సుమిత్ర కాశీరాజ్యపు రాకుమారి. పుత్ర కామేష్టియాగం చేసిన తరువాత యజ్ఞఫలం మూలంగా ఈమెకు లక్ష్మణుడు, శతృఘ్నుడు జన్మించారు. ఈమె పుత్రుడైనందున లక్ష్మణున్ని సౌమిత్రి అంటారు.
సుమిత్ర అనగా మంచి మైత్రి కలిగినది. అనగా మంచి స్నేహభావం కలిగినది అని అర్థం. రామాయణంలో సుమిత్ర ప్రస్తావన చాలా కొంచెంగా వస్తుంది. ఆమె పాత్రలో చాలా ఉదాత్తత, వివేకం కన్పిస్తాయి. వనవానికి వెళ్ళేముందు సీతారామలక్ష్మణులు ఆమె వద్దకు సెలవు తీసుకోవడానికి వెళ్ళారు. అప్పుడామె దుఃఖిస్తూనే లక్ష్మణునితో,
“రామం దశరథం విద్ది మాం విద్ది జనకాత్మజాం,
అయోధ్యయ మటవీం విద్ధిగచ్ఛతాత్ యధాసుఖం”
అంటూ, “నాయినా! ఇకపై రాముడే నీకు తండ్రి. నీ వదిన సీతే నీకు తల్లి. నీకు అడవే అయోధ్య. అరణ్యాలలో ఏమరుపాటు లేకుండా రాముణ్ణి కాపాడుకో. క్షేమంగా వెళ్ళి రా తండ్రి” అంటూ లక్ష్మణుని శిరస్సును ముద్దాడింది. “ఇక్ష్వాకు వంశంలో పుట్టావు. దానాలు చేయటం, యజ్ఞాలు చేయటం, యుద్ధంలో వీరోచిరంగా పోరాడటం , ఈ వంశంలో పూర్వం నుండి వస్తున్న ధర్మ పద్ధతే! అన్నగారిని అనుసరించి నడవటం అనుజునిగా నీ ధర్మం” నీతి బోధ చేసింది.
పుత్రవియోగంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కౌసల్యను సుమిత్ర ధర్మయుక్తమైన మాటలతో,
మాటలతో ,
“పునుః ప్రవిష్టం ధృష్ట్వాతమ భిషిక్తం మహాశ్రియం,
సముత్ర్యక్షసి నేత్రాభ్యాం క్షిప్రమానం ధ్వజం పయః”
అంటూ, “అక్కా! రాముని కంటే సన్మార్గాన నడిచే గొప్పవాడు లేడు. పదునాలుగు ఏళ్ళ వనవాసం పదునాలుగు రోజుల్లాగా గడిచిపోతాయి. నీ కుమారుడు త్వరలో వచ్చి నీ పాదాలకు నమస్కరిస్తాడు. అది చూచి నీవు ఆనందంతో పొంగిపోతావు” అని ధైర్యం చెప్పింది.
సుమిత్ర గొప్ప వీరమాత. ఇద్దరు బిడ్డలని కన్నప్పటికి ఒక కొడుకుని రామునికి, ఇంకొక కొడుకుని భరతునికి అప్పగించింది. సుమిత్ర తన బిడ్డలు, సవతి బిడ్డలు అనే భేదభావం లేనిది. రామునియందు అమితమైన ప్రేమ కలది. లోకంలో ఎవ్వరైనా తమ సవతి బిడ్డల కోసం తమ బిడ్డలను త్యాగం చేయలేరు. సుమిత్ర అంతటి త్యాగశీలి. గుణవతి. ఈమె చరిత్ర రామాయణంలో ఆచంద్రతారార్కం నిలిచి ఉంటుంది.


రికి వెళ్లి,”బల్లహునకు” భయపడి పోయి పారిపోయి వచ్చాను. నా భర్త నన్ను చావవద్దని అన్నాడు. నన్ను కాపాడుమని వేడుకుంది. కానీ బల్లహుడికి భయపడి సిరియాళదేవికి అతను ఆశ్రయము ఇవ్వలేదు. సిరియాళదేవని ఎరుకు రాజుకు తెలుస్తే ..సోమదేవ రాజు సహాయం తాను ఎన్నోసార్లు పొంది ఉన్నాడు కాబట్టి తప్పక ఆశ్రయం ఇచ్చి ఉండేవాడు. ఎరుకు దేవరాజు ఆశ్రయం ఇవ్వకపోవడంతో సిరియాళదేవి బయలుదేరి వెళ్లిపోతూ ఉండగా అనుమకొండ నివాసి సదాచార సంపన్నుడైన మాధవశర్మ సిరియాల దేవిని రమ్మని ఆదరించి భయపడకని ధైర్యం చెప్పి తన ఇంటిలో ఉండుమనీ ఆమెకు ఎటువంటి శ్రమ కలుగకుండా కాపాడుతున్నాడు. ఈ వార్త బల్లహుడు విని, అనుమకొండపైకి దండెత్తి వచ్చాడు. బల్లహుడికి భయపడి ఎరుకురాజు తన ఊరిలో సిరియాళదేవి లేదని చెప్పాడు. బల్లహుడు అనుమకొండలోని అందరి ఇళ్లకు ఆయా జాతుల వారిని పంపి సిరియాళదేవిని వెతికించాడు.మాధవశర్మ ఇంట్లో ఉన్న సిరియాళదేవిని , మాధవశర్మను ఒక బ్రాహ్మణుడు తీసుకొని వచ్చి రాజుకు చూపించాడు. బల్లహుడు ఆమెనే సిరియాళదేవి అని అనుమానించాడు. ఎరుకుదేవరాజు కూడా అనుమానించాడు. అప్పుడు అనుమకొండలోని బ్రాహ్మణులందరు కూడబల్కొని ఈమె సిరియాళదేవి కాదని మాధవశర్మ కూతురైన లలిత అని, ఒకవేళ ఈ లలితతోనే మీరు అనుకుంటే తీసుకొనిపోండి! మేమేమీ అడ్డు చెప్పము. మీరు చేసిన ఈ పనిని శాసనాల మీద చెక్కించి అందరం అగ్ని పేర్చుకుని అందులో దూకుతామని బ్రాహ్మణులు అన్నారు. ఆ మాటలకు బల్లహుడు అదిరిపోయి ఈమె మీ లలిత అయినా, సిరియాళ దేవైనా మాకు పని లేదు. సిరియాళదేవి జాడ తెలుసుకోవడం ఆమెకు మానహాని కానీ, ఆమె కడుపులో ఉన్న సంతానానికి హాని చేయడానికి కానీ కాదు. ఆమెను మేము మా ఇంటికి తీసుకుని పోయి ఆమె కడుపులో బిడ్డ కలిగితే మాకు విధేయుడిగా ఉండేలా పెంచుతామని, కంధార పట్టణానికి రాజుగా చేస్తామని అది నిజంగా నిజం అని అన్నాడు.


