుణ నిర్ణీత ,విశ్లేషకులు అయినా శ్రీ ఆకుల మల్లేశ్వర రావు గారు తెలుగు ప్రభలో అద్భుతమైన సమీక్షను రచించారు.
నవీన్ కృత్రిమ మేధపై ఒక ప్రాజెక్టు తయారు చేస్తుంటాడు. తెర తీసేసరికి అక్కడ దృశ్యం అంతా ఆధునికతతో టెక్నాలజీ పెరిగిపోయి జపాన్ నుంచి తెచ్చుకున్న రోబో ఇంట్లో ఉండడం ఇంటికి ఎవరు రావాలన్నా యాక్సెస్ తో రావడం వంటివి ఇంటి పనులను రోబో నిర్వహించడం ఇటువంటి దృశ్యాలను మనం గమనిస్తాం. ఇంటికి వచ్చిన తాత ఆశ్చర్యపోతాడు . మనవడిలోని యాంత్రికత మనసుని కదిలించి వేస్తుంది. ఇంతకీ ఎప్పుడు వెళ్ళిపోతావు అని మనవడు వేసిన ప్రశ్నకు ఆవేదనకు గురవుతాడు తాత. డబ్బే ప్రధానంగా జీవించే అరాచకం తన కూతుర్ని నవీన్ చేసే ప్రాజెక్టు పేటెంట్ కోసం ఉసిగొల్పుతాడు. నవీన్ తన మేధస్సును యంత్రంపై ఆధారపడినప్పటి నుంచి నవీన్ తో ఆ పాత్ర అతని వెన్నంటి ఉండి నడిపించడం ఒక ప్రత్యేక అంశం ! నాటకంలో తాతయ్యకు అనారోగ్యాన్ని పట్టించుకోని స్థితికి చేరిన మనవడికి బదులుగా స్నేహితుడైన వివేకం పరీక్షలు చేయించడం ఎప్పటికప్పుడు నవీన్ అనుసరించే విధానాన్ని హెచ్చరించడం చేస్తుంటాడు . చివరికి తన ప్రాజెక్టుకు మరింత డబ్బులు అవసరమైనప్పుడు జరిగిన పరిణామాలు కృత్రిమ మేధకు పూర్తిగా వశమై తనను తాను మర్చిపోయి మనిషిలా కాకుండా యంత్రంగా ప్రవర్తిస్తాడు నవీన్ . అది చూసి నవీన్ లోని మనిషిని వెలికి తీసే ప్రయత్నం చేస్తారు తాత ,వివేకం ,ఆశాలత . మనిషి ఆధునికత పేరుతో ఎదగడం అవసరం . కొత్త టెక్నాలజీని నేర్చుకోవడం అమలుపరచడం అవసరాలకు తగినంతవరకు ఉపయోగించుకోవడం శుభ పరిణామం. కానీ అది అదునుగా తీసుకొని పూర్తిగా దానికి బానిసగా మారవలసిన అవసరం లేదని మానవత్వం మర్చిపోకూడదు అని తెలియజేసిన నాటకం మంత్రనగరి.

రచనలు సంభాషణలలో కృత్రిమమైన మేధను మానవమేధనూ రెండింటిని ఉదాహరణలతో తాత పాత్రలో బాలాజీ నాయక్ తో చెప్పించిన విధానం నాటకానికి హైలైట్ ! పరిణితి చెందిన రచయితగా అద్భుతమైన డైలాగులతో శ్రీ మాడభూషి దివాకర్ బాబు గారు మనకు నాటకం మొదటి నుంచి చివరి వరకు కనిపిస్తారు.ఈ నాటకం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించి అందరూ ఆలోచించవలసిన కథాంశం . అభివృద్ధి పేరుతో విలువలను పట్టించుకోకపోతే మనిషి మనుగడ ప్రమాదంలో పడుతుందని హెచ్చరిక నాటకంలో మనకు కనిపిస్తుంది . ఆలోచనాత్మక నాటకం అందించిన శ్రీ మాడభూషి దివాకర్ బాబు గారు సర్వదా అభినందనీయులు.
ప్రకృతిలోని చెట్టూ పుట్టా, రాయీ రప్పా ఏదైనా కావచ్చు. కానీ ఆయన ‘దృష్టి’ అందులోని సౌందర్యాన్ని దర్శిస్తుంది. మనసు అంతకంటే వేగంగా స్పందిస్తుంది. చేతులు అమాంతం కుంచెను పట్టుకుంటాయి. వేళ్ళకొనల నుండి మిశ్రమ వర్ణాలు జారుతూ వివిధ ఆకృతులుగా రూపాన్ని సంతరించుకుంటాయి. అవి హృదయాలను ముగ్ధమనోహరంగా దోచుకుంటాయి. అంతటి మహనీయుడు, మాననీయుడు మరెవరో కాదు. ఆయనే భరతజాతి గర్వించదగిన తెలుగు బిడ్డ ప్రముఖ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు.

ఆయన శత జయంత్యుత్సవ సందర్భంగా హైదరాబాదులో ఆయన చిత్రకళాప్రదర్శన ఏర్పాటు చేయాలనే సంకల్పం కుటుంబ సభ్యులకు కలగడం ముదావహం. పట్టుదలతో శ్రమించి ఆయన చిత్రాలన్నీ భద్రపరచి పదిరోజులపాటు ప్రజల సందర్శనార్థం ప్రదర్శనను ఏర్పాటు చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. వృద్ధాప్యదశలో తల్లిదండ్రులను పట్టించుకోకుండా
వృద్దాశ్రమాల్లోనూ, రోడ్లపైనో వదిలివేస్తున్న వారసులున్న ఈ రోజుల్లో తమ ఇంట్లో విరిసిన చిత్రకళా కుసుమాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆయన వారసులుగా గర్విస్తూ, ఆ కళావిభవాన్ని నలుగురికీ పంచాలనుకున్న వారి ఆకాంక్ష ఎంతగానో ప్రశంసనీయమైనది.

కొండపల్లి శేషగిరిరావు 1924, జనవరి 27న తెలంగాణలో వరంగల్ జిల్లా, మహబూబాబాద్ మండలంలోని పెనుగొండ గ్రామంలో జన్మించారు. బాల్యం నుండే ఆయన మదిలో చిత్రకళా బీజాలు నాటుకున్నాయి. పాఠశాలలో డ్రాయింగ్ మాష్టర్ దీన్ దయాళ్ “భవిష్యత్తులో ఈయన ఒక గొప్ప చిత్రకారుడు అవుతాడ”న్న విషయాన్ని ఆనాడే ఊహించడం చిన్ననాటనే వెలువడిన శేషగిరిరావు సృజనాత్మకతకు అద్దం పడుతుంది. మాష్టారు గారి ఊహ వమ్ము కాలేదు. శేషగిరిరావు అఖండ ప్రజ్ఞాపాటవాలతో వెలువడిన అపురూప చిత్రకళాఖండాలు అశేష జనులను ఆకర్షించాయి. ఆయనకు వెలకట్టలేని గౌరవాన్ని ఆపాదించాయి.
వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయం మన శిల్పకళకు కాణాచి. అటువంటి ఘన శిల్పసంపద

ఆయనను ఉత్తేజితుణ్ణి చేసింది. వాటి నుండి స్ఫూర్తి పొంది ఆ శిల్పకళను లావణ్యవంతమైన చిత్రకళగా మార్చి ప్రముఖుల చేత ఔరా! అనిపించుకున్నాడు. ఆయనకున్న భక్తి తత్పరతలు అపారం. అందుకే అనేక పర్యాయాలు భాగవతాన్ని చదివి భక్త కవిపుంగవుడైన పోతన చిత్రానికి జీవం పోశాడు. ఆనాడు ఆంధ్రపత్రిక ముఖచిత్రంగా వచ్చిన ఆ చిత్రాన్ని చూసిన తెలుగు ప్రజలకు పోతన పట్ల ఆదరాభిమానాలు ఇనుమడించి దాన్ని ఫ్రేములు కట్టించుకున్నారంటే శేషగిరిరావు చిత్రకళా సామర్థ్యం అవగతమవుతున్నది. ఆయన చిత్రాల్లో ఇతిహాస గాథలు, కావ్యాలు, చారిత్రకాలు కూడా చోటు చేసుకోవడం ఆయనకున్న విషయ పరిజ్ఞానాన్ని విదితపరుస్తున్నాయి. 1975వ సంవత్సరంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన వేసిన తెలుగుతల్లి చిత్రం ఆయనకు ప్రముఖుల ప్రశంసలతో పాటు అభిమాన నీరాజనాలు అందించింది.
శేషగిరిరావు శకుంతల కథను విశ్వామిత్ర, మేనకల నుండి మొదలుకొని క్రమపద్ధతిలో తీర్చి చిత్రకావ్యంగా మలిచారు. శ్రీమద్రామాయణంలో గుహుడు, అహల్య, పట్టాభిషేకం, శబరి, లంకానగరంలో సీత దుఃఖం మొదలైన ఘట్టాలు వర్తమానంలోజరుగుతున్న అనుభూతిని కలిగిస్తాయి. పోతనకు సరస్వతీ దేవి సాక్షాత్కరించడం, గజేంద్రమోక్షం, మహిషాసురమర్దనం, పాండవుల అరణ్యవాసం, గీతాబోధ, రాధాకృష్ణుల ప్రణయం, రుద్రమదేవి, వీరనారి ఝాన్సీలక్ష్మి మొదలైన అనేక చిత్రాలు అత్యంత సుందరంగా ఆయన కుంచె నుండి రూపుదిద్దుకున్నాయి.


జానపదుల జీవితంలోని కాయకష్టాన్ని కూడా ఆయనచేయి స్పృశించింది. కళాకారులందరూ ప్రకృతి ఆరాధకులు. శేషగిరిరావు కూడా అంతే తాదాత్మ్యంతో, అత్యంత ప్రావీణ్యంతో పశు పక్ష్యాదులను తీర్చిన వైనం అనన్యసామాన్యం. ఎంతో జాగరూకతతో ఈ చిత్రాలను పరిశీలిస్తే పరమాణువంత చిన్న విషయాన్ని కూడా ఆయన ఎంత సునిశితంగా పరిశీలించి పరిగణనలోకి తీసుకున్నారో తేటతెల్లమవుతుంది.
ఇది మన వారసత్వం. ప్రజలకు ఆనందాన్ని, ఆహ్లాదాన్నిచ్చేవి లలితకళలు. వీటిని కాపాడుకోవాల్సినబాధ్యత మనందరి మీదా ఉంది. అంతేకాదు. ఇంతటితో ఆగిపోకుండా ఈ మార్గదర్శకత్వంలో ఇటువంటి మరోతరం రావాలి. భారతీయ కళ నలువంకలా కీర్తిపతాకాలను ఎగురవేయాలి. శేషగిరిరావు కుటుంబసభ్యులు ఆయన చిత్రకళా ప్రదర్శన ఏర్పాటుచేసి ఆయన గురించి అందరికీ తెలిసేలా చేస్తున్నందుకు వారికి శుభాభినందనలు.
మొన్న వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో, నిన్న ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో, ఆ ముందు… బోలె బాబా ఆశ్రమంలో
(పాదధూళి కోసం)… చెప్పుకుంటూ పోతే ఎన్నో… గాలిలో కలిసిపోతున్న ప్రాణాలెన్నో? జాగ్రత్తలెన్ని తీసుకున్నా ఇలాంటి అపశ్రుతులెందుకు జరుగుతాయి?
భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద జరుగుతున్న తొక్కిసలాటల్లో అశువులు బాస్తున్న ప్రాణాలెన్నో! ఈ తొక్కిసలాట జరగడమనేది మతసంబంధ కార్యక్రమాలలోనే కాదు, ఫుట్ బాల్ క్రీడా ప్రాంగణాల్లోనూ, సెలబ్రిటీలు పాల్గొనే కార్యక్రమాల్లోనూ… ఒక రకంగా చెప్పాలంటే, ఎక్కడైనా జన సందోహమెక్కువగా ఉంటుందనుకున్న ప్రదేశాలలో ఈ తొక్కిసలాట జరగడమనేది సాధారణమై పోయింది. అయినా ప్రజలు, అటువంటి కార్యక్రమాలకు ఎందుకు హాజరవుతారో ఒకసారి అవలోకిద్దాం.
మత విశ్వాసాలకు సంబంధించిన కార్యక్రమాలలో పుణ్యం సంపాదించుకోవడమే ధ్యేయమైతే, మిగిలిన వాటిలో తమకిష్టమైన బాబాలనో, క్రీడాకారులనో, నటీనటులనో దగ్గర నుండి చూసామని చెప్పుకోవడం కోసం హాజరవుతారు. లింగ, వయోభేదాలు లేకుండా అన్ని సామాజిక వర్గాల నుండి వీటికి హాజరవుతారు. కొంతమంది విశ్వాసంతో వస్తే, మరి కొంతమంది, మేము కూడా ఆ కార్యక్రమానికి వెళ్లామని చెప్పుకోవడానికి… ముఖ్యంగా యువత… వస్తారు.
జనసమ్మర్దం ఎక్కువగా ఉండే కార్యక్రమాలకు ఎంతమంది వస్తారనేది ఇంచుమించుగా లెక్కలు వేసుకుని ప్రభుత్వాలు, తగిన ఏర్పాట్లను చేస్తూనే ఉంటాయి. అయినా విషాదాలు చోటు చేసుకుని, అయినవారికి కన్నీళ్లు మిగిల్చిపోతుంటాయి. వీటిని అరికట్టలేమా?
ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో జరిగిన విషాదం గురించి. భోగి పర్వదినాన మొదలైన ఈ కుంభమేళాలో 15 కోట్ల మంది, జనవరి 28 వరకు గంగాస్నానం చేశారని లెక్కలు చెబుతున్నాయి. ఇంతమంది హాజరైనా, ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదని అందరూ సంతోషిస్తున్న వేళలో, జరగకూడనిదే జరిగి పోయింది. 30 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దీనికి కారణాలు ఏమిటన్నది మనం పరిశీలిస్తే, ఒకే ఒక్క విషయం అర్థం అవుతుంది.

ఒకేరోజు, ఒకే సమయానికి, ఒకే స్థలానికి, ఎక్కువ మంది చేరుకోవడం… మహాకుంభ మేళా, పుష్య మాసపు చివరి రోజు, మౌని అమావాస్య, అమృత ఘడియల్లో దేవతలు దిగి వస్తారని, ఆ సమయంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని, దానధర్మాలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని, పిండ ప్రదానం చేస్తే పితృదేవతలకు సద్గతులు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే జనవరి 29, మౌని అమావాస్య నాడు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన ప్రభుత్వం దానికి తగిన ఏర్పాట్లనే చేసింది. కాని, ఉదయం రెండు గంటల సమయంలో ఒకేసారి భక్తులు పోటెత్తడంతో బారికేడ్లు విరిగి, తొక్కిసలాటకు దారి తీసింది. దానికి తోడు చీకటిగా ఉండడంతో, ఏమి జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి… దాంతో కొంతమంది కింద పడి ప్రాణాలు కోల్పోతే, మరి కొంతమంది గాయాల పాలయ్యారు.
12 కిలోమీటర్లు పొడవునా 44 పుష్కర ఘాట్లతో ఉన్న నదీతీరంలో స్నానం చేయకుండా, ఆ ఒక్క ప్రదేశానికే, ఆ సమయంలోనే, ఆ రోజే, వెళ్లాలని అనుకోవడమెందుకు?
మనసా, వాచా, కర్మణా పరిశుద్ధంగా ఉండడం, ఎల్లప్పుడూ సత్యాన్ని పలకడం, పరిశుద్ధమైన భావాలుంటే చాలు నన్ను పూజించినట్టేనని, ఇవేవీ లేకుండా చేసిన హోమము, దానము, తపస్సు, మరి ఏ ఇతర క్రియ అయినా ఇహపరాలలో ఫలమివ్వదని, మనం చేసిన కర్మలే మనను అనుసరిస్తాయని గీతాబోధకుడే స్వయముగా అర్జునునితో చెప్పాడని భగవద్గీతలో నేర్చుకుంటూనే ఉంటాం.
పైగా హిందూ శాస్త్రాలలో, ఏ క్రతువు గురించి చెప్పినా అందులో దానధర్మాల ప్రసక్తి ఉంటుంది. దానర్థమేమిటి? అవసరంలో ఉన్న వారిని ఆదుకోమన్న అర్థమే. వీటన్నిటినీ వదిలి, ఆ రోజే, ఆ సమయంలోనే, ఆ త్రివేణి సంగమంలోనే స్నానం చేస్తే, చేసిన పాపాలన్నీ పోతాయనుకుంటే, భగవంతుడు చెప్పిన కర్మ సిద్ధాంతానికి విలువేమిటి?
అందుకని మనం చేయాల్సిందేమిటంటే, మంచి చెప్పే మత విశ్వాసాలను, బోధనలను అనుసరిద్దాం, ఆచరిద్దాం. చేసిన పాపాలు చేసేసి, ఒక్క స్నానంతో ఆ పాపాలన్నిటినీ కడిగి వేసుకుందామనే మూఢనమ్మకాలను విడిచిపెడదాం. ఈ విషయం అందరూ పాటిస్తే, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతమవ్వకుండా ఉంటాయి. అందుకని ప్రజలు కూడా, గుడ్డిగా ఎవరు ఏది చెప్తే అదే నిజమని భ్రమించకుండా, విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ, జన సాంద్రత ఉన్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు, వృద్దులు ఉన్నప్పుడు మరింత జాగ్రత్త అవసరం.
అలాగే న్యూస్ చానల్స్, పత్రికా యాజమాన్యాలు మూఢాచారాలను పెంచే వార్తలను ప్రోత్సహించకుండా, ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వారిలో అవగాహన పెంచే కార్యక్రమాలను చేస్తూ, ధర్మాధర్మ విచక్షణ తెలియజేసే కార్యక్రమాలను ప్రసారం చేస్తూ, సమాజంలో జరుగుతున్న చెడుని పదే పదే చూపించకుండా, తక్కువ ప్రాధాన్యమిచ్చి, సమాజంలో జరుగుతున్న మంచి కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వడం ద్వారా, మంచిని ప్రోత్సహించే కార్యక్రమాలను ఒకటికి రెండుసార్లు టెలికాస్ట్ చెయ్యడం ద్వారా, సమాజమూ బాగుపడుతుంది. మన పూర్వీకులు నమ్మిన సనాతన ధర్మమూ పునరుత్తేజమవుతుంది.
అలాగే ప్రభుత్వాలు కూడా, అధిక ప్రాధాన్యం సంతరించుకున్న ఇటువంటి కార్యక్రమాలలో, వి.ఐ.పి. లు వచ్చినప్పుడు ప్రోటోకాల్ పేరుతో, సామాన్యులను కట్టడి చేసి, వారు వెళ్లగానే ఒకేసారి గేట్లు తెరవడం ద్వారా తొక్కిసలాటకు అవకాశం ఏర్పడుతుంది. అందుకని జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో విఐపి ల, రాకపోకలను నియంత్రిస్తే, చాలా ప్రమాదాలను అరికట్టవచ్చు.
అలాగే, సామాన్య ప్రజల అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ, అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు ఏర్పాట్లలో తగిన మార్పులు చేర్పులు చేసుకుంటూ, జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రజలకు దిశా నిర్దేశం చేస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని, జనసాంద్రత ఎక్కువున్న ప్రదేశాలలో, కఠిన నిబంధనలను అమలు చేస్తూ, సాంఘిక మాధ్యమాల ద్వారా ప్రజలలో ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదనే విషయాలపై ముందు నుండి అవగాహన పెంచగలిగితే, ఇటువంటి విషాదాలను అరికట్టవచ్చు. భక్తులకు మధురానుభూతులను మిగిల్చవచ్చు.
కనుమ ను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను, బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు.
ఆ రోజు ఇంటి కొకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి, ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలు దేరుతారు. అక్కడ దొరికే నానా రకాల వన మూలికలు, ఔషధ మొక్కలు, సేకరిస్తారు .కొన్ని చెట్ల ఆకులు, కొన్ని చెట్ల బెరుడులు, కొన్ని, చెట్ల పూలు, వేర్లు, కాండాలు, గడ్డలు, ఇలా చాల సేకారిస్తారు. కొన్ని నిర్ధుస్టమైన చెట్ల భాగాలను మాత్రమే సెకరించాలి, అనగా, మద్ది మాను, నేరేడి మానుచెక్క, మోదుగ పూలు, నల్లేరు, మారేడు కాయ, ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా కత్తిరించి, ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచు తారు. అదంతా మెత్తటి పొడిలాగ అవుతుంది. దీన్ని ఉప్పు చెక్క అంటారు ఇది అత్యంత ఘాటైన మధుర మైన వాసనతో వుంటుంది. దీన్ని పశువులకు తిని పించాలి. ఇదొక పెద్ద ప్రహసనం. అవి దీన్ని తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. అప్పుడు ఆపశువు దాన్ని మీంగు తుంది. ఇలా ఒక్కదానికి సుమారు రెండు మూడు దోసిళ్ల ఉప్పు చెక్కను తినిపిస్తారు. గొర్రెలు మేకలు ఐతే కొన్ని వాటంతటే తింటాయి. లేకుంటే వాటిక్కూడ తినిపిస్తారు. ఏడాది కొకసారి ఈ ఉప్పుచెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని వీరి నమ్మకం. అది నిజమే కావచ్చు, ఎంచేతంటే అందులో వున్నవన్ని, ఔషధాలు, వన మూలికలే గదా. ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తోలుక పోయి, స్నానం చేయించి, లేదా ఈత కొట్టించి, ఇంటికి తోలుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను, పదునయిన కత్తితో బాగా? చెలిగి వాటికి రంగులు పూస్తారు. మంచి కోడెలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి. మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. అన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలేస్తారు.
సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునప్రతిస్టించి వూరులో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగిలి పెడ్తారు. పొంగిలి అంటే కొత్త కుండలో, కొత్తా బియ్యం, కొత్త బెల్లం వేసి అన్నం వండడం. ఒక నెల ముందు నుండే కాటమరాజు ముందు ఆ దారిన వచ్చి పోయే ఊరి వారు రోజుకొక కంపో, కర్రో తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు. ఈ రోజుకు అది ఒకపెద్ద కుప్పగా తయారయ ఉంటుంది. దాన్ని “చిట్లా కుప్ప” అంటారు. చీకటి పడే సమయానికి పొంగిళ్లు తయారయి వూంటాయి. ఊరి చాకలి కాటమరాజు పూజ కార్యక్రమం ప్రారంబించి దేవుని ముందు పెద్ద తళిగ వేస్తారు. అనగా ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు, పూజానంతరం మొక్కున్న వారు, చాకిలి చేత కోళ్లను కోయించు కుంటారు. అప్పటికి బాగా చీకటి పడి వుంటుంది. అప్పటికి పశు కాపరు లందరూ ఊరి పశువు లన్నింటిని అక్కడికి తోలుకొని వస్తారు. పూజారి అయిన చాకలి తళిగలోని పొంగలిని తీసి ఒక పెద్దముద్దగా చేసి అందులో సగం పోలిగాని కిచ్చి (పశువుల కాపరి) తినమని చెప్పి, తర్వాత అక్కడున్న చిట్లాకుప్పకు నిప్పు పెడతారు. పెద్ద మంట పైకి లేవగా పోలిగాడు పశువులన్నింటిని బెదరగొట్టి చెదర గొట్టతాడు. అవి బెదిరి చేలెంబడి పరుగులు తీస్తాయి, ఆ సమయంలో పశువులను బెదర గొడుతున్న పోలిగాని వీపున చాకలి తనచేతిలో వున్న మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతాడు. దానిని పిడుగు ముద్ద అంటారు. వాడు పరిగెడుతాడు .ఆ తర్వాత అందరు అక్కడ మిగిలిన తళిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని చిట్లకుప్ప మంట వెలుగులో తమ కోళ్లను కోసుకొని పొంగళ్లను తీసుకొని తాపీగా ఇళ్ల కెళతారు. ఈ సందార్బంగా పెద్ద మొక్కున్న వారు పొట్టేళ్లను కూడా బలి ఇస్తారు. దాని రక్తాన్ని ఆన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు. దాన్ని పొలి అంటారు. ఆ “పొలి”ని తోటోడు గాని, నీరు గట్టోడు గాని తీసుకొని పోయి అందరి పొలాల్లో,చెరువుల్లో, బావుల్లో “పొలో పొలి” అని అరువ్తు చల్లుతాడు. అప్పడే కొత్త మొక్కులు కూడా మొక్కు కుంటారు. అంటే, తమ పశు మందలు అభివృద్ధి చెందితే రాబోయే పండక్కి పొట్టేలును, కోడిని ఇస్తామని కాటమ రాజుకు మొక్కు కుంటారు .అప్పటికప్పుడే ఒక పొట్టేలి పిల్లను ఎంపిక చేస్తారు. ఆ విధంగా పశువుల పండగ పరిసమాప్తి అవుతుంది.
కనుమ పండగను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. సంక్రాంతి పండుగ లో మూడవరోజు కనుమ
అని పిలువబడే మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా ఉంటుంది, ప్రతి రోజు దాని స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. కనుమ పొంగల్ (తమిళం మరియు మలయాళం) మూడవ రోజున వస్తుంది మరియు దీనిని సాధారణంగా దక్షిణ భారతదేశంలో మట్టు పొంగల్ అని పిలుస్తారు మరియు ఆంధ్రలో దీనిని ముక్కనుమ అని పిలుస్తారు.
భోగితో వేడెక్కండి, సంక్రాంతి మొదటి రోజు, దాని తర్వాత సంక్రాంతి రెండవ రోజు కొత్త దుస్తులు మరియు రుచికరమైన భోజనాలు ఉంటాయి. గేమింగ్ మరియు బెట్టింగ్ ప్రతిభను ప్రదర్శించడానికి కనుమ రోజు. సరిగ్గా పశువులతో ప్రదర్శన ప్రారంభమవుతుంది.
అత్యంత అద్భుతమైన ఎద్దులను అలంకరించి వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లడం కనుమలోని అత్యంత ఆకర్షణీయమైన అంశం. ఇప్పటి వరకు, ఈ ఆచారం యొక్క వ్యాయామం నిర్వహించబడుతుంది మరియు సన్నాయి సంగీతంతో వస్తున్న అత్యంత సొగసైన ఎద్దులను మీరు తరచుగా వీధుల్లో చూడవచ్చు.
పురాతన కాలంలో, ఈ సంఘటన ప్రధానంగా కోడిపందాల కోసం పరిగణించబడుతుంది, దీనిలో ప్రజలు పందెం వేసేవారు మరియు ఇది గతంలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. కోడిపందాలపై పందెం కాసే ఈ అలవాటు గంభీరమైన కుటుంబాలలో శత్రుత్వానికి మరియు అసూయకు దారితీసింది మరియు గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో వరుసగా పెద్ద తగాదాలు జరిగాయి, దీనిని పల్నాటి యుద్ధం (పల్నాడు యుద్ధం) అని పిలుస్తారు. హిందూ ఇతిహాసమైన మహాభారతంతో పోల్చడం ద్వారా ఈ యుద్ధాన్ని ఆంధ్ర మహాభారతం అంటారు. ఆధునిక ప్రపంచంలో, కోడిపందాలు నిషేధించబడ్డాయి మరియు ఇది చట్టానికి విరుద్ధం.
డాక్టర్. అరుణ పరంధాములు
సాంఘిక సంక్షేమ డిగ్రీ సైనిక మహిళా శిక్షణ కళాశాల. భువనగిరి, నల్గొండ జిల్లా
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (19)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)తెలుగులోకి అను సృజన చేసింది. గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి.
“జాగ్రత్త దోస్త్ ! ఇక్కడ మనిషి
తీసుకునే శ్వాస కూడా నకిలీదే !
చలాకీగా తిరిగే ప్రతి మనిషి ప్రాణంతో
ఉన్నట్లు మాత్రం అనుకోకు !
నిత్య జీవితంలో మనకు ఎందరో మనుషులు తారసపడతారు.నిత్యం కనిపించే వాళ్లు అయినప్పటికీ వాళ్లు అందరు మనకు కావాల్సిన వాళ్ళు కారు,మనకు కావలసిన వాళ్లు కొందరు మాత్రమే ఉంటారు అనే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి.ఈ షాయరీ కవితలోని భావాలు సమాజంలో మనుషుల నిజ స్వరూపాన్ని ప్రతిబింబిస్తున్నాయి.బాహ్యంగా మనుషులు ఎలా కనిపిస్తున్నారో అలా ఉండరు.పైపై మెరుగులు అంటే అందం,తీయ తీయని చిలుక పలుకుల ముద్దు ముద్దు మాటలతో జనాన్ని ఆకట్టుకొని బుట్టలో వేసుకునే వారిని చూసి తక్షణమే వారిపై ఒక అభిప్రాయానికి రాకూడదు.అపరిచితుల జోలికి వెళ్లకూడదు.అపరిచితులను వెంటనే నమ్మకూడదు. అపరిచితుల మాటలకు చిక్కి బోల్తాపడకూడదు. మనకు తెలియని మనుషులు కనుక వారు ఎలాంటి వారో?అని తక్షణమే వారిపై ఒక నిర్ణయానికి రాకూడదు.వారు చెప్పేది మంచి మాటలా? బూటకపు మాటలా?వారి గురించి నిదానంగా ఆలోచించాలి.అసలు వారెవరు?వారితో గల మన సంబంధం ఏమిటి?అని దృష్టి సారించాలి అనే సూచన దాగి ఉంది.షాయరీ కవితలో మనిషి జీవితంలోని నాటకాలను,మోసాలను,వాస్తవికతను దార్శనికతతో చూపించడమైంది.షాయరీ కవితలో దాగి ఉన్న లోతైన భావం ఒక గొప్ప అర్థంతో కూడుకొని మనసుకు తాకి హాయిని గొల్పుతుంది. ‘జాగ్రత్త దోస్త్ ఇక్కడ మనిషి తీసుకునే శ్వాస కూడా నకిలీదే/’అంటే స్నేహపూర్వకమైన హెచ్చరికగా ఉపయోగిస్తారు.ఎవరైనా స్నేహితునికి ఏదైనా ముఖ్యమైన విషయం తెలియజేయడానికి జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది. జాగ్రత్త అంటే అప్రమత్తంగా ఉండడం మరియు జాగ్రత్తతో వ్యవహరించమని తెలియజేస్తుంది.దోస్త్ ఇది హిందీ పదం సంభాషణలో స్నేహపూర్వకంగా విస్తృతంగా ఉపయోగిస్తారు.జాగ్రత్త దోస్త్ అని చెప్పడం మీకు తనపై గల అపారమైన ప్రేమను, శ్రద్ధను తెలియజేస్తుంది.నేటి సమాజంలో ఉన్న మనుషుల మనసుల్లో నెలకొని ఉన్న కృత్రిమతను, మాయ మాటలను తప్పుడు ప్రవర్తనను సూచిస్తుంది.ఇక్కడ నకిలీ శ్వాస అనే భావన మనిషిలో వాస్తవికత లేక పోవడాన్ని, మోసపూరితంగా వ్యవహరించడాన్ని తెలుపుతుంది. ఇవ్వాళ సమాజంలో వ్యక్తుల నడత దోషభూయిష్టమై,కలుషితమై కంపు కొడుతోంది. సమాజంలో ఉండే చాలా మంది తమ నిజమైన స్వభావాన్ని దాచుకొని కృత్రిమమైన రూపంలో కనిపిస్తారు. ‘చలాకీగా తిరిగే ప్రతి మనిషి/ప్రాణంతో ఉన్నట్లు మాత్రం అనుకోకు’/అని చెప్పడం ద్వారా జీవితంలో మనకు కనిపించే వాళ్లు నిజంగా,ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు అని, భావించకూడదని హెచ్చరిస్తోంది.కవి జీవితంలోని అంతర్ముఖ పరిస్థితులపై దృష్టి చూపించారు.అనేక మంది బాహ్యంగా,శక్తివంతంగా,ఆనందంగా ఉన్నట్లు మనకు కనిపించవచ్చు.కానీ,వారి లోపల నిండి ఉన్న విషాదపు ఛాయలు,నిరాశ,నిర్లిప్తతతో పాటు, ఎదుటి వారిని బురిడీ కొట్టించే నయ వంచన, మోసం కూడా దాగి ఉండ వచ్చు.అందు వల్ల సమాజంలోని మనుషులతో వ్యవహరించే సందర్భంలో ఎటు వంటి దగా,మోసానికి గురి కాకుండా జాగ్రత్తగా ఉండమని సూచిస్తుంది.ఈ పంక్తి లోని లోతైన భావం మన హృదయాలను కదిలిస్తుంది.మనం ఎటువంటి సంకోచం లేకుండా మరొక సారి మన జీవితంపై దృష్టి పెట్టేలా ఆలోచింప జేస్తుంది.జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి వ్యక్తిని గుర్తించడంలో ఏమరుపాటు,అశ్రద్ధ తగదు.మనిషి తాను సందర్భానుసారంగా,స్వతంత్రమైన ఆలోచనతో ఇతరులతో వ్యవహరించాలి.తాను జీవితంలో సరియైన యుక్తి మరియు నేర్పుతో అప్రమత్తంగా ఉండాలన్న సందేశం ఉంది.ఈ షాయరీ కవిత ద్వారా మనం చూసే ప్రతి మనిషి ఎలా ఉన్నాడో,ఎట్లాంటి స్వభావం ఉందో అని తక్షణం అర్థం చేసుకోవడం కష్టం అని తెలుస్తోంది. మనిషి స్వభావంలోని కృత్రిమతను,అవగాహన లేక పోవడాన్ని విమర్శిస్తూ జీవితంలో అప్రమత్తంగా ఉండాలి అనే సందేశాన్ని ఇస్తుంది.ఈ కవితలోని భావం మన మనసులను తట్టి లేపుతుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (20)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి డాక్టర్ భారతి తెలుగులోకి అను సృజన చేసింది.
“ఏదైనా మంత్రం వేసి … నన్ను చలాకైన
“వాడిగా మార్చి పడేయ రాదు ?
“ నా ఈ అమాయకత్వం నాకు చాలా
“కష్టాల్ని తెచ్చి పెడుతోంది మరి !
మంత్రం అంటే మన మనసును నియంత్రించే సాధనం.అంటే మన ఆలోచనలను కంట్రోల్ చేసే మార్గం.ఇందులో మంత్రం అంటే ఒక అద్భుతమైన మార్పు లేదా ప్రత్యేకమైన శక్తి సాధనతో తన స్వభావాన్ని మార్చుకోవడం.మంత్రాలతో లేదా మాయాజాలంతో మన జీవితాలను వెంటనే మార్చడం సాధ్యం కాదు,కానీ,తన ఆలోచనా విధానం ద్వారా తన స్వభావాన్ని మెరుగుపరుచు కోవచ్చు.చలాకైన వాడిగా ఉండాలి అంటే తాను బాగా అనుభవాల నుండి నేర్చుకున్న కార్యాచరణతో సమర్థత చూపించే వ్యక్తిగా మారాలి అని సూచిస్తుంది.కానీ,వ్యక్తి మానసికంగా ఉన్న అమాయకత్వం నుండి ఒత్తిడిని అనుభవిస్తూ బ్రతుకు ఒక సవాలుగా నిలుస్తుంది. ‘నా ఈ అమాయకత్వం నాకు చాలా/కష్టాల్ని తెచ్చి పెడుతోంది’/ మరి ఇక్కడ తాను తన అమాయకత్వంతో బాధలను అనుభవిస్తున్నాడు. అమాయకత్వం వల్ల అపరిచిత వ్యక్తుల చేతిలో సులభంగా మోసపోతున్నాడు.మరియు తాను ఏమి చేయాలో తెలియక పోవడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.తనలోని అమాయకత్వం తనకు కష్టాలను,సమస్యలను తెచ్చి పెడుతుంది.అతను తన సహజమైన అమాయకత్వం విడిచిపెట్టాలని,తన స్వభావాన్ని సమర్థమైన చలాకీతనంగా మార్చుకోవాలని అనుకుంటున్నాడు.కానీ,అతనికి ఆ మార్పును ఎలా పొందాలో తెలియకపోవడం వల్ల తీవ్రమైన ఆందోళనకు గురి అవుతున్నాడు.చలాకిగా ఉండాలంటే ముందుగా తన మీద తనకు పూర్ణ విశ్వాసం ఉండడం అవసరం.తాను సాధించిన చిన్న చిన్న విజయాలను గుర్తుంచుకోవడం ద్వారా తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు.తన మనసులోని భావాలను,స్పష్టంగా,ధైర్యంగా చెప్పాలి.తాను ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను తెలుసు కోవడం ద్వారా తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ముందుగా చిన్న చిన్న పనులు చేయడం ద్వారా తమను తాము పరీక్షించుకోవాలి.దాని ద్వారా అమాయకత్వం తగ్గి చలాకితనం ఉప్పొంగుతుంది. ఉత్సాహం,ఉత్తేజం పెరుగుతుంది.ఎవరైనా తమ జీవితంలో తప్పులు చేయడం సహజం.తాను ఆ తప్పుల నుండి గుణపాఠం నేర్చుకొని అమాయకత్వాన్ని విడిచి పెట్టి జీవితంలో ముందుకు సాగాలి.అప్పుడే విజయాలు సాధించడం సాధ్యం అవుతుంది అని గుల్జార్ షాయరీ కవితలోని భావాలు తెలియ జేస్తున్నాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (21)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది. గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలను రంజింప చేస్తాయి.
“నిర్దయుడా … నేను మరణించాక కనీసం
“నీకు ఆ కబురు కూడా చేరకూడదు !
“నువ్వు పిచ్చివాడిలా నా కోసం
“వెతుకుతునే ఉండు …
“నీకు నా సమాధి ఆచూకీ కూడా దొరక
“కూడదు !
ఈ కవితా పంక్తులు తన హృదయంలోని గాఢమైన బాధను మరియు ఆవేదనను,లోతైన భావోద్వేగాన్ని,అంతులేని కోపాన్ని, వ్యక్తపరుస్తోంది. నిర్ధయుడా అంటే నీలో ఏ మాత్రం దయా దాక్షిణ్యం, ప్రేమ,అభిమానం కనిపించడం లేదు.అందుకే తాను దయ లేని వాడా అని అతనిని సంబోధిస్తున్నాడు.ఈ పదం వ్యక్తి గుండెల్లో నెలకొన్న తీవ్రమైన గుబులును, మనస్సులో దాగి ఉన్న బాధను స్పష్టంగా తెలియజేస్తుంది.తాను అత్యంత ప్రియమైన వ్యక్తి అయినప్పటికీ తన పట్ల నిర్దయగా ప్రవర్తించాడని, తన లోపలి బాధను,ప్రేమను అర్థం చేసుకోలేదు అనే ఆవేదన వ్యక్తం అవుతోంది. నిర్దయుడా నేను మరణించిన తర్వాత కూడా నీకు ఆ వార్త కూడా తెలియకూడదు అనే నిర్ణయం కనబడుతుంది. ఇది ఒకింత ప్రతీకార భావాన్ని తనలో గల ఆవేశాన్ని వ్యక్తం చేస్తుంది.నేను జీవితంలో నీకు ఎంతో ముఖ్యం అని తెలుసు. అయినప్పటికీ తనను అసలు పట్టించుకోని విధంగా వ్యవహరించడం చేత తన మరణం గురించి అతనికి తెలుసుకునే అవకాశం కూడా ఇవ్వదలుచుకోలేదు అనే విషయం ఇందులో కనబడుతుంది.
‘నువ్వు పిచ్చివాడిలా తిరుగుతూ నా కోసం వీధుల్లో వెతుకుతూనే ఉండు’/అంటే ఇక్కడ తాను అనుభవించిన బాధతో పాటు తనకు ప్రియమైన వారు తన ప్రాముఖ్యతను మరణించిన తర్వాత అయినా గుర్తించాలి అని కోరుకుంటున్నాడు.తాను చేసిన తప్పును గ్రహించాలి.అతడు పిచ్చివాడిలా తన కోసం వెతుకుతునే ఉండాలి అనే భావం వ్యక్తం అవుతుంది.నీకు నా సమాధి ఎక్కడ ఉందో అనే ఆచూకీ కూడా దొరకకూడదు.ఇది ఒక అంతిమ ఆవేదన.తాను మరణించిన తర్వాత కూడా తన కోసం గుండె నిండా గుబులతో తహతహలాడుతుండాలి అనే ఆకాంక్ష వ్యక్తం అవుతుంది.ఇది ఆ వ్యక్తి గుండెల్లో పొంగి పొర్లుతున్న బాధను తెలియజేస్తుంది.ప్రియమైన వ్యక్తి మీద బాధతో,తీరని ఆవేశంతో,ఆగ్రహంతో చెప్పిన భావోద్వేగపూరితమైన భావాలు ఇందులో కనిపిస్తున్నాయి.ఇది ఒక విధంగా మనసులోని గూడు కట్టుకున్న బాధను మరియు తన జీవితంలో మిగిలిపోయిన శూన్యతను వ్యక్తం చేస్తుంది.ఈ కవితా పంక్తులు ప్రేమతో కూడిన ఆవేదన,ఎడతెగని కోపం మరియు విరహాన్ని ప్రతిబింబిస్తున్నాయి.ఇది ప్రియమైన ఆప్తుడు తన పట్ల చేసిన ఘోరమైన నిర్లక్ష్యానికి,ద్రోహానికి ప్రతిగా ఆవేదనతో కూడిన బాధను వ్యక్తం చేస్తున్నది.కవి గుల్జార్ తనలోని ప్రేమను,బాధను,ఈ షాయరీ కవితలో అద్భుతంగా పండించారు.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (22)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి ( డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“అతను నా కోసం
“వెతుకుతున్నాడు … బహుశా అతనికి
“అవసరం ఉందేమో !
“ఆ నేల కిందే నా సమాధి ఉందని అతనికి
“తెలియదు !
ఈ కవితా పంక్తులు గాఢమైన భావోద్వేగాలతో నిండి ఉన్నాయి.
అతను నా కోసం/వెతుకుతున్నాడు/అంటే అతను నన్ను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాడు.ఈ కవితా చరణం వ్యక్తిలోని గాఢమైన ప్రేమతో చేసే అన్వేషణను సూచిస్తుంది.ఇది ఒక వ్యక్తి మరొకరి కోసం ఎంతో ఆతృతగా వెతకడం మరియు అందు కోసం చేస్తున్న ప్రయత్నాన్ని తెలియజేస్తుంది.ఇది కేవలం తాను శారీరకంగా వెతకడం మాత్రమే కాక, ఆత్మీయంగా,భావోద్వేగాలపరంగా కూడా అతనిని కనుగొనాలని చేసే ప్రయత్నం కనిపిస్తున్నది.
‘బహుశా అతనికి/అవసరం ఉందేమో/ అంటున్నారు.అంటే అతనికి నాతో ఏదో సంబంధం ఉండాలి,అయినా ఏదైనా అవసరం ఉండవచ్చు అనే సందేహాం వ్యక్తం అవుతున్నది.ఇది అతని పట్ల గల ప్రేమ లేదా జాలితో కూడిన భావన. ‘ఆ నేల కిందే నా సమాధి ఉందని/అతనికి తెలియదు/అంటే అతనెక్కడైతే నిలబడి ఉన్నాడో ఆ స్థలంలోనే నా సమాధి ఉంది అనే సంగతి అతనికి ఎలా తెలుస్తుంది?అతను నా సమాధిని కూడా చూడ లేదు.కాబట్టి అతనికి సమాధి ఎక్కడ ఉందో తెలియదు.ఈ పంక్తి అత్యంత భావోద్వేగభరితమైనది.ఇది జీవితానికి సంబంధించిన ఒక విషాదకరమైన వాస్తవాన్ని తెలియజేస్తుంది.అతను నన్ను వెతుకుతున్నప్పటికీ నా ఆత్మకి ఎలా తెలుస్తుంది?నా ఆత్మకి తెలియదు లేదా నా పరిస్థితి అతనికి తెలియదు.అతను నిలబడి ఉన్న నేల కిందే నా జీవన గమనం ముగిసింది అని తెలియని స్థితి.ఇది ఒక వ్యక్తి తన ఆత్మను లేదా తన జ్ఞాపకాలను గురించి చెప్పినట్లుగా అనిపిస్తుంది.దీన్ని ఒక భావోద్వేగపు స్వరూపంగా చూడవచ్చు.దీనిలో ఒక మౌనమైన వేదన,అర్థం కాని దురవస్థ వ్యక్తం అవుతున్నాయి. ఇది తనకు ఎదురైన జీవితం,చేదు అనుభవాలను కవితాత్మకంగా వ్యక్తీకరించినాడని చెప్పవచ్చు.ఒకరి కోసం వెతికినా ఆ వ్యక్తి ఆత్మ యొక్క నిశ్శబ్ద పిలుపును లేదా గమనం ముగిసిన దశను గుర్తించ లేని పరిస్థితిని ఇది సూచిస్తుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (23)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)తెలుగులోకి అను సృజన చేసింది.
“ఇంత అలక దేని కోయి ….
“నీ అలక తీర్చే సులువేదైనా కాస్త చెప్పు !
“నా జీవితాన్ని తాకట్టు పెట్టేస్తా
“నీ అలక తీర్చడానికి !
ఇష్టం లేక మొహం చాటు చేయడం అలక.తాను ప్రేమించే వ్యక్తి తన పట్ల అపరాధం చేసినప్పుడు, కొంత సమయం ఉదాసీనంగా వ్యవహరించడం అలక.మనిషి అలకను అధీనంలో పెట్టుకోవడం కష్టం.అలక అంటే ఒక నిశ్చితమైన ఫలితాన్ని కోరి ఓ పథకం ప్రకారం ఆ పని సాధించేందుకు కోపం వహించడం,ఆ కోపం తెచ్చుకున్నదే అయి ఉంటుంది.ఆవేశంతో కూడిన కోపం కాదు.
ఈ కవితా పంక్తులు తాను తన ప్రియమైన వారి అలకను తీర్చే ప్రయత్నంలో వ్యక్తీకరించిన భావనలను సూచిస్తుంది.ఇది అంతా సున్నితమైన ప్రేమతో కూడిన భావనగా తోస్తోంది.తాను తన ప్రియమైన వారి అలకను తీర్చే ప్రయత్నంలో తన ప్రేమను అంకితభావాన్ని గాఢంగా వ్యక్తికరించాడు.
“ఇంత అలక దేని కోయి…/అతను తన ప్రియమైన వారిని ప్రశ్నిస్తూ అలక వెనక గల కారణాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది. అతను ఆశ్చర్యాన్ని, ఆరాటాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇంత పెద్ద అలక ఎందుకు?దీనికి ఏమి కారణం?అనే ప్రశ్నలతో అలక గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత వ్యక్తం అవుతుంది.అలక ప్రేమికుల మధ్య సంభాషణలో అనేక సార్లు వినిపించే మాధుర్యమైన ప్రశ్న.
‘నీ అలక తీర్చే సులువేదైనా కాస్త చెప్పు/’అతను ఎంతో వినయంతో ఆమె అలకను తీర్చటానికి మార్గం చెప్పమని అడుగుతున్నాడు.అతను తమను దూరంగా ఉంచిన కారణాలను తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.తనను తాను నిరూపించేందుకు అలక తీర్చడం ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నాడు.ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది.దీనికి ఏదైనా సాధ్యం అయ్యే సులభమైన మార్గం చెప్పమని కోరడం ద్వారా అతను తన సరళతను,నిజాయితీని చూపిస్తున్నాడు.
‘నా జీవితాన్ని తాకట్టు పెట్టేస్తా/నీ అలక తీర్చడానికి/ అంటున్నాడు.అతనికి ఆమె మీద ఎంతో ప్రేమ ఉంది.ఇది ప్రేమ యొక్క గాఢతను,అంకితభావాన్ని, ప్రాధాన్యతను తెలియజేస్తుంది.అతను తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధం అని చెప్పి ఆమె అలకను తీర్చాలనుకుంటున్నాడు.తన ప్రియమైన వారి సంతోషం కోసం అతను ఎంత దూరమైనా వెళ్లేందుకు తాను సిద్ధమని తన ప్రాణం త్యాగం చేయగల శక్తిని కలిగి ఉన్నాడని సూచిస్తుంది.ఇవన్నీ అతను తన ప్రేమను వ్యక్తపరిచే తీరును గాఢమైన ప్రేమ,భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయి.తనకు అత్యంత ప్రియమైన వారిని కోల్పోయే భయంతో వారి మనసును తిరిగి పొందడానికి ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమని సూచిస్తున్నాయి.ఇది ప్రేమ,దానిలోని భావోద్వేగాలను బలంగా చూపించే ఉదాహరణగా నిలుస్తుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (24)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“కొద్ది వెలుతురు అడిగా ఈ జీవితాన్ని !
“చూడండి … నేను ప్రేమించిన వాళ్ళు
“మొత్తానికే …. నిప్పు రాజేశారు !
ఈ కవితా పంక్తులు జీవితంలోని నమ్మకద్రోహం, ఆవేదన మరియు ఆకస్మికంగా ఎదురయ్యే మార్పులను అత్యంత గాఢంగా ప్రతిబింబిస్తాయి.
‘కొద్దిగా వెలుతురు అడిగా జీవితాన్ని’!/ఈ పంక్తి ద్వారా కవి చెప్పదలచిన భావం ఇది.జీవితంలో తాను తక్కువగానే ఆశించాను అని,కేవలం కొద్దిగా సంతోషం లేదా ఆశ కోసం మాత్రమే తపించాను అని,తన ఆశలు పెద్దవేమి కాదు అని,తను కోరుకున్నది ఒక సాధారణ వెలుగు మాత్రమే అని అంటున్నాడు.
‘చూడండి … నేను ప్రేమించిన వాళ్లు/అనే పంక్తి ద్వారా కవి తనకు అత్యంత సన్నిహితమైన వారితో,నమ్మిన వారితో గల ప్రేమతో కూడిన అనుబంధాలను సూచిస్తున్నాడు.ఇది ఒక గాఢమైన భావోద్వేగంతో కూడుకొని ఉంది.
‘ మొత్తానికే … నిప్పు రాజేశారు !/అంటే అతనికి ఎదురైన పరిస్థితులు మారాయి.ఆశ్చర్యంతో,బాధతో తాను ప్రేమించిన వారు,తనకు మద్దతుగా ఉండాలి అని భావించిన వారు, అనుకోకుండా తన జీవితాన్ని నిప్పుల బారిన పడేసినట్లుగా నడుచుకున్నారు. తాను ఎంతో ప్రేమించిన వారు,నమ్ముకున్న వాళ్ళే తీరా తన జీవితం నాశనం అవ్వడానికి కారణమయ్యారు అని,నిప్పు రాజేశారు అనే వాస్తవాన్ని తెలియజేస్తున్నది.అంటే జీవితం అంతా దహించుకుపోయినట్లు,అన్ని తారుమారు అయినట్లు తెలుస్తున్నది.ఇది నమ్మక ద్రోహం, అవిశ్వాసం మరియు ఆత్మీయ సంబంధాల్లో ఎదురయ్యే కఠిన అనుభవాలకు ప్రతిరూపం.ఇది జీవితంలో కలిగిన నమ్మక ద్రోహాన్ని,ఆకస్మిక ఆవేదనను ప్రతిఫలిస్తుంది.ఈ కవితలోని భావం ప్రతి మనిషి జీవితంలో బాధలు ఎదుర్కోవాల్సిన స్థితికి ప్రతినిధిగా నిలుస్తుంది.మనం జీవితంలో కొద్దిగా ఆనందం కోరుకుంటే అప్పుడప్పుడు నిరాశ, నమ్మకద్రోహం,భరించలేని తీవ్రమైన అనుభవాలు, కలలో కూడా ఊహించని చిక్కులు ఎదురవుతాయి. ఇది నమ్మకంతో ముడిపడిన సంబంధాల పట్ల కలిగే బాధను నిశితంగా చూపిస్తుంది.కవితలోని ఈ భావనలు తన అనుభవాలకే కాక సమాజంలో నెలకొన్న వాస్తవిక స్థితిగతులకు వర్తిస్తాయి. ఎందుకంటే మనం ఆశించే వెలుగుకు ప్రతిగా చీకటిని ఎదుర్కోవాల్సి వచ్చే సందర్భాలు అనేకం ఉంటాయి.కవి కోరుకున్న వెలుగుకు ప్రతిగా చీకటిని ఎదుర్కోవాల్సి వచ్చిన కఠోర సత్యాన్ని ఈ పంక్తులు సూచిస్తున్నాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (25)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ఇదెలాంటి విషమో … ఏమో హృదయాల్లో
“నిండి పోయింది ?
“మనిషి మరణించాడు కానీ నీడలు బతికే
“ఉన్నాయి !
ఈ కవితలోని భావాలు చాలా లోతుగా భావోద్వేగంగా ఉన్నాయి.
“ఇదెలాంటి విషమో …ఏమో హృదయాల్లో/“నిండి పోయింది ?/ ఈ కవితా పంక్తి చాలా తీవ్రమైన భావోద్వేగాన్ని ప్రతిబింబిస్తుంది.ఇది మనసుకు చెప్పలేని బాధను,తీవ్రమైన కలతను కలిగించే ఏదో ఒక సంఘటన లేదా పరిస్థితి హృదయాలను ప్రభావితం చేస్తోంది.ఇది అనుభవంతో తాను ఎదుర్కొన్న చిన్నపాటి సమస్యను,అంతు లేని విషాదాన్ని సూచిస్తోంది.ఒక వైవిధ్యమైన అసహనాన్ని మనసులో నిలుపుతుంది.
“మనిషి మరణించాడు కానీ నీడలు బతికే/ ఉన్నాయి/’ అంటే ఈ కవితా పంక్తి ధార్మికతను మరియు ప్రగాఢమైన తాత్విక భావనను వ్యక్తపరుస్తుంది.మనిషి మరణం అనగా శరీర రూపంగా అతను లేకపోవడం,కానీ,అతను చేసిన పనులు,ఆలోచనలు,జ్ఞాపకాలు ఇంకా సజీవంగా ఉంటాయి.ఇక్కడ నీడలు అనగా మనిషి శరీరాన్ని విడిచి పోయిన తర్వాత కూడా అతని జ్ఞాపకాలు, అతని ప్రభావం లేదా అతని చేష్టలు,ఇంకా మన జీవితాల్లో కొనసాగుతాయి అని చెప్పవచ్చు.నీడలు అనేది ఆ వ్యక్తి ప్రాముఖ్యతను,ప్రభావాన్ని తెలుపుతాయి.ఇది మన మరణానంతరం కూడా మిగిలి ఉండి,జ్ఞాపకాల ప్రాధాన్యతను చూపిస్తుంది. ఇది మనిషి జీవితం మరియు మరణం మధ్య ఉండే సంబంధాన్ని మరియు మన దైనందిన జీవితాలపై అది చూపించే ప్రభావాన్ని ఆవిష్కరిస్తుంది.ఈ షాయరీ కవిత మన జీవితం,మరణం వాటి మధ్య సంబంధం మరియు తన జీవితం ముగిసినా అతని జ్ఞాపకాలు,ప్రభావాలు ఎలా కొనసాగుతాయో ఆవిష్కరించేందుకు చేసిన ఒక అద్భుతమైన ప్రయోగం.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత. (26)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)తెలుగులోకి అను సృజన చేసింది.
“అందరికీ తెలుసు … నేను కట్టుకున్న
“ఇల్లు ఇంకా పచ్చిగానే ఉందని
“అయినా … జనం వాళ్ల ప్రార్థనల్లో వర్షం
“కురవాలని కోరుకున్నారు చూడండి !
ఈ కవితా పంక్తిలో ఆంతర్యం చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది.కవి గుల్జార్ హృదయంలో చెలరేగే భావాలను ప్రతీకాత్మకంగా చెప్పిన విధానం కనిపిస్తుంది.
“అందరికీ తెలుసు … నేను కట్టుకున్న/ఇల్లు ఇంకా పచ్చిగానే ఉందని/”దీని అర్థం ఏమిటంటే నేను కొత్తగా కట్టుకున్న ఇల్లు ఇంకా పచ్చిగా,తడిగా ఉంది. ఇక్కడ ‘ఇల్లు పచ్చిగా ఉండటం’ అనేది కొత్తగా నిర్మించిన ఇల్లు పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు అని సూచిస్తుంది.ఇది ఒక వ్యక్తి సొంత జీవితంలో కొత్తగా ప్రారంభించిన పని లేదా పరిసరాల గురించి చెప్పే ప్రతీకగా కూడా భావించవచ్చు. “అయినా … జనం వాళ్ల ప్రార్థనల్లో వర్షం/కురవాలని కోరుకున్నారు చూడండి/అంటున్నారు.ఇది ప్రతీకాత్మకంగా చెప్పబడింది.కానీ,వర్షం కోసం ప్రార్థనలు చేయడం అంటే జనాలు తమ అవసరాలు కోసం ప్రయత్నించడం మరియు ప్రకృతి సహకారం కోరుకోవడం సూచిస్తుంది.జనాలు వర్షం కురవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నారు.వర్షం అనేది బాహ్య పరిస్థితే అయినా,వర్షం వల్ల ఇల్లు తడిసి నష్టం కలిగించవచ్చు.ఏదైనా జరిగితే ఇల్లు తడిసిపోయే అవకాశం ఉందని కూడా అర్థం అవుతుంది.ఈ కవితా పంక్తులు వ్యక్తిగత మరియు సామాజిక స్థితి మధ్య విరుద్ధతను చూపిస్తున్నాయి.అతను పచ్చగా ఉన్న తన కొత్త ఇల్లును సంరక్షించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ,జనాలు తమ అవసరాల కోసం కోరుకునే కోరికల వల్ల తనకు సమస్యలు,వచ్చే అవకాశాన్ని తెలియజేశారు.కవి వ్యంగ్య రీతిలో వ్యక్తిగత జీవితం మరియు సామాజిక ప్రవర్తన మధ్య గల సున్నితమైన సంబంధాన్ని కవిత ద్వారా ఆవిష్కరింపజేస్తున్నారు. ఇది భిన్నమైన సందర్భాల్లో మనుషుల తీరును ప్రతిబింబించే ఒక ఉదాహరణగా నిలుస్తుంది అని చెప్పిన కవి గుల్జార్ భావాలు పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (27)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“చూడు ! నా మీద అలిగితే … మా “అమ్మలాగే అలుగు !
“మా అమ్మ పొద్దున్నే మాట్లాడింది
“సాయంత్రానికల్లా మరిచిపోయి నన్ను
“దగ్గర తీసేది !
ఈ పంక్తిలో కవి తన భావాన్ని చెప్పే విధానం అర్థపరంగా,ఆసక్తికరంగా ఉంటుంది.ఇందులోని భావం చాలా సున్నితంగా హృదయానికి హత్తుకునేలా ఉంది.కవితలోని ప్రధాన భావం అమ్మ ప్రేమ పై ఆధారపడి ఉంటుంది.
“నా మీద అలిగితే … మా అమ్మలాగే అలుగు”/కవి తన సహచరునితో లేదా తనకు ఎదురుగా ఉన్న వారితో చెబుతున్నారు.అంటే నువ్వు నా మీద అలిగినా,మా అమ్మలా ఆ అలక తక్కువ సేపే కలిగి ఉండాలి అనే భావాన్ని అందిస్తున్నారు.మా అమ్మకు అలక రావడం సహజం.కానీ,ఆ అలక ఎక్కువ సేపు నిలవదు.ఇక్కడ అమ్మ అనేది ప్రేమకు ప్రతిరూపం. అమ్మను అనురాగం,నిస్వార్థత,క్షమకు ప్రతీకగా ఉపయోగించారు.
“మా అమ్మ పొద్దున్నే మాట్లాడింది/సాయంత్రానికల్లా మరిచిపోయి/నన్ను దగ్గర తీసేది/అని అంటున్నారు.
ఇది ఒక ఉదాహరణగా కవి తన అమ్మను గురించి ఇలా ప్రస్తావిస్తున్నారు.తాను ఉదయం అలిగినా, సాయంత్రానికి ఆ అలక పూర్తిగా మరిచిపోయి, తనను తిరిగి ప్రేమగా దగ్గర తీసుకునేది.అంటే అమ్మ ప్రేమతో,క్షమతో తనను స్వీకరించేది.ఇక్కడ ‘మరిచిపోయి’ అనే పదం క్షమకు సూచన.ఇది అమ్మ ప్రేమలో సహజమైన లక్షణం అని చెప్పవచ్చు.ఇక్కడ అమ్మ ప్రేమను,దయను,క్షమను గుర్తు చేస్తూ తన అభిప్రాయాన్ని తెలుపుతున్నాడు.కవి ఈ పంక్తి ద్వారా ఎవరితోనైనా సంబంధాన్ని మధురంగా కొనసాగించాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమ్మలా ప్రేమతో మెలగాలి.అమ్మలా అలక తక్కువ సేపు ఉండాలి,తర్వాత ప్రేమకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే సందేశాన్ని తెలియ చేస్తున్నాడు.అమ్మ ప్రేమ ఎంతో గొప్పది.అమ్మలో స్వార్థం అనేది ఇసుమంత కూడా కనిపించదు.మనం కూడా అమ్మలాగే నిస్వార్థంగా ఉండాలి అని సూచిస్తున్నాడు.ఈ కవితలో వ్యక్తిత్వం,సంబంధాల కొనసాగింపుల గొప్పతనం వ్యక్తం అవుతుంది.ప్రత్యేకంగా ఏవైనా కొట్లాటలు,ఆగడాలు,అలకలు కలిగినప్పుడు కూడా ప్రేమతో మెలగాలి అని చెప్పడమే ప్రధానమైన ఉద్దేశ్యం.ఈ కవితలోని అద్భుతమైన భావాలు
పాఠకులను హృదయాలను రంజింప చేస్తాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (28)
తెలుగులోకి అను సృజన ; కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ నిప్పు రాజేసే వాళ్లకు ఏం తెలుసు !
“గాలి దిశ మార్చుకుంటే వాళ్లు కూడా కాలి
“బూడిదవుతారని ??
ఈ కవితా పంక్తులలో లోతైన భావనతో కూడిన ఒక గొప్ప ఆలోచన దాగి ఉంది.ఇది జీవిత సత్యాన్ని తెలిపే సున్నితమైన సామెతలా కనిపించడమే కాదు,పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తుంది.
“నిప్పు రాజేసే వాళ్లకు’/అంటే ఇతరులకు సమస్యలు సృష్టించే వాళ్ళు,అకారణంగా కలహాలు రేపే వాళ్ళు, తప్పుడు పనులు చేసే వాళ్ళు,ఎదుటి వాళ్లకు హాని చేయాలనే ఉద్దేశంతో వ్యవహరించే వ్యక్తులను సూచిస్తుంది.స్వార్థపరుల తలంపులు,ఆలోచనలు, చేసే పనులు ఎల్లప్పుడు తమ స్వప్రయోజనాలు నెరవేర్చుకోవడాని కోసమే ఉంటాయి.సమాజంలో స్వార్థపరులు తమ ప్రయోజనాల కోసం ఇతరుల జీవన విధానంలో కలిగించుకుని తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తారు.
“గాలి దిశ మార్చుకుంటే/”అంటే గాలి అనే పదం ఇక్కడ పరిస్థితులను లేదా సమయాన్ని సూచిస్తుంది.జీవితంలో ఏదీ ఒక్క చోటే స్థిరంగా ఉండదు.సమయాన్ని బట్టి పరిస్థితులు అప్పటికప్పుడు మారుతాయి.కన్ను మూసి తెరిచేలోగా క్షణం మారినట్టు,కాలచక్రం గిర్రున తిరుగుతుంది.గాలి దిశ అంటే పరిస్థితుల గతి.గాలి దిశ మారిపోతే ఎవరి స్థితి ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు?జీవితం ఏ వైపున పయనిస్తుందో ఎవరికి తెలియదు.తాము రాజేసిన మంటలు దిశ మార్చుకుని తమను కూడా కాల్చి బూడిద చేయ వచ్చు.మారిపోయే పరిస్థితిని ఊహించడం ఎవరి తరం కాదనేది స్పష్టం అవుతున్నది.
“వాళ్లు కూడా కాలి బూడిద అవుతారని “/ఎవరైనా వారు చేసే చర్యల ప్రభావం ఒక్క సారిగా తిరగబడితే అది వారి మీద కూడా దుష్ప్రభావం చూపిస్తుంది.ఇది కర్మ సిద్ధాంతాన్ని సూచిస్తుంది. దుర్మార్గంగా చేసే పనుల ప్రభావం ఎప్పుడో ఒకప్పుడు తమ పైన కూడా పడుతుందని చెప్పడం, ఎవరైనా దానవుల వలె రాక్షస ప్రవృత్తితో నడుచుకుంటే తాను తీసిన గోతిలో తానే పడడం జరుగుతుంది.దాని వల్ల కలిగే ఫలితం తనకే హాని కలిగిస్తుంది.సామాజికంగా లేదా వ్యక్తిగతంగా ఎవరికైనా హాని చేసే పని చేయడం వల్ల చివరికి అది వాళ్ళకే బెడిసికొట్టి తీరని నష్టంగా మారుతుంది అనే సందేశం తెలియజేస్తుంది.దుష్ట కార్యాలు చేయడం తాత్కాలికంగా లాభం కలిగించినప్పటికి,దీర్ఘ కాలంలో వాటి ప్రభావం తిరగబడి,ఆ దుష్కా.ర్యాలు చేసిన వారికే కష్టాలు కలుగుతాయి.అందు వల్ల ఇతరులకు మంచి చేయడం,న్యాయంగా నడుచుకోవడం,మనకు సమాజానికి మంచిది అని తెలియజేస్తుంది.ఎవరికైన హాని చేయడానికి ప్రయత్నించే ముందు ఆ కర్మల ప్రభావం తిరిగి తమ పైనే దాడి చేస్తుంది అనే నిజాన్ని గుర్తుంచుకోవాలి అనే సందేశం కవి గుల్జార్ భావాల్లో వ్యక్తం అవుతోంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (29)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“నీ జ్ఞాపకాల ఉదయాలను నాతోనే ఉండనివ్వు …
“ఎవరికి తెలుసు …ఎప్పుడు ఏ వీధి మలుపులో
“జీవితం అస్తమిస్తుందో ….?
ఈ కవితా పంక్తులు జీవితం యొక్క అస్థిరతను, దాని ఆవశ్యకతను తెలియజేస్తుంది.
“నీ జ్ఞాపకాల ఉదయాలను నాతోనే ఉండనివ్వు”
అనే చరణంలో ఒక వ్యక్తి తన మనసుకు సంబంధించిన ముఖ్యమైన జ్ఞాపకాలను ఎప్పటికీ తనతో ఉండాలని కోరుకుంటున్నాడు.ఎందుకంటే జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు.’ఉదయం’ అన్నది దినచర్యలో ఒక భాగం,ఇది రోజు వారి జీవితంలో కొత్త ప్రారంభాలకు సూచనగా నిలుస్తుంది.ఆ జ్ఞాపకాలతో కొత్త జీవన అనుభవాలను స్ఫూర్తిగా తీసుకొని జీవనం గడపాలనే భావనను వ్యక్తం చేస్తుంది.
“ఎవరికి తెలుసు … ఎప్పుడు ఏ వీధి మలుపులో/జీవితం అస్తమిస్తుందో … /అనేది జీవితం యొక్క అనిశ్ఛితి,అస్థిరతను, తాత్కాలికతను సూచిస్తుంది.మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియని పరిస్థితిని తెలుపుతుంది. మనకు ముందు ఏం జరుగుతుందో ?ఎక్కడ ఎలా మార్పులు చోటు చేసుకుంటాయో? అనే దానిని ఎవరు ఊహించ లేరు.జీవితం క్షణికం కాబట్టి అది ఎక్కడ ముగుస్తుందో? తెలియదు.జీవితాన్ని సమర్థంగా, గౌరవంగా కొనసాగించాలని,ప్రియమైన జ్ఞాపకాలను,హృదయంలో పదిలంగా నిలుపుకోవాలి అని తెలియజేస్తున్నది.జీవితం మనకు అందించే ప్రతి క్షణాన్ని,విలువైన కానుకగా భావించి, మధురమైన గత జ్ఞాపకాలను మనసులో నిలుపుకొని,వర్తమానాన్ని ప్రేమతో,ఆసక్తితో ఆస్వాదించాలనే గాఢమైన సందేశం కవి గుల్జార్ షాయరీ కవితలో వ్యక్తం అవుతుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (30)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన ; నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ప్రేమించు కానీ తిరిగి ఏమీ ఆశించకు
“దుఃఖం ప్రేమించడం మూలాన కలగదు …
“తిరిగి ప్రేమను ఆశిస్తావు చూడు,అప్పుడు “కలుగుతుంది.
ఈ పంక్తి ద్వారా ప్రేమకు సంబంధించిన ఒక విలువైన సందేశాన్ని అందిస్తున్నారు.
“ప్రేమించు కానీ తిరిగి ఏమీ ఆశించకు”అనేది ప్రేమ యొక్క అసలైన స్వరూపాన్ని తెలియజేస్తుంది. ప్రేమను స్వచ్ఛమైనదిగా ఎంచి,స్వార్థం లేకుండా ప్రేమించాలి అని ఇక్కడ సూచిస్తున్నారు.ప్రేమ అనేది నిర్మలమైనది,స్వచ్ఛమైనది.ప్రేమలో స్వార్థం లేకుండా ఉండాలి.ప్రేమించడం అంటే మన హృదయాన్ని ఇతరుల కోసం తెరవడం,వారి మీద మమతను చూపించడం.అయితే దీనికి ప్రతిఫలంగా వారి నుంచి ప్రేమ లేదా గుర్తింపును ఆశించడం,మన దుఃఖానికి కారణం అవుతుంది.
“దుఃఖం ప్రేమించడం మూలాన కలగదు”అని చెప్పడం,ఎవరైనా నిస్వార్ధంగా ప్రేమిస్తే దుఃఖం కలగదు.ప్రేమ సహజంగా స్వచ్ఛతతో కూడి ఉండాలి.ప్రేమించేటప్పుడు ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించ కూడదు.నిస్వార్థంగా ప్రేమిస్తే దుఃఖం కలుగదు.కానీ మీరు ప్రేమించిన వ్యక్తి నుంచి తిరిగి ప్రేమను ఆశించి అది లభించకపోతే దుఃఖం కలుగుతుంది.
“తిరిగి ప్రేమను ఆశిస్తావు చూడు,అప్పుడు కలుగుతుంది”/అని సూచించడం వల్ల మన దుఃఖానికి కారణం ఏమిటో తెలుస్తుంది. ప్రేమకు ప్రతిఫలం ఆశించడం ద్వారా ఆశలు పెరుగుతాయి. కానీ ఆ ఆశలు తీరకపోతే బాధ కలుగుతుంది. అందుకే ప్రేమ ఏ ప్రతిఫలాన్ని ఆశించనిదై ఉండాలి. ఈ భావం మనకు ఇతరులతో సంబంధాలను మరింత మంచిగా దృఢంగా నిలిపే మార్గాన్ని చూపుతుంది.మొత్తానికి ప్రేమను స్వార్థరహితంగా ప్రకటిస్తే మనం నిజమైన ఆనందాన్ని పొందగలం. అందు వల్ల ప్రేమను పంచడమే కానీ తిరిగి ప్రతిఫలాన్ని ఆశించకూడదనే భావన అని కవి గుల్జార్ కవితలో వ్యక్తం అవుతున్నది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత. (31)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“నీతో విసిగి వేసారిపోయామన్న వారిని
“వదిలివేయి
“భారంగా మిగలడం కన్నా జ్ఞాపకంగా మిగిలి
“పోవడమే మంచిది.
ఈ పంక్తులు అందంగా ఒక గొప్ప జీవిత సత్యాన్ని చెబుతోంది మరియు లోతైన భావనను కలిగి ఉంది.దీనిలో వ్యక్తిగత సంబంధాల మధ్య ఉండే సున్నితమైన సమతౌల్యతను గురించి చర్చించబడింది.
“నీతో విసిగి వేసారి పోయామన్న వారిని వదిలివేయి’/ఎవరు మనతో విసిగి వేసారి పోతారో, మనను అంగీకరించలేకపోతారో,అలాంటి వారిని వదిలి వేయడం మంచిదని సూచిస్తోంది.ఈ పంక్తిలోని భావన ఏమిటంటే,మన సమీపంలో ఉన్న వారు మనపై విసుగు చెంది,మనతో ఉండటానికి ఇష్టపడకపోతే,వారిని బలవంతంగా మనతో ఉంచడం అవసరం లేదని,ఎవరు మనకు అనుకూలంగా వ్యవహరించరో వారిని విడిచి పెట్టడమే సరైనదని అర్థం.
“భారంగా మిగలడం కన్నా జ్ఞాపకంగా మిగిలి/ పోవడమే మంచిది.”/ఎందు కంటే మనం వారికి భారంగా అనిపించడం కన్నా,మనతో గడిపిన మంచి జ్ఞాపకాలను మిగుల్చుకోవడం మంచిది.మన కుటుంబంలో,స్నేహితులలో లేదా ఇతర సంబంధాలలో మనం బలవంతంగా ఉండి వారికి మనం భారంగా మారడం మంచిది కాదు.ఒక వ్యక్తికి చెందిన గొప్ప జ్ఞాపకాలు జీవితాంతం మనతో ఉంటాయి.అందు వల్ల సంబంధాన్ని బలవంతంగా కొనసాగించకుండా గౌరవంగా ముగించడం మంచిదని చెప్పే ప్రయత్నం ఇది.ఇతరులతో మన సంబంధాలు బాగా ఉండాలి.ఇతరులతో మన సంబంధాలు భారంగా మారితే శాంతియుతంగా దూరమవడం కూడా ఒక మంచి నిర్ణయం.ఇది సంబంధాలను హాని లేకుండా,గౌరవంగా ముగించుకునే సమర్థమైన మార్గం అని కవి గుల్జార్ భావాల్లో వ్యక్తం అవుతుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (32)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)తెలుగులోకి అను సృజన చేసింది.
“దోస్త్ …గుర్తుంచుకో ! కాలం గడిచే కొద్దీ నేనేమో
“అందరిలా మారిపోతాననుకోకు !
“నిన్నెప్పుడు కలిసినా … గతంలోలాగే ఉంటుంది
“నీతో నా వ్యవహారం.
ఈ కవితా పంక్తులు స్నేహానికి,బంధానికి గల అవినాభావ సంబంధాన్ని సూచిస్తాయి.
“కాలం గడిచిన కొద్దీ నేనేమో/అందరిలా మారిపోతాననుకోకు/ అని స్పష్టంగా చెప్పడం,కాలం ఎంత మారినా,తాను తన వ్యక్తిత్వాన్ని,తన స్వభావాన్ని మార్చుకోనని స్పష్టం చేస్తున్నాడు.ఇది అతని నిజాయితీకి,స్థిరత్వానికి నిదర్శనం.కాలం ఎంత గడిచినప్పటికీ నేను మారిపోనని నిన్ను చూసిన ప్రతి సారి,మన అనుబంధం,మన స్నేహం గతంలో ఎలా ఉందో,ఇప్పుడు అలాగే ఉంటుందని తెలియజేస్తున్నాడు.
నిన్నెప్పుడు కలిసినా .. గతంలోలాగే ఉంటుంది”/ అని అంటున్నాడు.స్నేహం ఎంత కాలం గడిచినా మారదు.స్నేహితుల మధ్య ఉండే అనుబంధం ఎప్పుడు పూర్వం ఎలా ఉందో అలాగే కొనసాగుతుంది అనేది వాస్తవంగా తోస్తుంది.
“నీతో నా వ్యవహారం”/ఈ కవితా పంక్తి సంబంధం మీద ఉన్న విశ్వాసాన్ని తెలియ జేస్తుంది.నా నడవడి నీతో ఎప్పుడు నిస్వార్థంగా,నిజాయితీతోనే ఉంటుంది.నా స్వభావం ఎప్పటికీ మారదు.నీతో నా స్నేహం ఎప్పటికీ అదే తరహాలో ఉంటుంది అని చెప్పే ఓ హామీగా చూడవచ్చు.ఈ షాయరీ కవితలోని భావన ఒక వ్యక్తి తన మిత్రుడితో గల అనుబంధాన్ని,మారని వ్యక్తిత్వాన్ని,కాలం ఎంత మారినా స్నేహం వారి మధ్య గల అనుబంధం ఎప్పటికీ మారదనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. అసలుసిసలైన స్నేహం కాలంతో మారదు.అది కేవలం హృదయానికి సంబంధించినది.కవి గుల్జార్ స్నేహానికి, అనుబంధానికి గల గాఢతను షాయరీ కవితలో వ్యక్తం చేసిన తీరు అద్భుతంగా ఉంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (33)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ నేను అమాయకుడినే కావొచ్చు కానీ,
“నేనెలాంటి
“వాడినో తెలియదు నీకు !
“నా సంతోషం కోసం వంద సార్లైనా విరిగి
“ముక్కలవగలను !
ఈ కవితా పంక్తిలోని భావం ఒక వ్యక్తి తన అంతర్ముఖ భావనలను వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుస్తూ చెప్పినది.
ఇది ప్రస్తుతానికి అతని ప్రాధాన్యతల గురించిన లోతైన ఆలోచనను తెలియజేస్తుంది.
“నేను అమాయకుడినే కావొచ్చు/కానీ,వ్యక్తి తన అమాయకత్వాన్ని ఒప్పుకుంటున్నాడు.ఇది అతనిలోని నిజాయితీని సూచిస్తుంది.ఈ పంక్తిలో అతను తనను నిందించే వారికి సమాధానమిస్తున్నట్లు ఉంది.
“నేనెలాంటి వాడినో తెలియదు నీకు”/కానీ,అతను నిజానికి ఎలా ఉంటాడో,అతని గొప్పతనాన్ని, త్యాగపరత్వాన్ని ఇతరులు గుర్తించడం లేదని తపన పడుతున్నాడు.తన మనసులోని భావాలను ఇతరులు సరిగా అర్థం చేసుకోలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.తన వ్యక్తిత్వం గురించి,తన గొప్పతనం గురించి ప్రపంచానికి తెలియని తీరును తెలియజేస్తున్నాడు.
“నా సంతోషం కోసం వంద సార్లైనా విరిగి/ ముక్కలవగలను/అని అంటున్నాడు.ఇది తన ఆనందం కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోంది. అతడు తన ఆనందం కోసం ఎంత గొప్ప త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాడు.అవసరమైతే వంద సార్లు విరిగి ముక్కలైనప్పటికీ తన ఆనందాన్ని దక్కించుకోవడంలో వెనుకాడడు.ఇది అతని త్యాగానికి,తన భావోద్వేగాలకు అద్దం పడుతుంది. ఈ కవితా పంక్తి తన బాధ్యతాయుతమైన ప్రేమ పూర్వక స్వభావానికి ప్రతీక.అది తన లక్ష్యాలకు ఆటంకంగా వచ్చిన ఎన్నింటినైనా ఎదిరించి,తన ఆనందాన్ని సాధించడంలో వెనుకడుగు వేయని తత్వాన్ని చూపిస్తుంది.ఈ కవితా పంక్తులలో ఒక వ్యక్తి తన అసలైన స్వరూపాన్ని తెలియజేసే ప్రయత్నం కనిపిస్తోంది.అతను అమాయకుడిగా కనిపించినప్పటికీ,అతని భావోద్వేగాలు లోతైనవి. తాను స్వార్థ రహితమైన త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.తన ఉన్నతమైన లక్ష్యాలను, ఇతరులు అర్థం చేసుకోలేకపోతున్నారని స్పష్టం చేస్తున్నాడు.కవి గుల్జార్ షాయరీ కవితలో వ్యక్తం చేసిన భావాలు బాగున్నాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(34)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ఈ జీవితం నా మీద ఎందుకో
“అలిగినట్లుంది
“పోనీయ్ …ఇంకా వదిలేయ్ …
“ఇదేమి మొదటి సారి కాదుగా
“అలగనీ
ఈ కవితా పంక్తుల్లో జీవితాన్ని ఒక కష్ట సాధ్యమైన ప్రయాణంగా చూడటం కనిపిస్తుంది.
“ఈ జీవితం నా మీద ఎందుకో అలిగినట్లుంది”/అంటే జీవితంలో కొన్ని కష్టాలు, నిరాశలు ఎదురవుతు కలవరం కలిగిస్తున్నాయి. కానీ,ఆ కష్టాలు,సమస్యల గురించి అదే పనిగా ఎక్కువగా ఆలోచించడం,బాధ పడటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.నష్టమే ఎక్కువగా ఉంటుంది.ఈ కవితా పంక్తి తన మనసును పిండేస్తున్న నిరాశను,ఒత్తిడిని,జీవితం ఎందుకో ఇంత అన్యాయంగా ఉంది అనే భావనను వ్యక్తం చేస్తోంది.
“పోనీయ్ … ఇక వదిలేయ్ …”/ అని తాను మనసులో అనుకోవడం ఒక రకమైన బాధ నుంచి విముక్తి పొందటానికి చేసే ప్రయత్నం.ఇది అన్ని వదిలివేయడం కాదు,అన్ని పట్టించు కోకుండా ఉండడం కాదు.తాను జీవితాన్ని ఒక కొత్త కోణం నుండి చూసే ప్రయత్నం.తాను తన మనసులో నిండిపోయిన బాధను తేలికగా మరిచిపోయే ప్రయత్నం చేస్తున్నట్లుగా భావించవచ్చు.ఇందులో ఓ రకంగా జీవితంలోని కష్టాలను పెద్దగా పట్టించుకోకుండా వాటిని మరిచిపోయి ముందుకు సాగమనే సూచన దాగి ఉంది.
“ఇదేమి మొదటిసారి కాదుగా”/అని వ్యక్తం చేయడం వెనుక తాను ఇప్పటికే జీవితంలో ఇలాంటివి ఎన్నో సవాలక్ష సవాళ్లను సులభంగా ఎదుర్కొని ముందుకు సాగిపోయిన తీరు కనిపిస్తుంది.కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా ధైర్యంగా ఉంటూ ఈ క్షణాలను సమర్థవంతంగా ఎదుర్కోవడం మంచిది. ఇదేమి మొదటి సారి కాదుగా అనే చరణం చాలా కీలకంగా తోస్తుంది.తనకు జీవితంలో ఇప్పటికే అనేకానేక కష్టాలు,సమస్యలు ఎన్నో ఎదురైనాయని వాటిని ఎదుర్కొని బలంగా నిలబడిన అనుభవం ఉందని తెలియజేస్తున్నాడు.తన జీవితం తాత్కాలికంగా విసిగి ఉన్నదని అంటున్నాడు.తన జీవితం అన్యాయానికి లోనైందని దానిని సరిదిద్దడానికి తాను తన ఎదలోపల ఒక పరిష్కారం కోసం చేసే తపన,ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. ఇదేమి మొదటిసారి కాదుగా అనే మాటలు,గతంలో కష్టాలను అధిగమించిన అనుభవాలను గుర్తు చేస్తాయి.ఈ షాయరీ కవితలోని ప్రధాన ఉద్దేశం తాను కష్టాలను స్వీకరించి వాటిని అధిగమించ గల శక్తి తనకు ఉందని తెలియజేయడం.జీవితానికి అర్థం ఏమిటి?అనేది కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది.ఇంత వరకు తాను కష్టాలను ఎదుర్కొని బలంగా నిలబడిన అనుభవం ఉంది.మళ్లీ కూడా తాను అదే శక్తితో ముందు కెళ్లగల సాహసం ఉంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును కూడా స్వీకరించాలి.అప్పుడే తనను తాను నిరూపించుకోవడం జరుగుతుంది.జీవితం ఎప్పుడో ఒక్కోసారి పరీక్షకు గురి చేస్తుంది.నిరాశ, నిట్టూర్పులు,అదో రకం బాధ ఏదోలా అనిపించినప్పుడు,మనసుకు శాంతి నిచ్చే పని చేయడం,ధైర్యంగా ముందుకు సాగడం అనివార్యం అని కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(35)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“జీవించడానికి కొన్నే కొన్ని నా కాలపు
“క్షణాలు భద్రంగా దాచిపెట్టుకున్నాను !
“కానీ అవి ఎక్కడ … ఎప్పుడు
“ఖర్చైపోయాయో కూడా తెలీనే లేదు …
ఈ కవితా పంక్తులు జీవితం మీద లోతైన అవగాహనను ప్రతిబింబిస్తుంది.
“జీవించడానికి కొన్నే కొన్ని నా కాలపు క్షణాలు భద్రంగా దాచి పెట్టుకున్నాను/అంటున్నాడు. జీవించడానికి కొన్ని తన కాలపు క్షణాలను భద్రంగా దాచి పెట్టుకున్నా.జీవితంలోని అతి ముఖ్యమైన, విలువైన క్షణాలను జాగ్రత్తగా దాచి ఉంచుకున్నాడు అని అర్థం. “అవి ఎక్కడ … ఎప్పుడు/ఖర్చయి పోయాయో కూడా తెలీనే లేదు”/అని అంటున్నాడు.జీవితం అనేది ఎన్నో ఆకాంక్షలతో,ప్రయాణాలతో నిండిన ప్రక్రియ.మనం అప్రమత్తంగా లేకపోతే సమయాన్ని ఎలా గడిపామో కూడా తెలియదు.ఇది కాలం ఎంత వేగంగా వెళ్ళిపోతుందో,మళ్లీ తిరిగి రానిదో అనే విషయాన్ని గుర్తు చేస్తుంది.జీవితంలో కొన్ని మంచి అపురూపమైన సమయాలను భద్రంగా దాచి ఉంచాలని అనుకుంటాం.కానీ, కాలం ఎవరికి చిక్కక విలువైన క్షణాలు తెలియకుండానే ఇట్టే గడిచి పోతాయి.ఇది జీవితం ఎంత క్షణభంగురమైనదో, సమయం ఎంత విలువైనదో తెలియజేస్తుంది.మన జీవితంలో సమయానికి ఎంతో విలువ ఉంది,దానిని సద్వినియోగం చేసుకోవడం ఎంతో ముఖ్యమని ఈ కవితా పంక్తి తెలియ జేస్తుంది.కాలం అనేది నిరంతరం కదులుతూనే ఉంటుంది.మనం దాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి.మనం తెలియకుండానే అనవసర విషయాల్లో తలదూర్చితే అత్యంత విలువైన సమయాన్ని కోల్పోతాం.జీవితంలో ప్రతి క్షణాన్ని చురుకుగా ప్రయోజనకరంగా వినియోగించాలని కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ జీవితాన్ని జాగ్రత్తగా గడపాలి అనే ప్రేరణను కలిగిస్తాయి.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు అద్భుతంగా ఉన్నాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత. (36)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“రోజూ ఎలా ఉన్నావని అడుగుతూ నన్ను
“సిగ్గుపడేట్లు ఎందుకు చేసావు ?
“ఇంకా ఎలా ఉంటాను నువ్వే చెప్పు?
“నువ్వు నన్ను ఏ స్థితిలో వదిలేసావో .. అదిగో
“అలానే నా పరిస్థితి !
ఈ కవితా పంక్తులు లోతైన భావోద్వేగాలతో నిండినవి.తాను జీవితంలో ఎదుర్కొంటున్న బాధను,బాధ్యత లేకుండా వదిలేసిన వారి చర్యల వల్ల కలిగిన హృదయ వేదనను తెలుపుతున్నాయి
“రోజూ ఎలా ఉన్నావని అడుగుతూ నన్ను/సిగ్గు పడేట్లు ఎందుకు చేసావు?/అంటే మాట్లాడుతున్న వ్యక్తి తన జీవితంలో కలిగిన బాధను ప్రతి రోజు గుర్తు చేయడాన్ని మళ్లీ మళ్లీ వినలేకపోవడం వల్లనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు.తాను తన పరిస్థితిని ఎల్లప్పుడు గుర్తు చేయడం వల్ల తనలో ఉన్న బాధ మరింత రెట్టింపు అవుతుంది.ఇది తనకు కలిగిన మానసిక ఆవేదనను స్పష్టం చేస్తోంది.
“ఇంకా ఎలా ఉంటాను నువ్వే చెప్పు ?/అని అంటే ఇంకా నేను ఎలా ఉంటానో నీకు తెలుసు కదా. ఇప్పుడు నీవు ఇంతకు పూర్వం నన్ను చూసిన విధంగానే బాధలను అనుభవిస్తూ ఉన్నాను.నువ్వు నన్ను ఏ స్థితిలో వదిలేసావో తిరిగి అదే స్థితిలో ఉన్నాను అనే భావనను తెలియజేస్తున్నాడు..
“నువ్వు నన్ను ఏ స్థితిలో వదిలేసావో… అదిగో అలానే నా పరిస్థితి/అంటే ఇక్కడ తన జీవితం ఎలాంటి మార్పు లేకుండా ఎటువంటి పురోగతి లేకుండా అదే స్థితిలో కొనసాగుతుందని అతను తెలుపుతున్నాడు.తనను పట్టించుకోనట్టి బాధ్యతాహీనతను స్పష్టంగా ఎత్తి చూపుతున్నాడు. ఇది తాను ఎవరో ఒకరిని నమ్మినారు,ఆ నమ్మిన వ్యక్తి వారిని మధ్యలో వదిలి వేయడం వల్ల ఎదుర్కొంటున్న ఒంటరితనాన్ని,బాధను వ్యక్తం చేస్తున్నట్లు తెలుపుతుంది.ఈ పంక్తులు ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితంలోని లోతైన బాధలను ప్రతిబింబిస్తాయి.అతను వదిలిపెట్టడం వల్ల తాను అనుబంధాన్ని కోల్పోవడం,ఒంటరితనం ఎదుర్కోవడం జరిగింది.ఈ కవితలో భావోద్వేగాల తీవ్రత మరియు సంబంధం పట్ల బాధ్యత అనేది లేకపోవడం స్పష్టంగా వ్యక్తం అవుతుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (37)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“నా కళ్ళల్లోకి రావద్దని ఆమెకి చెప్పండి
“ఎవరైనా …
“ఆమె కలలో కొచ్చిన రాత్రి మెలకువ
“వచ్చేస్తుంది ….
“హృదయం ముక్కలవుతుంది?!
ఈ కవితా పంక్తులు భావోద్వేగాలతో నిండి ఉన్నాయి.
“నా కళ్ళల్లోకి రావద్దని ఆమెకి చెప్పండి/ఎవరైనా…/ఇది ఒక ఆకాంక్షను,ఒక విజ్ఞాపనను వ్యక్తం చేస్తోంది.ఆమె అంటే ఎవరో ప్రత్యేకమైన వ్యక్తి అని,ఆమె గురించి తనకు బలమైన భావనలు ఉన్నాయని తెలియ జేస్తున్నాయి.నా కళ్ళల్లోకి రావద్దని అంటే ఎందుకో తెలియదు?ఆమె చూపులు తన మనసుని కలవరం కలిగిస్తాయి.ఆమె గుర్తుకు వచ్చి ఆమెకు చెందిన ఆలోచనలు వేధించి,వెంటాడుతాయి.తాను ఆమెను ఎంతగానో గాఢంగా ప్రేమించాడు.కాబట్టి తన ఆవేదనను ఈ కవిత పంక్తులలో వ్యక్తం చేస్తున్నాడు.
“ఆమె కలలోకొచ్చిన రాత్రి మెలకువ వచ్చేస్తుంది …/ ఎందు కంటే ఆమె కలలో వచ్చినట్లయితే తన నిద్రకు భంగం కలుగుతుంది.ఆ ఆలోచన వల్లనే తన హృదయం ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. ఇది ఒక చిధ్రమైన అనుభవాన్ని చెప్పే పంక్తి.ఆమె కలలోకి వచ్చి తన నిద్రను దూరం చేస్తోంది.ఇది మనసు ప్రశాంతతను కోల్పోయిన పరిస్థితిని సూచిస్తుంది.
“హృదయం ముక్కలవుతుంది?!/అంటే ఇది ప్రేమ,వ్యథ,అసహనాన్ని వ్యక్తపరిచే పదాలుగా కనిపిస్తున్నాయి.ఇది తన మనసులోని బాధ లేదా విరహాన్ని సూచిస్తుంది.ఆమెపై తన ప్రేమ ఎంత ప్రగాఢంగా ఉందో ఆమెని గుర్తు చేసుకునే ప్రతి సారి హృదయం బాధపడుతుందని ఇది తెలియజేస్తుంది.
ఈ షాయరీ కవితా పంక్తులు ప్రేమ,విరహం,బాధల నడుమ ఉండే అంతరంగిక స్థితిని ప్రతిబింబిస్తాయి. ఇది ఒక వ్యక్తి తన మనసులోని అలజడిని, హృదయంలోని బాధను వ్యక్తపరుస్తున్నట్లు తెలుస్తోంది.కవి గుల్జార్ ఎవరో తనకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిని గుర్తు చేసుకుంటూ తనలో కలిగే భావోద్వేగాలను షాయరీ కవితా రూపంలో వ్యక్తం చేస్తున్నారు.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత. (38)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“నా ఊహా ప్రపంచం ఎంత అందంగా
“ఉంటుందనుకున్నావు ?
“నీతోనే మొదలవుతుంది …
“నీవుగానే ముగుస్తుంది !
ఈ కవితా పంక్తులు మనసులో ఊహ ప్రపంచం గురించి,వ్యక్తిగత భావోద్వేగాలను,ఆత్మీయ ప్రేమను వ్యక్తపరుస్తున్నాయి.ఇందులోని ఒక్కో పదం ఒక లోతైన భావనను వ్యక్తపరిచేలా ఉండటం గమనించవచ్చు.
“నా ఊహా ప్రపంచం ఎంత అందంగా/ ఉంటుందనుకున్నావు?/ఊహ ఎంత అందంగా ఉంటుందో నీకు తెలియదు.మన ఊహా ప్రపంచం మనకి ఎంతో ప్రత్యేకమైనది.దీన్ని వేరొకరితో పంచుకోవాలనుకోవడం ఒక భావోద్వేగం.ఆ వ్యక్తి తన ఊహలకు సంబంధించిన కేంద్ర బిందువుగా ఉందని చెప్పే ప్రయత్నం ఇది.
“నీతోనే మొదలవుతుంది …/అంటే ఇది జీవితంలోని ఆరంభం,స్ఫూర్తి ఎక్కడ నుంచి వస్తుందో చూపుతుంది.తన ఊహలు,తన కలలు ఏవైతే ఉన్నాయో అవి ఆ వ్యక్తితోనే ప్రారంభం అవుతాయన్న భావన గోచరిస్తుంది.ఇక్కడ ఆ వ్యక్తి ప్రాముఖ్యత,ప్రేమను వ్యక్తం చేస్తుంది.
“నీవు గానే ముగుస్తుంది !ఇది తన జీవిత ప్రయాణం.ఆ వ్యక్తితోనే ముగుస్తుందన్న భావనను సూచిస్తుంది.నీతోనే మొదలవుతుంది..నీవుగానే ముగుస్తుంది.ఇది ప్రేమ భావనను ఆ వ్యక్తి ప్రాముఖ్యతను వ్యక్తపరుస్తుంది.ఆ వ్యక్తి లేకపోతే తన ఊహా ప్రపంచానికి,తన కలలకు,తన జీవితానికి ఎలాంటి అర్థం ఉండదని స్పష్టంగా చెప్పడం.తన ఊహల ప్రపంచం ఆ వ్యక్తితోనే ప్రారంభమై అదే వ్యక్తితో ముగిసేంతగా బలపడిందని అర్థమవుతుంది.ఈ షాయరీ కవితా పంక్తులు ఒక సునిశితమైన ప్రేమను,ఆత్మీయతను,అలాగే ఆ వ్యక్తి జీవితంలో ఉన్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తాయి. ఇవి ఒక్క స్నేహం,ప్రేమ లేదా బంధానికి సంబంధించిన భావంగా భావించవచ్చు.ఈ భావాలు తన జీవితంలో సహజమైన సంబంధం ఎలా ఉంటుందో తెలుపుతాయి.ఈ కవితలో తాను ఎవరినైతే అంత గాఢంగా ప్రేమిస్తాడో వారికే తన జీవితం అంకితం అవుతుంది అనే భావన వ్యక్తం అవుతుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత. (39)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“నీ ప్రేమ కూడా చాలా ఖరీదైనదిలా
“ఉంది …
“రోజు రోజుకి పెరిగిపోయే ధరలా !
ఈ కవితా పంక్తి ఒక రూపకం (metaphor) ద్వారా వ్యక్తీకరించబడింది.
“నీ ప్రేమ కూడా చాలా ఖరీదైనదిలా/ఉంది/అని చెప్పడం ద్వారా ఆ ప్రేమ అత్యంత విలువైనదిగా లేదా అందరికీ సులభంగా అందని దానిగా అభివర్ణించబడుతోంది.
“రోజు రోజుకి పెరిగిపోయే ధరలా/అంటే మీ ప్రేమ చాలా విలువైనదిగా అనిపిస్తుంది.అది రోజు రోజుకి పెరిగే ఖరీదైన వస్తువుల ధరల మాదిరిగా ఉంది. అంటే,అది సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండేలా లేదు.కానీ ఎంతో విలువైనదిగా ఉంది.ఇది ప్రేమ విలువ రోజు రోజుకు పెరుగుతోందని చెప్పడమే కాకుండా దాన్ని పొందడం కష్టతరంగా మారుతోందనే భావనను కూడా సూచిస్తుంది.ప్రేమ ఎంత ఎక్కువ ఆత్మీయతను కలిగిస్తుందో,అది అంత విలువైనదిగా భావించబడుతుంది.రోజు రోజుకు ప్రేమలో కలిగే కొత్త అనుభూతులు,మధురమైన క్షణాలు,ఆ ప్రేమ విలువను మరింత పెంచుతాయి. ప్రేమను సాధించడం లేదా దానిని పొందడం చాలా కష్టం అవుతుందనే భావన కూడా ఇందులో దాగి ఉంది.ప్రేమ రోజు రోజుకు పెరిగి అది సాధించలేనిదిగా అనిపించవచ్చు.ఈ కవితా పంక్తులు ఆ ప్రేమ విలువను, ప్రేమలో దాగి ఉన్న విశిష్టతను,ప్రేమ యొక్క ప్రత్యేకతను తెలియజేస్తుంది.అలాగే ప్రేమను పొందడం ఎంతో కష్టం అనే వాస్తవాన్ని వ్యక్తం చేస్తుంది.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావనలు అద్భుతంగా ఉన్నాయి.పాఠకుల హృదయాలను రంజింపజేస్తాయి.
(మొదటి భాగం, మహాబోధి బుద్ధవిహార)
బౌద్ధధర్మాన్ని సామాన్య ప్రజలలోనికి కొనిపోవడానికి జాతకకథలు ఎంతో ఉపయోగపడ్తాయి. ఈ జాతక కథలు పాలీ(భాష)లోని గాథలకు సందర్భసహిత వివరణలు. ఇవి పాలీత్రిపిటకాలలో ఖుద్ధనికాయంలో భాగంగా ఉన్నాయి. బౌద్ధులకు ఆదర్శ గ్రంథాలు త్రిపిటకాలు. అవి: 1. వినయపిటకం, 2. సుత్తపిటకం, 3.అభిధమ్మపిటకం.ఈ త్రిపిటకాలలో రెండవదైన సుత్తపిటకానికి సంబంధించిన గ్రంథమే ఖుద్ధనికాయగ్రంథం.
ఈ ఖుద్ధనికాయగ్రంథం మొదటిభాగంలో 150(నూటాయాబై) కథలున్నాయి. ఆ కథలను పదివర్గాలుగా విభజించారు. అవి: 1) అపణ్ణక, 2) శీల, 3) కురుఙ్గ (కురుంగ), 4) కులావక,5) అత్థకామ, 6) ఆసీస, 7) ఇత్థి, 8) వరుణ, 9) అపాయిమ్హ .10) లిత్థ, 11) పరోసత, హంచి, కుసనాళి, 14) అసమ్పదాన, 15) కకణ్టక వర్గాలు. ఇందులోని ఒక్కొక్క వర్గంలో ‘పది కథలు’(15I10R మొత్తం 150) ఉన్నాయి.
ఒకటి రెండు కథల్లో తప్ప, ప్రతికథలోనూ ఒక వర్తమాన కథ, ఒక అతీతకథ(గతాపూర్వ)జన్మకు సంబం ధించినకథ) ఉంటుంది. అంతేగాకుండా ఈ కథల్లో మనుష్యులు, యక్షులే గాకుండా రకరకాలప్రాణులు ాజంతువులు (ఏనుగు, కోతి మొసలి మొదలైనవి), పక్షులు(పావురాలు, చిలుకలు మొదలైనవి) కూడా కనబడుతాయి. ముందుగా ఆ కథల్లోనుండి వ్యాపారుల కష్టనష్టాల గురించి తెలుసుకుందాం,
వ్యాపారుల కష్టనష్టాలు ా సమాజం (అపణ్ణకకథ)
సరుకుల రవాణాకు పూర్వకాలమైన, ఇప్పుడైనా కష్టమైన పనే. సరుకుల రవాణా, ధరల నిర్ణయం, అనిశ్చిత స్థితి, అస్థిరస్థితి, భయాందోళనతోనే ఉంటుంది. ఆనాటికి, ఈనాటికి సరుకులరవాణాలో వేగం పెరిగితే పెరగవచ్చు. కాని, అవే సమస్యలు, కొన్ని వందల ఏండ్లనుండి వ్యాపారస్థులకు ఎదురు అవుతునే ఉన్నాయి. జాతకకథల ద్వారా ఆ వ్యాపారుల సాధకబాధకాల గురించి తెలుసుకుందాం.
ప్రాచీనకాలంలో అయినా, నేటి ఆధునికకాలంలో అయినా కొన్ని ప్రాంతాల్లో సరుకు రవాణావాహనాలు అడవులగుండా వెళ్ళాల్సి ఉంటుంది.ఆ అడవలు అనేకరకాలుగా ఉంటాయి. అవి: 1) దొంగల అడవి, 2) క్రూరమృగాల అడవి, 3) నీరులేని అడవి, 4) అమనుష్యుల అడవి, 5) తిండి దొరుకని అడవి.
ఈ అడవులగుండా భూమార్గంలో తూర్పు నుండి పడమరకు, పడమటి నుండి తూర్పుకు వ్యాపారనిమిత్తం బండ్లమీదసరుకు తీసుకొని రండు, మూడుజట్ల వ్యాపారులు కలిసి వెళ్లేవారు. ఆ జట్లకు ఎదురయ్యే, కలిగే లాభనష్టాలు: ` సాధారణంగా దారి, నీరు, ఆహారం, సరుకులు, వాటి విలువనిర్ణయించడాలు, దొంగలు, యక్షులు, మోసగాళ్లు మొదలైన సమస్యలు ఎదురవుతాయి. వాటి గురించి తెలుసుకుందాం.
రెండు, మూడుజట్ల వ్యాపారులబండ్లు ఒకేసారి ప్రయాణం చేస్తే ఒనగూరే కష్టనష్టాల గురించి, ఒక్కొక్కజట్టు వెళ్తే ఒనగూరే కష్టనష్టాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపణణ్జజాతక కథలో బోధిసత్వుడు ఒక వ్యాపారికుటుంబంలో, సౌమ్యుడు మరో వ్యాపారికుటుంబంలో జన్మించారు. వీరిద్దరు తూర్పు నుండి పడమరకు, పడమటి నుండి తూర్పుకు సరుకు అమ్ముకోవడానికి వెళ్లేవారు.
బోధిసత్వుడు (మొదటి వ్యాపారి) 500 బండ్లతో సరుకు అమ్ముకోవడానికి, మరో వ్యాపారి కొడుకు ` సౌమ్యుడు కూడా 500 బండ్లతో సరుకు అమ్ముకోవడానికి బయలుదేరారు.
ఇద్దరూ ఒకే సారి వెళ్తే పశువులకు మేత, నీళ్లు కష్టమౌతాయని బోధిసత్వుడు భావించాడు. అంతేగాకుండా దారి బాగా నలిగి, గతుకులు, గాళ్లు పడుతుందని, నీటికి ఇబ్బంది అవుతుందని, ఇద్దరిలో ఎవరో ఒకరు ఒక నెల ఆలస్యంగా బయలుదేరితే మంచిదని బోధిసత్వుడంటాడు. అప్పుడు సౌమ్యవ్యాపారి తానే ముందుగా వెళ్తానంటాడు.అందుకు బోధిసత్వుడు అంగీకరిస్తాడు.
ముందుజట్టువారి ఆలోచనలు: ముందుజట్టుకు ఎదురయ్యే లాభనష్టాలు
- దారి నలిగి పోదు. గతుకులుండవు. పశువులకు కావలసినంత మేత, నీరు పుష్కలంగా లభిస్తుంది, దారిలో ఆకుకూరలు, కూరగాయలు కొదువలేకుండా దొరుకుతాయి. పైగా ముందుగా వ్యాపారం చేయడం వల్ల ఇష్టం వచ్చిన ధరలకు సరుకులు అమ్ముకోవచ్చు.
వెనకజట్టుకు ఎదురయ్యే లాభనష్టాలు: వెనక జట్టువారి ఆలోచనలు
మొదటి జట్టు నష్టాలు రెండవ జట్టుకు లాభాలుగా మారుతాయి. 1) మొదటిజట్టులో వెళ్లినవారు ా శ్రమించి ఎగుడుదిగుడు బాటలను (ఎత్తుపల్లాలు)సరిచేస్తారు. 2) మొదటిజట్టువారి ఎడ్లు దారిలో ముదురుగడ్డి తింటాయి. 3) నీరు లేని చోట చెలిమెలు తవ్వుతారు.
వెనక జట్టుకు లాభాలు:
1) బండ్ల ప్రయాణం చేసే దారి సుగమంగా ఉంటుంది.
2) లేత పసిరిక(గడ్డి), లేత కూరగాయలు దొరుకుతాయి
3) నీటి కోసం శ్రమించాల్సి అవసరం లేదు. చెలిమలు, ఇతర నీటివనరులు సిద్ధంగా ఉంటాయి.
4) ముందుజట్టుగా పోయినవారు సరుకులధరలు నిర్ణయించాలంటే ప్రాణం పోయినంత పని అవుతుం ది. సరుకులధరలు ముందుజట్టునిర్ణయిస్తుంది. ఆ శ్రమ వెనకజట్టుకు ఉండదు. కాబట్టి సరుకులు తేలిగ్గా అమ్ముకోవచ్చు.
ముందు జట్టు నష్టాలు, వెనక జట్టుకు లాభాలు:
వెనక జట్టు నష్టాలు, ముందు జట్టుకు లాభాలు
యక్షులు: యక్షులతోబాధలు
జాతకకథలను చదువుతుంటె ఎక్కడ యక్షుల ప్రస్తావన వచ్చినా, వారిని నరమాంసభక్షకులుగానే చిత్రించారు, అది ఎంతవరకు నిజమో తెలియదు. వీరు అనేకరకాలుగా మోసాలు చేస్తుంటారు.
అ) నీరు ా మోసాలు
యక్షులు చేసే మోసాలు, క్రూరకర్మలు ఇన్నిఅన్ని కావు. 1) దారెంట బండ్లు వెళ్తుంటే వ్యాపారస్తులు తీసుకెళ్లే నీటిని మోసపు మాటలతో, మోసపువేషాలతో నమ్మించి, నీటిని పారబోయిస్తారు. 2) వారు (వ్యాపారస్తులు) నీరు లేకుండా బలహీనులైనప్పుడు వారిని పీక్కు తింటారు(అపణ్ణక కథ, పుట,85) చనిపోయినా కూడా వారిని పీక్కు తింటారు.
ఆ) యక్షులమోసపు వేషం:
యక్షుల నాయకుడు వయస్సులో ఉన్న ఎడ్లను అందమైన బండికి కట్టుకుంటాడు. విల్లంబులు, డాలు, కత్తి ధరిస్తాడు. పదిపన్నెండు మంది అనుచరులును వెంటబెట్టుకొని, తామరపూలను, కలువపూలను పట్టుకుంటాండు. తడిసిన వెంట్రుకలతో, తడిసిన బట్టలతో సంపన్నుల్లా బండి మీద కూర్చుంటాడు.
బురద అంటిన చక్రాలతో కూడిన బండితో వ్యాపారస్తులకు ఎదురు వస్తాడు. అనుచరులు కూడా అలాగే దాదాపు తమ నాయకుని వేషంలోనే ఉంటారు. ఆ బండిని, బండికున్న బురదను, తడిసిన బట్టలను, వెంట్రుకలను చూసి, వ్యాపారస్తొలవారు వర్షంలో తడిసి వస్తున్నారనే అనుకుంటారు.
నిజమన వ్యాపారి తన పైకి దుమ్ము రాకుండా ‘ముందుబండి’లో పయనిస్తుంటాడు. యక్షుడు అతని పక్కన బండిని పోనిస్తూ మెల్లెగా మాటల్లోకి దింపి, తేలిగ్గా బరువులేని బండ్లతో వెళ్లమని సలహా ఇచ్చి,వారిని నమ్మేటట్లు చేస్తారు. వారి వద్ద బానల్లో ఉన్న నీటిని పార బోయిస్తాడు.
పాపం! నిజమైనవ్యాపారస్తులు ఎంతదూరం వెళ్ళినా వాన వచ్చిన జాడగానీ, నీటిజాడ గానీ ఉండదు. నీరులేక నీరసించి, బలహీనం కాగానే యక్షులు వచ్చి, ఆ మనుష్యులను, వారి ఎద్దులను పీక్కుతింటారు.
వ్యాపారస్తుల ఎడారి ప్రయాణం:
వ్యాపారస్తుల ఎడారి ప్రయాణం కూడా చాలా కష్టాలతో కూడుకున్నదే (పుట. 92). ఎడారి ప్రయాణం సముద్రప్రయాణం (నీటిమీది ప్రయాణం) లాంటిదే.
అ) ఎడారిలో దారి తప్పడం:
సముద్రపుప్రయాణంలో దారి గుర్తులుండవు. అలాగే ఎడారిప్రయాణంలో కూడా నేలమీద దారి గుర్తులుండవు. అందువల్ల ఆ కాలంలో వ్యాపారాస్తులు(సార్థవాహులు) నక్షత్రాలను బట్టి దారి తెలుసుకోవడానికి ప్రయత్నించేవారు. లేదా దిశానిర్దేశం చేయడానికి ఎవరైనా నక్షత్రజ్ఞానంకలిగిన ఒక వ్యక్తిని తీసుకెళ్లేవారు. అతను రాత్రిపూట ఏమాత్రం కునుకుతీసినా ఆ బండ్లు దారి తప్పేవి. బండ్లు ఒక్కోసారి తిరిగి, బయటుదేరిన చోటికే వెళ్లే అవకాశాలు ఉండేవి.
ఆ) ఎడారిలో ఇసుక కాలడం:
ఎడారిఇసుకను చేతిలోకి తీసుకుంటే వేళ్లసందుల నుండి జారిపోయే సన్ననిదువ్వలా ఉంటది. పొద్దు ఎక్కువ అవుతున్న కొద్దీ ఇసుక వేడెక్కి, ఇసుక నిప్పులరాశిలా మారుతుంది. కాళ్లుకాల్తుంటే పశువులు నడవలేవు. ఈ కారణంగా ప్రయాణం జటిలమౌతుంది. ప్రయాణం చేయడానికి వీలు లేకపోవడంవల్ల ప్రయాణం ఆపేస్తారు.గుడారాల్లోనే ఉండిపోతారు.
ఒకవైపు మలమల మాడ్చే ఎండ, మరోవైపు నీళ్లకరవు:
నీటిజాడ(జలనిధి) గురించి తెలిసినవారు ఎవరైనా ఉంటే వారివారి ద్వారా జాడ తెలసుకొని, చెలిమెలు, బావులు తవ్వే ప్రయత్నం చేసేవారు. ఎడారిఇసుకలో ఎక్కడైనా ఆకుపచ్చగా దర్భగడ్డి ఉంటే అక్కడ నీరు ఉన్నట్టు గ్రహించేవారు. ఆ చోట చెవిపెట్టి నీళ్లు పారుతున్నట్లుగా, జలజల శబ్ద వస్తుందా, లేదా అని వినేవారు.
క్రూరమృగాలు: వీటికి తోడు క్రూరమృగాలు. ప్రాణభయం.
రాత్రిపూట ప్రయాణం చేయడానికి చీకటి దిశ సరిగా తెలియదు, క్రూరమృగాలు ఎక్కడినుండి వచ్చి మీద పడ్తాయో తెలియదు.
సంచారవ్యాపారుల మోసాలు:
సంచారవ్యాపారులు అంటే తాము తీసుకెళ్లిన వస్తువులపేర్లతో కేకలు వేసుకుంటూ, వీధులవెంట తిరుగు తూ, ఇంటింటికి సరుకుల అమ్ముకునే వారు. ఈ సంచారవ్యాపారుల్లో కొందరు అమాయకులైన ప్రజలను మోసం చేస్తుంటారు. విలువైన వస్తువులను, విలువలేని వాటిగా చెప్పి, వెల తక్కువ చేసి చెప్తారు.
వర్తకుల నియమం:
వర్తకుల నియమం ప్రకారం ఒక వర్తకుడు వచ్చి వెళ్లాకనే, మరొక వర్తకుడు వెళ్ళాలి. కాని ఒకేసారి ఇద్దరు వెళ్లకూడదు (పుట. 96).
లివితేటలుగల యువకుని వ్యాపారం:
శ్రేష్ఠికులంలో పుట్టిన బోధిసత్త్వుడు మహామేధావి, పండితుడు. అతను ఒకనాడు రాజాస్థానానికి పోతూ పోతూ, ఒక చచ్చిన ఎలుకను చూస్తాడు. దాని నక్షత్రబలాన్ని చూసి, ‘ఎవరైనా తెలివిగలవాడు ఈ చచ్చిన ఎలుకతో వ్యాపారం చేసి, భార్యాపిల్లలను పోషిస్తాడు’ అని అంటాడు.
ఆ మాటలు విన్న ఒక యువకుడు ఆ చచ్చిన ఎలుకను తీసుకెళ్ళి, పిల్లికి మేతగా ఒక కాకణికం(అణా వంటి చిన్న నాణెం)కు అమ్ముతాడు. దానితో కొన్ని బెల్లంముక్కలు కొంటాడు. ఒక పెద్దకుండా నీరు తీసుకొని పోయి, దారిలో పెట్టుకుంటాడు. అడవిలో పూలు ఏరుకొని, ఆ దారెంట వచ్చే దాహార్తులకు కావలసినన్ని నీళ్లుపోసి, వారికి ఒక బెల్లం ముక్క ఇస్తాడు. వారు సంతోషంతో తలా గొప్పెడు పూలు పెడ్తారు.
ఆ యువకుడు ఆ పూలను అమ్మి, మళ్ళీ బెల్లాన్ని కొని, వారికి ఇస్తాడు. తర్వాత అతను తోటకు వెళ్తే పూలమొక్కలు ఇస్తారు. వాటిని అమ్మి ఎనిమిది ‘కార్షాపణాలు’ సంపాదిస్తాడు. ఇంతలో ఒక రోజు గాలివాన వస్తుంది. రాజుగారి ఉద్యావనంలో చెట్లకొమ్మలు విరగి, ఆకులు రాలి, వాటితో నిండిపోతుంది. తోటమాలి అనుమతితో పిల్లలతో విరిగిన చెట్లకొమ్మలను ఏరించి, ఆ చెట్లకకొమ్మలను కుమ్మరి వాళ్లకు అమ్ముతాడు.
కకుమ్మరిఅతను కుండలు, బానలు ఇస్తాడు. వాటిని అమ్మితే 16 కార్షాపణాలు వస్తాయి. మొత్తంమీద అతనికి 24 కార్షాపణాలు సంపాదించాడు. వాటితో కుండలు కొని, మంచి నీరు నింపి, గడ్డిని అమ్మేవారికి (500మందికి) దాహం తీరుస్తాడు. వారు తిరిగి అతనికి ఏదైనా సహాయం చేయాలని అనుకుంటారు. వారి సహాయం తర్వాతతీసుకుంటానని చెప్తాడు.
ఆ యువకునికి ‘స్థలపథవర్తకులు (ఊర్లు తిరిగి వ్యాపారం చేసే వర్తకులు), జలపథవర్తకులు (నౌకావ్యాపారులు)’ వద్ద పనిచేసే పరిచారకులతో పరిచయమైతది. ‘స్థలపథవర్తకుడు’ గుర్రాలతో వస్తున్నాడని తెలుసుకొని, గడ్డి వాళ్ల వద్దకు వెళ్లి, గడ్డిమోపులు మాట్లాడుకుంటాడు. ‘తన గడ్డి అయిపోయేవరకు వాళ్లు అమ్మకూడదని ఒప్పందం చేసుకుంటాడు. 500 గడ్డిమోపులను 1000 నాణాలకు గుర్రాల వ్యాపారికి అమ్ముతాడు.
తర్వాత పెద్దనౌకలో ‘జలపథవ్యాపారి’ సరుకు తెస్తున్నాడని తెలుసుకొంటాడు. ఎనిమిది కార్షాపణాలతో బండిని కొని, చక్కగా, ఆర్భాటంగా అలంకరించుకొని, నౌకాశ్రయానికి వెళ్తాడు. తన దగ్గరున్న ఉంగరాన్ని బయానాగా (అడ్వాన్స్)ఇచ్చి, సరుకుతో సహా నావను కొని, అక్కడికి దగ్గరలోనే ఒక చిన్న మంటపాన్ని ఏర్పాటుచేసుకుంటాడు.
‘బయటి నుండి ఎవరన్నా సరుకులు కొనే వ్యాపారులు వస్తే మూడవజాములో నాకు చెప్పండని అక్కడివారికి చెప్తాడు. సరుకులతో నౌక వారణాసి నుండి వచ్చిందని తెలియగానే వందమంది వ్యాపారులు సరుకులను కొన డానికి నౌక వద్దకు వెళ్తారు. అప్పుడే సరుకు అమ్ముడు పోయిందని, ఒక యువకుడు కొన్నాడని, అతను మూడవ జామున వస్తాడని చెప్తారు. మొత్తం మీద ఆ యువకునికి ఒక్కొక్కరు 2000కార్షాపణాలు ఇచ్చి మొత్త సరుకును కొనేస్తారు. మొత్తం మీద రెండులక్షల (200000) కార్షాపణాలు సంపాదించుకొని తిరిగి వారణాసి వెళ్తాడు.
చచ్చినఎలుకతో వ్యాపారంచేయడమనే ఈ కథవల్ల వ్యాపారస్తునకు ఉండవలసిన లక్షణాలు తెలుస్తున్నాయి. అత్యల్పసమయంలో పనికిరాని వస్తువు(చచ్చాన ఎలుక)ను కూడా తెలివితేటలతో అమ్మవచ్చు, ముందుచూపు, యుక్తి, లౌక్యం, సమయస్ఫూర్తి ఉంటే డబ్బును ఎంతైనా, ఎలాగైనా సంపాదించవచ్చ ని కూడా మనకు ఈ కథ వల్లతెలుస్తుంది. వ్యాపారస్తులకు ఉండవలసినివి తెలివితేటలు అని ఈ కథ నిరూపిస్తున్నది.
వ్యాపారులు ా సరుకు ధర నిర్ణయం ా అధికారులకు లంచాలు:
సర్వసాధారణంగా రాజులుకొనే సరుకులు ` గుర్రాలు, ఏనుగులు, మణులు, మాణిక్యాలు, బంగారం మొదలైనవి. ఆ సరుకులధరలు నిర్ణయించడానికి ఆనాడు ‘ప్రత్యేకఅధికారులు’ఉండేవారు. ఆ ప్రత్యేకఅధికారులు ‘న్యాయం’గా సరుకు వెల’ నిర్ణయంచి, వాటిని అమ్మేవారికి ‘రొక్కం’ ఇప్పించేవారు. అలా సరుకులవెలను న్యాయంగా ఇప్పించడంతో ఖజానా ఖాళీ అవుతుండేది. ఈ విషయాన్ని రాజు గ్రహించాడు. అందువల్ల ‘సరుకు విలువ తెలియని’ ఒక ‘మూర్ఖుడిని, లోభిని’। అధికారిగా నియమిస్తాడు. ఇతనికి సరుకు గురించి తెలియకపోవడంతో, సరుకుకు విలువ కట్టకుండా నోటికి వచ్చినంత చెప్తుండేవాడు.
ఒకసారి ఒక వ్యాపారి ఉత్తరాపథంనుండి 500 గుర్రాలను తీసుకొని ‘ధరలనిర్ణయాధికారి’ వద్దకు వచ్చాడు. అతను వాటికి ‘మానెడు బియ్యం’ వెల కట్టాడు. ఆ వ్యాపారి అంతకుముంఉన్న ‘ధరల అధికారి’ వద్దకు వెళ్లి, మొరపెట్టుకుంటాడు. అప్పుడు అతను ఆ అధికారికి ‘లంచం’ ఇవ్వమంటాడు. తర్వాత రాజుగారి సమక్షంలో ‘మానెడు బియ్యం విలువ’ చెప్పమంటాడు. అందుకు అతను సరేనని ఒప్పుకొని, రాజుగారి సమక్షంలో మానెడెబియ్యం విలువ ‘రాజుతో సహా వారణాసి రాజ్యమంత’ అని అంటాడు. దాంతో అతని తెలివితేటలు బయటపడ్తాయి.
వర్ణాంతర వివాహం ా శ్రేష్ఠి కుటుంబం:
శ్రేష్ఠి కుటుంబంలోని కూతురు సేవకునితో సంబంధం పెట్టుకొని, చేతికి అందినంత సొమ్ముతీసుకొని, అతనితో ఇంట్లోనుండి వెళ్లిపోతుంది. మానసిక, శారీరక వేదన చెందుతుంది. ప్రసవానికి పుట్టింటికి వెళ్ళాలని అనుకుంటది. కాని మధ్యలోనే ప్రసవం అవుతుంది. రెండుసార్లు అలాగే మధ్యలోనే ప్రసవించి, వెనుకకు తిరిగి వస్తుంది. పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత, తాతఅమ్మమ్మల గురించి అడిగితే వారికి ఏ విషయాలు చెప్పకుండా, ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వస్తుంది. నగరద్వారం వద్ద ఉన్న ధర్మశాలలో దిగి, తల్లిదండ్రులకు కబురు పంపిస్తుంది.కాని, తల్లిదండ్రులు ఆమెను ఇంటిలోనికి ఆహ్వానించడానికి ఇష్టపడరు, ఆమెను ఇంటిలోకి రానివ్వరు.కాని పిల్లలనుతమతో ఉంచుకోవడానికి అంగీకరిస్తారు, ఆ పిల్లలను దగ్గరికి తీసుకుంటారు.
(శ్రేష్ఠి : ఇది ఒక పదవి, ఈ పదమే శెట్టిగా మారింది)
ఇలాంటి వ్యాపార సంబంధిత అంశాలు, ఆనాటి సమాజం మనకు జాతకకథలవల్ల తెలుస్తాయి.