మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంద్రధనుస్సు

రాజ్యాంగ దినోత్సవం (నవంబర్ 26)

by రూపాదేవి January 17, 2023
written by రూపాదేవి
(Soft pastel colours తో వేశాను పై చిత్రాన్ని)

ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం రూపుదిద్దుకుని 1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదం లభించింది. కాబట్టి 2015 నుంచీ ఏటా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం.

1949లో ఆమోదం లభించినా గానీ 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే రాజ్యాంగం పుట్టిన నవంబర్‌ 26ని గుర్తు పెట్టుకోవాలనే ఆలోచనతో 1979లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం నవంబరు 26న న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించింది.

కానీ, భారత ప్రభుత్వం 2015లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా నవంబర్‌ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. ఈ ఏడాది నవంబరు 19న ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. అప్పటి నుంచి నవంబర్‌ 26న జాతీయ న్యాయ దినోత్సవంగా కాకుండా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సంవిధాన్ దివస్, జాతీయ చట్ట దినోత్సవం పేర్లతోనూ వేడుకలను నిర్వహిస్తున్నాం.

రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకుని ఈ ఏడాది నవంబరు 26కు 73 ఏళ్లు పూర్తవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా, ఒక లిఖిత రాజ్యాంగం కలిగి ఉన్న దేశంగా మనకు ఎంతో గర్వకారణం.

January 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నేటి భారతం

by A. Venugopal January 17, 2023
written by A. Venugopal

ఏటి భారతం – ఈనాటి భారతం

మాటల పోటీల బ్రతుకె నేటి భారతం

రాజ ధర్మ పరిరక్షణె నాటి భారతం

ఓటు సీటు, నోట్ల కొఱకె నేటి భారతం

సోదర, ప్రేమలు పంచుట నాటి భారతం

ఉదర పిండ విధ్వంసం నేటి భారతం

గీత బోధ జరిగినదలనాటి భారతం

హితుల కీడు నెంచేటి నేటి భారతం

విదురగీతి నాదరించె నాటి భారతం

అవినీతికి, పట్టమొసగె నేటి భారతం

మానవత్వమున కర్థం నాటి భారతం

అమానుషం, అన్యాయం నేటి భారతం

మనిషిలోనె దేవునిగనె నాటి భారతం,

మనిషికి, మనిషే శతృవు నేటి భారతం

అర్థ, స్వార్థముల నిండెను, అహంకారమే హెచ్చెను

అమాయకపు జనులనెల్ల ‘మాయ’లోనె ముంచేసెను నేటి భారతం

శాశ్వతమేదీ కాదనె నాటి భారతం

అంతా శాశ్వతమని యెంచెను నేటి భారతం….

January 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

వి’శ్వాస’ దీపం

by కె. వీణారెడ్డి, January 16, 2023
written by కె. వీణారెడ్డి,

ఆకాశంలో ఉరుములు మెరుపులు… భూమిపైన జోరుగా వర్షపు చినుకులు… చెవులకు సోకుతున్న హోరుగాలి… ఆ చల్లని వాతావరణంలో టకటక వినిపిస్తున్న ఒక శబ్దం!

హాస్పిటల్ నుండి ఇంటికొచ్చి, తన బావమరుదులతో కూడి డాక్టర్ రాజారాం చేసుకుంటున్న మందు పార్టీలో అది రెండో రౌండ్. ‘ఛీర్స్… ఛీర్స్’ గ్లాసుల గలగల శబ్దానికి పోటీపడుతున్నట్టుగా టకటకమంటూ మళ్లీ అదే శబ్దం!

చిరాకుగా వెళ్ళి వీధి తలుపు తీసి చూశాడు రాజారాం. తెరుచుకున్న ఆ తలుపుల ముందు… తడిసిన తల కొప్పెరతో, బురదనిండిన చెప్పుల్లేని కాళ్లతో, సన్నగా వణుకుతూ నిల్చున్నాడో పదేళ్ల పిల్లాడు.

‘అరె…. వీడా? ఏడాదినాడే కాలం చేసిన, కాలనీ చివరింటి జానయ్య కొడుకు శీనయ్యగాడా!” అనుకుంటూ అదోలా చూశాడు రాజారాం.

ఆ రాత్రి వేళ తనను డిస్టర్బ్ చేసిన వాడి రాకకు, తడిసి నేలను తడుపుతున్న వాడి తీరుకు అసహనం కలిగింది డా. రాజారాంకు.

“ఏంట్రా శీనూ?” విసుగ్గా అడిగాడు.

“డాక్టర్ సార్… నిన్నట్నుండి మా యమ్మకు జెరం. రాత్రికి రాత్రే ఎక్కువైంది. కరోనా వచ్చిందేమోనని భయమైతుంది. ఓసారి మీరొచ్చి సూడండి సార్… ఏదైనా గవర్నమెంట్ దవకాన్ల సేర్పించి పరీచ్చలు సేయించండి. కరోనా అయితేగాన దయచేసి మందులిప్పించండి!” అంటూ డాక్టర్ గారి కాళ్లు పట్టుకున్నాడు కన్నీళ్ళతో శీనుగాడు.

మజాగా నడుస్తున్న మంది పార్టీ నుండి వైద్యుడిగా బయటకు రానివ్వలేదు రాజారాం మనసు.

“ఒరేయ్ శీనుగా… కష్టం జేసుకునేటోళ్లకు కరోనా రాదు లేరా! శక్తికి మించి పనిచేసిందేమో….. సుస్తీ చేసుంటది. మీయమ్మకేమీ కాదులే… రేపటికల్లా తగ్గిపోతుంది గానీ వెళ్లువెళ్లు!”

అంటూ… వాడిని బలవంతంగా బయటికి పంపించేసి, తలుపులు మూసేసి, గదిలోకొచ్చి మరో బాటిల్ ఓపెన్ చేశాడు డాక్టర్ రాజారాం.

* * *

ఓ వారం అనంతరం….

ఇంట్లోనే ఓ మూల గదిలో… బెడ్ పై అసహనంగా అటూ ఇటూ కదులుతూ చిన్నగా మూలుగుతున్నాడు రాజారాం.

‘వైద్యుడుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, తను కూడా కరోనా బారిన పడక తప్పలేదు. హోం క్వారంటైన్ పద్నాలుగు రోజులు పడకేసే తిప్పలు పడక తప్పడం లేదు! బాధగా, భయంగా, ఒంటరిగా… ఏదోలా గడుపుతున్నాడు తను. కొవిడ్ భయంతో బంధు మిత్రులెవరూ రావడం లేదు. కుటుంబీకులు మాత్రం అన్న పానాదులను గది బయటే పెట్టి తలుపు కొట్టి వెళుతున్నారు. అంతటి వైద్యుణ్ణి తనను తాకడానికే భయపడుతూ…. అందరూ దూరంగా వెళ్ళిపోతున్నారు. తననో అంటరానివాణ్ణి చేసిన కరోనా కాలమెంతటి భయంకరమైనది!’

ఆయాసంతో కూడిన ఆవేదనతో అనుకున్నాడు ఆరో రోజున డా.రాజారాం.

                   * * *

మందుల ప్రభావంతో, మగతగా పడుకున్న రాజారాం నుదుటిపై ఓ సున్నితమైన చల్లని స్పర్శ తగిలి మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు.

ఏదో జ్ఞాపకం… మంద్రపవనంలా అతడి మనసులో కదలాడింది!

‘పక్షం రోజుల క్రితం…. ఆనాటి వర్షపు రాత్రిలో…. నిర్ధాక్షిణ్యంగా వీణ్ణి తను వెళ్ళగొట్టినా ఈనాడు తనకు కరోనా వున్నా, తనను ముట్టుకని తన నుదుట బొట్టుపెట్టిన ఈ శీనుగాడి సింధూరం చేతులు అప్పుడే విచ్చిన మందారాల్లా అన్పిస్తున్నాయి తనకు!’ అనుకొంటూ “శీనూ ఏంట్రా ఇది?” సంచలనంతో కూడిన ఆశ్చర్యంతో అడిగాడు!

‘’దండాలు డాక్టర్ గారూ… నిజంగా మీరు దేవుడే! ఆ రాత్రి మీరు సెప్పిన…. కాదు కాదు మీరు దీవించిన మాటతో మయమ్మకు జెరం తగ్గింది.  కరోనా కూడా రాలేదు. అయ్య లేని నాకు అమ్మ తోడైనా నిలబెట్టిండ్రు మీరు!”

కృతజ్ఞతతో నమస్కారం పెడుతూ అన్నాడు శీనుగాడు.

“నిజమా శీనూ” నమ్మలేనట్టుగా అడిగాడు రాజారాం.

“అవును సార్! మందులేకుండానే మీ నోటి మాటతోనే మాయమ్మ రోగాన్ని తగ్గించిన మనిసి దేవుడు మీరు! అట్లాంటి మీకు కరోనా వచ్చిందని తెలిసి బాగా బాధపడిన. మనిసిదేవుడికి గుళ్ళోని ఆ పెద్ద దేవుడే కదా తగ్గించాలె! అందుకే మన కాలనీలున్న ఆంజనేయస్వామి గుడికెల్లి మీకు తగ్గించమని రోజూ మొక్కేటోణ్ని. ఇయాల గుళ్లో ఏదో పండుగుంట! టెంకాయ కొట్టి దండం పెట్టి సిందూరం తెచ్చిన…. ఎవరు సూడకుండ మీ ఇంటి లోపలికొచ్చిన…. ఆ దేవుని     బొట్టు మీకు పెట్టిన, మీకు తప్పక తగ్గిపోతది సార్!

అంటున్న శీనుగాడి కళ్లల్లో అంతులేని విశ్వాసం అగుపించింది.

అబ్బురంగా వాడివైపు చూశాడు రాజారాం!

‘ప్రాణాంతకమైన కరోనా భయంతో తన వాళ్ళెవరూ తనను తాకనైనా తాకలేని దుర్భరమైన స్థితిలో… తననే దేవుడనుకున్న అమాయకమైన నమ్మకంతో… భయంలేని బాల రుద్రుడిలా తనను తాకిన వీడి హస్తముద్ర తనకెంతో సాంత్వన కలిగించిన మాట నిజం!’

అనుకొంటూ అపురూపంగా చూశాడా పిల్లాడివైపు.
‘ఆనాడు… మందు మత్తులో వాళ్ళమ్మకు మందివ్వని మా గొప్ప వైద్యుడు తను! తండ్రిలేని పిల్లాడు, తల్లినైనా బ్రతికించుకుందామని… ఎంతో ఆత్రంగా ఆ జోరువానాలో తన దగ్గరకు పరుగెత్తుకొచ్చాడు. కానీ… తను… విసుగును దాచుకున్న నటనతో చెప్పిన తన మాయమాటలు నమ్మి, ఆ నమ్మకంతోనే తన తల్లియందు ఆరోగ్య దేవతను దర్శించుకున్న అదృష్టవంతుడు!

ఆర్ద్రతా హృదయంతో అనుకున్నాడు డా. రాజారాం.

అంతలోనే….

“రాజా…. మొన్నటి శాంపిల్ టెస్ట్ రిజల్ట్స్ ల్యాబ్ నుండి నా మొబైల్ కు ఫార్ వర్డ్ చేశారు. నీకు కరోనా నెగెటివ్ వచ్చింది కంగ్రాట్స్ రా!”

సాటి డాక్టర్ మిత్రుడి మాటలతో…. అణువణువునా ఆనంద స్పందన కలిగింది రాజారాంలో, ఆప్యాయంగా శీనుగాడివైపు చూశాడు.

“నీ విశ్వాసంతో, నీ స్పర్శతో నన్ను స్వస్తుణ్ని చేసిన బాల ధన్వంతరివి నీవు శీనూ….      నా వృత్తి ధర్మంలోని పరమార్థాన్నెరిగించిన బాల గురుడవు కూడా నీవే! నీకు నా జోహార్లు శ్రీనివాసా!”

అంటూ పశ్చాత్తాపంతో కూడిన బాధానందాశ్రువులతో వాడి సింధూరం చేతుల్ని పూజా పుష్పల్లా కళ్ళకద్దుకున్నాడు  డాక్టర్ రాజారాం.

January 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

అనర్ఘ రత్నాలు

by డా॥ సంగనభట్ల నరసయ్య January 16, 2023
written by డా॥ సంగనభట్ల నరసయ్య

ఉ.       వాడిమయూఖములం గలుగువాడ పరాంబుధి గ్రుంకె, ధేనువుల్

          నేడిట వచ్చే నేకతము, నిష్ఠమెయిన్ భవదగ్ని హోత్రముల్

          పోడిమి వేల్వగా బడియె, బ్రొద్దును బోయె, గచుండు నేనియున్

          రాడు, వనంబులోన మృగరాక్షస పన్నగ బాధనొందెనో (ఆది ప. 3-112)

ఈ పద్యం నన్నయ రాసిన గొప్ప పద్యాల్లో ఒకటి. ఆంధ్రమహాభారతంలో కచదేవయానిగాథ లోనిది. మృత సంజీవని విద్య కోసం శ్రతు శిబిరం నుండి అంటే దేవలోకం నుండి వచ్చిన కచుడు గురువు శుక్రునివద్ద శుశ్రూష చేసి విద్య పొందడమే లక్ష్యంగా ఉన్నాడే తప్ప మరో ఆలోచనలేదు. దేవయాని కచుని ఇష్టపడి, రాక్షసుల బారి నుండి రక్షిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉండగా కచుడు గోవులను తీసికని మేపడానికి అడవికి వెళ్లినాడు. అతణ్ణి రాక్షసులు చంపివేసినారు. తిరిగిరాని కచుని కోసం ఎదురు చూసి, తండ్రితో పై విధంగా అన్నది.

సూర్యుడు అస్తమించినాడు. గోవులు కచుడు లేకుండా ఒంటరిగా తిరిగి వచ్చాయి. మీరు శిష్యులతో కలిసి సాయం కాలపు అగ్నిహోత్రాన్ని పూజించారు. బాగా పొద్దుపోయింది. కచుడింకా రాలేదు. అడవిలో క్రూరమృగాలు, సర్పాలు, రాక్షసుల నుండి ఏమైనా అపకారం జరిగిందేమో అని బాధపడిందని పై పద్యం తాత్పర్యం.

ఈ పద్యం వెనుక అనేక అర్థాలు నన్నయ నిక్షేపించాడు. అవన్నీ “లో నారసి” చూడాలి.

వాడి మయూఖములు (కిరణములు) కలవాడని ప్రారంభించబడిన పద్యంలో నిజానికి సూర్యుడస్తమించడని చెప్పుతోంది. మరి మధ్యాహ్న సూర్యుని ప్రచండత్వ ప్రస్తావన ఎందుకు? అదీ పద్య ప్రారంభంలోనే.

తండ్రి (శుక్రుని)కి సంబంధించిన సేవలు, ఆహారాదులు సమకూర్చి, మధ్యాహ్నం విశ్రాంతి లభించాక, తన ప్రియుణ్ణి గురించి ఆలోచనలు మొదలయ్యాయి. మధ్యాహ్న సూర్యుని నుండి అస్తమయ సూర్యునివరకు ఎదురు చూస్తున్నదని, క్షణక్షణం లెక్క పెట్టుకని కచుని రాకకై తపన పడుతుందనే అర్థం. మరింకా రాలేదంటే ఆర్తి మొదలైంది.

గతంలో సూర్యుడస్తమించినపుడోసారి, మరోసారి ఆవులను మేపుకని కొంచెం ఆలస్యంగా , మరోసారి అగ్ని హోత్రాదుల పూజలు ముగించేసరికి, మరోసారి ఇంకొంచెం పొద్దుపోయి, చీకటి అలుముకున్నాక కొంచెం ముందు వెనుకలుగా వచ్చినాడు. ఈసారి అన్ని రకాలుగా అన్ని దశలు దాటి నా కచుని జూడలేదని, ఆ దశలననినటిని వరుసగా ఎదురుచూస్తూ, ఐనా రాలేదని, దుఃఖంలో అన్ని సంఘటనలను ఏకరువు పెట్టింది.

ఈ సంఘటనల పరంపర గూర్చి ఇంకా చెప్పాలంటే సూర్యుడూ కచుణ్ణి పట్టించుకోకుండా అస్తమించాడు, ధేనువులూ కాపరిని (కచుణ్ణి) పట్టించుకోకుండా ఒంటరిగా తిరిగి వచ్చాయి, మీరూ ఆయనకు పట్టించుకోకుండా, మీమీ సాయం సంధ్యాగ్ని విధుల్ని నిర్వర్తించుకొన్నారని అర్థం. ఓ రకంగా తండ్రితో నిష్ఠూరాలాడిందని భావం.

క్రుంకె అంటే తనదారిన తాను (మునిగి) పోయాడని, ధేనువులు తమ దారిన తాము వచ్చాయని, మీ దారిన మీరు మీ పూజాదికములు నిర్వర్తించుకున్నారని, ఎవరూ ఆతని గూర్చి ఆలోచించలేరని వాపోయింది.

సూర్యుడస్తమించాడని మొదటిపాదం నిండా మహాకవి పరచినా, తిరిగి “పొద్దును పోయె” అన్న నుడికారంతో వచ్చే సమయం ఐపోయిందని స్పష్టపరచినాడు. లేకుంటే పునరుక్తి కాదా? అంతేకాదు అస్తమయాన్ని పునరుక్తి చేయడంలో దేవయాని ఆర్తి అధికమైందని నిష్కర్ష.

సూర్యుడు పోయాడంటే చిరువెలుగుల్లో మృగబాధలు, ధేనువుల రాకతో సంధ్య పూర్తి ఐందంటే రాక్షస బాధలు, అగ్నిపూజలైనా యంటే చిక్కటి చీకటిలో పాముల బాధలు మూడు దశలకు మూడు బాధలు క్రమాలంకారంగా భాసించాయి.

సూర్యునిలా కచుడు ఈమెను పట్టించుకోకుండా అస్తమించాడు. అంటే రాక్షసులు సంహరించారు. కోర్కెలు ధేనువులు. అవి కచుడు లేకుండా వచ్చినట్టే, కచుడు లేక – తీరని వైనాయి.  ఏకతమ శబ్ద ప్రయోగంలో ఒంటరితనపు దేవయాని మానసిక స్థితిని వ్యంజించినాడని గమనించాలి. కచుడు నిర్లక్ష్యపు ప్రియుడు. కచుని అభాంలో ధేనువుల్లా కోర్కెలు, విరహజ్వాలల్లో అగ్నిజ్వాలలు. కచుడు (చని)పోయాడని, ధేనువులు కోర్కెలా దేహం (ఇల్లు) చేరాయని, అగ్ని విరహంలా ప్రజ్వరిల్లిందని సూచించబడిన క్రియలు. అగ్నిజ్వాలలు విరహజ్వాలలకు సంకేతాలు. అవీ ప్రజ్వరిల్లాయి. అణగిపొయ్యాయి. ఇంటిలోనే కాదు దేవయాని వంటిలో జరుగుతున్న సంఘర్షణలకు గుర్తులు.

ఈ దశ ఇపుడే కాదు, కచుడు స్వర్గానికివెళ్ళి పోయాక కూడా జరిగింది. దేవయాని (దేవలోకానికి ప్రయాణించవలసినది అని శబ్దార్థం) దేవతలవలె సుఖలాలస హెచ్చింది. కచుడు మృతితో అమృతత్వం సాధిస్తే దేవయాన చేయవలసింది, దేవ గురువు పుత్రుని వెంబడి వెళ్ళలేక, తీరని కోర్కెలతో భూమ్మీదే ఉండిపోయింది. స్వధర్మాన్ని (మానవ ధర్మాలను) తిరస్కరించి, పరధర్మాన్ని (దేవతల ధర్మాలను, ఆ లోకాలను) ఆశ్రయించ బోయి తిరస్కృతయై విఫలమైంది.

అబిధార్థం తండ్రికి గోచరమైంది. వ్యంజన పాఠకులకు అందించాడు మహాకవి. ఆనంద వర్ధనుడు అలఁకార శాస్త్ర వాఙ్మయంలో ప్రతిష్ఠించిన వెనక అతనికి శత సంవత్సరం పిదప నన్నయ ఆవిర్భవించాడు. ధ్వనిని ఈ సందర్భంలో అనంగమించాడు. “గతోస్తమర్కః” అన్న వ్యంగ్యార్థ వాక్యం అలంకారశాస్త్రంలో ప్రసిద్ధం. “అస్తంగతః అర్కః” అనగా సూర్యుడస్తమించాడని దానికి ప్రకరణవశాత్తు అనేకార్థాలు ఉన్నాయని ఆ శాస్త్రవేత్తలు ఉదాహరిస్తారు. అది మనసులో సుప్రతిష్ఠం ఐన నన్నయ అర్కుని అస్తమయాన్నే వర్ణించి, తన పద్యంలో ధ్వని ఉందని నిశ్చయపరిచాడు.

ఈ పద్యం శిల్పంలో వైవిధ్యం కలది. ఏకవాక్య తాత్పర్యంతో ఉండే పద్యాలకు భిన్నంగా బహువాక్యభరితం. వాక్య పంచకం ఉంది దీంట్లో. నాలుగు క్రియలు భూతార్థకాలు. ఐదవ క్రియ ‘రాడు’, దేవయానికి సంభాషించేనాటికి భవిష్యదర్థకమే కాక, నిశ్చయార్థకమైనా “వాచమర్థోనుధావతి” ఐంది. ఆరవ క్రియ సందేహాన్ని, ప్రమాదాన్ని సూచించింది.

కచుడు అరణ్యానికి గోవులను మేపడానికి వెళ్లినంతసేపూ కుడు లేని గృహ సీమ ఆమెను విరహంతో బాధించింది. అందుకే పగలొనర్చిన పగటిరేడు బాధకుడై వాడి మయూఖముల వాడయ్యాడు. అస్తమించినపుడు కూడా సూర్యుడామెకు వాడి మయూఖములవాడే. అదే తొలి పాదం అర్థం.

కచుడు రాకున్నా ఎవరూ పట్టించుకోలేదని, ఇంకా ఆలస్యం చేస్తే రాత్రి గడిస్తే ప్రమాదమని, తాను పట్టించుకున్నట్టు బయటపడింది. జరిగిన క్రియలతో జరుగని పని తెలుపుటచే వస్తుధ్వని. మృగరాక్షస పన్నగ బాధలు ఆతడు పొంది ఉంటాడనే ఊహ నిజమే ఐంది. సహజ సాయంకాలవర్ణనలో అసహజమైన కచుని మృత్యువు అలంకార ధ్వని చెప్పక చెప్పిన తన విరహబాధ రసధ్వని. ఈ పద్యం లోనారసి చూస్తే అర్థ రత్నాలగని.

January 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నిఘా నేత్రమా

by Kamala Reddy January 16, 2023
written by Kamala Reddy

నిఘా నేత్రమా

నీకు వందనం
పసి పిల్లల మనసును
పాడు చేసే ద్వంద వైఖరిని
నిఘానేత్రంతో చూసావు
వలస కూలీలు
వలవల కార్చే కన్నీరు
నిఘానేత్రంతో చూసావు
కార్మికుల కర్షకుల
కష్టాలను
నిఘానేత్రంతో చూసావు
రవి గాన్సని చోటు కవి కాంచుతాడని
నీ కవితల ద్వారా నిరూపించావు
ఉస్మానియా ఉద్యమాలను
ఆ ఉర్రూతల ప్రభంజనాలను
సమాజ హితమును కోరి
సాగే నీ నిఘానేత్రం
మేధావులు మౌనంగా ఉండరాదని
మేల్కొల్పే నీ నిఘానేత్రం
అందు కో నా అభినందన

(నా అభిమాన రచయిత్రి పై రాసిన కవిత)

January 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

లేఖాప్రపంచంలో నార్ల

by Cheedella Seetha Lakshmi January 16, 2023
written by Cheedella Seetha Lakshmi

“పత్రికొక్కటున్న పదివేల సైన్యము

పత్రికొక్కటున్న మిత్రకోటి

ప్రజలకు రక్షలేదు పత్రిక లేనిచో!!

అని నమ్మిన డా.నార్ల వెంకటేశ్వర రావు పత్రిక సైన్యాధ్యక్షునిగా ఆంధ్ర ప్రభ,ఆంధ్ర జ్యోతి పత్రికలలో ఎడిటర్ గా పనిచేసి పత్రికను పైకి తేవడానికి కొత్త ఒరవడిని ప్రవేశపెట్టి కాగడా,జనవాణి పత్రికల్లో  తాపీ ధర్మారావు ప్రారంభించిన వ్యావహారిక భాషా ఉద్యమాన్ని ఆంధ్రప్రభ,ఆంధ్రజ్యోతి పత్రికల ద్వారా సమర్థంగా కొనసాగించిన దిట్ట.

     హేతువాది,రాజ్యసభ సభ్యుడు ,సంపాదకుడు అయిన నార్ల   వెంకటేశ్వర రావు డిసెంబర్ 1 వతేదీ 1908 సంవత్సరంలో లక్ష్మణరావు,మహాలక్ష్మి దంపతులకు మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించాడు. కృష్ణాజిల్లాలో విద్యాభ్యాసం కొనసాగింది.

    మద్దూరి అన్నపూర్ణయ్య ప్రచురించే ” కాంగ్రెస్” పత్రికకు 1928 సంవత్సరం తన 20 సంవత్సరాల వయసులో రాసిన మొదటి ఉత్తరం నార్ల పత్రికారచన వైపుకు దారి తీసింది.  మొదట్లో ఉపేంద్ర,రవీంద్ర పేరుతో స్వరాజ్య,జనవాణి,ప్రజామిత్ర  పత్రికల్లో వ్యాసాలు రాశాడు.

1938 సంవత్సరంలో సులోచనాదేవితో వివాహం జరిగింది.

 1938లో ఆంధ్రప్రభలో న్యూస్ ఎడిటర్ గా చేరి 1942 నుండి 1959 వరకు ఎడిటర్ గా బాధ్యత ను నిర్వహించాడు.

   కేవలం ఒక సంపాదకుడి కోసం  ఆ రోజుల్లో కె.ఎల్.ఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆంధ్రజ్యోతి పత్రిక  1960 జులై 1 వ తేదీ విజయవాడలో ఆవిర్భవించింది.  ఆ సంపాదకుడు నార్ల  వెంకటేశ్వర రావు. ఆయన సంపాదకత్వంలో ఆంధ్రజ్యోతి పత్రిక కొత్త పుంతలు తొక్కింది.నిజాయితీకి,నిర్భీతికి మారుపేరు నార్ల.

    ఎవ్వరికీ భయపడని ఆదరని బెదరని వ్యక్తిత్వం నార్లది.ప్రజలకు అర్ధమయ్యే జీవ భాషలో సంపాదకీయాలను రాశారు. నైజాం ప్రభుత్వం ఆంధ్రప్రభను నిషేధిస్తే రజాకార్ల దురాగతాలపై ఎత్తిన కత్తి దించకుండా కలం కదిలించిన యోధుడు.

   జైల్లో ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య గారు తనకు ఇస్తున్న ఆంధ్రప్రభ దినపత్రిక  నానా కత్తిరింపులతో సెన్సార్ చెయ్యబడి వస్తున్నదేమిటి అని నార్ల వారికి ఉత్తరం రాశారు.తన సంపాదకత్వంలో వస్తున్న పత్రికను ప్రభుత్వం కత్తిరింపులతో రాజకీయ ఖైదీలకు అందిస్తున్నందుకు నిరసనగా ఒకరోజు పత్రిక మొదటి పేజీనిండా నల్లగా తారు పూసి విడుదల చేశాడు.అది పత్రికా ప్రపంచంలో చాలా ఘాటైన నిరసన.దానితో ప్రభుత్వం దిగివచ్చి సెన్సార్ చేయడం మానుకుంది.

   నార్ల స్వతంత్రుడు.ఏ రాజకీయ నాయకుణ్ణి విమర్శించకుండా వదలలేదు.రాజగోపాలచారిని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని 1946లో మహాత్ముడు నిర్ణయించినపుడు దానికి నిరసనగా నార్ల  శరపరంపరగా సంపాదక అస్త్రశస్త్రాలను ప్రయోగించాడు. నచ్చని నాయకుణ్ణి ఎన్నుకోవాలని చెప్పే హక్కు గాంధీజీతో సహా ఎవరికీ లేదు అని తెగేసి చెప్పాడు. ఇందిరాగాంధీ నిరంకుశపాలనను,కుటుంబ వారసత్వ పాలన రాజకీయాలను ద్వేషించాడు.పౌరహక్కులు, మానవ విలువలు కావాలనుకునే వాడు.

    ఆధునిక పత్రికా ప్రపంచాన్ని తన సంపాదకీయాల ద్వారా ఉర్రూతలూగించి, పత్రికకు ప్రాణదీపాలుగా మార్చి, సామాజిక సంస్కరణకు వాహికలుగా మార్చిన ఘనుడు లేఖాప్రపంచాన్ని కూడా పరిపుష్టం చేసిన మహనీయుడు.

నార్ల వారిలో ఎంతో సృజనాత్మక దృక్పథం ఉంది.దానిని మించి విమర్శావలోకనం కూడా ఉంది.సమకాలీన కాలంలో ఎంతో మందికి వ్రాసిన ఉత్తర ప్రత్యుత్తరాల వలన ఆయన విమర్శనా దృక్పథాన్ని అవగాహన చేసుకోవచ్చు.

   బిరుసైన పండితులనుంచి మొదలుపెట్టి ప్రాథమికావస్థలో ఉన్న సాహిత్య ప్రియులవరకు నార్ల స్వయంగా స్వదస్తూరితో లేఖలు రాసి తమ మనోగతాభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు.

   బెంగుళూరు నివాసి అయిన ” హరిహరప్రియ” అని పిలువబడే సాతవల్లి వెంకట విశ్వనాథకు నార్లకు మధ్య  సాహిత్య సంబంధాలున్నాయి.

వయోరీత్యా ఆలోచిస్తే నార్ల హరిహరప్రియ కంటె చాలా పెద్దవాడు.చిన్నవాడైన హరిహరప్రియ వ్రాసిన ఎన్నో ఉత్తరాలకు నార్ల ప్రతిస్పందించి ఎంతో ఓపికగా సమాధానాలిచ్చాడు.అది నిజమైన సాహితీవేత్తకుండే సమ్యక్ దృష్టి.ఈ దృష్టి నార్లలో విశాలంగా ఉంది.

      నార్ల వ్రాసిన ఉత్తరాలను 50కి పైగా జాగ్రత్తగా భద్రపరచి హరిహరప్రియ  ముద్రించి పుస్తకరూపంలో వెలికి తెచ్చాడు.అయితే ఈ ఉత్తరాలన్నీ ఆంగ్లంలో ఉన్నాయి.నార్లకు తెలుగులో ఎంత భావావేశం ఉందో ఆంగ్లంలో కూడా అంతకు రెట్టింపు భావావేశమున్నదని ఈ ఉత్తరాలను లోతుగా దర్శిస్తే తెలిసిపోతుంది.ఉత్తమ విమర్శకునికి ఉండాల్సిన సమ్యక్ దృష్టి ,విశ్లేషణాత్మక, నార్లలో పుష్కలంగా ఉన్నాయి.

     “హరిహరప్రియ” కు రాసిన ఉత్తరాల్లో సాహిత్య విషయాలతో పాటు తన కుటుంబానికి సంబంధించిన అరుదైన విషయాలను ప్రస్తావించాడు. చిన్నవాడైన హరిహరప్రియతో తన ఆరోగ్య విషయాలు చర్చించాడు. విషయాలను ప్రస్తావించేటప్పుడు నిర్మొహమాటంగా చెప్పడం నార్ల వారి ప్రధాన లక్షణం.తనకు నచ్చని విషయాలను కూడా నచ్చిన విషయాలతో కలుపుతూ చురకలంటించిన సందర్భాలు చాలా వున్నాయి.వైజ్ఞానిక వ్యవహారాలు,వైయక్తిక విషయాలు,సమకాలికుల ప్రస్తావన, పుస్తకాల ముద్రణ,పుస్తక వ్యవహారాల ఇచ్చిపుచ్చుకోవడాలు ఇలాంటి వెన్నెన్నో అంశాలు నార్ల లేఖలో ప్రస్తావనకు వచ్చాయి.నార్ల రాసిన లేఖలను హరిహరప్రియ భద్రపరచి ముద్రించాలనుకొన్నప్పుడు హరిహరప్రియ నార్ల అనుమతి కోరాడు.తనపై చూపే అభిమానాన్ని ఒకవైపు మెచ్చుకుంటూనే తన మరణానంతరం లేఖలను ముద్రించవచ్చని నార్ల కోరాడు.ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఏ ఉత్తరంలోనైతే నార్ల

ఈ విషయాన్ని ప్రస్తావించాడో ఆ ఉత్తరమే హరిహరప్రియకు చివరిసారిగా వ్రాసిన ఉత్తరమైంది.

 కవులు,విమర్శకులు క్రాంతదర్శిత్వం కలవారని చెప్పటానికి  ఈ ఉత్తరం ఒక ప్రత్యక్ష తార్కాణం.

     నార్ల లేఖలను భిన్నకోణాలనుండి దర్శించి సమీక్షింపవచ్చు.హరిహరప్రియ కు వ్రాసిన ఉత్తారాల్లో చాలావరకు సమీక్షాత్మక లేఖలే అధికం.సరళమైన ఆంగ్ల పదాలతో భావ వ్యక్తీకరణ చేశాడు పదాల పటాటోపం కోసం ప్రాకులాడినట్లు ఎక్కడా కనిపించదు.పరాయిభాష పట్ల వ్యామోహాన్ని ప్రదర్శించే మనస్తత్వం నార్లలో కనిపించదు.అసలు పదాడంబరం అంటేనే నార్లకు అసహ్యం.ఒకచోట నార్ల పదాలపై నా అధికారం చూడు అనేది నా మట్టుకు కవిత్వం కాదు.నీ గుండెపై నా రాజ్యాన్ని చూడు అని చెప్పగలిగిందే కవిత్వం అని అంటాడు. ఈ వాక్యంలో కవిత్వాన్ని ఎంత ప్రస్ఫుటంగా గాఢంగా నిర్వచించాడో తెలుస్తుంది.

    హరిహరప్రియకు రాసిన ఉత్తరాల్లో నార్ల తన ఆరోగ్యం గురించి అప్పుడప్పుడూ అక్కడక్కడా ప్రస్తావించాడు. ఆ లేఖలను బట్టి జీవితంలో ఎక్కువభాగం అనారోగ్యంతో బాధపడినట్లు తెలుసుకోవచ్చును.

అనారోగ్యం వలన ఆరోగ్యంగా ఉన్న సమయాలలో కూడా అస్వస్థులుగా కనిపించే వారట.

 నార్లలో నిండైన  మానవత్వం తొణికిసలాడుతుంది.గర్వం మచ్చుకైనా కన్పించదు.

తాను గొప్పవాడినని భావించినప్పటికీ అదే మోతాదులో ఇతరుల గొప్పతనాన్ని కూడా గుర్తించే హృదయవైశాల్యం కలవాడు.అందుకే

ఆయన నిండైన మానవతావాది.ఇతరులను గౌరవించడం వలన తమ గౌరవం కూడా పెరుగుతుందన్న విశాల దృక్పథం కలిగినవాడు నార్ల.

        నార్ల రచించిన ” జాబాలి” ని హరిహరప్రియ కన్నడభాషలోకి అనువదించాడు ఆ సందర్భంలో ముగింపు వాక్యాలను గురించి అనువాదకుడు కొన్ని సూచనలు చేశారు. హరిహరప్రియ చేసిన సూచనలను నార్ల అంగీకరించాడు.దీనిని బట్టి ఆయన హృదయవైశాల్యాన్ని అంచనా వేయవచ్చు.” జాబాలి” కన్నడంలోకి అనువదింపబడిన తర్వాత హరిహరప్రియను ప్రశంసిస్తూ నార్ల ఆయనకు లేఖలు రాశాడు. కన్నడ పాఠకులు తన అనువాదగ్రంథాన్ని ఆదరించాలని దీవించాడు.ఆద్య రచయితగా కన్నడంలో ఆ పుస్తకాన్ని ముద్రించిన తర్వాత తనకు రెండు ప్రతులను పంపించమని నార్ల కోరాడు.చూసే వారికి ఈ కోరిక ఎంత చిన్నదైనా నార్ల ఎంత సంతృప్తిపరుడో తెలుస్తుంది.

అచ్చువేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా నార్ల హరిహరప్రియకు సూచించాడు.దీనినిబట్టి ఆయనలోని భావసౌందర్యమే కాదు రస సౌందర్యం,రూప సౌందర్యం కూడా వ్యక్తమౌతుంది.

జాబాలి కావ్యాన్ని కన్నడంలో డా.పుట్టప్ప చదివి తన అభిప్రాయం తెలిపినట్లు రాశాడు ఉత్తరంలో. అలాగే ఒక కాపీని డా.ఆద్య రంగాచార్యకు అందచేయమని చెప్పాడు.

 రామాయణంలోని రెండవ నాటకం సీత జోస్యం ప్రచురణ అయ్యాక నీకు పోస్ట్ చేయిస్తానని రాశాడు. మీ ఇంట్లో అమ్మ నాన్నకు మీ శ్రీమతికి శుభాకాంక్షలు అని రాశాడు.

       కన్నడంలోకి ” జాబాలి” అనువదింపబడిన తర్వాత మైసూరు విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్.వి.యెస్.సుందరం జాబాలిపై వ్యతిరేకాభిప్రాయాన్ని వ్యక్తీకరించాడు.ఆయన వ్యక్తీకరించిన అభిప్రాయాన్ని నార్ల ఒకచోట ప్రస్తావిస్తూ ” సుందరం గారి విజ్ఞతకు ఒకవైపు మెచ్చుకుంటూ చురక వేశాడు. మృదువుగా విమర్శించి మౌనముద్ర దాల్చడం నార్లకు పెట్టని భూషణం.

     రచయితలు పుస్తక రచనలు చేస్తూ తమకు తాము ప్రచురించుకోవడం సరియైనది కాదని నార్ల అభిప్రాయపడ్డాడు.

ఈ విషయాన్ని హరిహరప్రియకు సూచించాడు కూడా.పుస్తకాలను తమకు తామే ప్రచురించుకోవడం వలన అమ్మడం కష్టమవుతుందని తత్ఫలితంగా విపరీతమైన నష్టాన్ని భరించవలసి వస్తుందని నార్ల అభిప్రాయ పడ్డాడు.పుస్తక ముద్రణ విషయంలో ప్రచురణకర్తలు ప్రోత్సహించాలని కూడా హరిహరప్రియకు సూచించాడు.

     నార్ల భౌతిక జగత్తుకు చెందిన మనిషి. ఆయన ఉత్తరాల్లో ఎక్కడా మర్మవాదపు ఛాయలు గోచరించవు.ఆధ్యాత్మిక బోధలు అసలు రుచించవు. ఉత్తరాలను విశ్లేషిస్తే సామాన్యమానవుని జీవితానికి  సంబంధించిన నమ్మశక్యంగాని రాయిలాంటి వాస్తవాలు బయటపడతాయి.అది ఆయన ఉత్తరాలలోని ప్రత్యేకత అంతేగాని ఊహాలోకాల్లో తేలిపోవడం అసలే నచ్చదు.

    నార్ల చక్కని కుటుంబ జీవి.సాంసారిక సుఖాలను స్వర్గంలా భావించిన విశాల హృదయుడు. ఒక్కొక్కసారి తమ పిల్లల గురించి గొప్పలు చెప్పుకుంటూ నా సంతానమే నా సౌభాగ్యం అని పరవశించిపోతూ ఉండేవాడు.

   నార్ల వారి ఉత్తరాల్లో హాస్య చమత్కారాలు మబ్బుచాటున మెరుపుతీగల్లా మెరిసిపోతుంటాయి.

ఐదుగురు కొడుకులు ,కోడళ్ళు,ముగ్గురు కూతుళ్లు, అల్లుళ్లు డాక్టర్లు.అందరూ విదేశాల్లోనే. ఒక కూతురు అల్లుడు మాత్రం ఇక్కడున్నారు మరి నాకేమో రెండు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. మా కుటుంబంలో నా భార్య తప్ప మిగతా వారంతా డాక్టర్లే.ఆమెకు కూడా ఏ విశ్వవిద్యాలయమైనా గౌరవ డాక్టరేట్ ఇస్తే బాగుంటుంది.అప్పుడు మాఇంట్లో అందరూ డాక్టర్లే అవుతారు.ఇంతమంది డాక్టరులున్నా నేనెప్పుడూ పేషేంట్ నే.తలనుంచి కాలుదాకా నేనో రోగాల పుట్టని”. నార్లవారి అరుదైన చమత్కారానికి ఈ ఉత్తరం నిదర్శనం. ఇప్పటి లాగా డబ్బులిచ్చి కొనుక్కునే దొంగ డాక్టర్ డిగ్రీలు ఆనాడు లేవు మరి.

 నార్ల ఉత్తరాల్లో ఒకచోట తన వచనశైలికి సంబంధించిన ప్రస్తావన వచ్చింది తాను పాతకాలపు మనిషి అయిన కారణంచేత తన వచనం కూడా పాతదేనని తెగేసి చెప్పాడు. పత్రికారంగంలో ఆంధ్రజ్యోతి సంపాదకునిగా గణనీయమైన స్థానాన్ని సంపాదించిన నార్ల

ఏ పరిస్థితుల్లో దాన్ని వదులుకోవలసి వచ్చిందో హరిహరప్రియకు లేఖద్వారా తెలియచేస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.పత్రికాస్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న యాజమాన్యంపై నార్ల విరుచుకు పడ్డ సందర్భాలెన్నో ఉన్నాయి.

       సమకాలీన సాహిత్యాన్ని అధ్యయనం చేయడం నార్లవారికి ఉన్న చక్కని అలవాటు ” తెలుగు విద్యార్థి” వంటి పత్రికలను క్రమం తప్పకుండా చదివి యువరచయితలను అర్థం చేసుకుంటానని హరిహరప్రియకు నార్ల మాట ఇచ్చాడు.ఇతరులు రాసిన ఉత్తరాలకు ప్రత్యుత్తరాలు రాసినపుడు ఆలస్యం జరిగినపుడు క్షమార్పణ చెప్పే మనస్తత్వం కలిగిన వ్యక్తి నార్ల.హరిహరప్రియకు ఎన్నో సందర్భాల్లో క్షమార్పణ చెప్పి తన వ్యక్తిత్వాన్ని పెంచుకున్నాడు.

      మిత్రులతో కలిసి భోజనం చేయడమంటే నార్లకు చాలా ఇష్టం.అది ఆయన సంస్కారాన్ని తెలియచేసే విషయం.ఎంతో సంయమనంతో సమకాలికులతో జీవితాన్ని పంచుకోవాలన్న మనస్తత్వం నార్లది.తాను మైసూరు,బెంగుళూరు నగరాలకు వెళ్లినప్పుడు హరిహరప్రియ ఆతిథ్యాన్ని మెచ్చుకుంటూ నార్ల ప్రశంసల వర్షం కురిపించాడు.

   నార్ల వ్యక్తిత్వాన్ని తలపింపజేసే ఎన్నో విషయాలు హరిహరప్రియ రాసిన లేఖలో ప్రస్తావనకు వచ్చాయి.ఒక ఉత్తరంలో నార్లను హరిహరప్రియ డా.నార్ల అని సంబోధించాడు. అలా సంబోధించడం వల్ల తన వ్యక్తిత్వం అంతగా పెరగదని నార్లకి, డా.నార్లకి అంత వ్యత్యాసం కనిపించడంలేదని మృదువుగా త్రోసిపుచ్చి భవిష్యత్తులో  అలాంటి సంబోధనలు అక్కరలేదని సూచించాడు.అనవసర ఆడంబరాలకోసం ప్రాకులాడడం నార్లకు గిట్టదని ఈ లేఖ ద్వారా విదితమౌతుంది.

      నార్ల వ్రాసిన కొన్ని గ్రంథాలు మరాఠీ భాషలోనికి కూడా అనువదించబడ్డాయి.

వీరేశలింగంపై

రాసిన మోనోగ్రాఫ్ గుజరాతీ భాషలో కూడా అనువదించబడింది.ఆయన రచనల గొప్పతనం తెలుగువారికే పరిమితం కాకుండా సమస్త భారతీయులు సైతం అవగాహన చేసుకొనే స్థితికి దిగారు.

  నార్లకు సమకాలీన సమస్యలపై చక్కని అవగాహన ఉంది.తన కూతురు వివాహ విషయంలో తాను స్వయంగా కలుగజేసుకొని తన అల్లుడికి వరకట్నం ఇవ్వ ప్రయత్నించినప్పటికీ ఆయన కట్నంలేకుండా  పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది.ఈ విషయాన్ని హరిహరప్రియతో ప్రస్తావించి ఎంతో మురిసిపోయాడు.సమకాలీన కాలంనాటి వరకట్న సమస్యకు భిన్నంగా తాను మంచిబుద్ధి కలిగిన అల్లుడి ద్వారా అధిగమించానన్న ఆనందాన్ని నార్ల పొందినట్లున్నాడు.

  ఇలా నార్ల వారి ఉత్తరాలను విశ్లేషించుకుంటూపోతే ఎన్నో అంశాలు బయట పడ్తాయి. కుటుంబ విషయాలు,మిత్రుల విషయాలు,రచనలకు సంబంధించిన విషయాలు,సాహిత్య విమర్శలు, సమకాలీన సమస్యలపై చర్చలు మొదలగు అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.ఇద్దరు వ్యక్తుల మధ్య సాగిన ఈ లేఖలవల్ల సమకాలీన సమాజానికి పనికి వచ్చే ఎన్నో విషయాలు నిక్షిప్తమై ఉండడం వల్ల సాహితీజగత్తుకు ఈ లేఖలు చక్కని సందేశాన్ని అందించినట్లు తెలుస్తుంది.

   సంపాదకీయ వ్యాసాలు,సమకాలీన రాజకీయ పరిస్థితులను ఏ రకంగా శాసించాయో

లేఖాప్రపంచంలోని లేఖలు కూడా సమకాలీన సాహిత్యాంశాలను ఎన్నింటినో ఎత్తి చూపుతూ ఉత్తమ విమర్శకు చక్కని ఉదాహరణలుగా మిగిలిపోయాయి.

 నార్ల వెంకటేశ్వర రావు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తూ అనేక ప్రక్రియల్లో రచనలు చేశాడు. నవయుగాల బాట నార్ల మాట  అనే మకుటంతో  700 పైగా సందేశాత్మకంగా ఆట వెలది పద్యాలు,బాలలకోసం నీతి పద్యాలు,16 ఏకాంకికల సంపుటి,సాంఘిక,పౌరాణిక నాటకాలు,వ్యాసాలు మొదలైనవి ఎన్నో రాశాడు. ఏది రాసినా సామాజిక ప్రయోజనమే.

ఇంగిలీషులో భగవద్గీతపై విమర్శనాత్మక రచన చేయగా అది పలు విదేశీ జర్నల్స్ లో  ప్రచురితమైంది.

నార్ల ఎన్నో కొత్తమాటలు,పదబంధాలు సృష్టించాడు.మాండలికానికి పెద్దపీట వేశాడు.భాషాపరమైన అంశాలలో  ప్రయోగాలు ఆయన సొత్తు.  ఆయన ఒక కదిలే  విజ్ఞాన బాండాగారం.

   ప్రశ్న ప్రగతికి మూలం.ప్రశ్నలేని జగత్తు ప్రశ్నార్థకం అని అంటాడు.

   ” తెలుగులో ఆలోచించి, తెలుగు నుడికారంలో తెలుగుదనం ఉట్టిపడేటట్టు రాయగలిగినప్పుడే తెలుగువారిలో మనం కదలిక పుట్టించగలం” అని ఆనాడే తోటి జర్నలిస్టులకు ఉద్బోధించాడు. నిజాయితీగా,నిర్భీతిగా ఉండాలని కోరే మేటి పాత్రికేయుడు నార్ల.

     1981లో “సీత జోస్యం” నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందాడు.1983లో ఎన్. టి. రామారావు    ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక నార్లను సాంస్కృతిక వ్యవహారాల సలహాదారునిగా నియమించారు.

   నిజాయితీయే  ఆయుధమై స్వేచ్ఛగా జీవితాన్ని గడిపి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించి, కొన్ని దశాబ్దాల పాటు పత్రికారంగాన్ని శాసించి,పఠితలను ఉర్రూతలూగించిన  డా. నార్ల వెంకటేశ్వర రావు  1985 సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన . నార్ల  స్వర్గస్తులయ్యారన్న వార్త పత్రికారంగానికి  శరాఘాతంగా,తీరని లోటుగా మిగిలింది.

——————————-

డా.చీదెళ్ళ సీతాలక్ష్మి

విశ్రాంత సహాయాచార్యులు

హైదరాబాద్

January 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తొలి చలనచిత్రాలపై నాటకాల ప్రభావాలు

by Dr. V.V. RamaRao January 16, 2023
written by Dr. V.V. RamaRao

సినిమా దృశ్య శ్రవ్య ప్రధానమైన వినోదకళ. అలనాటి నాటకానికి సాంకేతిక  పొడగింపే సినిమా. తెలుగు సినిమా వెండి తెరపై వెలుగులు చిందడానికి
తెలుగు నాటకాలు మౌలికంగా ప్రధాన భూమిక పోషించాయి. కారణం తెలుగు తొలి టాకి యుగం మొదలు నేటివరకు జన బాహుళ్యంలో ఉన్న నాటకాల
నే తెరకు ఎక్కించారు కాబట్టి,సినిమాకు మూలంగా  నిలిచిన నాటక చరిత్రను విహంగవీక్షణంగా స్ప్రశించడం సబబు. రంగస్థలంపై సజీవంగా నటించేది నాటకంలో. కథానుగుణంగా నటీనటులతో నటింపజేసి, సెల్యు లాయిడ్ గా మలచి వెండితెరపైన ప్రదర్శించేది సినిమా.అందుకే దీనిని కదిలేబొమ్మల రూపకం అని, “చలన చిత్రం”( బొమ్మలు చలిస్తాయి కాబట్టి ) అంటారు.
            వాస్తవానికి విశ్వ సాహిత్యంలోనే  నాటకానికి ఒక విశిష్ట స్థానం ఉంది. సంస్కృతంలో “కావ్యేషు నాటకం రమ్యం… నాటకాంతం హి సాహిత్యమ్” అంటూ నాటక ప్రాముఖ్యతను చాటిచెప్పబడింది.*1 క్రీస్తుశకం నాటికే మనదేశంలో దృశ్యకావ్య ప్రక్రియ అద్భుతంగా అభివృద్ధి చెందింది. దీన్ని శాస్త్రీయంగా సూత్రీకరించిన వాడు ‘భరతుడు’.
       . తెలుగు సాహిత్య ప్రక్రియ ప్రారంభమైన కాలం నుంచి క్రీస్తుశకం 1860 వరకు మొదటి కాలం. ఈ కాలంలో వీధి నాటకాలను ఎక్కువ సంఖ్యలో ప్రదర్శించేవారు. ఆ తరువాతి కాలాన్ని ముఖ్యంగా క్రీస్తుశకం 1860 నుండి 1960 వరకు, ఈ వంద సంవత్సరాల కాలం తెలుగు నాటక రచనకు ప్రత్యేక కాలంగా పెద్దలు పేర్కొన్నారు.
ఆధునిక కాలంలో శ్రీయుతులు కోరాడ రామచంద్రశాస్త్రి, కొక్కొండ వెంకటరత్నం పంతులు మరియు పరవస్తు రంగాచార్యుల గార్లను తొలి నాటక కర్తలుగా పేర్కొంటారు.   తెలుగులో వెలువడిన మొట్టమొదటి నాటకం ‘మంజరీమధుకరీయం’. ఈ నాటకాన్ని 1860లో కోరాడ రామచంద్రశాస్త్రి గారు రచించారు. ఈ నాటకం ముద్రణ మాత్రం 1903లో జరిగింది. 1871లో కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు ‘నరకాసుర విజయం’ నాటకాన్ని తెలుగులో రచించారు. అదే సంవత్సరం పరవస్తు రంగాచార్యులు గారు కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకాన్ని  తెలుగులో రచించారు. మూల నాటకంలోని  ప్రాకృత భాషల స్థానంలో తెలుగును ప్రవేశపెట్టిన ఘనత ఈ ఆచార్యుల వారిదే
ఆధునిక తెలుగు నాటక ప్రదర్శన ఆరంభదశలో ప్రథములు కందుకూరి వీరేశలింగం పంతులుగారు. 1880లోనే వీరి రచనలు ‘బ్రాహ్మ వివాహము’, ‘చమత్కార రత్నావళి’ దిగ్విజయంగా ప్రదర్శించబడినవి. తెలుగులో మొదటి సాంఘిక నాటకం ‘నందక రాజ్యం’. 1880లో వావిలాల వాసుదేవశాస్త్రి దీనిని రచించారు. 1883లో వడ్డాది సుబ్బారాయుడు రచించిన ‘వేనీ సంహారం’ సుప్రసిద్ధమైన తెలుగు నాటకంగా నిలిచింది. నాదెళ్ళ పురుషోత్తమకవి గారు 1884- 86 ప్రాంతంలో 32 నాటకాలను రచించి పాత్రోచితమైన సంభాషణలతో నాటకాలను రక్తికట్టించారు. ఉత్తమ శ్రేణికి చెందిన నటులైన ధర్మవరం కృష్ణమాచార్యులు 1887లో ‘చిత్రనళీయం’ 1989లో ‘విషాద సారంగధరము’ మొదలైన 25  స్వతంత్ర తెలుగు నాటకాలను రచించారు. ఆంధ్ర నాటక పితామహ బిరుదాంకితులైన వీరు తెలుగులో విషాద నాటకాలు రచించిన ప్రథములు. నాటకములలో పాటలను ప్రవేశపెట్టిన ఘనత వీరిదే. లక్షకుపైగా ప్రతులు అమ్ముడుపోయిన  ‘గయోపాఖ్యానం’ నాటకాన్ని 1889లో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు రచించారు.
‌.    సరిగ్గా ఇదేసమయంలో మనదేశంలో సినిమా అడుగిడింది.1886లో లుమీర్ సోదరు లు   భారత దేశంలో మొదటి మూగ సినిమాను ప్రదర్శించారు. తరువాత ఆర్.జి.టోర్నీ అనే విదేశీయుడు 1910లో “భక్త పుండరీక”, 1911లో “రాజదర్బార్” అనే చిత్రాలు నిర్మించాడు. భారత దేశంలో మొదటి మూగ సినిమా నిర్మించిన భారతీయుడు దాదా సాహెబ్ ఫాల్కే. ఈయన 1913 మే 3న రాజా హరిశ్చంద్ర చిత్రాన్ని విడుదల చేశాడు.
తెలుగు నాటక చరిత్రలో విశిష్టమైన సంవత్సరం 1897. ఈ ఏడాదిలోనే వేదం వెంకటరాయ శాస్త్రి గారు ‘ప్రతాపరుద్రీయం’ నాటకాన్ని, గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ నాటకాన్ని రచించి తెలుగు నాటక రంగాన్ని సుసంపన్నం చేశారు.
1901- 1920 కాలంలో విశిష్టమైన చారిత్రాత్మక నాటకరచన కొనసాగింది. కోలాచలం శ్రీనివాసరావు 1907లో ‘రామరాజు చరిత్ర’, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి 1909లో ‘బొబ్బిలియుద్ధం’, ధర్మవరం గోపాలాచార్యులు ‘రామదాసు’ మొదలైన నాటకాలను రచించారు. ఈ కాలంలోనే సోమరాజు రచించిన ‘రంగూన్ రౌడీ’ నాటకం అధిక సంఖ్యలో ప్రదర్శనలు అందుకున్న నాటకం. 1911లో తిరుపతి వేంకటకవులు రచించిన ‘పాండవోద్యోగ విజయములు’, బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి రచించిన ‘సత్యహరిశ్చంద్రీయము’ నాటకాలు ఇప్పటికీ ఘనమైన స్థితిలో కొనసాగుతున్న అద్భుత నాటక రాజములు. స్వాతంత్ర్య ఉద్యమ సమయములో  సంఘసంస్కరణ నాటక రచనలలో పేరుగాంచిన వారు కాళ్ళకూరి నారాయణరావు. వీరు 1921లో చింతామణి, 1926లో వరవిక్రయం నాటకాలను రచించారు. ఇలా మరెందరో నాటక రచయిత లు ఉన్నారు . కొన్ని వెలుగు లో కి రావు కొన్ని ప్రసిద్ధి చెందవు. అయితే తెలంగాణ నుండి కూడా చాలా మంది రచయితలు ఆకాలం లోనే అనేక ప్రక్రియలను చేపట్టారు. వారిలో ‘ఒద్దిరాజు సోదరులు‘ అని కీర్తి గాంచిన ఒద్దిరాజు సీతారామచంద్రరావు, ఒద్దిరాజు రాఘవ రంగారావు సోదరులు సాహిత్యం లో ని అన్ని ప్రక్రియల్లో రచనలు చేసారు . 1912 లోనే ” మోహినీ విలాసం” నాటకాన్ని రచించారని వారిపై 2017 లో వచ్చిన పరిశోధన గ్రంథం చదివితే తెలిసింది. 1918 లో సోదరులు రచించి, ముద్రించిన ” రుద్రమదేవి నవల పీఠిక లో ఈ నాటక ప్రస్తావన ఉన్నదని కూడా తెలిసింది. ఈ విషయం ” ఒద్దిరాజు సోదరురుల జీవితం సాహిత్యం అనే” పరిశోధన గ్రంథం లో ఉన్నది . ఇప్పుడు ఈ నాటకం లభించడం లేదు . 1920 లో ఈ సోదరులు రచించిన ” భక్తిసార చరితము” అనే నాటకం ఆనాడు ముద్రించారు మళ్లీ కొత్త గా ముద్రణ కూడా అయ్యింది.‘ తెనుగు‘ పత్రికా వ్యవస్థాపకులూ , సాహితీ వేత్తలు ఒద్దిరాజు సోదరుల పై 2017 న వెలువడిన డా॥ కొండపల్లి నీహారిణి గారి పరిశోధన గ్రంథం ద్వారా తెలియవస్తున్నది.
బహుశః “మోహినీ విలాసం ” నాటకం అనంతర కాలంలో తెలుగులో వెలువడిన” )మోహినీ భస్మాసుర” ( 1966) సినిమాకు మూలం గా భావించాల్సి వస్తుంది. అంతేకాదు 1918 లో ఈ సోదరులు రచించి న ‘ రుద్రమ దేవి‘ నవల పీఠిక లోఈ నాటకం ప్రస్తావింపబడటం గమనించదగ్గ అంశం.

జాతీయ ఉద్యమం ప్రస్థానంలో పాట, నవల, కథ వంటి ప్రక్రియలతో పాటు నాటకం పోషించిన పాత్ర చాలా శక్తివంతంగా నిలిచి పోయింది. స్వాతంత్ర్య ఉద్యమం వైపు చైతన్య దిశగా కదిలించిన తెలుగ నాటకాలు కోకొల్లలుగా వచ్చాయి. పౌరాణిక నాటక ఇతివృత్తాలతో పండిత సుబ్రహ్మణ్య శాస్త్రి ‘సంపూర్ణ మహాభారతం’ ‘ద్రౌపది వస్త్రాపహరణం’ నాటకాలను, ధర్మవరం కృష్ణమాచార్యులు  ‘స్వయంవరం’ నాటకాన్ని, మొక్కపాటి వెంకటరత్నం ‘ద్రౌపది మాన సంరక్షణ’ నాటకాన్ని, వేదాంత కవి ‘యుద్ధభూమి’ నాటకాన్ని, కాళ్ళకూరి నారాయణరావు ‘పద్మవ్యూహం’ ఊటుకూరు  సత్యనారాయణ ‘భానుమతి’ ధర్మవరం కృష్ణమాచార్యులు ‘ప్రమీలార్జునీయం’ పట్టాభి సీతారామయ్య ‘మాతృ దాస్య విమోచనం’ మొదలైన నాటకాలను రచించారు.
1900లో కోలాచలం శ్రీనివాసరావు ‘సుల్తాన్”, 1921లో కొప్పరపు సుబ్బారావు ‘రోషనార,’ 1932లో ముత్తరాజు సుబ్బారావు ‘చంద్రగుప్త’, 1928లో ప్రభులింగాచారి ‘పల్నాటి వీరచరిత్రము’, 1926లో ఉన్నవ లక్ష్మీనారా యణ ‘నాయకురాలు’,నాటకానికి అంత శక్తి ఉంది.
1921లో మచిలీపట్నానికి చెందిన రఘుపతి వెంకయ్య, తనకుమారుడు ఆర్.ఎస్.ప్రకాష్ దర్శకత్వం, నటనలో భీష్మ ప్రతిజ్ఞ అనే మూగ సినిమాను నిర్మించి విడుదల చేశాడు. 1921 నుండి తొలి టాకీ వరకు (1932) విడుదైలన మూకీలు ,ఆనాటి రంగస్థల నాటకాల ముందు నిలువలేకపోయాయి.
టాకీ యుగం ప్రారంభమయ్యాక నాటకప్రభ సన్నగిల్లింది.
ప్రేక్షకులు కొత్తదనాన్ని వేలంవెర్రిగా స్వాగతించారు
1932 లో హెచ్ ఎం రెడ్డిగారు తెలుగునాట ప్రసిద్ధి చెందిన సురభి నాటక కంపెనీ అధినేత సురభి కమలాభాయి బృందాన్ని, రంగస్థల నటుడు మునిపల్లి సుబ్బయ్యని బొంబాయి తీసుకువెళ్లి, తెలుగు తమిళ భాషలలో ‘భక్త ప్రహ్లాద’ చిత్రాన్ని1932లో తనదర్శ కత్వం లో రూపొందించారు. ఆ తరువాత తెలుగులో తీసిన సినిమాలు అధికశాతంనాటకాలనే మూలంగా చేసుకొని తీశారు.భక్తప్రహ్లాద, పాదుకా పట్టాభిషేకం,చింతామణి, సత్యహరిశ్చంద్ర, వరవిక్రయం ,లవ కుశ సారంగ ధర, శకుంతల,కన్యా శుల్కం ..మొదలైనవి తెలుగునాట విజయభేరిని మ్రోగించిన నాటకాలు.
      ఈవిధంగా తెలుగులో తొలినాళ్ళలో నిర్మితమైన సినిమాలకు నాటకాలే మూలద్రవ్యాలను అందించాయి.
   *
     

January 16, 2023 1 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

“మా శారద గొప్పది”

by -  బి ఎస్ రాములు January 16, 2023
written by -  బి ఎస్ రాములు

ప్రేమించానని వెంటబడి పెళ్లి చేసుకొన్న అద్వైతకు కులాంతరాలు గుర్తుకు రాలేదు. ఏ లోపాలూ కన పడలేదు. నిన్ను పెళ్లి చేసుకోలేని ఈ జీవితం వ్యర్థం అన్నాడు. రొమాంటిక్ బ్లాక్ మేల్ చేసి గాంధర్వ వివాహం చేసుకున్నాడు. ఒక బిడ్డకు జన్మనిచ్చింది శారద. పెళ్లి చేసుకొన్న మూడేళ్లకు ఏదో కెమిస్ట్రీ కుదరలేదని భార్యను బిడ్డను వదిలేసి వెళ్లిపోయాడు అద్వైత .
శారద ఒంటరి ప్రయాణంలో మరో మూడేళ్లు గడిచాయి. ఎన్నో అనుభవాలు పోరాటాలు. ఎందరో మద్దతు నిలిచారు.
ఒంటరి పోరాటంలో కన్నీరు కార్చింది. ఏకైక కూతురు కంట కన్నీరు చూడ లేకపోయారు… కన్న పేగు కదిలింది. కడుపులో దాచుకున్నారు. అత్తామామలకు మనవరాలంటే ప్రేమ. ఎన్నాళ్లకు తమ ఇంట్లో మళ్లీ పసిపిల్ల కేరింతలు. ఆ పసి నవ్వులకు మురిసిపోయారు. కొడుకే చెడిపోయాడు. కోడలు మంచిది అని తెలుస్తూనే ఉంది. మాకు పెళ్లే కాలేదన్న కొడుకు వాదన విన్నాక వీడు తమ కడుపున చెడ పుట్టాడని బాధ పడ్డారు. కోడలు మనవరాలు తమ తో ఉంటే ఎంత సౌఖ్యంగా ఆనందంగా వుండేదో అనుకున్నారు. అలా కలిసి పోయారు. ఇపుడు వాల్లందరికి గారాల మనవరాలంటే ప్రాణం. మనవరాలు ఆటపాటలతో అన్ని మరిచి పోయారు. బయట సంఘర్శన. ఇంట్లో ఆనందం. కోర్టు , అడ్వకేటు , కలిసి దిగిన ఫోటోలు సాక్ష్యాలు అన్నీ బలంగానే ఉన్నాయి.
ఈ కొత్త జీవితం లో అనేక విషయాలు తెల్సుకుంది శారద. శారద ఇపుడు తన ఏటియం కార్డు తానే వాడుకుంటుంది . కేసు పెట్టింది. ఇపుడు జైల్లో వున్న అద్వైత్ ఉద్యోగం పోయి శారద మీద మీద మనోవర్తి కేసు వేసాడు.
కేసు వాసుతీసుకుంటానన్నాడు. అతడు
అడ్వకేటు తో కబురు పెట్టింది గుర్తుకు వచ్చి నవ్వుకుంది శారద.
ఏదో కెమిస్ట్రీ కలవడం లేదన్న బింకం అహంకారం ఎక్కడ పోయిందో! ఇపుడు తనకేమైందని అతనిని ఆహ్వానించడం.
?
అతని లోని మార్పుతో తనకేమీ సంబంధం లేదు.
ఇపుడీ సింగిల్ పేరెంట్ జీవితమే బాగుంది. అపుడు కులాంతరాల పేరిట దూరమైన అమ్మా నాన్నా అత్తమ్మా మామయ్యా అంతా నాతోనే వున్నారు.
ఈ ఉమ్మడి కుటుంబమే బాగుంది. అతడు మల్లీ తన జీవితంలోకి ప్రవేశించడం దేనికి?
తన అడ్వకేటుకు అదేమాట చెప్పింది. ఆ మాట చెప్పాక తనకెంతో బరువు దిగిపోయినట్టు ఉత్సాహం..
శారద మునుపటి శారద కాదు.
ఎన్నో అనుభవాలతో ఎదిగిపోయింది.
వదిలేసిన వాడి జీవితమే వాడిపోయింది. మా శారద గొప్పది.
శారద తన జీవితాన్ని తిరగ రాసుకుంది. స్కూటర్ పై
బిడ్డను స్కూల్‌లో దింపి నవ్వుతూ టాటా చెప్పి యధావిధిగా డ్యూటీకి స్కూటర్ స్టార్ట్ చేసి బయల్దేరింది శారద

January 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

 వెలుగు నీడలు

by తడక మళ్ళ మురళీధర్ January 16, 2023
written by తడక మళ్ళ మురళీధర్

(సినిమా బిర్యానీ)

మీనా, శివల వివాహబంధానికి దశాబ్దం గడచింది. వారి పూర్వీకులది బొబ్బిలి వంశం.  ఆస్తులు-అంతస్తులు ఎప్పుడో కాలగర్భంలో కలసిపోయాయి. ఔనన్నా కాదన్నా ఇద్దరు ప్రేమమూర్తులు.  ప్రేమకు చిహ్నంగా వారికి పుట్టిన ముద్దుల సంతానం రాము, ఆది.  తల్లిదండ్రులు రామును పండూ అని, ఆదిని చంటి అని పిలవటం అలవాటైంది.   ఆట నుండి అప్పుడే రాము ఇంటికొచ్చాడు. “ఒరేయ్ పండూ,  నీ స్నేహితుడు మురారితో గొడవ పడి కాలికి గాయం అయ్యేట్టు దెబ్బలు కొట్టావట. అతడు నీతో తప్పుగా ప్రవర్తిస్తే నాతో చెప్పి ఉండాల్సింది, నేను వాళ్ళ డాడీతో మాట్లాడే దాన్ని” అంటూ మీనా తన కొడుకు రామును మందలించింది.

“అమ్మా , కన్నతల్లివై ఉండి నిజం తెలుసుకోకుండా నన్నే దోషి అంటావేం,  వాడు నన్ను దొంగ అంటే చూస్తూ ఊరుకోవాలా!  ప్రతీకారం తీర్చుకున్నాను” ఉచ్ఛస్వరంతో బదులిచ్చాడు రాము.

“అంత  పౌరుషం వద్దు పండూ. నీవు వాడిని కొట్టిన విషయం మీ నాన్నకు తెలిస్తే పెద్ద రచ్చ జరుగుతుంది.  ఈ అమ్మమాట విని శ్రద్ధగా చదువుకో  నాన్నా, చదువు-సంస్కారం ఉన్నవాడే అందరి అభిమానం పొందగలుగుతాడు” కొడుక్కి హితబోధ చేసింది మీనా.

  “అలాగే నువ్వు చెప్పింది చేస్తా. నిజంగా ఒట్టేసి చెప్తున్నా.  అవును, శ్రీశైలం నుండి  కల్పన  పిన్ని వాళ్ళు వస్తారన్నావుగా, ఎప్పుడొస్తారు” అడిగాడు రాము.

“బాబాయి బొంబాయి వెళ్ళారట.  పిన్ని మామగారు అనారోగ్యంతో ఉన్నారని  డాక్టర్ బాబుకి చూపిస్తే రెండు రోజులు విశ్రాంతి తీసుకొమ్మన్నారట.   అంజలి స్కూలుకు ఇంకా శలవులు ఇవ్వలేదట. అందుకే ఎప్పుడు వచ్చేది  నిర్ణయం తీసుకోలేదట” జవాబిచ్చింది మీనా.

“నేను, తమ్ముడు చంటి, పిన్ని కూతురు అంజలి సరదా సరదాగా శలవులు గడపొచ్చనుకున్నాను”.

“నిజమే, సంక్రాంతి పండుగ కూడా వస్తుంది కదా. బొమ్మల కొలువు పెడతాను. నీవు దీపావళి పండుగకి  చేసినట్టే ఇంటి దర్వాజలకి మావిడాకుల తోరణాలు కట్టి నాకు సాయం చెయ్యాలి” సలహా ఇచ్చింది మీనా.

“మన చంటిగాడు బొమ్మల కొలువును పెట్టనిస్తాడా, వీడొక్కడే చాలు చెడగొట్టడానికి.”

 “ఈ మధ్య వాడు బుద్దిమంతుడు అయ్యాడు.  అయినా వాడి సంగతి  చూసుకోడానికి నా దగ్గర మంత్రదండం ఉందిలే. సరే గానీ  దేవాలయానికి వెళ్దాం రెడీ అవ్వు”.

“ఎప్పుడు దేవాలయం, అమ్మవారు, పూజ, నోములంటావు.  సరదాగా సర్కసుకో, జురాసిక్ పార్కుకో తీసుకెళ్లవచ్చు కదా” బుంగమూతి పెట్టి మారాముగా అన్నాడు రాము.

“శలవుల్లో  అందరం ఎంచక్కా జెమిని వారి ఫ్యామిలీ సర్కస్,  నెక్లెస్ రోడ్డు, గోల్కొండ కోట వెళ్దాం.  ఈ రోజు మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి కంచి స్వామి వస్తున్నారట. వారి ఆశీర్వాదం తీసుకుంటే ఎంతో శుభప్రదం”

“థాంక్స్ అమ్మా, కాసేపట్లో రెడీ అవుతాను”.

                       **

కూతురు అంజలితో పాటు టాక్సీ దిగిన కల్పన ఇంట్లోకి వస్తూ  “అక్కా బాగున్నావా, పండు, చంటి బాగున్నారా” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.

“అందరం బాగున్నాం. మీరెలా ఉన్నారే. అబ్బో, బంగారం జడగంటలు వేసుకుందే” అంటూ అంజలిని దగ్గరకు తీసుకుని కౌగలించుకుంది మీనా.

ఆహా బాగున్నాం.  అక్కా బావెక్కడ, అడిగింది కల్పన.  అడుగుతుండగానే  శివ ఇంట్లోకి  వచ్చాడు.   బావగారూ బాగున్నారా అంటూ శివను పలకరించింది కల్పన.  సూపర్ గా ఉన్నాను.  తమ్ముడు రాలేదా అంటూ శివ ప్రశ్నించాడు .

“పోలీసు ఇన్స్పెక్టర్  ఉద్యోగం మానేసి సినిమా ప్రొడక్షన్ వైపు దృష్టి పెట్టారు మా ఆయనగారు.  మొదటి సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు మా ఇలవేలుపు తిరపతి వెంకన్న అనుగ్రహం కోసం  వెళ్లారు.  కాలి నడకన ఏడుకొండలు ఎక్కి దైవదర్శనం చేసుకోవాలని ఆయన అభిలాష.  సినిమా సినిమా అంటూ ఈ మధ్య ఆయనగారు పిచ్చిమారాజులా చేస్తున్న ఆలోచన మా జీవితంలో ఎన్ని యూటర్న్ లు తిప్పుతుందో” అంటూ కల్పన కాసింత వెటకారంగానే అంది.

“వావ్, పోలీసుభార్య ఇప్పుడొక నిర్మాతకు అర్ధాంగి కాబోతుంది. కాసింత పాజిటివ్ గా  ఆలోచన చెయ్యి కల్పనా.  చక్రవర్తి చేసేది అంతా మనమంచికే. అతడు కుటుంబం కొరకు కష్టపడే మంచిమనిషి.  నువ్వనుకుంటు న్నట్లు ఆయన పిచ్చిమారాజు కాదులే, మంచి మారాజు కాబట్టే భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు” అంటూ ధైర్యం నింపే ప్రయత్నం చేసింది మీనా.

ఇంతలో పనుందంటూ శివ బయటకు వెళ్ళాడు.  “అక్కా మీ మాయదారి మరిది చిరంజీవి, తోడికోడలు జ్యోతి  మీతో కలిసి ఉండట్లేదా” అడిగింది కల్పన.

“ఏం చెప్పమంటావు.  పచ్చని సంసారంలో చిచ్చు పెట్టే రకాలు ఆ ఆలుమగలు. ఇద్దరూ ఇద్దరే. మా పెళ్ళిరోజు వాళ్ళు చేసిన నిర్వాకానికి  మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండే మా కాపురం కొంతకాలం కలహాల కాపురంగా మారింది . ఉమ్మడి కుటుంబంలో ఉండాలని వాళ్ళకూ లేదు. కాలం మారింది. పోనీలే, ఆ విషయాన్ని వదిలేద్దాం ” అంటూ నవ్వింది మీనా.

                      **

సంక్రాంతి పండక్కి రెండు రోజుల ముందుగానే చక్రవర్తి శివ ఇంటికి వచ్చాడు. కుశల ప్రశ్నలు ముగిశాయి. సినిమా స్క్రిప్ట్ అయిపోయిందని, దేశభక్తికి సంబంధించిన సినిమా అని, పేరు సుభాష్ చంద్ర బోస్ అనుకుంటు న్నట్లు,  శ్రావణ మాసం కల్లా  షూటింగ్ పూర్తి చేసి దేవీ అభయంతో దీపావళి రోజు విడుదల చేసి ప్రేక్షకుల దీవెన అందుకోవాలని డైరెక్టర్ పంతం అంటూ సగర్వంగా చెప్పాడు చక్రవర్తి.

తోడల్లుళ్ళు శివ, చక్రవర్తి  సొంత అన్న-తమ్ముడు  మాదిరి కలిసిపోయే రకం.  ఇల్లంతా పెళ్ళిసందడి లాగా పెద్దలు, పిల్లలతో ఎవడిగోల వాడిది అన్న చందాన సందడే సందడి.  పిల్లలు టీవీ లో హ్యారీ పోటర్, డిస్కవరీ ఛానల్ మార్చి మార్చి చూస్తూ ఖుషీ చేస్తున్నారు.  అక్కా చెల్లెలు మీనా, కల్పనలు అన్నపూర్ణ బ్యూటీ పార్లరు, బాబు టైలర్ షాపు, లీలా మహల్ సెంటర్ లోని శంకరాభరణం జెవలర్స్, రాఘవేంద్ర స్వగృహ ఫుడ్స్ అంటూ పూటకో షాప్ కు పరుగుతీస్తూ హంగామా చేస్తున్నారు. మీనా, కల్పనల తండ్రి సాంబయ్య ఆరు సంవత్సరాల క్రితం క్యాన్సర్ వ్యాధితో కన్ను మూశారు.  కొడుకులు లేనందున తల్లి యశోద మూడు సంవత్సరాల పాటు సొంత ఊరులో ఒంటరిగా గడిపింది. ఆ తర్వాత  ఆరోగ్యం బాగా లేక పల్లెటూరులో  సరైన వైద్యం  అందుబాటులో లేక  కుమార్తెల పంచన చేరింది. కూతుళ్ళు బాగానే చూసుకున్నా, అభిమానవతి అయిన యశోద పోరు పెట్టి అల్లుళ్ళకు ఇష్టం లేకున్నా  వృద్ధాశ్రమంలో చేరింది. 

భార్యలు లేని సమయం చూసుకొని శివ చక్రవర్తితో అత్తగారి ప్రస్తావన తెచ్చాడు.

“అత్తగారికి కూతుళ్ళైనా, కొడుకులైనా మీ వదిన, కల్పనే కదా. న్యాయపరంగా కూడ అత్తగారి మంచీ-చెడూ చూసుకోవలసిన బాధ్యత ఆవిడ సంతానందే అని నా మిత్రుడు లాయర్ విశ్వనాధ్  చెప్పాడు. మన మామగారి మరణం అత్తగారిని బాగా కుంగదీసింది. జీవితం చరమాంకంలో  మనవళ్ళతో ఆనందంగా గడపటానికి ఆమెను

వృద్ధాశ్రమం నుండి తీసుకొస్తే బాగుంటుందని నా సూచన.  నేనొక్కడినే కోరుకోవడం కాకుండా నీ అభిప్రాయం అడుగుతున్నాను చక్రవర్తి” అన్నాడు శివ.

“ఎప్పటినుండో నా మదిలో ఇదే ఆలోచన ఉంది అన్నయ్యా. కానీ ఆనాడు పంతం పట్టి వెళ్లినావిడ తిరిగి వస్తుందా.  నాకైతే హోప్ లేదు ”  బదులిచ్చాడు చక్రవర్తి .

“నిజం చెప్పాలంటే మన కుటుంబాల్లో నేడు ఎన్నో మార్పులు వచ్చాయి. ఆనాటి గందరగోళానికి కారణం అసాధ్యుడు లాంటి నా తమ్ముడు, మహానటి లాంటి వాడి భార్యామణి.  ఇద్దరు ఇప్పుడు సింహాచలం వెళ్లి అక్కడే కొత్త కాపురం పెట్టారు కదా. అదీ గాక ఈ మధ్యనే నీ ధర్మపత్ని కల్పన ఉద్యోగంలో చేరింది.   ఆమె ఆఫీసుకు వెళ్తే అంజలి స్కూలు నుండి రాగానే ఇంటి దగ్గర రక్షణ కోసం ఎవరో ఒకరు ఉండాలి.  ఈ విషయాలు చెప్పి అక్కా చెల్లెళ్ళను ఒప్పించే ప్రయత్నం చేద్దాం.”

శివ చెప్పిన ఐడియా నచ్చిన చక్రవర్తి సరేనంటూ అభినందన పూర్వకంగా కళ్ళు పెద్దవిగా చేసి నిలువుగా తల తిప్పాడు. ఐడియాను వెంటనే అమలు చేయటానికి మీనా, కల్పనను కూర్చోబెట్టి పెద్దమనిషిగా అత్తగారి పెత్తనం, కూతుళ్ళ ధర్మం, న్యాయం, బాంధవ్యాలు గురించి శివ చెప్పటంతో ఇద్దరిలో  పరివర్తన వచ్చింది. తప్పును సరిదిద్దు కోవాలనుకున్న  అక్కా చెల్లెళ్లిద్దరూ తక్షణమే కారులో ఆనందనిలయం వృద్ధాశ్రమానికి వెళ్ళి యశోదను క్షమాపణ కోరి, ఆవిడను ఒప్పించి,తోడ్కొని వచ్చి కుటుంబగౌరవం నిలబెట్టారు. సిసింద్రీలు ఆనందమానంద మాయె అంటూ  అమ్మమ్మకు సంబరంగా స్వాగతం పలికారు.  అమ్మమ్మా మాకు చందమామ కథలు, రాముడు కృష్ణుడు కథలు చెప్పాలి అంటూ రాము యశోద చీర  కుచ్చిళ్ళు పట్టుకున్నాడు. యశోద ముగ్గురు జూనియర్స్ ని దగ్గరకి తీసుకుని శుభాశీస్సులు అందిస్తుండగా ఆవిడ కళ్ళ నుండి ఆనంద భాష్పాలు రాలాయి.

(160 పైగా తెలుగు సినిమాల పేర్లతో అల్లిన కథ )

January 16, 2023 2 comments
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మనం విస్మరించిన కవి రచయిత – యజ్ఞకృష్ణమదాసు

by Nakka Harikrishna January 16, 2023
written by Nakka Harikrishna

ఈ నేల ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు. సాహిత్య పవనాలు సమృద్ధిగా కలిగిన ప్రాంతమిది. సృజ నాత్మకతకు, బహుముఖ ప్రజ్ఞకు చిరునామాగా ఎందరో వైతాళికులు ఇక్కడ నడయాడారు. పోరాట తత్వాన్ని, తత్వజ్ఞానాన్ని కలిగి శరీరాన్ని కరిగించి లోకహితం కోసం ధారపోశారు.అలాంటివారు ఎందరో అక్షరమూర్తులు మనకు ప్రాతఃస్మరణీయులుగా ఉన్నారు. వారిలో ఒక మేలిమి రత్నం  యజ్ఞ కృష్ణమదాసు.

యజ్ఞకృష్ణమదాసు 1899వ సంవత్సరం మెదక్ జిల్లామారేపల్లిలో, ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు. వారిది పద్మశాలి కుటుంబం. చాలీచాలని వ్యవసాయం ఉన్నప్పటికీ, కొంత నేత పని, కూలి పనులతో రోజులు గడిచేవి. ఆయన బాల్య జీవితం ఎక్కువగా పశువులను కాయటంలోనే గడిచిపోయింది. బడికి పోయి అక్షరాలు దిద్దవలసిన వయసులో ఆయన పశువుల కాపరిగా ఉన్నాడు. అందుకు ప్రభలమైన కారణాలు ఉన్నాయి. ఆ రోజులలో ఉర్దూ ప్రధాన రాజభాషగా కొనసాగింది. ప్రభుత్వ లావాదేవీలన్నీ కార్యాలయ వ్యవహారా లన్నీ ఉర్దూ మాధ్యమంగా జరిగేవి. ఉర్దూ పాఠశాలలు తహతన్య, వస్తేమియా ప్రాథమిక ఉన్నత విద్యగా పిలువ బడ్డాయి. అవి ప్రధానమైన తాలూకా కేంద్రాలలో మాత్రమే ఉండేవి. అవికూడా తాలూకా కేంద్రాలకు వెళ్లి చదువుకోవటం గ్రామీణ విద్యార్థులకు ఇబ్బందికరంగా పరిణమించింది. అందువలన గ్రామంలో అక్కడక్కడ నడిచే ఖాన్గి పాఠశాలలలో కొంత మటుకు విద్యాభ్యాసం మాతృభాషలో జరిగింది. ఇది కూడా చాలా తక్కువ అని మాత్రమే చెప్పాలి.

విద్యా అవకాశాలు తక్కువగా ఉండటం వలన నిరక్షరాస్యత శాతం అధికంగా ఉండేది. ఆ విధంగా ఎందరో విద్యకు దూరం అవుతున్న సందర్భంలో తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం ప్రారంభమైంది. 1901 లో శ్రీకృష్ణదేవ రాయ ఆంధ్రభాషా నిలయం స్థాపించబడటం ఎంతో స్ఫూర్తిదాయకమైంది. తెలంగాణ రాష్ట్రంలో గ్రంథాలయాలు స్థాపించబడ్డాయి. గ్రంథాలయ ఉద్యమం జరుగుతున్న దశలోనే అణాగ్రంధమాల ప్రాచుర్యంలోకి రావటం వలన విద్య పట్ల చదవడంపట్ల అభివృద్ధి పెరిగింది.గ్రంథాలయ ఉద్యమం తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఆలంపల్లి వెంకట రామారావు గారు ఆంధ్ర జన సంఘం ఏర్పడటానికి పాదులు వేశారు.ఈ సంఘటన తరువాత మాతృభాష పట్ల ఆలోచనలు పెరిగాయి. ఆ వెంటనే ఆంధ్ర జనసంఘం స్థాపించటం ఆంధ్ర మహాసభలు ఏర్పడటం చైతన్యకారకాలు. ఈ ప్రేరణతో ఈ ప్రాంతపు కవులు రచయితలు నవతరాలను ఏర్పరచగలిగారు.

వడ్డేపల్లి సోదరులుగా పేరుగాంచిన దేశబంధుపత్రిక నిర్వాహకులు బెల్లంకొండ నరసింహచార్యులు, బెల్లంకొండ వెంకటాచార్యులు మెదక్ సభలో గల జోగిపేట నందు అవధానం చేస్తున్న సందర్భంగా వారికి యజ్ఞ కృష్ణమదాసు పరిచయమయ్యాడు.

బెల్లంకొండ సోదరులు యజ్ఞకృష్ణమదాసులో గల పఠణాభిలాషను తెలుసుకొని ఆయనకు తన 15వ ఏట అక్షరాభ్యాసం చేశారు. సంస్కృతం ఉర్దూ భాషలు నేర్పించారు. తెలుగులో చందస్సు అలంకార శాస్త్రం నేర్పించారు. యజ్ఞకృష్ణమదాసు అక్కడితో ఆగకుండా దేశబంధు సోదరులతో పాటు పత్రికా సంపాదకుల సమావేశానికి హాజరయి, ఆంధ్ర మహాసభలు, ఆర్యసమాజ కార్యక్రమాలు అణాగ్రంథమాలలో పాలుపంచుకునే స్థితి దాకా ఎదిగాడు. హైదరాబాద్ కోటిలో దేశబంధు సోదరులు ప్రతి నెల నిర్వహించే పత్రిక సంపాదకుల సభా నిర్వహణ చేసే స్థాయి దాకా ఎదిగాడు.అక్కడి నుండి ఆయనలో చెప్పుకో తగినంత సాహిత్య పరిణతి కలిగింది.

యజ్ఞకృష్ణమదాసు కవి, కథకుడు, విమర్శకుడు, యక్షగానాలు రచించాడు, పాండవోద్యోగము, శ్రీకృష్ణ రాయబారం, దక్షయజ్ఞము ఆయన రాసిన  యక్షగాన రచనలు. వీటితోపాటు జ్యోతిష శాస్త్రాన్ని రచించాడు. ఆయన విస్మృతికి గురైన కవి రచయిత. ఆనాటి పరిస్థితులలో కార్యకర్త. ఆయన కృషిని  డా. బెల్లంకొండ సంపత్ కుమార్ వెలుగులోకి తెచ్చారు. యజ్ఞకృష్ణమదాసు కథలను సేకరించి “మెతుకు కతలు”లో ప్రచురించాడు. మలిదశ తెలంగాణ ఉద్యమం అస్తిత్వం ఫలితంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోగల ఎందరో రచయితలు ఈ గ్రంథం ద్వారా పరిచయమయ్యారు. ఈ పుస్తకానికి వేముగంటి మురళీకృష్ణ, డా. బెల్లంకొండ సంపత్ కుమార్ సంపాదకత్వం వహించారు.

వంద సంవత్సరాల కిందట ఆయన రాసిన రచనలు ఇవాళ చాలా అలభ్యంగా ఉన్నాయి. దేశ బంధు పత్రికలలో జీర్ణప్రతులలో కొందరి పరిశోధకుల కృషి వలన ఆయన గురించిన సమాచారం పరిమితంగానే లభ్యమవుతుంది. యజ్ఞ కృష్ణమదాసు కృతజ్ఞతా పూర్వకంగా రాసిన పద్యం ఆయన వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది.

పశువుల కాపరై పద్మశాలిగపుట్టి

కట్టెలేరుకొనియు గడుపు నన్ను

అవధానములు చేయునట్టి సభన జూచి

కడుపేద నైనను కరుణజూపి

సంస్కృతముర్దూయు ఛందస్సులను నేర్పి

నట్టి బెల్లంకొండ నాచార్య సోదర

ద్వయముకంజలి తనువువీడువరకు

యజ్ఞకృష్ణపుదాసు యనెడి నన్ను

తే .దేశ బంధు పత్రిక నాకు దిశనుజూపె

పత్రిక సభల అధ్యక్షు నై పాల్గొనుమని

బెల్లంకొండసోదరులైన వారె నిలను

నొందినఘనులనేమని నుడువువాడ

యజ్ఞ కృష్ణ దాసు కథలు :

యజ్ఞకృష్ణమదాసు మరొక గురువు గణపతిశర్మ. తొలి దశలో గణపతి శర్మ వద్ద అక్షరాలు దిద్దు కున్నప్పటికి కొద్ది కాలానికే విద్యాభ్యాసం ఆగిపోయింది. పశువుల కాపరిగానే వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడటం వలన పరిస్థితులు అనుకూలించక ప్రోత్సాహం లేకపోవటంతో విద్య ఆగిపోయింది.

యాజ్ఞకృష్ణమదాసు అర్థశత కథలు రాసినట్టు బెల్లంకొండ సోదరులు దేశబందులో తెలిపారు. వాటిలో లభ్యమవుతున్నవి నాలుగైదు మాత్రమే. యజ్ఞకృష్ణమ దాసు రాసిన కథలలో ఇంద్రమాలిక కథవైవిద్య భరితమైంది. ఇంద్రమాలిక అనే పేరు కథకు శీర్షిక చేయటం ఎంతో ఔచిత్యవంతంగా ఉన్నది. ఈ కథ ఆనాటి పరిస్థితులను కండ్లకు కడుతుంది.

ఇంద్రమాలిక ప్రజావ్యతిరేక రాచరికన్ని నిలువరించే రచనగా మనకు అర్థమవుతుంది. కల్పవృక్షం కామధేనువు వలె ఇంద్రమాలిక ఒక విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉన్నది. పూర్వగాదా లహరిలో ఇంద్రమాలిక అనే పదానికి అర్థం ఒక కమల మాలిక అని అది ఎన్నడును వాడిపోనిది అని. దీనిని ఎవరు ధరించినను వారిని ఏ ఆయుధములు కూడా తాకలేవు అని. ఈ మాలికను ఇంద్రుడు ఉపరిచర వసువునకు ఇచ్చెను. అనేవి వరం పేర్కొనబడిఉంది.

ఈ కథలో ఆనాటి రాజ్యపాలన ఉన్నది పాలకుల క్రూరత్వం నిరంకుశ విధానాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రజల లోకాల నిరసనలను ఈకథ తెలియజేస్తుంది.

ఇంద్రమాలిక కథలో మంజీర కాదేశం ప్రస్తావన ఉన్నది. మంజీరకాదేశంలో నారయ్య అనే ఒక గృహస్థుడు ఉన్నాడు. అతడు శ్రీ చూర్ణం తిరుమణి కలిగి ఉండి మతభేదములు లేక విభూతి భస్మం ఒక సందూక పెట్టెను ఉంచుకొని దుఃఖితులైన ప్రజలకు దివ్యఔషధాలను ఇస్తూ ఉంటాడు. వారు ఎద్దులను అలంకరించేవారు. వ్యవసాయ శ్రమను నమ్ముకొని జీవించేవారు. నారయ్య తాతదండ్రులు ఇంద్రమాలిక విద్యను నేర్చుకున్నారు. గండర కత్తెరలు తలలు తెంపినా అతికించగల నేర్పరులు వారి తాత తండ్రులు. ఇంద్రమాలిక అనబడేడు కవచం ఒక విద్యగా రచయిత ఈ కథ ద్వారా తెలిపాడు.

కథలో వర్ణనలు ఉన్నాయి. వర్ణనలు కథా శిల్పంలో అమరినట్టు ఉండటం కథలో ఉన్న కొత్తదనం. “ఒక శ్రావణ పూర్ణిమ దినం నవనాడులు జీరములలోనూ కమంజీరకాదేశ స్వరమృత్తికన ఆహ్లాదకర వాయువులు వీచుచుండ ఆజామున ముసళ్ళు నీటి ఉపరితలము మీన నిద్రించుచుండ పవళిని బీద వదనంబున ప్రకృతి విషాదకాంతవలె శంకువు లేరుచు వెన్నెల, మెరుపున ఒలలాడుచున్నది”. పవళిని అనే స్త్రీ పాత్రను కథలో ప్రవేశింప చేయడానికి రచయిత వర్ణనను కథకు తగినట్టుగా అమరిక చేశాడు.

పవళిని రాజ్యపాలకులు వంచించారు. ఆమె కుటుంబం అంతా పాలకులవలన దెబ్బతిన్నది. పాలకుల క్రూరత్వానికి కుటుంబం బలి అయిపోయింది. ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజుకామోన్మాది రాజుగా రచయిత పేరులోనే ప్రజా వ్యతిరేకతను కనబరిచారు. అతని దుశ్చర్యలకు పవళిని కుటుంబం మాత్రమేకాదు ఎన్నో కుటుంబాలు బలైపోయినాయి.

ఆమె నారయ సహాయం తీసుకోవటం కథకి మలుపు. నారయ్యకు ఇంద్రమాలిక విద్యవచ్చును. ఇంద్రమాలిక నిద్రించు వారల మేలుకొలుపునది అని రచయిత కథాంశంలో చెప్తాడు.

ఒకనాటి మాఘ స్నాన ప్రారంభంలో రాజుగర్వానికి అడ్డుకట్ట వేసే సందర్భం ఏర్పడుతుంది. రాజుపల్లకి మోయటానికి బోయిలు వస్తారు. వారు నారదాసుని మామిళ్ళతోట దారిన తీసుకు వెళుతూ ఉన్నప్పుడు నారయ్య రాజు పల్లకిని మోసే బోయిగా ఉంటాడు. ఇక్కడ కథలో ప్రధానమైనమలుపు ఉన్నది. నారయ్య మామిళ్ల తోట వద్ద స్నానం ఆచరించి అలంకారం చేయించుకుంటున్నప్పుడు ఆయన కండ్లకు నారయ ఒక అంజనాన్ని లేపనం చేస్తాడు అంజనం ప్రభావంగా రాజు అపస్మారక స్థితిలోకి వెళ్తాడు. ఆ రాజును బోయిలు దక్షిణ పర్వత శ్రేణిలోకి తీసుకొని వెళ్తారు రాజును బంధీగా చేసి కట్టివేస్తారు. తెల్లారి అతనికి మేలుకో వచ్చి చూసుకుని అయిన విషయాన్ని గ్రహిస్తాడు. రాజు ఇంద్రమాలిక విద్యవలన బంధి అయినాడు. ఈ విషయం తెలిసిన ప్రజలు ఆనందంతో పండుగ చేసుకుంటారు. రాజురాజ్య బ్రష్టుడౌతాడు. ఆ రాజ్యమున ఆకలి అనే మాటలేదు. ఆనాటి నిజాం నిరంకుశ పరి పాలనకు వ్యతిరేకమైన ఆలోచనలు ఈకథలో ఉన్నాయి. ఈ కథ ఆంధ్ర మహాసభల నేపథ్యంలో వచ్చింది.

విమర్శ :

కృష్ణదాసు “భారతీయసాహిత్యము” అనే విమర్శనాత్మక వ్యాసాన్నిరాశాడు. ఈ వ్యాసం దేశ బంధు పత్రిక ప్రమోదూత నామసంవత్సరం పాల్గుణ మాస పత్రికలో ప్రచురించబడింది. పాశ్చాత్యుల సాహిత్య భావనలు భారతీయ సాహిత్య భావనలు వేరుగా ఉన్నాయని రచయిత పరిశీలించాడు. పాశ్చాత్యులు భారతీయ లాక్ష్యనికులు రాసిన గ్రంథాలను అభ్యసనం చేశారని తెలిపారు. సాహిత్యం జీవనపరిధి లోనిది. అందువల్ల పాశ్చాత్య సాహిత్యం భిన్నంగా ఉండటంలో ఆశ్చర్యం లేదని తెలిపాడు. ఈ వ్యాసంలో భారతీయ సాహిత్య వారసత్వం కావ్య స్వరూపంలో ఇహపరలో కసార్ధకత ఏ విధంగా పరిఢ విల్లిందో అదేవిధంగా సాహిత్యం మోక్షగామిగా అనుకూలమైన సందర్భాలను రచయిత పరిశీలించాడు. రామాయణ భారతభాగవతాలను రచించిన వారి జన్మధన్యంగా ఆధ్యాత్మిక చింతన యొక్క ప్రాధాన్యతను తెలిపాడు. భారతీయ లాక్ష్యనికులు చెప్పినకవితా పద్ధతులు వాటి ప్రయోజనం గురించి రచయిత వివరించాడు. కేవలం కావ్యాన్ని స్పర్శించినంత మాత్రాన ఎవరు కవులు కాజాలరు అని చెబుతూ కవికి నిత్యసాధన అవసరమని తెలిపాడు. “దర్శనాద్వర్ణనాచ్చాడరూడాలోకేకవిశ్రుతిః. “రామాయణ రచనలలో వాల్మీకి మొదట కరుణ రసహృదయుడైనాడు తర్వాత రచనామయుడైనాడు” అని యజ్ఞకృష్ణమదాసు తెలిపాడు.

ఆయన కవితత్వాన్ని పరిశీలిస్తూ వస్తువును అగోచరముగా దర్శించిన వాడు ఉత్తమకవి కాజాలడు అన్నాడు.  “కమనీయం కావ్యం” కావలెనని ఆ లక్షణాలు రామాయణ భారత భాగవతాలకు ఉన్నాయని పరిశీలిం చాడు.

” సశబ్దో నసన్యాయో నసా విద్యా నసాకళా

జాయతే యన్న కావ్యాంగమతో భారో మహాకవేః ”

సా విద్య పట్ల అవగాహన కలిగి ప్రతిభా పాటవాలు రచన సామర్థ్యం కలిగి ఉన్నవాడు కవి కావటానికి అర్హుడని యజ్ఞ కృష్ణమదాసు చెప్పాడు. ‘సావిద్య’ అంటే చైతన్యం. చైతన్యం అనేది కాల చైతన్యాన్ని తెలుపుతుంది. రచన ఇతివృత్తాల పట్ల సరైన అవగాహన కలిగి ఉండటం, అందుకు ప్రతిభ తోడు కావాలనేది కృష్ణమదాసు భావన. అవి కాకపోయినా పర్వాలేదు కానీ కవిత్వానికి భిన్నంగా అకవిత్వం రాయటం సమంజసం కాదు అని కృష్ణమదాసు ఈ వ్యాసంలో పరిశీలన చేయతలచాడు. యజ్ఞకృష్ణమదాసు వ్యుత్పత్తిలోపం వలన ప్రతిభ నశించిపోతుందని చెప్ప టానికి.

“అవ్యుత్పత్తి కృతో దోషఃశక్తా సంవ్రియతేకవేః

జస్త్వశక్తికృత స్థస్యఝడిత్యే వావ భాసతే “

అని తెలిపాడు. ప్రతిభ గుణసంపదల చేత పరిపూర్ణమవుతుంది. కవి ఈ గుణ విశేషములను పుష్కలంగా కాంచవలెనని యజ్ఞకృష్ణమ దాసు కవితా విమర్శనం చేశాడు.

ఈ విధంగా కృష్ణమ దాసు యక్షగాన రచయితగా పద్య రచయితగా, గ్రంథకర్తగా, కథారచయితగా, విమర్శకుడిగా, పత్రికరంగంలో వడ్డేపల్లి సోదరుల నిర్వహణలో పత్రికా సంపాదకుల సమావేశానికి అధ్యక్షత వహించి సురవరంప్రతాపరెడ్డితో మెప్పుపొందిన మేటిరచయితగా బహుముఖంగా దర్శనమిస్తాడు.

యజ్ఞకృష్ణమదాసు కవి రచయిత మాత్రమేకాదు. ఆయన ఆర్యసమాజ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆంధ్రమహాసభలతో ప్రేరణ పొందాడు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపాడు. నాటి ప్రముఖులతో స్నేహసంబంధాలు కలిగి ఉన్నాడు. ఆయన 1969వ సంవత్సరంతుదిశ్వాస విడిచే వరకు స్ఫూర్తివంతమైన జీవితం గడిపాడు. యజ్ఞ కృష్ణమదాసు వంటి వారి సేవ ఎంతటిదైనా అటువంటి వారి కృషి పట్టుదల ఆదర్శనీయత భావితరాలకు మార్గదర్శకమైంది. అట్టి వారి సేవలను విస్మృతికి గురి కాకుండా కాపాడుకోవాల్సిన అవసరము ఉన్నది.

January 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us