మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంద్రధనుస్సు

విద్యను ఎలా సాధించాలి?

by డా|| మృదుల నందవరం October 25, 2021
written by డా|| మృదుల నందవరం

ఎంతో విశిష్టతను కలిగిన విద్యను ఎలా సాధించాలో చాణక్య నీతి తెలుపుతుంది
శ్లో|| క్షణశః కణశ్చైవ, విద్మయర్థం చ సాధయేత్
క్షణత్యాగేకుతో విద్య, కణత్యాగే కుతోధనమ్
ప్రతిక్షణమును సద్వినియోగం చేసుకుంటూ విద్యను ఆర్జించాలి. రూపాయి, రూపాయిని కూడ చెడితేనే ధనము పోగవుతుంది. క్షణాన్ని వ్యర్థం చేస్తే విద్య ఎలా వస్తుంది. రూపాయిని పొదుపు చేయకపోతే ధనము ఎలా పోగవుతుంది? అందుకే దేనిని అల్పంగా చూడకుండా, క్షణాన్ని, కణాన్ని కాపాడుకోవాలి. డబ్బు పట్ల ఆసక్తితో ఎలా దాచుకుంటామో, విద్య పట్ల ఆసక్తితో ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యను ఆర్జించాలి అని పై శ్లోకం తెలుపుతుంది.
(సూక్తి ముక్తావళి, మహీవర జగనో్మహనరావు, పేజి. 42, జనవరి 2015)
‘కల అంటే నిద్రలో వచ్చేది కాదు. నిద్రపోనివ్వకుండా చేసేది.’
అని అబ్దుల్ కలాం అంటారు. మన లక్ష్యంవైపు – విద్యను పొందాలి అన్న ఆలోచనవైపు విశ్రమించకుండా పరిశ్రమించడమే; అని కలాం అంటారు. ఆ దిశగా మన పయనం సాగితే దేనికీ లోటు ఉండదు.

పై శ్లోకానికి ధీటుగా, పంచతంత్రం లోని మిత్రభేదం వాక్యాలు మనకు కనిపిస్తాయి.వర్ధమానుని ఇతివృత్తం లో చిన్నయసూరి గారు,’దక్షిణాపథమందు రక్షావతి యను పట్టణము గలదు.అందు వర్ధమానుడను సార్థవాహుడు వాసము చేయుచుండును.అతడు తనకంటె సంపన్నులైన తన బంధువులను జూచి వారికంటె మిక్కిలిగా ధనము సంపాదింప వలెనని యెంచి యిట్లు చింతించెను.
“అర్థము పురుషార్థముల లోపల నుత్తమము.అర్థవంతున కసాధ్యము లోకమందేదియు గానము.కాబట్టి పురుషుడు న్యాయము దప్పక యే యుపాయము చేతనయినను ద్రవ్యము సంపాదింపవలెను.ఇంత సంపాదించితి నింకేలయని తనియరాదు.బుద్ధిమంతుడు జరామరణములు లేని వాని వలె విద్యాధనములు గడియింపవలెనని పెద్దలు చెప్పుదురు”.

ఈ వాక్యాలు విద్యను, ధనాన్ని ఎలా సంపాదించాలో తెలియజేస్తున్నాయి.విద్యాసముపార్జనలోనూ,ధనసంపాదనలోనూ తృప్తి ఉండరాదని తెలుపుతున్నాయి.

ఇక్కడ మనకొక ప్రశ్నరావొచ్చు.పైవాక్యాలకనుగుణంగా బ్రతికితే,అది తృప్తి లేని జీవితం అవుతుంది కదా ! అనే భావన కలగవచ్చు. అందులో ఉన్న లోతైన ఆలోచన మనం గుర్తించాలి.

మన విద్యాసముపార్జన ఎందరికో జ్ఞానజ్యోతి కావాలి.మన ధన సముపార్జన ఎందరికో జీవితాలను ఇవ్వాలి.అందుకోసం మనం అహరహము కృషి చేయాలి.

ఇక్కడ కూడా మనకు ఒక ప్రశ్న ఉదయించవచ్చు.ఎవరికి కావలసింది వారు సముపార్జించుకుంటే సరిపోతుంది కదా ! అని.ఈ సృష్టి లో ప్రతి జీవికి అన్నీ సాధ్యం కావు.ఉదాహరణకు పండించడం రైతుకు మాత్రమే సాధ్యం అవుతుంది.అతడు తన వరకు మాత్రమే పండించడు.మన అందరి కోసం పండిస్తాడు. అలాగే మన విద్యా ధనములు తోటివారికి ఉపయోగపడాలి.అందుకు శక్తి ఉన్నంతవరకు కృషి చేయాలి.

మానవుడు,జీవితం తన కోసమే కాదు.తోటివారందరికోసం అనే సత్యాన్ని గుర్తించాలి.వారి సంక్షేమం అనే సుందర స్వప్నానికి సాకారం కల్పించాలి.

October 25, 2021 1 comment
1 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

పదకిరణ కలనం-4

by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి October 25, 2021
written by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి

ఆధారములు
****
అడ్డం
***
01. అమ్మ ఆవు నేర్పిన ఓనమాలు (2)
03. జింక (4)
05. మాదిరి రూపం (3)
07. రవి గాలి మోక్షం (4)
09. సమానము నకలు (2)
10. వనిత కాదు అడవి (3)
12. ఒక క్రొవ్వు బెజ్జం (2)
13. పూరి గుడిసె (2)
14. బంధువుల రాకకు ఆకర్షణ సుమతీసూక్తి (3)
16. నిస్పృహకు ముందు తోడు (3)
18. అలంకారం ఓ రసం (3)
19. పక్షిరెక్క అతిశయం (2)
21. అగ్న్యర్ధాంగి హవిర్వచనం (2)
22. కొంతవరకే కమ్మిన చీకటి (2)
23. అవిభాజ్య (4)
24. తండ్రి (2)
25. …. (శ్రద్ధ గలిగి) యిసుమున తైలంబు దీయవచ్చు (3)
27.” …. లక్ష్మణా!” .. బాధలు వెళ్ళబుచ్చే మాట (2)
30. నీచుడు (3)
32. ఇండ్ల ముందు చల్లేది (3)
33. భూలోకం (2)
34. నెమలిపురి గుత్తి (2)
35. ప్రధానేంద్రియం (3)
36. ఇక్కట్లలో నివాసం (2)ఐ
37. జలధి (2)
38. కూసేది కాదు, చేసేది (2)
40. ఉపేక్ష ఓ భాష (3)
41. వీణ వంటి వాద్యం, ప్రక్కగాజు (2)
42. గాలితో నీటిసుడి (4)

నిలువు
***
01. వాస్తవ విషయం (6)
02. ఈ దా కాదు, లాభం మరోభాషలో (2)
03. సంతానవతి (3)
04. చేతికఱ్ఱ అతిమధురం (2)
05. మావ లేని మానవతి నమస్కారం (2)
06. నటీనటుల జీవనక్షేత్రం (5)
08. చెంప క్రింది భాగం బిళ్ళకట్టు చోటు (3)
09. చలిపందిరి (2)
11. కనికట్టులో చూచి (2)
12. జీవశక్తిలో ఆవు కూతురు (2)
13. కోటలో వేసేది (2)
15. హద్దు కొలత (4)
17. ఇవి లేకుంటే చుట్టరికాలు, బాటలు మరుగౌతాయి (5)
18. మృగరాజుతో జరిగిన సంగతులను నెమరువేయు (6)
20. ఆ పూవు కాస్త వెచ్చగా ఉంటుంది (3)
26. వృథా (2)
28. కోతితో గణపతికి ఇష్టమైనది (3)
29. పొందిక (4)
30. నీచం (2)
31. సముద్రం (3)
34. ఊపిరి మ్రింగుట (2)
36. ఒక నాడి నేల ఆవు (2)
37. విరోధం (2)
38. నడుమ తరుగుతో తరుగు యుక్తమైన (2)
*****

October 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

వ్యంగ్య చిత్రాలు (కార్టూన్స్)

by మూటుపూరు విఠల్ చందర్ రావు October 25, 2021
written by మూటుపూరు విఠల్ చందర్ రావు

-మూటుపూరు విఠల్ చందర్ రావు
Tech Arch Delivery Manager, Accenture
+91-9908817120

October 25, 2021 0 comment
3 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

సినీ గేయాల పరామర్శ

by ఏలూరు అశోక్ కుమార్ రావు October 25, 2021
written by ఏలూరు అశోక్ కుమార్ రావు

1960లో వచ్చిన ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’లో ఆత్రేయ వ్రాసిన ‘ఎవరో అతడెవరో’ పాట ఒక రసాత్మక గీతం. బృందావన సారంగ రాగంలో పెండ్యాల నాగేశ్వరరావు దీనిని స్వరపరచారు. ఘంటసాల, సుశీల పాడిన యీ పాటను ఎన్టీఆర్, సావిత్రి లపై చిత్రీకరించారు దర్శకులు పి.పుల్లయ్య.
పల్లవి : ఎవరో అతడెవరో, ఆ నవ మోహను డెవరో, నా మానస చోరుడెవరో, ||ఎవరో||
తొలి చూపులలో వలపులు చిలికి దోచిన మగసిరి దొర ఎవరో ||తొలి||
అరయక హృదయమునర్పించితినని, ఆదరించునో ఆదమరచునో ||ఎవరో||
వల రాజా? కలువల రాజా? కాడే కన్నుల కగుపడినాడే!
అకలంకుడే…. హరిణాంకుడు కాడే ||అక||
మరి ఎవరో ఏమరినానో ||ఎవరో||

శ్రీ మహావిష్ణువు శ్రీనివాసునిగా లక్ష్మిదేవి పద్మావతిగా అవతరించారు. పద్మావతి శ్రీనివాసుని చూచినప్పటి నుండి తన హృదయాన్ని అర్పించింది. శ్రీనివాసుడే శ్రీ మహావిష్ణువని తెలియక ‘ఎవరో అతడెవరో’ అని పాడుకున్నదని ఆత్రేయగారి వాదన. అంటే మానవ రూపంలో అవతరించిన లక్ష్మీదేవికి శ్రీనివాసుడు నవమోహనుడిగా, తన మానస చోరుడిగా అగుపించాడు. తన హృదయాన్ని అర్పించినది. అతడు కూడా తన కోరికను మన్నిస్తాడో లేదో అని బాధపడుతుంది. పైగా తాను ఇష్టపడిన శ్రీనివాసుడు మన్మథుడా (వలరాజా) దేహం లేని మన్మథుడైతే మరి తన కళ్ళకు కనపడుతున్నాడే! చంద్రుడా (కలువల రాజా), జింక చిహ్నం మచ్చగా గల చంద్రుని (హరిణాంకుడు) లాంటివాడు కాదే, మచ్చలేనివాడు (అకలంకుడు) (హరిణాంకుడు) లాంటి వాడు కాదే, మచ్చలేనివాడు (అకలంకుడు) కదా తాను ఇష్టపడినవాడని పద్మావతి ఊహించుకొన్నదని భావుకుడైన ఆ్రతేయగారి ఆలోచన. కాని ఆలోచిస్తే శ్రీ మహావిష్ణువుని ఆత్రేయగారు అతని కంటె స్థాయిలో చిన్నవారైన మన్మథునితోను, చంద్రునితోను పోల్చడం, విష్ణువు గుండెలపై ఉన్న శ్రీవత్స చిహ్నం(మచ్చ) గురించి ఆమె మరచిపోయి అకలంకుడు అని భావించడం, ఇతరులు విమర్శించడానికి అవకాశం ఇస్తుంది.

‘చలువలు కురిసే జాబిలి !
చెలి కలతను తెలిసీ కలుగద జాలి
కరుణ చూపి కబురు తెలిపి రమ్మనవా నను చే కొమ్మనవా’

తన మనోగతాన్ని చందమామకు తెలిపి, నీవు చల్లని వెన్నెల కురిపించే వాడివి– “ఆతడు నా బావని నీకు తెలిసినప్పటికి నా మీద జాలి కలగడం లేదా ? నాపై దయ చూపి, శ్రీనివాసుని నేను ప్రేమిస్తున్నాననే కబురు ఆయనకు చెప్పి ” తనను పెళ్ళి చేసుకొమ్మని చెప్పమని రాయబారిగా వెళ్ళమని చంద్రుణ్ణి, పద్మావతి బ్రతిమాలుతుంది.

‘కరుణ చూపి కబురు తెలిపి’

చరణంలో ఉర్దూ పరమైన
‘ కబురు ’ _ తాను ఉపయోగించినందుకు ఈ పాట రికార్డింగు పూర్తయ్యాక, ఆత్రేయగారికి గుర్తొచ్చి, బాగా బాధపడ్డారట. వెంటనే తనకు గురు సమానుడైన రచయిత మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి వద్దకు వెళ్ళి, తన మనసులోని బాధను చెప్పారట ఆత్రేయ. అందుకు మల్లాదివారు ‘ఏం ఫర్వాలేదు. ఆ కాలంలో బీబీ నాంచారి కూడా ఉన్నది. ఆమె ముస్లిం కదా, బాధపడవద్దని ఆత్రేయగారిని ఊరడించారట. అంటే ఎవరూ కూడ పసిగట్టలేనటువంటి ప్రయోగాన్ని ఉపయోగించినందుకు ఆత్రేయగారు బాధపడిన తీరు చూస్తుంటే ఆయన నిజాయితీ తెలుస్తుంది. ఇక్కడ ఊరడించిన మల్లాది వారి ప్రతిభ , సాహిత్య విశ్లేషణ శక్తి , ఆ రోజుల్లో ఎందరికో ఆయన పెద్ద దిక్కైన గొప్పతనమూ గమనించవచ్చు.

పద్మావతి తన బాధను చందమామతో వెల్లడించిన సమయంలోనే శ్రీనివాసుడు కూడ
‘ఎవరో తానెవరో ఆ నవమోహిని ఎవరో నా మానస హారిణి ఎవరో ||ఎవరో||
నందన వనమున నానందములో తొలిసారిగ పూచిన పూవో
||నందన||
తొలకరి యవ్వన మొలికిన నవ్వో మనసిచ్చినదో నను మెచ్చినదో
ఆ జవ్వని ఎవరో తానెవరో ఆ నవ మోహిని ఎవరో నా మానస హారిణి
ఎవరో ఎవరో తానెవరో ’ అని తన మనో గతాన్ని వ్యక్తపరచాడు. ఆత్రేయగారి భావనలో పద్మావతి, శ్రీనివాసుడు ఇద్దరు కూడా ‘Both are Sailing in the same boat’ ఒకే విధమైన అనుమానంతో ఆందోళన తో ఉన్నారు.

పద్మావతి : నవ మోహనుడు అంటే శ్రీనివాసుడు : నవమోహిని అంటున్నాడు. ఇంకా ఇంకా
మానస చోరుడు : మానస హారిణి
తొలి చూపులలో : నందన వనముననానందములో తొలి పూవో …
వలపులు చిలికి దోచిన తొలిసారిగ పూచిన పూవు
మగసిరి దొర : మనసిచ్చినదో,
నను నర్పించితినె : ఆదరించునో
మెచ్చినదో : ఆదమరచునో

ఆత్రేయగారి ఆలోచన, అంతర్మథనం, అంతర్ముఖత్వం మనకు ఈ పాటలో స్ఫురిస్తున్నాయి. కనుకనే 60 స.లు గడిచిపోయినప్పటికి ఈ పాట సాహితీ మర్యాదను అందుకుంటున్నది.
– ఏలూరు అశోక్ కుమార్ రావు, హైదరాబాద్

ఆచార్య ఆత్రేయ (కిళాంబి వేంకట నరసింహాచార్యులు)
తన గోత్రాన్ని కలం పేరుగా పెట్టుకొని సినీరంగ ప్రవేశం చేశాడు ఆత్రేయ . నాటక రచయిత, సినిమా మాటల, పాటల రచయిత, దర్శకుడు 1961 సంవత్సరంలో వాగ్దానం సినిమాను నిర్మించారు. తెలంగాణ మహాకవి దాశరథి ని మద్రాసు పిలిపించుకొని
“నా కంటిపాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా “పాటను వ్రాయించుకున్న కవిప…

October 25, 2021 4 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

శ్రీ యాదాద్రీశా వైభవమ్-10

by శ్రీ పెరంబుదూరు రాఘ‌వాచార్యులు October 25, 2021
written by శ్రీ పెరంబుదూరు రాఘ‌వాచార్యులు

చంచ న్మాయాప్రపంచ స్థితి లయకరణాద్యంత తంత్రస్వతంత్రం
కంబాలాభప్రతాపం కపటపటు పటాలంబిత ప్రాఙ్నితంబం
రంగజ్జంఘాల జంఘాయుగ మపరిమితానందనందాభివంద్యం
వందే యాదక్షమాభృత్కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహమ్‌ !
తాత్పర్యం: అస్థిరమైన ఈ మాయా ప్రపంచం యొక్క ఉనికికీ, మహా ప్రళయంలో లయమై పోవటానికీ, సమస్త సృష్టి పరిరక్షణకూ, పోషణకూ, ఆదినుండీ అంతమువరకూ అన్నింటికీ కారణభూతమైన స్వతంత్ర చిద్రూపుడూÑ అపార పరాక్రమశాలిjైున ఆంజనేయునితో సముడగు ప్రతాపశాలీÑ తన మాయాబలంతో వస్త్రంవలె తూర్పుపర్వతాన్నంతా కప్పివేసినవాడూÑ ప్రకాశిస్తూ శీఘంగా కదలగల బలిష్ఠములైన రెండు పిక్కలు కలవాడు, తనయుని బాల్య చేష్టావిశేషాల చేత అంతులేని ఆనందాన్ని పొందిన నందునిచేత నమస్కరింపబడినవాడూ అయిన ` యాదగిరిపై నెలకొని తన బలిష్ఠములైన భుజముల బలపరాక్రమాలను ప్రదర్శిస్తున్న ` శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని నమస్కరిస్తున్నాను.
విశేషాలు: ‘‘య ద్దృశ్యం త న్నశ్యం’’ అని వేదాంతులు నొక్కి వక్కాణించారు. ఇంద్రియ గోచరమయ్యే ప్రతిదీ నశించిపోయేదే అని దీని భావం! సమస్త చరాచర సృష్టినీ తనలోని అంతర్భాగంగా చేసుకుని అంతా తానుగా కనిపించే ఈ ప్రపంచం (చంచత్‌GమాయాGప్రపంచంR) కదులుతూ ఉన్నట్లుగా కనిపించే మాయాప్రపంచమే! ఈ ప్రపంచం యొక్క ఉనికి (స్థితిR) అంటే జన్మించినట్లుగా కనిపించి, ఇదంతా నిజమేనని భ్రమింపజేసి, (లయR) కొంతకాలం అందరినీ మాయలో ముంచి, శోక`మోహాదులకు గురిచేసి, నశించిపోతున్నట్లుగా అనిపించి, చివరికి మహాప్రళయ సమయంలో సమస్తాన్నీ తనలో కలుపుకునే మహాసముద్రంగా కనిపించి, ఈ (జన్మలయల) మధ్య కాలంలో (కరణR) రక్షింపబడుతూ, వృద్ధి చెందుతూ ఉన్నట్లుగా అందరినీ భ్రమింపజేసే ఈ మాయా ప్రపంచం (స్థితిGలయGకరణGఆద్యంతGతంత్రGస్వతంత్రంR) పుట్టుకకూ, వృద్ధికీ, నాశానికీ తానే మూలకారణమైన సర్వతంత్ర స్వతంత్రుడు ఆ లక్ష్మీనరసింహస్వామి!
బమ్మెర పోతన మహాకవి కూడ భాగవతంలో ఈ విషయాన్ని ఈ విధంగా పేర్కొన్నాడు ` ‘‘ఎవ్వనిచే జనించు జగ, మెవ్వని లోపల నుండు, లీనమై యెవ్వని యందు డిరదు, పరమేశ్వరుడెవ్వడు, మూలకారణం బెవ్వ, డనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానjైునవాడెవ్వడు, వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్‌’’ అంటూ ఆ పరమేశ్వరుణ్ణి వేడుకున్నాడు.
(కంGబాలGఆభGప్రతాపంR) ‘క’ అనే ఏ కాక్షరానికి ఉన్న నానార్థాలలో వాయుదేవుడు అన్న అర్థం కూడ ఒక్కటి. వాయుదేవుని బాలుడు (కుమారుడు) ఆంజనేయస్వామి. బాలశబ్దానికి చిన్న శిశువు అన్న అర్థం కూడ ఉంది. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే ఆంజనేయుడు ఉదయిస్తున్న సూర్యుణ్ణి పండుగా భావించి, మింగటానికి పైకెగిరిన విషయం తెలిసిందే కదా! అంతటి పరాక్రమశాలి ఆంజనేయుడు. సీతజాడ తెలిసికొని వచ్చిన ఆంజనేయుణ్ణి, అతని పరాక్రమాన్ని మెచ్చుకున్న సుగ్రీవుడు లక్ష్మణునితో ఇలా అంటాడు ` ‘‘కార్యసిద్ధి ర్మతి శ్చైవ తస్మి న్వానరపుంగవే, వ్యవసాయ శ్చ వీర్యం చ శ్రుతం చాపి ప్రతిష్ఠితమ్‌, జాంబవా న్యత్ర నేతా స్యా దంగద శ్చ మహాబలః హనూమాం శ్చా ప్యధిష్ఠాతా న తస్య గతి రన్యథా’’ ‘‘వానశ్రేష్ఠుడైన ఆ హనుమంతునిలో కార్యసిద్ధి, తెలివితేటలు, పట్టుదల, పరాక్రమము, విద్య అన్నీ నెలకొన్నాయి. ఏ పనిలో జాంబవంతుడు, మహాబలుడగు అంగదుడు నాయకులుగా ఉంటారో, హనుమంతుడు తోడుగా ఉంటాడో ఆ పని వేరు విధంగా కాదు. అంటే తప్పకుండా జయప్రదం అవుతుంది’’ అని అంటాడు.
తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు. ఇంద్రుడు సమస్త దేవతాగణానికీ, దేవలోకానికీ అధిపతి కూడా! దైత్యదానవుల తాకిడి నుండి ఇంద్రుణ్ణీ, దేవలోకాలను రక్షించేవాడు శ్రీహరి! వాళ్ళు పన్నే చిత్ర విచిత్రములైన మాయోపాయాలన్నిటినీ ఛేదిస్తూ ` అనంతమైన, అభేద్యమైన కవచంగా నిలిచేవాడు విష్ణుమూర్తి! (కపటGపటుGపటGఆలంబితGప్రాక్‌GనితంబంR) రాక్షసుల దాడి నుండి సురలోకాన్ని కాపాడటం కోసం (కపటR) తన విష్ణుమాయ అనే (పటుGపటR) దృఢమైన వస్త్రంతో (ఆలంబితGప్రాక్‌GనితంబంR) కొండ మధ్య భాగం వలె స్థిరమైన సురలోకాన్ని కప్పి, రక్షిస్తున్నాడు. నితంబం అంటే కొండ (పర్వతం) యొక్క నడిమి భాగం అని అర్థం. విష్ణుమాయ నిరంతరం దుర్మార్గుల బారి నుండి (ప్రాక్‌GనితంబంR) దేవ లోకాలను కాపాడుతూ ఉంటుందని భావం!
పిక్కల్లో బలం ఉంటే కాని శత్రువులను ఎదిరించి పోరాడి విజయం సాధించలేము. యుద్ధంలో (రంగత్‌GజంఘాలG జంఘాయుగంGఅపరిమితGఆనందGనందGఅభివంద్యంR) తన బలపరాక్రమాలను ప్రదర్శించాడు శ్రీకృష్ణావతారంలో శ్రీహరి. దానిని చూడటం వలన అపరిమితమైన ఆనందం కలిగింది నందగోపుడికి. భక్తితో శ్రీకృష్ణపరమాత్మను (శ్రీహరిని) స్తుతించి నమస్కరించాడు నందుడు.
అనంత మహిమాన్వితుడై, యాదాద్రిపై నెలకొని తన బలిష్ఠములైన భుజముల బలమును ప్రదర్శించుచున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని కవి భక్తి ప్రపత్తులతో స్తుతించి నమస్కరిస్తున్నాడు.

October 25, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

చురకలు

by కొరుప్రోలు హరనాథ్ October 25, 2021
written by కొరుప్రోలు హరనాథ్

తేడా
——-

ఆకాశంలో
మిణుకు మిణుకుమంటూ
మెరిసే కోటానుకోట్ల
నక్షత్రాల కన్నా…..
జిగేల్ న మెరిసే
ఒక జాబిల్లి మిన్న
పదవి పట్టాన్ని వరించి
వాగ్దానాల నూకల్ని విసిరే
నాయకుల కన్నా
జాతిని ఒక త్రాటిపై నడిపే
ఉద్యమకారుడు మిన్న

—-**——

రాజకీయం
—————

రాజకీయ ప్రయాణంలో
పదవుల పట్టాలు తప్పి
ప్రతిపక్ష పార్టీల
యాక్సిడెంట్లు సహజం –
వాటిని తట్టుకుని
ముందుకు సాగినవాడే
రాజకీయ నాయకుడు
అదే అసలైన
రాజకీయం

కె.హరనాథ్, 9703542598

October 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ఐదు స్పూన్ల ఉప్పు

by ఒద్దిరాజు మురళీధరంరావు October 25, 2021
written by ఒద్దిరాజు మురళీధరంరావు

గీతా, ఎక్కడున్నవు? నా మెడిసిన్ కొరకు నువ్వు మెడికలం షాపుకు త్వరగా వెళ్ళి రావాలి, రా, నా దగ్గరికి, అని గీత తాతగారు గీతను పిలిచాడు. గీత ఎక్కడ ఉండింది? ఆమె ఓ పుస్తకం చదువుతూ బెడ్లో ఉండెను. చాలాసేపు వరకు ఆమె ఏమి విననట్టు నటించింది. ఆ పుస్తకం చాలా ఉద్రేకపరిచేట్టు ఉండెను. దీనికి తోడు బయట చాలా వేడిగా నుండెను, అందుకు ఆమె బెడ్ నుండి కదలదలచుకోలేదు.

గీతా! ఈసారి తన తల్లి మాట కూడా వినవచ్చింది రమ్మన్నట్లు. అమ్మాయి ఒక నిట్టూర్పు తీసి బెడ్ నుండి బయటికి వచ్చి ఏం కావలెనో తెలుసుకోదలచింది. ఆమె తాతగారు కొంత డబ్బు చేతిలో పెట్టి, తనకు చాలా తలనొప్పి బాధ ఉదయం నుండి ఉందని చెప్పాడు. నాకు ఈ మందులు తేగలవా? అన్నాడు.

గీత డబ్బులు తీసుకొని మెడికల్ స్టోర్ వైపు వెళ్లింది. దారిలో ఒక స్పీట్ షాపు పక్క నుండి వెళ్ళుతుండెను. ఓహ్, ఏం చెప్పాలి, ఎంతమంచి గులాబ్ జామున్, లడ్డూలు, జిలేబిలు ఘుమ ఘుమ వాసనలు. ఆమె కొన్ని తీసుకోదలచింది. ఆమెకు చెప్పిన పని మరిచిపోయి షాపులోకి వెళ్ళి స్వీట్లను తీసుకొని తన ఒడిలో పెట్టుకోసాగింది. అప్పుడే ఓ ఫ్రెండు అటు వచ్చి ఈమెతో కలిసింది. ఆ ఇద్దరు అమ్మాయిలు స్వీట్లు తిని చాలాసేపువరకు మాట్లాడుకున్నారు. గీత తన దీన తాతగారి తలనొప్పి గురించి పూర్తిగా మరిచిపోయింది. ఆమె ఇంటి నుండి బయటికి వచ్చిన పని జ్ఞాపకం వచ్చేవరకు మధ్యాన్న నుండి సాయంత్రం అయి మెడికల్ షాపు ఆ రోజుకు మానేశారు. ఆమె ఇంటికి త్వరపడిపోయిందో, తన తాతగారు ఎంతో బాధపడినాడు. ఎప్పుడు పెద్దదానివి మరియు బాధ్యత రాలువు అవుతావు గీతా అని అతను నిట్టూర్చి అడిగాడు.

గీతా వాస్తవంగా చాలా బాధపడింది, కాని తన పద్ధతులు మార్చుకుందా? లేదు. ఆమె ఎప్పటిలాగే మతిమరుపు మనిషి. ఎప్పుడైతే ఆమె తల్లి బయట ఆరేసిన బట్టలు తెమ్మందో, ఆమెకు మరుసటి రోజు ఉదయాన జ్ఞాపకం వచ్చింది. అప్పటివరకు రాత్రంతా కురిసిన వానకు బట్టలు తడిసి ముద్దయినాయి. మరొక రోజు తన చెల్లెలుకు లంచ్ బాక్సు స్కూలుకు తీసుకపోవలసియుండె.  దారిలో సర్కస్ డేరాలను చూసింది. ఉదయమంతా సర్కస్ టెంటు చుట్టు తిరుగుతూ జంతువులు తినగా మరియు అవి చేయవలసిన పాత్రలకు జరిగే ట్రేనింగ్ కుతూహలంగా చూస్తూ గడిపింది.

కేవలం తనకు ఆకలి అయినపుడే తన చేతిలోని బాక్సు చూసి తన చెల్లెలు స్కూలులో దినమంతా ఏమీ తినకుండా ఇల్లు చేరి ఉంటుందని అనుకుంది.

ఇంకకసారి తన తండ్రి పనికి పోయే తొందరలో షర్టు ఇస్తే చేయమని గీతకు చెప్పిండు. గీత షర్టు తీసుకని వేడి ఇస్తీపెట్టె దగ్గర పెట్టింది. ఇంతలో బజారులో పెద్దవి రుచికరమైన మామిడి పండ్లు బుట్టలో పెట్టుకుని అమ్మేవాడి కూత వినిపించింది. వెంటనే అక్కడికి వెళ్ళి పండ్లు ఏరడం మదలు పెట్టింది. ఇంతలో షర్టు కాలుతున్న వాసన వచ్చింది. ఆ రోజు తండ్రి చాలా విచారపడినాడు.

ఈ సంఘటన తరువాత కొన్ని రోజులకు స్కూలు నుండి వచ్చి మరుసటి రోజు స్కూలు నుండి పిక్ నిక్ వెళ్ళగలమని చెప్పింది గీత. పిక్ నిక్ కు వెళ్ళేటప్పుడు తలా ఒక అయిటమ్ తీసుకెళ్ళాలని, తను సాంబారు తేగలనని నిర్ణయించింది. తన తల్లి మంచి రుచికరమైన సాంబరు చేస్తుందని తన ఫ్రెండ్సు బాగా సంతోషిస్తారని అనుకుంది. తల్లి పెద్ద కుండలో సాంబరు చేస్తానని ఒప్పుకుంది. గీత రాత్రి సంతోషంగా పడుకుంది, మరునాటి మంచి పిక్ నిక్ రోజు బాగుంటుందని ఊహిస్తూ.

మరుసటి రోజు ఉదయం తల్లి త్వరగా లేచి సాంబారు చేయడం మొదలు పెట్టింది. ఆమె పప్పు ఉడకపెట్టింది. కూరగాయలు, కొబ్బరి మరియు అన్ని మసాలాలు వేసి కుండను మండే స్టౌపై పెట్టింది. గీత బెడ్ లో ఉన్నపుడే మంచి ఘుమ ఘుమ వాసన రాబట్టింది. గీత కదలికలను చూసి, నా ప్రియమైన గీతా లేవమ్మా ఇప్పుడు. చూడు, సాంబారు దాదాపు కావచ్చింది. నేను గుడికి పోతున్నాను, కాబట్టి కొద్దిసేపు అయ్యాక ఐదూ స్పూన్ల ఉప్పు దాంట్లో వెయ్యి. మరిచిపోకు ఇప్పుడు. లేచి త్వరగా తయారుగా అంది.

తిట్లు అనుకుంటూ హడావిడిగా ఆమె వెళ్లిపోయింది. గీత నాయనమ్మ ఎవరైతే వంట గదిలో వుండెనో. అదంతా విన్నది మరియు తనలోనే తానే అనుకుంది, తన కోడలు ఎప్పుడు గీత మతి మరుపు పిల్ల అని తెలుసుకుంటుందో యని. నాకు గట్టి నమ్మకం ఉంది, ఆ అమ్మాయి ఉప్పు వేయడం మరిచిపోతుందని. అప్పుడు అమ్మాయిని ఆమె ఫ్రెండ్సు ఆట పట్టిస్తారు. జాగ్రతగా ఉండటమే మేలు అనుకుంటూ వెళ్ళి కుండలో ఉప్పు కలిపింది.

గీత తాతగారు వరండాలో కూర్చొని వార్తా పత్రిక చదువుతుండేది. అతనికి గీత తన తల నొప్పికి మెడిసిన్ తెమ్మని పంపుతె ఆమె మరిచి పోవడం తను బాగా తలనొప్పితో బాధపడటం జ్ఞాపకం ఉంది. గీత ఏదైన జ్ఞాపకం ఉంచుకోవడమే? అది కాని పని, అని తనలో తానే ్నుకుంటు వంట గదిలోకి వెళ్ళి సాంబరులో ఉప్పు వేశాడు.

గీత చెల్లెలు తల దువ్వుకుంటుండెను. స్కూలుకు పోయేందుకు తయారు అవుతూ ఆమెకు గుతా గీత లంచ్ బాక్సు తేవడం దారిలో సర్కస్ డేరాలు చూస్తూ మరిచిపోయి తను ఆ రోజు ఆకలితో ఇల్లు చేరడం బాగా జ్ఞాపకం ఉండింది. గీత ఉప్పువేయడం తప్పక మరిచిపోయే ఉంటుంది, దానితో తన స్నేహితురాళ్ళు నవ్వుతారు. అనుకుంటూ తను త్వరగా వంటగదిలకి వెళ్ళి ఐదు స్పూన్ల ఉప్పు సాంబరులో కలిపింది.

గీత తమ్ముడు పండ్లు తోముకుంటూ తల్లి తన అక్కకు చెప్పిన మాటలు ఉప్పు గురించి తప్పక మరిచే ఉంటుంది. అతను కిచెన్ లోకి వెళ్ళి కొన్ని స్పూన్ల ఉప్పు కుండలో వేసి వెళ్ళిపోయాడు.

గీత తండ్రి బహు జాగ్రత్తగా తన షర్టును ఇస్త్రీ చేసుకుంటుండెను. అందరి వలె అతను కూడా కిచెన్ లోకి వెళ్ళి సాంబారు కుండలో ఉప్పు వేశాడు.

ఇప్పటికి గీత లేచింది, ఆశ్చర్యంలో ఆశ్చర్యం ఉప్పు వేయడం ఆమెకు జ్ఞాపకం ఉండింది. అందుకు ఆమె కూడా వెళ్ళి ఐదు స్పూన్ల ఉప్పు తల్లి చెప్పినట్లు కలిపింది.

ఇప్పటివరకు తల్లి వచ్చి సాంబారు ఒక కంటే నీరులో పోసింది. దాన్ని తన కూతురుతో పిక్ నిక్కు పంపించింది.

పిక్ నిక్ ప్రాంతంలో పిల్లలు బాగా సంతోషంగా ఆడుకున్నారు కొంతసేపు. కాబట్టి ఇక ఏమి చేయలేక ఆకలితో ఉండిరి. ప్లేట్లు, స్పూన్లు బయటికి తీశారు. కంటెనర్సు పదార్థాలతో నిండి వుండెను. ప్లేట్లలో రైసు, చట్నీలు, కూరలు, పూరీలు, మరియు తీరు తీర్ల మిఠాయిలతో నిండిపోయినవి. అందరు ఎక్కువ ఎక్కువ గీత చేతితో సాంబారు పోయించుకున్నారు. కాని ఒక స్పూను నోట్లో పెట్టుకున్నారో లేదు, హా, హా, నీళ్లు, నీళ్లు అని మొత్తుకోవడం మొదలయింది. ఆశ్చర్యపడింది. గీతకు ఏమైందో తెలుస్తలేదు. అల్లం వాసన రైసం మరియు సాంబరు తన ప్లేటుతో వచ్చిన కూలి. అది చాలా అయిష్టంగా ఉండెను. అది తన తల్లి సముద్రంలోని ఉప్పంతా సాంబరులో వేసినట్లు తోచింది. అప్పుడు గీతకు జ్ఞాపకం వచ్చింది.  తన తల్లి ఉప్పు కలుపలేదు, తనే కల్పింది. అయితే ఎక్కడ తప్పు జరిగింది?

ఆ రోజు గీత ఇంట్లో అందరు ఆతురతతో గీత స్కూలు నుండి వచ్చి సంతోషానికి బయటికి వెళ్ళిన సమాచారం కొరకు ఎదిరి చూస్తుండేది. కాని ఇదేమిటి? ఆమె చాలా అలసిపోయినట్లు, ఆమె ముఖం రంధితో మరియు కన్నీరు పెట్టుకున్నట్లు కనిపించింది. ఏం జరిగింది? గీత వారిమీద అరిచింది, ఇంకెవరయిన సాంబరులో ఉప్పు వేశారా?

నేను వేసిన, నాయనమ్మ అంది

నేను వేసిన, తాతగారు అన్నారు

నేను వేసిన తండ్రిగారు అన్నారు

నేను కూడా అన్నాడు తమ్ముడు

మరియు నేను అంది చెల్లెలు.

భయంతో అందరూ ఒకరి ముఖం చూసుకుంటూ కూర్చున్నారు. గీత రంధితో ఉండటం ఆశ్చర్యం కాదు. ఆమె ఫ్రెండ్సు ఆమెను సాంబరులోని ఉప్పు గురించి హేళణ చేసి యుండవచ్చు!

‘’మీరంతా అలా ఎందుకు చేశారు? అమ్మనా ఒక్కతికే గదా చెప్పంది’’ అని ఏడ్చింది గీత.

ఓహో ప్రియమైన గీత, నీకు ఏది చేయమని చెప్పినా మరిచిపోతవు గదా అని, ఈసారి కూడా మరిచిపోతావని, అనుకొని… అందరు విచారం వ్యక్తపరిచారు.

ఇప్పుడు తల్లి గీతను దగ్గరకు తీసుకని కన్నీరు తుడిచి నీవు ఏదైనా నాల్గు సార్లు జ్ఞాపకం చేయండి మరిచిపోగలవని ఇట్లు జరిగింది. ఇక ముందు జాగ్రతగా వుంటానని వాగ్ధానం చెయ్యి. మేమంతా నీవు నీ పనులు సక్రమంగా చేయగలవని నమ్ముతాము.

గీత ముక్కు చీదుకని, సరేనని తల ఊపింది. అటు తరువాత తమ తమ పనులు చాలా జాగ్రతగా చేసుకుంటుండేది. ఎంతో సదిరి చెప్పాక తన ఫ్రెండ్సు తన ఇంటికి ఒక నాడు లంచ్ కు వచ్చారు. తల్లి చేసిన రుచికరమైన సాంబరుతో లంచ్ బాగా ఆరగించి, ఇంత రుచికరమైన సాంబరు అన్నం ఎన్నడు తినలేదని ఒప్పుకున్నారు. అందరూ బాగా ఆనందించారు.

 

రచయిత రెండు మాటలు

మా నాయనమ్మ క్రిష్ణ, అందరు కిష్టక్క అని పిలిచేవారు. ఆమె చాలా తెలివయినది మరియు చాలా దయగలది. ఆమె కథలు గొప్పగా చెప్పేది కూడా ఆమె మాకు ఎప్పుడూ నీతులు చెప్పేది కాదు. కాని జీవిత విలువలను కథల రూపంలో చెప్పేది. మేము చిన్నపుడు చాలా ఫ్రీగ కుటుంబంలోని తోటి అమ్మాయిలతో మరియు తాతయ్య, నాయనమ్మలతో ఉత్తర కర్నాటకలోని హడావిడి లేని నగరం షిగాన్ (Shiggaon), లో ఉంటిమి. ఏదైన మేమందరం సంతోషంగా పంచుకునేవారము.  మా అందరి కలయికకు మా నాయనమ్మే మూలం (Binding force). నాయనమ్మ చెప్పిన కథల ప్రభావం నా మీద ఇప్పటికి ఉంది. ఏవో చిన్న చిన్న మార్పులతో ఈ కథల పుస్తకం వ్రాశాను. కానీ చాలావరకు వాటి ప్రభావమే.

ఎప్పుడైతే నా మనుమరాలు క్రిష్న పుట్టిందో ఆమె నన్ను అమ్మమ్మ స్థాయికి లేపింది. నేను అన్నీటికన్న కథల విలువ ఎక్కువని గ్రహించాను. అవి పిల్లల విజ్ఞానం పెంపుదలలో ఎంతో సహాయపడుతాయి. అందుకే ఈ పుస్తకం.

ఈ కథలు పిల్లలు, తల్లిదండ్రులు, తాతయ్య, నాయనమ్మలు మూడుతరాలవారు ఒకరితో ఒకరు ప్రేమతో కలిసి ఉండేందుకు దోహదపడుతాయి.

పెంగ్విన్ బుక్స్ ఇండియా నా పుస్తకాల ప్రచురణకు ఉత్సాహం చూపుతున్నందుకు ధన్యవాదాలు. నేను సుదేశ్నా షోం ఘోష్ కు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఆయన నాకు గత పదేండ్లలో కథలు రాయడంలో ఎడిటర్ గాక మంచి మిత్రుడయినాడు.

 

సుధామూర్తి

బెంగళూరు

October 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

మారుతున్న కాలం తో పాటు బాల సాహిత్యం లో మార్పు రావాలి

by vedantasuri October 25, 2021
written by vedantasuri

మనిషికి బాల్యం పునాది వంటిది. పిల్లలు కదా వారికి ఏమి తెలుసు అని అనుకోవడం పొరపాటు. వారి పరిశీలన , అవగాహన లోతుగా ఉంటుంది. బాల్యం లో ఏర్పడిన అభిప్రాయాలు, అభిరుచులు, మనిషి వయసుతో పాటు పరిణతి చెందుతుంటాయి. అందుకే వారికి చిన్న వయసులోనే అంటే మూడేళ్ళ వయసు లోపే ఏది , మంచి , ఏది చెడు అనేది చెబుతుండాలి. ఆ వయసులోనే వారి అభిరుచులు ఏమిటో తెలుసుకోవచ్చు . ఈ దిశగా పెద్దలు పిల్లలను అవగాహన చేసుకుని వారి అభిరుచులకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించాలి. అంతే కాకుండా. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న క్రమం లో పిల్లల మానసిక ఎదుగుదల కూడా పెరిగింది. వారు ఎంత వేగంగా ఆలోచిస్తున్నారు గమనించి వారికి అన్ని ఏర్పాట్లు చేయాలి.
అదే విధముగా రచయితలూ కూడా తమ రచనల్లో మార్పులు తీసుకు రావాలి. బాల్యం లోనే సృజన అమోఘంగా ఉంటుంది. దాన్ని పదును పెట్టడానికి పెద్ద్లు కృషి చేయాలి . కానీ మీరు అనుకున్నది వారు చేయాలి. మీరు చెప్పింది వారు వినాలి అనే ధోరణి ఉంటే వారు రెంటికి చెడ్డ రేవడిగా మారి పోతారు. వారి ఆలోచనలు మారుతున్న కాల పరిస్థితులను అవగాహన చేసుకుని పెద్దలు కూడా తమ రచనల్లో మార్పులు చేసుకోవాలి. ఇప్పుడు చందమామ , బాల మిత్ర కథలు కాదు ఈ తరానికి తగిన రచనలు చేయాలి. ప్రపంచ బాలలతో పోటీ పడి ఎదగాలంటే బాల సాహితీ వేత్తలతో పాటు ప్రభుత్వాలు, సమాజ ఆలోచనల్లో తగిన మార్పు రావలసి వుంది.
ఇలా పెద్దల్లో మార్పు వస్తే భావితరానికి బంగారు బాట వేసిన వారమవుతాము.
ప్రతి ఏటా ఉపాధ్యాయులకు , రచయితలకు కార్యశాలలు ఏర్పాటు చేయాలి. సమాజ ఆలోచనా విధానాలు కూడా మారాలి. మారుతున్న కాలం తో  పాటు మనుషులు కూడా మారాలి. ఆ మేరకు పిల్లల ఆలోచనలకు అనుగుణంగా అవగాహన పెంపొందించడానికి ప్రయత్నాలు ప్రారంభించాలి ,  మొక్కు బడి ఆలోచనల నుంచి బయట పడాలి. రచనలు చేయడం ఒక్కటే సరిపోదు , మీరు రాసేది ఎందరు చదువుతున్నారు , ఎంతమందికి ఉపయోగ పడుతుంది ఆలోచించాలి. లేకుంటే మీ లక్ష్యం నెరవేరనట్టే .

 
 
October 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

” పసి పిల్లలు ” (బాలగేయం)

by Gadwal Somanna October 25, 2021
written by Gadwal Somanna
పసి పిల్లలు వేల్పులు
జగతి ప్రగతి బాటలు
వెలుగునిచ్చు భానులు
నింగిలోని  తారలు
       ముద్దులొలుకు పిల్లలు
       ముద్దబంతి పువ్వులు
       మురిపించే మువ్వలు
       విహరించే గువ్వలు
ఇంటిలోన దివ్వెలు
కంటిలోని పాపలు
ప్రాణమున్న బొమ్మలు
ఫలములిచ్చు తరువులు
         వెన్నెలమ్మ జల్లులు
         వెన్న వంటి మనసులు
         సొగసుల హరివిల్లులు
         తెల్లని సిరిమల్లెలు
కన్నవారి ఆశలు
వారి గుండె శ్వాసలు
బాధ్యతగల పౌరులు
భారతమ్మ వీరులు
-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు, సెల్:9966414580
—–హామీ పత్రం——
మయూఖ పత్రిక సంపాదకులకు నమస్కారం. ఈ గేయం నా సొంత రచన.అనువాదం, కాపీ కాదని హామీ-గద్వాల సోమన్న
October 25, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

సైరంధ్రి

by Bhavani October 25, 2021
written by Bhavani

సర్గ : 2

అక్కడే మేలుకొన్నది ఆలోచనాలోకం ,

ఎక్కడికో పరిగెడుతున్నది మానసం ;

భిన్నభ్రమలను కూడదీసుకుని ,

తనకుతానే నిలిచెను ఒంటరిగా  !

 నిత్య వికసిత యవ్వనదీప్తి ,

ముగ్ధవసంత బాల్యవిముక్త ;

అరుణచాప అపురూప విలసిత,

ఎగిసిపడినది యజ్ఞజ్వాలలా!

 కలత చెందిన కోరికలు ,

క్రూర వాస్తవ విలోకనలు;

సర్వం కరిగిన కాలంతెరలు,

                                       -2-

స్వరబద్ధాలంకృత శిధిల వాద్యాలు!

 లోపలి సూర్యుని నిద్రలేపెను,

వడిగా చీకటి పారిపోయెను ;

ఎప్పటినుంచో హత్తిన నీడ ;

అన్నిటినుండీ లిప్తను వీడెను!

 సకల అస్మితలు ఓడిపోయినవి,

మాన్యతాయుత  ముకుటము తొలగె ;

యాచన  కోరిన శరణాగతిగా,

వికృతరూపము దీక్షగబూనె!

 అటు ఇటు ఏవో ఆలోచనలు,

అతులిత సమయస్మృతి కదలె;

స్వయంవరం అది ఎవరి కోసమో ,

ఆమెయే నేడు అభిశప్త భాగ్య!

                                     -3-

జనకుడు వరుని వెదకిన వేళ ,

ఆహ్వానించెను రాజవీరులను;

చివరకు పడినది దావానలమున,

నూతనరూప శపిత మోసమున!

 పరమ ప్రియతముని వరించవలయు,

అయినను కానదు మనోహరుని;

పాండుపుత్రుని ప్రతిష్ట వెలిగె,

సూతపుత్రుడు కళంకమొందె!

 అచ్చట నిలిచిరి ఇద్దరు వీరులు, అద్వితీయ దీప్తిమంతులు,

విజయునే  వరింపవలసె , రాధేయుని  వెడలగద్రోసె;

క్షాత్రతేజమున విరాజిల్లినా, నాధుడుమాత్రం కాలేడు,

కిరీటికి  సరిసమానుడు , వివశవదనుడై వెనుదిరిగె!

                         ******

గుజరాతీ మూలం , హిందీ అనువాదం : డా. వినోద్ కుమార్ జోషి  

 

 

 

 

October 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us