మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

కమ్మని కవితల మేస్త్రీ కృష్ణశాస్త్రి

by vanaparti padma March 17, 2023
written by vanaparti padma

తెలుగు భాషలో భావకవితా ప్రపంచానికి అదినేత బావ కవిగా పుట్టి భావగీతాలాలపించి, భావ కవిత్వాన్ని ఉధ్యమంగా స్వీకరించి విశేషప్రచారం చేసి రెండు దశాబ్దాల కాలం ఎదురు లేని తనహొ కవితా లహరిలో తెలుగు పాఠకులను ముంచి తేల్చి అచ్చమైన భావకవిగా గంధర్వలోకాల కేగిన గాన మూర్తి, పద్య కవిత్వాన్ని పండిచారు. పాటల కవిగాను, నాటకాలు, యక్షగానాలు చేశారు. ఎన్నో వ్యాసాలు రాసినప్పటికి వచనంలో కూడ సాహిత్య సౌరభాలు విరజిమ్మారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన పాతకొత్తల మేలుకలయిక.

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు క్రీ॥శ 1897 సంవత్సరంలో జన్మించారు. తల్లి దండ్రులు శ్రీమతి. శ్రీ సీతమ్మ వెంకటకృష్ణశాస్త్రి గార్లు కృష్ణశాస్త్రి చిన్నతనంలోనే పద్య, మరియు కవితా రచన చేసి కన్న వారి దీవెనలు పొందారు. 1918వ సంవత్సరంలో పిఠాపురం, కాకినాడల్లో విద్యాభ్యాసం పూర్తిచేశారు. పెద్దబావగారి కూతురినే వివాహం చేసుకున్నారు. 1919వ సం॥లో తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి స్థాపించిన “సాహితి సమితి” లో సభ్యులైనారు. ఓ సందర్భంలో కృష్ణశాస్త్రి బి.ఎ అనిపించుకోవడం కంటే “సాహితి సమితి సభ్యుడను” అపిపించుకోవడమే తనకిష్టమని చెప్పారు. కాకినాడ పెద్దాపురం హైస్కూల్లో ఉపాధ్యాయులుగా రెండు సంవత్సరాలు పనిచేశారు. కాలం పిలుపులోని కల్మషాన్ని కడిగి వేయడానికి రాసిన ఈయన పాటలు సంప్రదాయవాదులకు గిట్టనందుకు రాజా వారికి చెప్పి సంఘబహిష్కరణచేయించారు. పిఠాపురం రాజావారికి వ్యతిరేకంగా ‘ధర్మసాదన’ అనే పత్రికలో కొన్ని వ్యాసాలు రాయడంతో రాజావారు ఉద్యోగం నుంచి తొలగించటమే కాకుండ తండ్రులకాలం నుండి వచ్చె ‘వార్షికం’ నిలుపు చేశారు. ఇలాంటి క్లిష్టసమయంలోనే శాస్త్రిగారి భార్య మరణించారు. భార్య వియోగం తో శోకతప్త హృదయంతో ‘కన్నీరు’ అనే ఖండకావ్యం రాశారు. గాడేపల్లి సూర్యనారాయణ గారి పెద్దమ్మాయి ‘ రాజహంస’ను వివాహము చేసుకొని మామగారి ప్రోత్సాహంతో సహయం నిరాకరణోద్యమ కార్యక్రమాలలో భాగస్వామి అవడంతో స్కూలుమాష్టారి ఉద్యోగం పోగొట్టుకున్నారు అయిన అదితన అదృష్టంగానే భావించారు ఎందుకంటే దేశ సేవనే గొప్పది అనుకున్నారు.

కృష్ణశాస్త్రిగారు రచించిన ఖండకావ్యాలు చేర్చి 1925లో ‘కృష్ణపక్షము’ అనే పేరుతో సాహితి సమితి తరుపున ప్రచురించారు. తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి గారి’సింహవలోకనం’ అనే పరిచయ వాక్యాలతో ఈ కావ్యం పాఠకుల ముందు కొచ్చింది. ఈ కావ్యాన్ని సూర్యరాయ బహద్దూర్ గార్కి అంకితమిచ్చారు. ఇందులో 59 శీర్షికలున్న ఈ గ్రంధం పద్యగేయంమిశ్రమం కాని కృష్ణపక్షమనే మకుటంతో ఏ శీర్షికలేదు. కాని “నాకు మరణమ్ము” అనే శీర్షిక తేటగీతి పద్యాల్లో ఒక చోట ఆపదం కనిపిస్తుంది. 14 చీకటి రాత్రులన్న కృష్ణ పక్షాన్ని తనలో సగమైన, చేయి కలిపి కష్ట సుఖాలు పంచుకున్న అర్ధాంగి తనను అందకారంలో ముంచి వెళ్లిపోయిన విషాద సన్నివేశానికి, సింబాలిక్ గా ఈ పదం వాడారని చెప్పవచ్చును.

కృష్ణశాస్ర్తీ గారు భావగీతలను కూడ రాశారు.

” ఆకులో ఆకునై పువ్వులలో పూవ్వునై / కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై / ఈయడవిదాగిపోనా ఎట్లైనా/ నిచటనే దాగి పోనా అంటుసాగిపోతాయి.

కృష్ణ పక్షం కావ్యంలో గొప్ప కవితా ఖండిక ‘అన్వేషణ’ తనకుతానే గోపికయై వంశీ మోహనుడైన గోపాల దేవున్ని కవి వెతకడం అన్వేషణలోని ప్రధాన ఇతి వృత్తం సెల యేటి కెరటాలలో తేలిపోతున్న విరికన్నె వలపు గాను, తొలి ప్రొద్దు తెమ్మర త్రోవలో పయనమై పరిగెత్తు కోయిల పాటగాను తెల్లని వెన్నెలలో కలసి కరిగి పోతున్న మబ్బు తునక లాగాను తీయదనమైన గోపికా హృదయాంతరాన్ని తన్మయత్వంలో ముంచి తట్టిలేపింది. అనంత సంగీత మకరంద మాధుర్యాన్ని చవి చూసిన గోపికా నాథుని వెదుకుచు ఆయన పల్లె వదిలి ప్రాణ నాథుని పట్టువొదలి యమునా సైకత భూవిలో వెరిగ్రా తిరగసాగింది ఇలా “శారద శర్వరే మధుర చంద్రిక / సూర్యమంతా స్రవంతిగా చారు వినీల వీచిక ప్రశాంత నిశా | పవనోర్మి మాలికా ” అంటు సాగింది. కృష్ణ శాస్త్రి జీవితమే అన్వేషణగా జీవించి మురళీ మోహమనే ద్యాన భజనలో మధుర భక్తిని పండించిన ఆపరజయదేవుడు. లోక నీతికి, సంప్రదాయ రీతికి భిన్నంగా శ్రీకృష్ణునికి తనకు తాను అర్పించుకున్న రాధగా జయదేవ కవి ఆలపించిన భావ సౌందర్యాన్ని పూతగా స్వీకరించ కృష్ణ శాస్త్రి అన్వేషణలో రాశారు. దేశ మాతను బంధించిన కఠిన దాస్య శృంఖలాలు చెదరి పోయినట్లు గగనతలం మారు మ్రోగెటట్లు కంఠమెత్తి స్వేచ్ఛాగానం చేశారు. ఏల ప్రేమింతును, నా ప్రేమ, ప్రాణకాంత వంటి గీతా మాలికలు రాశారు. భార్య వియోగంతో తపించిపోయిన శాస్త్రిగారు దుఃఖంలో విషాదకావ్యాలు రాశారు. ‘ఆశ్రువులను మాయం చేసె మరణం కన్నా జీవించి ఆమె కోసం దుఃఖించటమే తనకు ఆనందం అంటారు.

1929వ సం||లో జ్వాల పత్రికను నడుపుతున్న ముద్దు కృష్ణగారు ప్రవాసము ఊర్వశి అనే సంపుటిని ముద్రించారు. ‘కృష్ణపక్షము’ లోని వియోగం నుండి ప్రవాసములోని దుఃఖం ఆ దుఃఖం నుండి గమనించిన నాయిక “ఊర్వశి” అని చెప్పవచ్చు. దుఃఖాన్నే సౌఖ్యంగా అనుభవిస్తూ ప్రవాస గీతాలల్లడం, ప్రవాస గీత మాధుర్యాన్ని భావనకు అనునయించి ఆ భావనలో దివి నుండి దివ్యమూర్తి ‘ఊర్వశి’ ని భూమికి దించారు కృష్ణ శాస్త్రి గారు. ఉషస్సులు రావని తన జీవితం వలె కాలం కూడ చీకటి మయం గా కనిపిస్తుందని వాపోయారు. ఆయన బాధనుఏ గంధర్వలు అలకించారో ఏ వసంతుడు విశ్వ ప్రేయసి ఊర్వశికి తెలియచేశారో కాని ఆమె నిశీధిలో వెల్లు రేఖలా కవి హృదయకవాటాన్ని తట్టి లేపింది. ఆ విధఃగా కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానికి బాధ మాత్రమే కాదు సర్వలోకాలను కదిపి వేసిన గాధ కూడ ఆమె కోసం నిశీథిలో అన్వేషించారు. తపించారు కళ్ళలో వత్తులువేసుకొని నిరీక్షించారుఎద లోపలి ఎదలో దాచుకున్నారు. ఊర్వశిని “తొలిపొద్దున కురిసిన మంచు’ లా, విశ్వ వేదన మాల్యంగాను, విషంతో, అమృతంతో, చీకటితో, వెన్నెలతో కలసిన ప్రేయసిగా ఊహించుకున్నారు. శాస్త్రాగారి మాటల్లో చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎవరికైనా అమ్మ సీతమ్మ, ప్రేయసి ఊర్వశి’అని అంటారు.

రఘుపతి వెంకట రత్నం నాయుడు గారి శిష్యరికంలో బ్రహ్మ సమాజంలోని విశాల మానవ దృష్టి సంకల్ప శక్తి ఆయనకునైతిక బలాన్నిచ్చాయి. వైష్ణవి గీతాల్లోని వర్ణన మాధుర్యాన్ని ఆకళింపు చేసుకున్నారు. వీరి భావనలోని అణువణువు లయతో ఉంటుంది. శాస్త్రిగారి లేఖిని నుంచి జాలువారె ప్రతి గేయంలోను శబ్ధార్ధాలు పొందికలో నాట్యం చేస్తుంది. ఇంకా భక్తి గీతాలు అమృత వీణా ‘మంగళ కాహళి అనే సంపుటాలుగా వెలువరించారు. కృష్ణ రజని కన్నీరు, మహతి, మధు మురళి, గుడి గంటలు, ఋతుభేల, విరితూపు అనేవి సప్తస్వర సమ్మిళితం అయతే నిరాశ, కరుణ, ఆర్తి, భక్తి, ప్రణయం, ప్రకృతి ఆరాధన, పుణ్యయ ప్రేమ అనేవి సప్త స్వరాఅంత నాదాలు ఉంటాయి.

ఋతుశోభను ప్రకృతి కాంతలీలా మాధుర్యాన్ని కళ్ళారా చూచి, మనసారా అనుభవించిన కృష్ణశాస్త్రి వైష్ణవ భావ పరిపక్వతతో అండాళ్ళు ‘తిరుప్పావై’ ని ఆంధ్రీకరించారు శబ్దమాధుర్యంతో పాటు రూపమాధుర్యాన్ని అంతర్నేత్రంతో దర్శించి ఆనందించగల కృష్ణశాస్త్రికి దేవుడికి ఏ పూవ్వులు కావాలో, తెలుగులో ఏ అలంకారాలు, ఏ దేవుడికిష్టమో తెలుసు. ఏ అక్షరాలలో ఏ దేవుని పూజిస్తే అతడు సంతృప్తుడౌతాడో తెలుసు. అందుకే పుష్పాక్షరాలతో పూజించిన పుణ్య మూర్తి కాబట్టి వందలాది భక్తి కీర్తనలను రచించారు. కృష్ణశాస్త్రి గారి గొంతు పోయాక రాసిన గేయ సంకలనం కృష్ణ రజని’ లో ఆర్తిగీతాలు అద్భుతంగా పలికించారు.

కృష్ణశాస్త్రి పద్యాన్ని పాటను ఎంత రమణీయ శిల్పరంజితంగా తీర్చిదిద్దారో అంతటి నైపుణ్యాన్ని వచన రచనల్లో కూడ చూపించారు మంచి గంధంతో మల్లెపూలు అత్తరులో కలిపిచినుకు చినుకు చిలకరించినట్లుంది. వారి వచన శైలి, పచ్చకర్పూరపు గుభాళింపుతో వున్న పాయస పాత్రను నోటికందించినట్టుగా వుంటుంది. శాస్త్రిగారి విషయ విన్యాసం. కృష్ణశాస్త్రి పుట్టుకతో కవిగా అవతరించిన నిరంతర కవితా ధ్యానంతో పరిణతి చెందారు. వచనంలో కూడ తనదైన ఒక శైలిని సృష్టించుకున్నారు. ఆధునిక అవసరాలను ఊటకింస్తూ రాసిన చిన్న చిన్న వ్యాసాలల్లో కవిత్వం హృదయాన్ని ఎంత రంజిప చేస్తుందో వారి వచనం కూడా అంతగానే ఆలోచనలను తట్టి లేపుతుంది. వీరి కవిత్వంలో ప్రధాన గుణం భావమైతే మరో గుణం సంగీతం అంతర్వాహినిలా సాగుతుంది. అందుకే 1960 సం||లో హైదరాబాదు ఆకాశవాణిలో పనిచేశారు అనతి కాలంలోనే చలన చిత్ర పరిశ్రమ కూడా కృష్ణశాస్త్రి గార్ని ఆహ్వానించింది. సినిమా మరుగైనా పాట నిలిచే ఉండే మంచి పాటలు రాసిన కవుల్లో దేవులపల్లి అద్వీతీయులు.

1939వ సం|| నాటికే ప్రతినాగరికుడి నోటికి కూని రాగాలయ్యాయి. ఆనాడు రాసిన గీతాల్లో “మవదూదయంలో మంచి ముహుర్తం/ మాధవి లతకు పెండ్లి/ మాదవి పెండ్లికి మల్లెమాలలు /మంధారాలు పేరంటాళ్లు” అనే పాట బహ్మండమైన ప్రచారంలో ఉండేది. ఇలాంటి పదచిత్రాలు చూసిన సినిమా రంగం 1951లో వారిచే పాటలు రాయించింది. దేవులపల్లిగారు పాటలు రాసిన మొదటి సినిమా ” మల్లీశ్వరి’ రాణి వాసపు పంజరంలో బంధీయైన మల్లీశ్వరి రాత్రిపూట రహస్యంగా ప్రియునిన కలుసుకున్నపుడు ఆమె మనస్సు మల్లెలు ఊగిపోయాయి హాయి నిండిన ఆ రేయిలో ఆమె బతుకే పండింది అంటూ ఈ పాట ‘మనసున మల్లెల మాల లూగెనే / కన్నుల వెన్నెలడోల లూగెనే ఎంత హాయి ఈ రేయి నిండెనో / ఎన్ని నాళ్లకి బ్రతుకు పండెనో అంటు సందేశాన్ని పంపినా ప్రతి పాటా ఒక మధుర కావ్యం. కాళిదాసు మేఘ సందేశాన్ని దృష్టిలో ఉంచుకొని మల్లీశ్వరిలో మంచి పాటలు రాశారు. జావళీలు రాయడంలో కూడా ఆయనకు తిరుగు లేదు. పిలిచిన బిగువటరా / పిలిచినా బిగువరా / ఔరౌర అంటు సాగే జావళీ పాట నేటికి నిత్య నూతనంగా అందరి హృదయాలను అలరిస్తూనే ఉంది. పాటలో జీవిత చిత్రాన్ని చిత్రించడంలో ‘వారికి వారె సాటి. జీవితంలో అన్ని విధాల ఓడిపోయిన మారిపోయిన ఉక్కు మనిషిలోపరివర్తనకు కారణమైంది ఒక పసిపాప. అతడు పాప కోసమే జీవిస్తాడు కారణాంతరాన చెరసాలకు వెళ్లి తిరిగి వచ్చాక పాప పెద్దదవుతుంది. అతన్ని మర్చిపోతుంది. బరువెక్కిన గుండెలతో ఒక పాప బొమ్మను లాలిస్తూ. తథిమి తకథిమిల్ బొమ్మ /దీని తమాస చూడవే కీల్ బొమ్మ / దీని తమాస చూడవే మాయ బొమ్మ అంటు పాడతాడు తలచుకుంటేనే గుండె కరిగిపోయే ఈ సన్నివేశంలో తత్త్వాన్ని చాలా గొప్పగా పలికించారు. కృష్ణశాస్త్రి గారు. మల్లెల్లో పూలల్లో కూడ సృష్టి విలాసాన్ని పొదిగి చెప్పిన పాటలు లెక్కకందవు. అందులో ఒక్కటి ” ఇది మల్లెల వేళయని / ఇది వెన్నెల మాసమని / తొందర పడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది అంటు మల్లెలు, వెన్నెల, కోయిలతో మహత్తరమైన జీవిత సత్యాన్ని పాడారు. అందులోనే “మరిగిపోయెకి మానవ హృదయం / కరుణ కలిగేది చల్లని దైవం వాడే లతకు ఎదురైవచ్చు, వాడని వసంత మాసం వసివాడని కుసుమ విలాసం అంటు సాగే ఈ పాటలో విషాదం వెనుక వసంతాన్ని సృష్టించి ఊపిరిపోస్తారు. సినిమాల్లో కూడ ఎన్నో భక్తి గీతలు రాశారు “సంపూర్ణ రామాయణం” లో శబరి రాముని కోసం ఎదురు చూస్తుంది రాముడు సమీపానికి వస్తున్నాడు ఈ సన్నివేశంలో శబరికి, శాస్త్రిగార్కి బేధం లేదు. ఆ సందర్భంలో ఇలా… ముందు తెలిసెనా ప్రభూ / ఈ మందిర మిటులుండేనా, మంద మతిని, నీవు వచ్చు మధుర క్షణమేదో, కాస్త ముందు తెలిసినా……. అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే సుందర మందార కుందసును దళములు పరవనా…. అంటు షాగే ఈ పాట గళం మూగబోయాక రాసిన గగన తలాన్ని సృశిస్తుంది భగవంతుని పిలుస్తుంది. భాగ్య రేఖ సినిమాలో “నే వుండేదాకొండపై రాజమకుంలో ‘సడిసేయకేగాలి” భక్త శబరి చిత్రంలో “ఏమి రామ కథ” మంచి రోజులొచ్చాయి చిత్రంలో “నేలతో నీడ అన్నది నను తాకరాదని” ఆమెరికా అమ్మాయిలో పాడనా తెలుగుపాటా”, బంగారు పంజరంలో ‘గట్టుకాడ ఎవరో ” మొదలైనవి శాస్త్రి గారి పాటల్లో ఆణిముత్యాలుగా చెప్పవచ్చును. వందల సినిమాల్లో దాదాపు 500పైగా పాటలు రాశారు. సినిమా పాటకు కావ్య గౌరవాన్ని కల్పించిన ఘనత కృష్ణశాస్త్రి గార్కె దక్కింది.

కృష్ణశాస్త్రి గారు స్వాతంత్య్ర కాంక్షతో జాతీయ గీతాలు పాడారు. “జయ జయ జయ ప్రియభారతి జనయిత్రీ దివ్వ దాత్రి ” అంటూ నివాళులర్పించారు. స్వాతంత్రోద్యమంలో ప్రజలను కదిలిస్తూ రాసిన గీతం ” ప్రజారథం తరలింది / ప్రపంచ పధం పొరలింది/ కనుక పదవోయి పద” అంటూ హెచ్చరిస్తూ ఉత్తేజతుల్ని చేసింది. 1939 ప్రాంతంలో దేశంలో క్షామ దేవత తాండవిస్తున్న తరుణంలో ఆకలిగేయం రాశారు. 1941లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి మహ సభకు ఉద్యమానికి ప్రేరణగా అవేశం అంతర్భూతంగా ఒక స్వభోధ గీతాన్ని రచించారు. శాస్త్రిగారు అభ్యుదయ కవుల హృదయాల్లో చెలరేగిన ఉద్వేగ భావాలు గుర్తించారు. ఆశీర్వదించి వారికి పద నిర్దేశం చేసి ముందుకుసాగనించారు. తృతీయ అభ్యుదయ రచయితల మమాసభకు అధ్యక్షత వహించడం ఆయన అభ్యుదయ ప్రియత్వానికి నిదర్శనం శాస్త్రిగారు భావ కవితా ప్రతినిధే కాదు కవితా వైతాళికుడు కూడా. వారు పాడితే పక్షులు వంతపాడుతాయి. మబ్బులు శృతి కలుపుతాయి, నదులు పర్వతాలు లయలు చూపుతాయి. అందుకే ఆయన అచ్చమైన ప్రకృతికవి. ఆయన పాటల్లో ఆకుల నాడించే కొత్తగాలి, మాటల్లో విశ్వ ప్రేమ ను చూపించే కొత్త ఊపు, ఆలోచనల్లో సామాజిక హృదయ స్పందనలపై కొత్త చూపు కలంలో కరుణ, జాలు వార్చెడి కొత్త రసస్పందన కవితలలో సర్వహృదయాలను కదిలి కదిలిపోయె నూతన భాష్పీభవన పరిస్పందన. దేవులపల్లి కవిత ఆత్మీయుడైన మిత్రుడు సంస్కారాన్ని తట్టి మేలు కొల్పినట్లుంటుంది. సంప్రదాయం నుంచి చైతన్య పూరితమైన సన్నివేశాలు తెలసుకోగలరు. అవి రెండు కలిపి కవిత్వంగా ఆవిష్కరించగలరు. ఆ కవిత్వాన్ని పాడి ఎదుటి వాడి గుండెలో గూడు కట్టి కాపురం చేయగలరు. అందుకే ” కవి కృష్ణ శాస్త్రి కమ్మని కవితల కతడు మేస్త్రి అంటారు. 1942లో నవ్య సాహిత్య పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికైనారు. 1964లో శాస్త్రి గారి స్వరపేటికలో కాన్సర్ సోకింది. ఆపరేషన్ చేశారు. గళం మూగబోయింది. మధుమాస కోయిలకు గొంతు మూగ బోయదంటే ప్రకృతిలో ఎంత విచిత్ర మైన లీలలు సాగుతున్నాయో గదా !

గొంతు మూగబోయిన చివరి వరకు ఆయన మానసికంగా ఎంతో ఉత్సాహంగా జీవించారు. కవితా వ్యాసం సగం విడువలేదు ఆ సమయంలో రాసినదే “కృష్ణరజని” అని పేరు పెట్టారు. తన అభిమానులకు కొండంత సాహిత్యంతోపాటు రవంత కన్నీరు మిగిల్చి 24-02-1980 వ సంవత్సరములో గంధర్వ లోకం వెళ్ళిపోయారు.

“నన్ను గొపోవరాదా నాదా / నా హృదయం నాదా ” అంటూ భగవంతుని సన్నిధానం చేరుకున్నారు. కృష్ణ శాస్త్రి కవిత్వం రాయడానికి కొన్న హంగులు కావాలి నిరంతరం సాహితి గోష్ఠికావాలి మంచి సంగీతం వింటూ ఉండాలి. ఊసులు చెప్పుకోడానికి ఊహ తెలిసిన మిత్రులు కావాలి. ఈ హంగులుంటేకాని ఎక్కడో గున్నమావి కొమ్మల్లో ఉన్న గువ్వ కలంతో కలిసి పాడదు. కదిలి పోయే గుండె ఉండాలే కాని కృష్ణ కోయిల ప్రతి వసంతానికి తట్టి లేపుతునే ఉంటుంది.

” గూడు నిద్రపోయిన గువ్వ మేలుకుంది.
గొంతు మూగ పోయిన గుండె మేలుకుంది “


వనపర్తి పద్మావతి
ప్రముఖ కవి, రచయిత
ఉపన్యాస సిరోమణి


March 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

నయాగరపు సోయగాలు

by Narmada Nomula March 12, 2023
written by Narmada Nomula

(అమెరికా, కెనడా)

ప్రకృతి రమణీయ దృశ్య కావ్యం నయాగరా జలపాతం. ఈ జలపాతాన్ని ఎన్ని సార్లు వీక్షించినా తనివి తీరదు. ఋతువులు మారుతుంటే వాటితోపాటు తన రూపాన్ని మార్చుకునే నయాగరా గురించి ఎంత వర్ణించినా తక్కువే. అందుకే కవులంటారు ప్రపంచంలోని జలపాతాలన్నింటిని ఒక్కచోట కుప్పపోసి చూస్తే కనిపించేదే నయాగరా అని. నయాగరాను చూస్తే ఆ కవి వర్ణన తప్పుకాదేమో అనిపిస్తుంది. అందుకే ఈ నయాగరా అందాలని వీక్షించేదుకు మూడుసార్లు వెళ్ళి వచ్చాను.

ఈ మూడు సార్లు ఎటువైపు నుండి (కెనడా, అమెరికా) చూసినా తన అందాలతో కట్టిపడేసి, తనలో తడిసిముద్దయ్యేలా చేస్తుంది. ఇన్ని సార్లు చూసేందుకు అంతలా ఎముంటుంది అనేగా మీ ప్రశ్న.. దాని గురించి తెలిస్తే దాన్ని చూడకుండా ఎవరూ ఉండలేరు. అంత అద్భుతమైనది ఆ నయాగరా..

నయాగరా గురించి…

భూతల స్వర్గమని మనం పిలుచుకునే అమెరికా, కెనడా సరిహద్దులలో ఉందీ. జలపాతం. వరల్డ్ లో అతిపెద్ద జలపాతమైన విక్టోరియా జలపాతం తర్వాత స్థానం దీనిదే. అందుకే ఏటా కోటిన్నరకు పైబడి పర్యాటకుల సందర్శనతో ఈ జలపాత ప్రాంతాలు కిటకిటలాడుతూ ఉంటాయి.

నయాగరా జలపాతం, మూడు జలపాతాల సంగమం. ఒకటి ‘హార్స్ షూ ఫాల్స్’, రెండవది ‘అమెరికన్ ఫాల్స్’, మూడవది ‘బ్రైడల్ వెయిల్ ఫాల్స్’. ఈ మూడూ ఎరీ నదిలోని నీటిని, అంటారియో లేక్ లోకి ప్రవహింప చేస్తాయి. దీని ఎత్తు 167 అడుగులే అయినా (కొన్ని చోట్ల 188 అడుగులు కూడా వుంది), నిమిషానికి ఆరు మిలియన్ల ఘనపుటడుగుల నీరు ప్రవహిస్తుంది. నయాగరా జలపాతం వెడల్పు 2,600 అడుగులు మాత్రమే!

నయాగరా అంటే, మొహాక్ ఇండియన్స్ వారు మాట్లాడే భాషలో ‘మెడ’ అని అర్ధం. 1604 ప్రాంతంలోనే దీనిని, కెనడాకి వచ్చిన ఫ్రెంచ్ వారు, అమెరికాకి వచ్చిన పూర్వీకులు కనుగొన్నారు. 18వ శతాబ్దంలోనే నయాగరా జలపాతాన్ని చూడటానికి ఎంతోమంది యాత్రీకులు వచ్చేవారుట. 1897లోనే ఈ రెండు దేశాల్నీ కలుపుతూ, ఒక బ్రిడ్జిని కట్టారు. దాని పేరు, Whirlpool Rapids Bridge ఈ స్టీల్ బ్రిడ్జ్ మీద రైళ్ళూ, కారులూ అన్నీ నడిచేవి. కార్ల కోసం కొత్త బ్రిడ్జ్ కట్టినా (దాని పేరు రైన్బో బ్రిడ్జ్), పాత బ్రిడ్జి మీద ఇంకా రైళ్ళు నడుస్తూనే వున్నాయి. జూన్, జులై, ఆగస్టుల్లో అధిక సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు విచ్చేస్తుంటారు.

కెనడా వైపు కన్నా అమెరికా వైపు జలపాతం వెడల్పు తక్కువ, లోతు ఎక్కువ ఉంటుంది. అమెరికా వైపు సుమారు 1060 అడుగుల వెడల్పుతో 175 అడుగుల లోతులో నీరు పడుతుంటే, కెనడా వైపు సుమారు 2000అడుగుల వెడల్పుతో గుర్రపు ఆకారంలో 140 అడుగుల లోతులో నీరు పడుతుంది. అంత ఎత్తు నుండి కిందకు దూకే పరవళ్లతో నయగరా జలపాతం మహా ఆద్భుతంగా ఉంటాయి. తన సోయగాలతో ప్రపంచ వింతల్లోనే ఒకటిగా చోటు సంపాదించుకున్న ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడతారు.

మొదటి ప్రయాణం…

నయాగరా జలపాతాన్ని చూసేందుకు 1999లో మొదటి సారి వెళ్ళాను. అమెరికాలోని ఓహియో () నగరంలో మావారి బాల్య స్నేహితుడు సుదర్శన్ రెడ్డి, జయ దంపతులు నివసిస్తుంటే వాళ్ళను కలిసేందుకు వెళ్ళినప్పుడు మొదటి సారి

నయాగరాని చూడటం.

చిన్ననాటి స్నేహితులు కాబట్టి చాలా క్లోజ్ గా ఉండేవాళ్లం. వాళ్లు ఉద్యోగరీత్యా ఎక్కడికీ ట్రాన్స్ఫర్ అయినా అక్కడికి వెళ్ళివచ్చేవాళ్లం. వీళ్ళు కలకత్తాలో ఉంటే కలకత్తాకు, బాంబేలో ఉంటే బాంబేకి దూరంతో సంబంధం లేకుండా ఎక్కడ ఉన్నా అక్కడికి వాలిపోయేవాళ్లం. అంతంటి స్నేహం మా ఇరు కుటుంబాలది. చివరకూ అమెరికాలో ఉన్నారని తెలిసినా చూడటానికి వచ్చేశాం.

మొదటిసారి అమెరికాకు వచ్చినప్పుడు న్యూయార్క్ ఎయిర్ పోర్టులో దిగి అక్కడి నుండి గ్రే గ్రౌండ్ బస్లో ఓహియో చేరుకున్నాం. ఓహియో అనేది అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒక ముఖ్య నగరం. ఓహియో అనే పేరు సెనెకా పదం నుండి వచ్చింది. ఓహియో అంటే ‘గొప్ప నది’ లేదా ‘మంచి నది’ అని అర్థం.

మొదటి సారి వచ్చినప్పుడు వారం రోజులు వాళ్లింటోనే మకాం. ఆసలు వారం రోజులు వాళ్లతో ఎలా గడిచిపోయిందో తెలియనే తెలిదు మాకు. వాళ్ళకు సొంత వెహికిల్ ఉంది కాబట్టి హ్యాప్పిగా అన్ని ప్రాంతాలని చుట్టి వచ్చాం. మొదటి సారి నయాగరాను చూసేందుకు వెళ్ళేసరికి రాత్రి అయింది. రాత్రి వేళలో నయాగరాను వీక్షిస్తే అద్భుతంగా ఉంటుందని ఆ టైంలో తీసుకెళ్ళారు. అక్కడే దగ్గర్లో ఉండేలా ప్లాన్ చేశారు. రాత్రి వేళల్లో ఏం కనిపిస్తుంది. ఏం చూస్తాం అనుకుంటాం కానీ నిజానికి రాత్రి వేళల్లో నయాగరా జలపాతాన్ని వీక్షించడం ఓ అద్భుతమే అనవచ్చు.

జలపాతాలని పగలు దర్శించడం వేరు. కానీ చీకట్లో చూడటమే వింత. అందుకే ఆ వేళలో చూడటం. నయాగరా జలపాతం చీకటి పడగానే మొత్తం దృశ్యం ఏదో స్వప్నలోకంలో ఉన్నట్లు మారిపోయింది. తారాజువ్వలు ఆకాశంలో నుంచి విచ్చుకొని రంగురంగుల పువ్వులను వర్షిస్తున్నట్లుగా, దాదాపు ఒక పదిహేను నిమిషాల పాటు ఫైర్ వర్కు ప్రదర్శన సాగుతుంది అక్కడ.

ఎక్కడో దూరం నుంచి ఫోకస్ చేసిన లేజర్ కిరణాలు ఈ నీటి ధారలను రంగులమయం చేసి నీటి తుంపర్ల మీద ఇంధ్రధనస్సులా పడి మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అంత విశాల ప్రాంతంలో జలపాతంలో రంగులు మారుతున్నట్లు చేసిన ఏర్పాట్లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఆ దృశ్యాన్ని చూస్తూ టూరిస్టులంతా హర్షాతిరేకంతో బిగ్గరగా అరుస్తువుంటే…అ రాత్రి అద్భుతమనే చెప్పవచ్చు.

ఆ వెండి వెన్నెల్లో తారాజువ్వల మధ్య నయాగరాను వీక్షించాక హెూటల్కు వెళ్లి పోయాం. తిరిగి ఉదయం కెనడా బార్డర్ నుండి నయాగరా జలపాతం దగ్గరకు వెళ్లాం. ఇదంతా కూడా ఓ రెయిన్ ఫారెస్టు. చినుకులతో, నీటి తుంపర్లతో ప్రదేశం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ మా ఫ్రెండ్ వాళ్లకు ముందుగానే తెలుసు కాబట్టి నుండి చాలా ప్రదేశాలను చూపించారు. చూపించడమే కాకుండా ప్రతి ప్రదేశం గురించి చక్కగా వివరించారు. వారి అతిథ్యం మేం ఎప్పటికీ మరిచిపోలేం.

రెండోసారి (2004) స్నేహితురాలు శ్రీలతో కలిసి నయాగరా జలపాతాన్ని చూసేందుకు వెళ్ళాం. ఆమె, డాక్టర్ సుదర్శన్ గారు న్యూయర్క్ క్యాపిటల్ అయిన ఆల్బమాలో ఉంటుంది. తనతో మేం వారం రోజులు పాటు గడిపాం. వారం రోజుల్లో మేం అక్కడే ఉండే చిన్న చిన్న ప్రదేశాలకు పిక్నిక్ లాగ వెళ్ళేవాళ్లం. ఉదయం పూట మమ్మల్ని కార్లో తానే డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళేది. మాబాబు మాతోపాటు వచ్చాడు కాబట్టి తనకు చూపిద్దామని అందరం కలిసి వెళ్ళాం. రాత్రికి దగ్గర్లో ఉన్న హెూటల్లో రూమ్ తీసుకొని మర్నాడు ఉదయం కూడా నయాగరా చూడటానికి వెళ్ళాం. మా బాబుకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని దగ్గరుండి నయాగరా అందాలను దగ్గరుండి మరీ చూపించాపించాలని జలపాతం దగ్గర ఉన్న టేబుల్ రాక్ కాంప్లెక్స్కు వెళ్ళాం. అదో వ్యూ పాయింట్. లిఫ్టులో 125 అడుగుల కిందకి తీసుకెళ్ళి ఒక గ్లాసు డోరులోంచి జలపాతాన్ని చూడవచ్చు. నీటి మట్టానికి 25 అడుగుల ఎగువన ఒక బాల్కనీ కట్టారు. మూడువైపులా రైయిలింగ్స్ ఉంటాయి. నిమిషానికి సుమారు 20కోట్ల లీటర్ల నీరు 175 అడుగుల లోతుకు పడి, వందల అడుగుల ఎత్తుకు లేచిన చల్లటి నీటి తుంపర్లు ముఖాన్ని తడుపుతుంటే…. ఆ మనోహర దృశ్యాలను వివరించడానికి మాటలు చాలవనుకోండి.

మైడ్ ఆఫ్ ది మిస్ట్….

వెళ్ళిన వెంటనే అందరం కలిసి నయాగరా జలపాతాన్ని చూశాక ఆ జలపాత పరవల్లను మరింత దగ్గర నుండి చూడాలని టికెట్లు కొనుక్కొని ‘మైడ్ ఆఫ్ ది మిస్ట్’ దగ్గరికి వెళ్ళాం. సుమారు 100 మంది పట్టే డబుల్ డెక్ మోటార్ బోటు ఇది. అక్కడికి వెళ్ళగానే లిఫ్ట్ ఎక్కి, అంత ఎత్తు నించీ క్రిందకి దిగి, అక్కడ ఒక బోటు ఎక్కాం. బోటు ఎక్కే ముందు, అందరికీ పాంచోలు (రైన్ కోటు లాంటివి) వాళ్ళు ఇస్తే అందరం వాటిని వేసుకుని, తల అంతా పాంచోలో వున్న టోపీతో కప్పుకుని, బోటులో అందరం రైలింగ్ పట్టుకుని నుంచున్నాం. అది రెండస్తుల బోటు. అది నెమ్మదిగా, ఈ మూడు జలపాతాలు పక్క నించీ వెడుతుంటే, ఆ శబ్దం, గాలి, తల మీద పడే నీటి తుంపరలే కాక, అక్కడక్కడా కుండపోత వర్షంలా పడే నీరూ | అదొక అందమైన అనుభవం.

ఒక రకంగా జలపాతం క్రింద దాకా వెడతామన్నమాట. ఇక్కడ గాలి విపరీతంగా వుంటుంది. జలపాతం హెూరు చెవుల్ని చిల్లులు పడేట్టు చేస్తుంది. మన మీద పడే నీళ్ళు కూడా గట్టిగా తాకుతుంది. నదిపై బోటులో వెళుతుంటే… ఒక వైపు భయంగా ఉన్నా… మరో వైపు సాహసం చేస్తున్న థ్రిల్ కలుగుతుంది. అంత ఎత్తు నుండి నీటి ఉధృతి, తుంపర్లతో తడిసి ముద్దయిపోవలసిందే…!

ఆ అద్భుత దృశ్యాలను చాలా మంది తమ కెమెరాల్లో, సెల్ఫోన్లలో బంధిస్తుంటే మేము కూడా ఫొటోలు తీసుకున్నాం. ఇక్కడ పిల్లా, పెద్ద అనే తేడా లేకుండా హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. అందరం కలిసి బాగా ఎంజాయ్ చేశాం అక్కడ.

డాక్టర్ సుదర్శన్ గారు లీవ్ పెట్టి మరీ మాతో వచ్చిన ఆ ప్రయాణాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. ఆ దంపుతులిద్దరు సాయంత్రం పూట బర్బిక్ తో తయారు చేసిన చికెన్, మటన్, మొక్కజొన్న కంకులతో వేడి వేడిగా స్నాక్స్ తినిపించేవాళ్లు. చాలా రుచిగా అనిపించేవి. మమ్మల్ని ఫై స్టార్ హెూటల్కు తీసుకెళ్లారు. ఆ ప్రయాణంలో ఒక్క పైస కూడా మమ్మల్ని ఖర్చు పెట్టనివ్వలేదు. వారి అతిథ్యాన్ని మేం ఎప్పటికీ మరిచిపోలేం.

2014లో ఇంకోసారి….

2014లో మేం కెనడా వెళ్లాం. ఈ ప్రయాణంలో మరిచిపోలేని అనుభూతి వయా ట్రైన్. వాస్తవానికి మేము అక్కడికి వెళ్ళే వరకూ కూడా దాని గురించి తెలియదు. ఒక హెూటల్లో రూమ్ తీసుకొని ఓ రాత్రి ఉన్నప్పుడు అక్కడున్న ఓ అమ్మాయి అడిగింది. “మీరు ఎక్కడికెళ్తున్నారని”. మేం ఇక్కడ దగ్గర్లో ఉన్న ప్రదేశాలను చూడటానికి అని చెప్పాం. అవి ఎప్పుడైనా చూడోచ్చు కానీ. ముందు మీరు కెనడా వచ్చేరంటే కచ్చితంగా మీరు వయా ట్రెయిన్ ఎక్కాలి. ఇది కెనడా వాళ్ల జీవిత కాలపు స్వప్నం. మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి ఈ ట్రైన్ ఎక్కడం మీస్ కాకుండా చూసుకొండని” అమ్మాయి చెప్పింది. ఆమె ఇచ్చిన ఓ సలహాకు వెంటనే ఆమెనే టికెట్లు బుక్ చేయమని అడిగాం. “మీరు ఒక టూ నైట్స్కు తీసుకొండి. చాలా తక్కువలో వస్తుంది. అంటే లాస్ట్ మినిట్ సేల్ ఉంటాయి. అది నేను బుక్ చేస్తానని” చెప్పింది. అలా చాలా తక్కువ ధరలో మాకు ట్రెయిన్ బుక్ చేశారు. నిజంగా ఎంత ఆనందించానో.. మనం వెళ్లాలని ఆశ, కోరిక ఉంటే చాలా మనకు అలాంటివారే తటస్థ పడతారు. మనల్ని ప్రోత్సాహించేవాళ్లు, దారి చూపించేవాళు మన చుట్టు ఉంటే ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. పొద్దున్నే లేచి రెడీ అయి వయా ట్రెయిన్ ఎక్కాం. ఆ అమ్మాయే మాకు కెనడాలో ఏయే ప్రదేశాలు చూస్తే బాగుంటుందో చక్కగా చెప్పారు.

వయా ట్రైన్ కొందరి స్వప్నం….

కెనడాలో ఇది అతి ముఖ్యమైన జర్నీగా చెప్పుకొవచ్చు. ఎందుకంటే ఈ ట్రెయిన్ ఎక్కడం అక్కడి ప్రజలు జీవిత కలగా భావిస్తారు. వయా ట్రైన్ అనేది కెనడాలో చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి.

మేం పొద్దున్నే స్టేషన్కు వెళ్లి ట్రెయిన్ బుక్ చేసుకున్నాం. ఆ ట్రెయిన్ ఉదయం ఐదింటికి ఉంది. కానీ మేం నాలుగింటికే ప్లాట్ పామ్ దగ్గరకు వెళ్లాం. మేం వెళ్లేసరికే మాకన్నా ముందే ఒక ముసలావిడ ట్రెయిన్ కోసం ఎదురు చూస్తోంది. ఆమె వయసు 84 ఏండ్లు. ఆమె దగ్గరకు వెళ్ళి నేను కాసేపు మాట్లాడాను. ట్రెయిన్ కోసం తాను మూడింటి నుండి వెయిట్ చేస్తున్న అని చెప్పింది. అమె అలా చెబుతుంటే కాస్త వింతగా అనిపించింది. ఇంత ఎర్లీగా ఎందుకు వచ్చిందో అని. అదే అడిగాను. మూడింటికే ఎందుకు వచ్చారు మీరు. ఐదింటికి రావొచ్చు కదా? అని. దానికి ఆమె ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా “నాకు ఈ ట్రెయిన్ ఎక్కలన్నది నా కల, ఈ కోరిక కొన్ని ఏండ్లది. అందుకే ఈ సమయానికి ఇక్కడికి వచ్చి ట్రెయిన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఆ ఉత్సహంలో నాకు రాత్రాంత నిద్ర కూడా పట్టలేదు. అందుకనీ రెండింటికే నిద్రలేచి రెడీ అయి మూడింటికల్లా స్టేషన్ దగ్గర కొచ్చి ట్రెయిన్ కోసం ఎదురిచుస్తున్నాను” అని అంది. ఆమె అలా చెబుతుంటే ఆశ్చర్యంగా అనిపించింది నాకు. తానోక టీచరట. తాను సంపాందించిన సంపాదనలో కొంత భాగం ఈ ప్రయాణం కోసం దాచిపెట్టుకుందని చెప్పింది. అలా ఆమె జీవిత కాలపు కలను నేరవేర్చుకుంటోన్నది. మేం కూడా ఆ చలిలో తనతో పాటు కూర్చున్నా.

ఆమెను చూసిన తర్వాత ఈ వయసులో కూడా ఎంత సాహసం, ఎంత ఉత్సహాం కదా అనుకున్నాం. నిజానికి ప్రయాణికులకు కావాల్సింది ప్రోత్సాహాం కాదు, ఇలాంటి వాళ్ల అనుభవం ఉంటే చాలు ఎంత దూరమైన సరే వయసుతో సంబంధం లేకుండా తిరిగేయొచ్చు. ఇలా వాళ్ల జీవితమే కదా మాలాంటి వాళ్ళకు ప్రోత్సహం. ఆమెను చూసి మేం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అలా ఆ రోజంతా మేం ట్రెయిన్లో గడిపాం. సహజంగా ట్రెయిన్ జర్నీ అనగానే ఎవరికైనా ఆనందమే కదా!. అలాంటిది మేం వెళ్లే ట్రెయిన్ అన్నీ ట్రెయిన్స్ కన్నా భిన్నమైనది, ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు.

వయా ట్రైయిన్….

జనరల్గా ఏ ట్రెయిన్ అయినా ఐరన్ ఉంటాయి. మహా అయితే కాస్త లక్జరిగా ఉంటాయి. హంగూ ఆర్భాటాలత మూస్తాబు చేసి ఉంటాయి. కానీ ఈ ట్రెయిన్ అలాంటి ఇలాంటి ట్రెయిన్ కాదు. అందుకే కదా ఆ ముసలావిడ ఆ వయసులో కూడా తను కూడా దీన్ని ఎక్కాలని తహతహలాదింది.

కెనడా ప్రభుత్వం ప్రకృతి అందాలను వీకించేందుకు ప్రత్యేకంగా గ్లాస్తో నిర్మాణం చేయించింది ఈ ట్రెయిన్ను. ఈ ట్రైయిన్లో ప్రయాణం చేస్తూ ఎంచక్కా జర్నీ పొడవునా బయటి ప్రదేశాలను, ప్రకృతి దృశ్యాలను వీక్షించవచ్చు. బోగిలు అంతా గ్లాస్తోనే ఉంటాయి. కింది వైపు, పక్కవైపు, పైని వైపు ఎటూ చూసిన గ్లాస్గోనే ఉంటాయి. అందుకే బయట కనిపించే వాటిని స్పష్టంగా చూడవచ్చు. చూస్తూనే మన కంటికి కనిపించే దృశ్యాలను ఎంచక్కా ఫోటోలు కూడా తీసుకోవచ్చు. అయితే ఈ ట్రెయిన్ కాస్త కాస్లీ అని చెప్పవచ్చు. సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే కొన్ని లక్షల రూపాయలు కూడా ఖర్చు అవుతుంది ఈ ట్రెయిన్ జర్నీకి. మా తర్వాత వెళ్ళి, ఆ ట్రెయిన్ ఎక్కిన మా స్నేహితులు లక్ష రూపాయాలు ఖర్చు పెట్టామని చెప్పారు. అంత ఎందుకైంది. మేం వెయ్యి రూపాయాల్లో చూసొచ్చామని చెప్పాను. అయితే వాళ్లు బుక్ చేసుకున్నది పూర్తిగా అక్కడే ఉండి చూడటానికి. మేం నార్మల్ ట్రెయిన్ మాదిరి బుక్ చేసుకొని అక్కడి ప్రదేశాలను చూడటం జరిగింది.

ఆ ట్రెయిన్లో జర్నీతో ప్రయాణికులకు కావాల్సిన భోజనం, టీ, కాఫీ, బ్రెడ్ ఇంకా చాలా పదార్థాలను సప్లయ్ చేస్తారు. మేం మాత్రం ఎక్కువగా వేటిని ఆర్డర్ చేయకుండా కేవలం ఒక కాఫీ ఆర్డర్ ఇచ్చి తాగి అలా అందులోనే కూర్చుండిపోయి నాలుగు గంటలు ప్రయాణం చేసి తర్వాత మళ్లీ తిరిగొచ్చి భోజనం ఆర్డర్ చేసుకొనే వాళ్లం. అలా రోజంతా ట్రెయిన్లోనే గడిపేవాళ్లం. అందుకని మాకు కాస్త తక్కువనే ఖర్చు అయింది. ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం చేయాలనుకునే వాళ్ళకు ఈ ట్రెయిన్ జర్నీ అద్భుతమనే చెప్పాలి.

మేయి ఈ ట్రెయిన్ జర్నీలో మొదటగా అలస్కా కు చేరుకున్నాం. అక్కడి నుండి విక్టోరియా, తర్వాత విజిలర్స్, తర్వాత క్యూబెక్ ఇలా రెండు రోజుల పాటు ఆ ట్రెయిన్లో ప్రయాణం చేయడం ఎప్పుడు మరిచిపోలేని అనుభూతిని మిగిల్చిందనే చెప్పవచ్చు.

ఆ ట్రెయిన్ జర్నీ తర్వాత క్యూబెక్ నుండి టొరంటోకు బస్సులో వెళ్ళిపోయాం. బస్సులో వెళ్లేందుకు అమెరికాలో ఉన్న కుమార్ అనే అబ్బాయి బస్ బుక్ చేసి మాకు హెల్ప్ చేశాడు. మళ్ళీ ఓసారి కెనడా వైపు నుండి నయాగరా చూడాలని బయలు దేరాం.

ఈ సారి ప్రయాణంలో మాకు నయాగరా వద్ద ఇండియా నుండి వచ్చిన డాక్టర్ రమా, ప్రసాద్ దంపతులు కలిసారు. మేము నలుగురం కలిసి అక్కడే డబుల్ బెడ్ రూం తీసుకొని అక్కడే ఉండి ఆ ప్రాంతాలనన్నీంటిని చూడాలని ప్లాన్ చేసుకున్నాం.

ముచ్చటగా మూడోసారి…

ఎలాగూ రూం తీసుకున్నాం కాబట్టి స్వయంగా వండుకొని ప్రశాంతంగా ఆ ప్రాంతాలనన్నీంటినీ చూడాలని బయలు దేరాం. ఈ సారి మా ప్రయాణంలో కేవలం నయాగరా జలపాతాన్ని చూడటమే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాలని కూడా కవర్ చేయాలని అనుకున్నాం. అందుకే నయాగరా చూశాక చుట్టుపక్కల వంతెనలు ఉన్నాయంటే వాటిని చూద్దామని వెళ్ళాం.

జలపాత మార్గంలో ఉన్న ఆరు అపురూపమైన బ్రిడ్జిలూ భలే ఆకట్టుకుంటుంటాయి. ఈ వంతెనలన్నీ కెనడా, అమెరికా అంతర్జాతీయ సరిహద్దుల వెంబడే నయగరా నదిపై నిర్మితమయ్యాయి. నాలుగు చక్రాల వాహనదారులు,పాదచారులు కూడా ఈ వంతెనలపై ప్రయాణిస్తుంటారు. వీటిలోనే ఇంటర్నేషనల్ రైల్వే బ్రిడ్జ్ మొదలైనవి. వీటిని చూసేందుకు 20,30 డాలర్ల ఫీజు ఉంటుంది. అక్కడ ఓ బ్రిడ్జ్ మీదకు ఎక్కి నయాగరా అందాలను తిలకించాం.

అలాగ మేం దగ్గర్లో ఉండే ప్రదేశాలకు నడిచి వెళుతూ అన్నీ చూస్తు తిరిగాం. చాలా సంతోషం అనిపించింది. నయాగరా పరిసరాల్లో, ఆ ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తే ఎగిరి గంతులేయలనిపించింది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మేము స్టే చేసింది కూడా నయాగరా జలపాతం దగ్గర్లోనే కాబట్టి ప్రతిరోజూ రాత్రి ఆ రంగు రంగుల నయాగరా జలపాతాన్ని వీక్షించడం సంతోషకరమైన అనుభవం.

టొరంటోలోనే మా అల్లుడి గారి మేనత్త జయ వాళ్లు ఉంటే వాళ్ళింటికెళ్లాం. జయ మమ్మల్ని టొరంటో నుండే పికప్ చేసుకొని వాళ్ళింటికి తీసుకెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళగానే చక్కటి సంగీతం పెట్టి వేడి వేడి కాఫీతో మాకు స్వాగతం పలికింది. ఒకవైపు జయ వాళ్ల ఆయన క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉంటూ భాదపడుతూ ఉన్నా మాకు ఇచ్చిన ఆతిథ్యం ఎన్నటికీ మరిచిపోలేను. వాళ్ల ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నాడు కాబట్టి మాకు ఇబ్బంది కలగకూడదని ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసింది. మా కోసం గదిలో బ్రష్ లు, దువ్వెన, టవల్స్ ఇలా అన్ని అన్నీ కొత్తవి ఉంచింది.

జయకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. రోజూ రాత్రి పన్నెండు గంటల వరకు చక్కగా కబర్లు చెప్పుకుంటూ, పాటలు పడుకుంటూ గడిపేవాళ్లం. మావారు, జయవాళ్లయన ఇద్దరు డ్రింక్ చేసుకుంటూ సంగీతాన్ని వినేవారు. షాపింగ్ తీసుకెళ్ళి చాలా తక్కువ ధరకు లభించే వస్తువులను చూపించింది. తక్కువ ధరకు స్టోర్ట్స్ షూట్ ఇప్పిచ్చింది. ఈ యాత్రలో జయ వాళ్ళ ఇంట్లో గడిపిన క్షణాలు మాత్రం ఎప్పటికి గుర్తుండిపోతాయి. అదే చివరిసారి జయ వాళ్ళ ఆయనను చూడటం. రెండు రైలు వంతెనలు కూడా ఉన్నాయి. అవి.. పీస్ బ్రిడ్జ్, రెయిన్బో బ్రిడ్జ్, వర్ల్ుల్ బ్రిడ్జ్,లూయిస్టన్-క్వీన్స్ట్రన్ బ్రిడ్జ్, మిచిగన్ సెంట్రల్ రైల్వే బ్రిడ్జ్, ఇంటర్నేషనల్ రైల్వే బ్రిడ్జ్ మొదలైనవి. వీటిని చూసేందుకు 20,30 డాలర్ల ఫీజు ఉంటుంది. అక్కడ ఓ బ్రిడ్జ్ మీదకు ఎక్కి నయాగరా అందాలను తిలకించాం.

అలాగ మేం దగ్గర్లో ఉండే ప్రదేశాలకు నడిచి వెళుతూ అన్నీ చూస్తు తిరిగాం. చాలా సంతోషం అనిపించింది. నయాగరా పరిసరాల్లో, ఆ ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తే ఎగిరి గంతులేయలనిపించింది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మేము స్టే చేసింది కూడా నయాగరా జలపాతం దగ్గర్లోనే కాబట్టి ప్రతిరోజూ రాత్రి ఆ రంగు రంగుల నయాగరా జలపాతాన్ని వీక్షించడం సంతోషకరమైన అనుభవం.

టొరంటోలోనే మా అల్లుడి గారి మేనత్త జయ వాళ్లు ఉంటే వాళ్ళింటికెళ్లాం. జయ మమ్మల్ని టొరంటో నుండే పికప్ చేసుకొని వాళ్ళింటికి తీసుకెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళగానే చక్కటి సంగీతం పెట్టి వేడి వేడి కాఫీతో మాకు స్వాగతం పలికింది. ఒకవైపు జయ వాళ్ల ఆయన క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉంటూ భాదపడుతూ ఉన్నా మాకు ఇచ్చిన ఆతిథ్యం ఎన్నటికీ మరిచిపోలేను. వాళ్ల ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నాడు కాబట్టి మాకు ఇబ్బంది కలగకూడదని ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసింది. మా కోసం గదిలో బ్రష్ లు, దువ్వెన, టవల్స్ ఇలా అన్ని అన్నీ

కొత్తవి ఉంచింది.

జయకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. రోజూ రాత్రి పన్నెండు గంటల వరకు చక్కగా కబర్లు చెప్పుకుంటూ, పాటలు పడుకుంటూ గడిపేవాళ్లం. మావారు, జయవాళ్లయన ఇద్దరు డ్రింక్ చేసుకుంటూ సంగీతాన్ని వినేవారు. షాపింగ్ తీసుకెళ్ళి చాలా తక్కువ ధరకు లభించే వస్తువులను చూపించింది. తక్కువ ధరకు స్టోర్ట్స్ షూట్ ఇప్పిచ్చింది. ఈ యాత్రలో జయ వాళ్ళ ఇంట్లో గడిపిన క్షణాలు మాత్రం ఎప్పటికి గుర్తుండిపోతాయి. అదే చివరిసారి జయ వాళ్ళ ఆయనను చూడటం.

March 12, 2023 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మారుతున్న సామాజిక పరిస్థితుల్లో రచయితల పాత్ర

by -డాక్టర్ కాసర్ల రంగారావు March 12, 2023
written by -డాక్టర్ కాసర్ల రంగారావు

ఆదికవి నన్నయ్య వేదిక ఉ//9గం.లు
విజయవాడ లో 5వ ప్రపంచ తెలుగు మహాసభల్లో నా ప్రసంగం:


19 వ శతాబ్దపు చివరి దశాబ్దాల నుండి ప్రస్తుత పరిస్థితి వరకు ఆధునిక కాలంగా భావించవచ్చు. ఈ కాలంలో వచ్చిన ప్రధాన మార్పులు జాతీయ వాదం , దేశభక్తి, ప్రగతిశీల అభ్యుదయ భావాలు, స్త్రీ విద్య,బాల్య వివాహాల రద్దు ,వితంతు వివాహాలు, సామ్యవాద దృక్పథం తో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, కార్మిక కర్షక వర్గాల శ్రేయస్సు, ఆధునిక వైజ్ఞానిక అవగాహనా దిశగా హేతువాద దృక్పథం పెంపొందించడం యిత్యాదులు ‌.వీటన్నిటి నేపథ్యంలో కూడా ఆథ్యాత్మిక చింతన కూడా మనిషి వైఖరిలో మార్పుకు , మంచి వైపుమరలడానికి దోహదం చేసింది.
ఈ పై భావజాలాల దృష్ట్యా రచయితలు, కవులు తమ తమ రచనల ద్వారా మంచి మంచి ఫలితాలు సాధించారు. గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం పంతులు, గిడుగు రామమూర్తి పంతులు, వంటి వారు ఏర్పరచిన దారిలో గాడిచర్ల, దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, త్రిపురనేని, తాపీ వంటి వారలు చాలా వరకు లక్ష్యాలు సాధించారు.
అందు వల్లనే కుల ,మత బేధాలు తగ్గి సమైక్యంగా అందరూ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనగలిగారు. సురవరం ప్రతాప రెడ్డి, సరోజినీ నాయుడు, దాశరథి సోదరులు, కాళోజీ సోదరులు, ముఖ్దూం మొయినుద్దీన్, షోయబుల్లాఖాన్, అడవి బాపిరాజు వంటి వారలు ప్రత్యేక ముద్ర వేశారు.దేవులపల్లి రామానుజరావు వంటి వారలు ఆసులో దారంలా యీఅన్ని భావాల వైఖరులు ఉద్యమాల సంధానకర్తలుగా దీప్తి నందించారు.
గరిమెళ్ళ సత్యనారాయణ వంటి కవి గాయకులు గాంధీ శకానికి/ యుగానికి ప్రతినిధులు. వారి పాటల ద్వారా ప్రజలలో మంచి భావావేశాన్ని కలిగించారు. వామపక్ష సోషలిస్టు దృక్పథాలు ఫలితాలు సాధించి ఆధునిక ప్రజాస్వామ్య ప్రయాణాన్ని బలోపేతం చేశాయి.
ప్రజాస్వామ్య యుతంగా , రాజ్యాంగ బద్ధంగా ప్రభుత్వాల్ని ఏర్పరచుకోవడం , ప్రభుత్వాల్ని మార్చడం అనేది అతిపెద్ద సామాజిక మార్పు . దీనికి రచయితలు కవులు ఎంతో దోహదం చేశారు. నిరక్షరాస్యులైనా , గ్రామీణులైనా దళిత గిరిజనులైనా తమ తమ విచక్షణ జ్ఞానం ద్వారా ప్రభుత్వాల్ని మార్చడమనేది ఒక గొప్ప శుభ పరిమాణం, పరిణామం. దీనికి రచయితలు కవితలు , నాటకాలు, పాటలు , బుర్రకథలు యిత్యాదుల ద్వారా ప్రజల అవగాహనకు తోడ్పడ్డారు.
కుల మతాల సాంప్రదాయ భావజాలాలు పునర్వికాసం చెందుతున్నాయి. ఒకప్పుడు ఉద్యమ రూపంలో కలిసి పనిచేసినవారు ,పోరాడినవారు కొంత కాలానికి కుల మత భావజాలాలకు లోనవుతున్నారు.
ఛందో రూపమైన ప్రాచీన సాహిత్యం కన్నా వచన కవిత్వం విశేష ప్రాచుర్యం లోనికి వచ్చింది.ఐనా మంచి పద్యాలు, సమస్యొ పూరణలు వస్తున్నాయి. తిరుపతి వేంకట కవులు, కొప్పురపు కవులు , జాషువా, విశ్వనాథ, శ్రీశ్రీ, నండూరి రామకృష్ణమాచార్య , ఆశావాది ప్రకాశరావులు మంచి పద్య శిల్పాన్ని నిర్మించారు.
శ్రీ గరికిపాటి నరసింహారావు మహా సహస్రావధాని. శ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆథ్యాత్మిక ప్రవచన కర్త. ఆధునికత వెర్రి తలలు వేసి సమాజం అడ్డదారులు తొక్కుతున్న తరుణంలో ఈ యిద్దరు ప్రవచనకర్తలు మంచి మార్పుకై దోహదం చేస్తున్నారు.
ఏ సమాజంలో నైనా మంచి ని ప్రోత్సహించడం , చెడును విమర్శించడం , త్యాగమయ దేశభక్తి జాతీయతా దీప్తిని ప్రోత్సహించడం, ధర్మనిరతిని కాపాడటం రచయితల పాత్ర.
ఈ విధంగా ప్రధానంగా అరసం విరసం వంటి సంఘాలు గద్దరు / వంగపండు వంటి కవి గాయకులు చాలా సామాజిక మార్పు సాధించారు. కేవలం రాజకీయ పార్టీల వల్ల 150-200 సంవత్సరాలు పట్టగల మార్పును , వీరు 40 సంవత్సరాల్లో సాధించారు. ఈ యీ సామాజిక ఉద్యమాల / రచయితల రచనల ద్వారానే సామాన్య ప్రజానీకానికి మార్పు తేగలం అనే నమ్మకాన్ని కలిగించారు .
ప్రస్తుత తరుణంలో నేరమయ జీవిత నేపథ్యం గల రాజకీయ రంగమును క్షాళన చేయడానికై రచయితలు/ కవులు ప్రజల అవగాహనను ఈ ప్రధాన సమస్యపై కేంద్రీకరించడానికి కృషి చేయవలసిందిగా ఆయత్త పరచాలి.

March 12, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

పదకిరణ కలనం-10

by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి March 12, 2023
written by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి

అడ్డం

**

01. రవికుల తిలకుడు (5)

04. ముక్కెర  (4)

07. కోతి జెట్టి (2)

08. యుద్ధం (2)

11. కచ్ఛపం (3)

13. వజ్రాయుధం  (3)

15. చాటింపు  (3)

17. కిరణం రోగం (2)

18. తల (2)

19. కండోలం  (2)

21. జంతువు పిల్ల (2)

23. పోటి పగ (2)

25. లోటు తక్కువ (2)

26. తేలిక (3)

27. ఏమరుపాటు  (3)

28. వరుసకు ముందు చుట్టరికం (2)

29. సన్నము కానిదా? ఉష్ణద్రవము (2)

30. పందెం (2)

31. భ్రాంతి ఓ ప్రముఖకవి ఇల్లు (3)

33. తొమ్మిది పదులు (3)

35. పిల్లలను తల్లి లాలించే వెచ్చని పానుపు (2)

36. సుమంత్రుని తొలి విరి (2)

38. వెలితి  (2)

39. గెలుచు (2)

40. కూడు కొరివి పెట్టేవాడు (3)

41. శ్రీరామునకు విశ్వామిత్రుడు ప్రసాదించిన ఒక అస్త్రం (4)

43. జతకుదురు సరిపోవు (2)

44. ఇల్లు పీకి వేసేది (3)

45. సదా (3)

46. పెరుమాళ్ళు కెఱుక (3)

**

నిలువు

01. మాధవుని మామ (5)

02. తాలింపులో వాడే సుగంధద్రవ్యం (3)

03. దీనిని దీనితోనే తీయాలట (2)

05. పెంచు బొట్టుదినుసు (2)

06. పూదేనె  (3)

08. తీగెలు, మొక్కలకు తావు (2)

10. ఇతరుల తిండితో బ్రతికేది (5)

12. మురికి లప్పం (2)

13. గోడ (3)

14. యుద్ధభూమి  ఒకప్పటి రంగూన్ (2)

16. పాకు (2)

20. భాషలో పదిమందిలో ప్రాముఖ్యత (5)

22. దేవతలు మెచ్చి కురిపించేది (4)

24. రాత్రితో ఉపవాసం (3)

26. ఆ విధంగా (2)

27. పందెం (2)

28. తరువాత తన ఆస్తికి అర్హుడు (4)

30. సతికి తనతో సగం ఇచ్చినవాడు  (2)

32. అత్యుష్ణం దుఃఖం (4)

34. స్త్రీ నేర్పరి ఇల్లు (3)

35. వంచు వశమగు (2)

37. తాను కోరినదే కావాలని పట్టే మొండితనం (4)

39. రెండుపక్షాలతో తీగసాగిన స్త్రీ (3)

40. స్త్రీ పూలను తురిమేది ఇక్కడ (3)

41. శత్రువు (2)

42. వేరే చోట నివాసం చేసేది (2)

March 12, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

“మా శారద గొప్పది”

by -  బి ఎస్ రాములు March 11, 2023
written by -  బి ఎస్ రాములు

ప్రేమించానని వెంటబడి పెళ్లి చేసుకొన్న అద్వైతకు కులాంతరాలు గుర్తుకు రాలేదు. ఏ లోపాలూ కన పడలేదు. నిన్ను పెళ్లి చేసుకోలేని ఈ జీవితం వ్యర్థం అన్నాడు. రొమాంటిక్ బ్లాక్ మేల్ చేసి గాంధర్వ వివాహం చేసుకున్నాడు. ఒక బిడ్డకు జన్మనిచ్చింది శారద. పెళ్లి చేసుకొన్న మూడేళ్లకు ఏదో కెమిస్ట్రీ కుదరలేదని భార్యను బిడ్డను వదిలేసి వెళ్లిపోయాడు అద్వైత .
శారద ఒంటరి ప్రయాణంలో మరో మూడేళ్లు గడిచాయి. ఎన్నో అనుభవాలు పోరాటాలు. ఎందరో మద్దతు నిలిచారు.
ఒంటరి పోరాటంలో కన్నీరు కార్చింది. ఏకైక కూతురు కంట కన్నీరు చూడ లేకపోయారు… కన్న పేగు కదిలింది. కడుపులో దాచుకున్నారు. అత్తామామలకు మనవరాలంటే ప్రేమ. ఎన్నాళ్లకు తమ ఇంట్లో మళ్లీ పసిపిల్ల కేరింతలు. ఆ పసి నవ్వులకు మురిసిపోయారు. కొడుకే చెడిపోయాడు. కోడలు మంచిది అని తెలుస్తూనే ఉంది. మాకు పెళ్లే కాలేదన్న కొడుకు వాదన విన్నాక వీడు తమ కడుపున చెడ పుట్టాడని బాధ పడ్డారు. కోడలు మనవరాలు తమ తో ఉంటే ఎంత సౌఖ్యంగా ఆనందంగా వుండేదో అనుకున్నారు. అలా కలిసి పోయారు. ఇపుడు వాల్లందరికి గారాల మనవరాలంటే ప్రాణం. మనవరాలు ఆటపాటలతో అన్ని మరిచి పోయారు. బయట సంఘర్శన. ఇంట్లో ఆనందం. కోర్టు , అడ్వకేటు , కలిసి దిగిన ఫోటోలు సాక్ష్యాలు అన్నీ బలంగానే ఉన్నాయి.
ఈ కొత్త జీవితం లో అనేక విషయాలు తెల్సుకుంది శారద. శారద ఇపుడు తన ఏటియం కార్డు తానే వాడుకుంటుంది . కేసు పెట్టింది. ఇపుడు జైల్లో వున్న అద్వైత్ ఉద్యోగం పోయి శారద మీద మీద మనోవర్తి కేసు వేసాడు.
కేసు వాసుతీసుకుంటానన్నాడు. అతడు
అడ్వకేటు తో కబురు పెట్టింది గుర్తుకు వచ్చి నవ్వుకుంది శారద.
ఏదో కెమిస్ట్రీ కలవడం లేదన్న బింకం అహంకారం ఎక్కడ పోయిందో! ఇపుడు తనకేమైందని అతనిని ఆహ్వానించడం.
?
అతని లోని మార్పుతో తనకేమీ సంబంధం లేదు.
ఇపుడీ సింగిల్ పేరెంట్ జీవితమే బాగుంది. అపుడు కులాంతరాల పేరిట దూరమైన అమ్మా నాన్నా అత్తమ్మా మామయ్యా అంతా నాతోనే వున్నారు.
ఈ ఉమ్మడి కుటుంబమే బాగుంది. అతడు మల్లీ తన జీవితంలోకి ప్రవేశించడం దేనికి?
తన అడ్వకేటుకు అదేమాట చెప్పింది. ఆ మాట చెప్పాక తనకెంతో బరువు దిగిపోయినట్టు ఉత్సాహం..
శారద మునుపటి శారద కాదు.
ఎన్నో అనుభవాలతో ఎదిగిపోయింది.
వదిలేసిన వాడి జీవితమే వాడిపోయింది. మా శారద గొప్పది.
శారద తన జీవితాన్ని తిరగ రాసుకుంది. స్కూటర్ పై
బిడ్డను స్కూల్‌లో దింపి నవ్వుతూ టాటా చెప్పి యధావిధిగా డ్యూటీకి స్కూటర్ స్టార్ట్ చేసి బయల్దేరింది శారద.

March 11, 2023 1 comment
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఎఱ్ఱాప్రెగడ రచనా సౌందర్యాన్నందించిన యశోదారెడ్డి

by Dr. Karimindla Lavanya March 11, 2023
written by Dr. Karimindla Lavanya

విషయ ప్రధానమైన భావగతి, నిండైన వర్ణనలు సంపూర్ణ రస నిర్వాహణ ఎర్రన కవితా లక్షణాలు. పురాణ మార్గం నుండి దేశిమార్గం వైపు, జాను తెనుగువైపు పాఠకులను మళ్లించి నూతన సాహిత్య నిర్మాణాన్ని చేసినవాడు నాచనసోమన. ఈ ఇద్దరి కవిత్వాలను, సాహిత్య పరిణామాలను లోతుగా అధ్యయనం చేసిన డా॥ పాకాల యశోదారెడ్డి ఆధునిక సాహిత్య నిర్మాణానికి సాహితీ బాటను నిర్మించింది. “తెలుగులో హరివంశాలు” అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో Ph.D. పరిశోధన చేసి ప్రాశ్చ్య, ఆధునిక రచయిత్రిగా, విమర్శకురాలుగా తెలుగు సాహితీ రంగంలో సుస్థిర స్థానాన్ని పొందింది.

తెలుగు సాహిత్య వికాసంలో ఎర్రన ప్రబంధ నిర్మాణానికి బలమైన భూమికను, పునాదిని నిర్మించి “ఋషిగా” కన్పిస్తే నాచనసోమన పాత్రల మూర్తి కల్పనా, సంభాషణా చాతుర్యంతో పద్యాల విరుపులతో, జాతీయాలు, సామెతలతో కవిత్వాన్ని వ్రాసి నవీనగుణసనాథుడైన “కవి”గా కన్పించాడు. ఈ ఇద్దరి కవిత్వగుణాలను తనలో ఆకళింపు చేసుకొని యశోదారెడ్డి “సాహితీ తపస్వి”గా తనదంటూ ప్రత్యేక ముద్రను సాహితీ ప్రస్థానంలో స్థిరీకరించింది. తాను చెప్పదలచుకుంది, వ్రాయదలచుకుందీ సూటిగా చెప్పి, వ్రాసి భావి పరిశోధకులకు కావల్సినంత సాహిత్య సరుకును అందించింది.

ఇంగ్లీష్‌లో “English Men of Letters” అనే పేరు మీద ఆ వాఙ్మయంలోని మహాకవుల, రచయితల జీవిత విశేషాలకు, రచనా సౌందర్య విశేషాలను విశదీకరించే విమర్శ గ్రంథ పరంపర ఒకటున్నది. దాని మాదిరిగానే ఆంధ్రవాఙ్మయంలో ప్రముఖ కవుల జీవిత రచనా విశేషాలను వెలువరించాలనే ఉద్దేశంతో ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధ్యక్షులుగా ఉన్నపుడు UGC వారి సహాయంతో “ఆంధ్రకవి నక్షత్రమాల” అనే పేరుతో 27 గ్రంథాలను ప్రచురించాలని సంకల్పించాడు. అందులో రెండవది “ఎఱ్ఱాప్రెగడ” గ్రంథం. 1972, డిసెంబరులో ప్రచురితమైన ఈ గ్రంథం డా॥ పాకాల యశోదారెడ్డి వ్రాసింది. ఎఱ్ఱాప్రెగడ తాత, తండ్రుల వివరాలను మొదలుకొని, ఎర్రన వ్యక్తిత్వంతో పాటు, ఆయన రచనల సారాన్నంతా కూలంకషంగా యశోదారెడ్డి ఈ గ్రంథంలో వివరించింది.

తెలంగాణ ప్రాంత యాసతో ఈ ప్రాంత భాషా నిర్మాణానికి పునాది వేసిన యశోదారెడ్డి కథలు ఎంత ప్రాచుర్యం పొందినా, తెలంగాణా సమాజాన్ని కదిలించినా ముందుగా ఆమె విమర్శకురాలని నా అభిప్రాయం. ప్రాచీన కవిత్వాన్నంతా అధ్యయనం చేసి దానిపై పూర్తి పట్టును సాధించింది. ఆధునిక సాహిత్యంలో అతి తక్కువ మంది మొదటి తరం విమర్శకుల్లో ప్రముఖ స్థానం యశోదారెడ్డిది. మూల గ్రంథాలనే అధ్యయనం చేసింది. అందుకుగాను సంస్కృతం, ప్రాకృతం, జర్మన్‌ వంటి భాషలను నేర్చుకొని మూలాల సారాంశాల కోసం వెతుకులాడింది. ప్రాచీన సాహిత్యంపై ఆమె చేసిన కృషి, వెలువరించిన ప్రసంగాలు పండితుల మన్ననలు పొందాయి. మహిళలు చదువుకునే పరిస్థితులు సమాజంలోలేని కాలంలో చదువుకొని, ఇతర మహిళలకు ఆదర్శంగా నిలిచింది. అందరికీ జ్ఞానోదయం కలిగించింది.

ఇక “ఎఱ్ఱాప్రెగడ” కవిత్వానుశీలనలో ఎర్రనది ప్రబంధ లక్షణాలున్న సహజ కవిత్వమని యశోదారెడ్డి అభిప్రాయం. కావ్య ప్రయోజనాన్ని ఆశించి, కావ్య రచన చేయడం ఎర్రన కవిత్వ లక్షణాల్లో ప్రధానమైంది. అందుకే రామాయణంలోనూ, మహాభారత అరణ్యపర్వశేషభాగ రచనలోనూ, నృసింహపురాణంలోనూ, హరివంశంలోనూ కావ్య ప్రయోజన సాధనకోసం ప్రబంధరచనా ప్రావీణ్యం, చమత్కారంగా వ్రాసే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నారనే అభిప్రాయాన్ని యశోదారెడ్డి వెలిబుచ్చారు.

ఎర్రాప్రగడ జీవించిన కాలాన్ని వీరేశలింగం పంతులు పరిశోధన ఆధారంగా, చరిత్ర గ్రంథాల ఆధారంగా క్రీ॥శ॥ 1280-85 మధ్యకాలంలో పుట్టి, 1355 వరకు జీవించివున్నాడని తెలిపారు. విష్ణు పారమ్య ప్రతిబోధకాలైన రామాయణం, హరివంశం, అరణ్యపర్వశేషభాగం, నృసింహపురాణం ఎర్రన రచనలు. ఇవన్నీ విష్ణుభక్తి ప్రతిబోధకాలే. నేడు రామాయణం ఆధారంగా కందుకూరి వీరేశలింగం పంతులు, శేషాద్రి రమణ కవులు, పింగళి లక్ష్మీకాంతం, వేదాల తిరువేంగళాచారి, దివాకర్ల వేంకటావధాని, చాగంటి శేషయ్య, వేలూరి శివరామశాస్త్రి వేదాల తిరువేంగాళాచార్యులు, నోరి నరసింహశాస్త్రి పరిశోధనలను అనుసరించి, ఎర్రన మొదట రామాయణ హరివంశాలను తరువాత అరణ్య పర్వశేషం, నృసింహపురాణాలను వ్రాసినట్లుగా యశోదారెడ్డి అభిప్రాయపడింది.

నోరి నరసింహశాస్త్రి “ఈశ్వర ప్రణిపాతములో గూడిన విజ్ఞాన యోగమునందభినివేశము కలిగిన సమాధిని నిమీలితేక్షణుండనై క్షణంబున్న” అని చెప్పుకున్న వాక్యం అప్రయత్నంగా వచ్చిన సత్యవాక్యమని కవి ఆధ్యాత్మికోన్నతిని పొగిడినాడు. దీన్ని బట్టి నృసింహపురాణమే మొదటిదని చెప్పినా యశోదారెడ్డి అందుకు అంగీకరించలేదు. ఆత్మోన్నతి కలిగిన మహాకవికి నృసింహపురాణం బాల్య రచన కాదనేది యశోదారెడ్డి అభిప్రాయం.

ఎర్రన నృసింహ పురాణంలో “ఎన్నికమై బ్రబంధ పరమేశుడనంగ నరణ్య పర్వశేషోన్నయమంధ్ర భాష సుజనోచ్చ మెప్పగ నిర్వహించితి”నని చెప్పినాడు. చదులవాడ మల్లన విప్రనారాయణ చరిత్రలో “ప్రతిభతో నారణ్యపర్వశేషము జెప్పె కవులకు జెవుల పండువులుగాగ” అని ఎర్రన అరణ్యపర్వశేషమును చెప్పినట్టు ధృవపరిచాడు. జక్కన విక్రమార్క చరిత్రలోనూ “ఈత్రయిదా బ్రబంధ పరమేశ్వరుడై విరచించె శబ్దవైచిత్రి నరణ్య పర్వమున శేషము” అని శబ్దవైచిత్రితో ఎర్రన అరణ్య పర్వశేషం వ్రాసెనని చెప్పాడు. ఈ ఆధారాలను తీసుకొని యశోదారెడ్డి అరణ్య పర్వశేష భాగం ఎర్రనే వ్రాసినాడనే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.

భారతమూలరచనను పరిశీలించి నన్నయ కన్నా ఎక్కువగా మూలాన్ని అనుసరించాడన్నది. నన్నయ తిక్కనల కన్నా ఎర్రనే ఆంధ్రమహాభారతలక్ష్మిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడని, వారిద్దరూ సంపూర్ణ భారతాన్ని అందించలేదూ – ఎర్రన పూర్తి చేసిన తరువాతే భారత రచన ఫలవంతమైందని యశోదారెడ్డి అభిప్రాయపడింది.

సంస్కృత భారతంలో శరదృతువు వర్ణన ఏడు (7) శ్లోకాల్లో ఉంటే, నన్నయ శ్లోక సారాంశాన్ని కలుపుకొని “(1) భూసతికిం దివంబునకు బొల్పె సగంగ శరత్సమాగమం…”, (2). శారద రాత్రు లుజ్వలలస్తతర తారక హార పంక్తులం…”, అనే రెండు పద్యాల్లో శరదృతువు యొక్క ప్రధాన లక్షణాలను చెప్పినాడు. ఈ పద్యాల తరువాతే ఉన్న “స్ఫురదరుణాంశు రాగ రుచి బొంపిరివోయి” పద్యాన్ని పరిశీలించినపుడు పూర్తిగా మూల భారత అనువాదంగానే కనిపించింది. దీంతో భారత రచనా విధాన భేదాన్ని గుర్తించవచ్చు. శ్రీకృష్ణుడు సత్యభామతో పాండవుల దగ్గరకు వచ్చిన సందర్భంలో మూలగ్రంథంలో ఉన్న ఋతు వర్ణనను పరిశీలించినపుడు మూల శ్లోకాలకు మెరుగులు దిద్దినట్లుగా కనబడింది. మూలగ్రంథంలో శ్రీకృష్ణుడు ధర్మరాజును ప్రశంసించిన సందర్భంలో, ద్రౌపదిని ఆమె కుమారుల క్షేమాన్ని గురించి అడిగిన సందర్భంలోనూ మూలంలోని శ్లోకాలు భావ వైవిధ్యం లేక చెప్పిన విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పినట్లుగా ఉన్నదని, మూలశ్లోక భావాన్నంతటిని సమీకరించినట్లున్నదని యశోదారెడ్డి అభిప్రాయపడింది.

సంస్కృత భారతంలోని మార్కండేయ మహర్షి ధర్మరాజుకు చెప్పినట్లున్న రామాయణ కథాభాగం అనువదించిన విధానాన్ని పోల్చి చూసినపుడు మూలశ్లోక భావాన్ని తప్పక యతి సమర్థుడై  వర్ణించాడు ఎర్రన. మూలభారతంలోని రావణ సంహారములో రాముడు బ్రహ్మాస్త్ర సంధానం చేసాడని అది రావణుని నీరుగావించిందని ఉంది. బ్రహ్మాస్త్ర సంధానం తరువాత దేవదావన కిన్నెరాదులు రావణున కాయురల్వావశేషమై ఉన్నదని తలచినట్లున్నదన్న విషయాన్ని వదిలిపెట్టాడు. అశోకవనంలో ఉన్న సీతతో రావణ సంవాదం తరువాత వాల్మీకీ రామాయణంలో త్రిజటా స్వప్న వృత్తాంతం ఉన్నది. మూలభారతంలో త్రిజటా స్వప్న వృత్తాంతం తరువాతే సీతారావణ సంవాదం ఉంది. ఎర్రన భారత కథనం ప్రకారమే అనువాదము చేసినాడు. 30 శ్లోకాల సంభాషణను 7 గద్య పద్యాలల్లోనే వర్ణించాడు ఎర్రన. అంటే భారతంలో రామాయణం ఇతివృత్త ప్రాధాన్యం కొంతవరకే అవసరమని గుర్తించాడని యశోదారెడ్డి అభిప్రాయపడింది.

హరివంశంలోని “నా తమ్ముండు ఘనుండు అనే పద్యంలో రామకథమున్‌ జెప్పించి యత్యుత్తమ ఖ్యాతింబొందితి నింకనేను” అనే పద్యాల్లోనూ, కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణ సారసంగ్రహంలోని అనేక సందర్భాల్లో ఎర్రన పద్యాలను ప్రస్తావించడంలోనూ, గణపవరపు వేంకటకవి ప్రయోగ రత్నాకరమనే లక్షణ గ్రంథంలోనూ, చెదలువాడ మల్లన విప్రనారాయణ చరిత్రలోనూ, ఆనందరంగకవి ఆనందరంగరాట్భందములోనూ, ఎర్రన రామాయణ ప్రస్తావనలున్నాయి. ఎర్రన కాలంలోనే భాస్కర రామాయణం వ్రాయబడింది. అయినా ఎర్రన వ్రాసివున్నట్లుగా అనేక ఆధారాలున్నందున మనోజ్ఞంగా రామాయణం కూడ వ్రాసే ఉంటాడని యశోదారెడ్డి బలంగా వారి అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

మహాభారతం పంచమ వేదమైతే, హరివంశం వేదశిఖ అని యశోదారెడ్డి అభిప్రాయం. భారతంలో శ్రీ కృష్ణుని గురించి సూక్ష్మంగా, వ్యంగ్యంగా చెప్పబడితే, హరివంశంలో విపులంగా, వాచ్యంగా శ్రీహరి చరిత్ర వర్ణింపబడింది. మహాభారత యుద్ధం, క్షత్రియ సంహారంతో పాఠకుని మనస్సు బాధతో నిండి ఉంటుంది. పాఠకునిలో తొలగించే నిర్వేదవైరాగ్యాలను తొలగించడానికి హరివంశం వ్రాయబడింది. ప్రోలయ వేమారెడ్డి ఎర్రనను హరివంశరచన చేయమని కోరగా, ఇదివరకే నన్నయ తిక్కనలు భారత రచన చేసినారు. వారి త్రోవలో నడుచుటకు సంతోషంగా ఉంది. హరివంశం, భారతం రెండూ కూడ వ్యాసమహర్షి వ్రాసినవే అని హరివంశ పీఠికలో అనడంతో హరివంశ రచనాకాలం నాటికే భారత అరణ్యపర్వశేషం వ్రాయలేదని స్పష్టంగా తెలుస్తున్నదనే అభిప్రాయాన్ని యశోదారెడ్డి వ్యక్తపరిచింది.

సంస్కృతంలో హరివంశపర్వము, విష్ణుపర్వము, భవిష్యపర్వములుంటే, ఎర్రన మూల గ్రంథాన్ని అనుసరించలేదని తెలుస్తున్నది. పూర్వభాగంలో తొమ్మిది ఆశ్వాసాలు, ఉత్తరభాగంలో పది ఆశ్వాసాలుగా ఎర్రన విభజించి అనువదించాడు. అయితే ఇక్కడ నాచనసోముని ఉత్తర హరివంశాన్ని గురించి కొంత చెప్పుకోవాలి. నాచనసోమన ఉత్తర హరివంశాన్ని ఆరు ఆశ్వాసాల గ్రంథంగా వ్రాసినాడు. అయితే ఎర్రనను అనుకరించాడని చెప్పే వీలు లేదు. ఎర్రన హరివంశానికి పీఠిక ఉంటే, ఉత్తర హరివంశానికి లేదు. ఎర్రనకు విషయ ప్రధానమైన భావగతి మీద, వర్ణనల మీద, రస నిర్వహణ మీద ప్రధాన దృష్టి ఉంటే, సోమన తెలుగు కవితను పురాణ మార్గం నుండి మళ్లించాలని ప్రయత్నించాడు. సఫలీకృతుడైనాడు. ఎర్రన “ఋషిగా కావ్యం వ్రాస్తే సోమన “కవి”గానే కావ్యం వ్రాశాడు. ఎర్రన హరివంశ అనుకరణలు ఉత్తర హరివంశంలో కానరావు.

సంస్కృతంలోని పద్దెనిమిది పురాణాల్లో నృసింహపురాణం లేదు. ఎర్రన వ్రాసిన నృసింహపురాణం “పురాణం” కాదని స్పష్టమవుతున్నది. ఎర్రన తాత ఎఱపోతసూరి శ్రీమహోబలీశ నరసింహుని భక్తుడు. తన దైవంపై తీర్ధ మహాత్మ్యాన్ని అవతార వైశిష్ట్యాన్ని వ్రాయమని కోరగా ఎర్రన నృసింహపురాణం వ్రాశాడని యశోదారెడ్డి అభిప్రాయపడింది. కథా ప్రారంభంలో “ఏను విన్నవంబు సేయంగల లక్ష్మీ నరసింహావతారంబను పురాణకథకు బ్రారంభం బెట్టిదనిన” అని పేర్కొన్నాడు. అసలీ గ్రంథం పేరు “లక్ష్మీ నరసింహావతార కథ”. చదలవాడ మల్లన విప్రనారాయణ చరిత్రలో “నారసింహుని పురాణ మొనర్చె హరి మెచ్చి నన్నునెన్నడు చూచినాడు వనగ” అని వ్రాసిన వాక్యాలను బట్టి “నృసింహపురాణం” అనే తెలుస్తున్నది. ఇది అనువాదం కాదు. క్షేత్రమాహాత్మ్యం గురించి చెప్పబడిన స్వతంత్ర కావ్యం. పురాణానికి ఉండవలసిన సర్గ ప్రతి సర్గాది పంచలక్షణాలు ఇందులో లేవు. కొంతవరకు బ్రహ్మాండ పురాణంతో సంబంధం ఉన్నది. విష్ణుపురాణంలో కనిపించే కథాసరళి తనకు అనుగుణంగా మలచుకొని ఉపయోగించుకున్నాడు. భాగవతంలోని నృసింహావతార కథాభాగాన్ని కాక, వామన ప్రాదుర్భావానికి తరువాత చెప్పిన కథా భాగాన్ని స్వీకరించినాడు. నృసింహ పురాణంలో ఎర్రన హిరణ్యకశిపుని దిగ్విజయాన్ని వర్ణించిన విధానం హరివంశంలోని కాలనేమ్యాదుల దిగ్విజయ వర్ణనా విధానాన్ని తలపింపజేస్తున్నదని యశోదారెడ్డి అభిప్రాయపడింది.

ఎర్రన శ్రీమద్భాగవత తృతీయాస్కంధంలోని వైకుంఠపురవర్ణనను నృసింహపురాణంలో అనువదించాడు. “నారాయణుని దివ్య నామ సంకీర్తనంబని శంబు జేయు మహాత్ములకును బద్మాక్షు శ్రీపాద పద్మంబులత్యంత భక్తిమై బూజించు ప్రాజ్ఞులకును” అన్ని రకాల సుఖాలను నారాయణుడు ప్రసాదిస్తాడని వైకుంఠపురవర్దనను జేస్తూ వివరిస్తాడు ఎర్రన. కొన్నిచోట్ల విష్ణుపురాణంలోని హిరణ్యకశిపు ప్రహ్లాదుల సంవాదాన్ని యధాతథంగా వర్ణించాడు.

ఎర్రన రచనలన్నింటిలోను జాతీయాలు, అలంకారాలు సహజ సుందరంగా సందర్భోచితంగా వ్రాశాడు. ఎర్రన నృసింహపురాణంలో భాగవత శ్లోకాలను సంక్షేపించినట్లు, విష్ణుపురాణ శ్లోకాలను యధాతథంగా అనువదించినట్ట్లు, కావ్యకళావైభవాన్ని ప్రదర్శించినాడు. కొన్నిచోట్ల హరివంశ పద్యాలను విపులీకరించాడు. మూలంలోని సూచన ఆధారంగా విస్తృతంగా వ్రాస్తూనే నాచనసోముని అనుకరించినట్లుగా యశోదారెడ్డి అభిప్రాయపడ్డారు. ఎర్రన కాలం నాటికే అనువాదాలు అనేకం వచ్చాయి. కాబట్టి ఎర్రన రెండు భాషల్లోనూ ప్రావీణ్యం పొంది అనువాదం చేయడం సులభమైంది. దానికి తోడు రాజపోషణ వల్ల కూడ తెలుగు భాష స్థిరరూపాన్ని పొందింది. నన్నయ, తిక్కన అనువాదంలో మూలానికి విపులీకరణ, సంక్షేపము, విషయ పరిహరణం, వ్యత్యయం ఈ నాలుగు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎర్రన అనువాదంలో యధామూలకథ ఉన్నాకూడ ఆయా సందర్భాలను బట్టి వివిధ కావ్యాల్లోని సారాంశాలను ఒక సందర్భోచిత కావ్యంగా మలచడం హరివంశ, నృసింహ పురాణంలో కనిపించిందదే. సందర్భోచితంగా కథాపాత్రల పేర్లను కూడ ఎర్రన మార్చినాడు. అనేక సందర్భాల్లో ఇతర గ్రంధాల నుండి సేకరించిన శ్లోకభావాలను తన గ్రంథంలో చేర్చుకోవడమనే విశేష రచనా విధానానికి శ్రీనాథునకు ఎర్రనయే మార్గదర్శకుడై యుండవచ్చని యశోదారెడ్డి అభిప్రాయం.

వ్యక్తి, వస్తు, క్షేత్రాది బాహ్యవర్జనతో తృప్తి పొందక మనోవృత్తులను, భావవైఖరులను విపులీకరించి పాఠకులకు ఆసక్తి కలిగించుటకు మధ్యలో సంభాషణలను పెట్టాడు. భారతారణ్య పర్వశేషంలో అనువాదంలోని “మూలాసరణమును, హరివంశంలో కొంత “స్వేచ్ఛను పాటించి ఇతర గ్రంధాలనుండి ఆయా కథావృత్తాంతాలను తీసుకున్నాడు. నృసింహపురాణంలో కథాక్రమమును పాటించక ఇష్టంవచ్చినట్లు కథాసూత్రంను తనే ఏర్పాటు చేసుకున్నాడు. సోమన రచన స్వతంత్ర రచన. అందుకే సోమన అనువాదం “మూలాతిరిక్తమైన స్వేచ్ఛానువాదమనీ” చెప్పవచ్చని తన పరిశోధన ద్వారా ధృవీకరించింది యశోదారెడ్డి. ఎర్రన అనువాదం అట్లకాదు. మూలాధారం లేక ఏ విషయాన్ని వ్రాయలేదు. “ఒక ఆలంబనమును పురస్కరించుకొని దానిని మెరుగులు దిద్ది తనది కావించుకొనుట ఎర్రన అనువాద విధానం”. ఇతని దృష్టి ఎపుడూ ఒకరిని అనుకరించి, అనుసరించి వాళ్ళను మించి రచన చేయగల దక్షత తనకు కలదని లోకానికి చాటడమే ఎర్రన అనువాద విధానమని యశోదారెడ్డి యొక్క స్థిరమైన అభిప్రాయం. అందుకే ఎర్రన అనువాద పద్ధతి “మూలాతిరిక్తమయ్యు మూలానుసారి” అని చెప్పవచ్చును.

సకల భాషాకవిత్వవేది, బహుపురాణ కథాసకల సంవేదియైన ఇతనిని లోకం కవిత్రయం అన్నందున ఎర్రన అదృష్టవంతుడని అంటుంది యశోదారెడ్డి. రాజపోషణ వల్ల, లిఖిత గ్రంథప్రాచుర్యం వల్ల తెలుగు భాష విస్తరించింది. దానికి ఇంపులు సొంపులు కూర్చినవాడు ఎర్రన. “Personality is what is the Unique in Man” అని పాశ్చాత్య సాహిత్యవేత్తలన్నారు. అదే వ్యక్తిని వ్యక్తి నుండి వేరు చేసి ప్రత్యేకించేది. ఇది ఎర్రనలో సహజ సుందరంగా కనిపించింది.

కథాసంవిధానములో విచిత్ర పద ప్రయోగ వైచిత్య్రములో, శబ్దార్ధాల మేలుకలయికలో నాచనసోమన అనుకరించాడు. నన్నయ, తిక్కన, నాచనసోమనలను ఎర్రన ఆదర్శంగా తీసుకుంటే ఆ తరువాతి శ్రీనాథుని మొదలు కవులంతా ఎర్రననే అనుకరించారు. శ్రీనాథుడు “పరిఢ వింతం బ్రబంధ పరమేశ్వరునిఠేవ సూక్తి వైచిత్రి నొక్కొక్కమాట” అని ఎర్రనను అతిగా సంభావించినాడు. ఎర్రన స్వభావోక్తి అలంకారాన్ని ఎక్కువగా ఉపయోగించాడు. సూక్తి వైచిత్రాన్ని ప్రదర్శించాడు.

ఎర్రన సకలకళారహస్యాలను తెలిసిన కవి మాత్రమే కాదు. సంగీత సాహిత్య పోషకుడైన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండడం వల్ల, ఆయా సందర్భాన్ని బట్టి తాను చూసిన ఆ కళల్లో ప్రత్యేక అభిమానాన్ని పెంచుకున్నాడు. అందుకే ఎర్రన కావ్యాల్లో గానకళా ప్రసంగాలు కన్పిస్తాయి. ఉదాహరణకు నృసింహపురాణంలో అప్సరసల విభ్రమవ్యాపారాలను చెప్పు సందర్భం. హరివంశంలో వాద్యసంగీతము, నాట్యం గురించి చెప్పాడు. ఎర్రన ఎక్కువగా “విజ్ఞానము” అనే శబ్దాన్ని వాడినాడు. విజ్ఞానమంటే పరతత్త్వవిద్య, బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానము. వీటిని ఉపయోగించే కవిత్వం వ్రాశాడు. గోపికల విరహం, పరమ పవిత్రమైన భక్తి పరిణమింపజేసి మధుర భక్తి విధానానికి దారితీసినవాడు ఎర్రనయే అని యశోదారెడ్డి అభిప్రాయపడింది. ఎర్రనకు “యోగం” అంటే అభిమానం ఎక్కువ. శృంగారిని కూడా మహాయోగిగా అభివర్ణించిన యోగి ఎర్రన. నమ్మకములు, ఆచారాలు కూడా ఎర్రన కావ్యాల్లో ఉన్నాయి. శివములు, పూనికలు, ఆనాటి సహజ సాంఘిక పరిస్థితులను తెలుపుచున్నాయి. నేటి Democracy కన్న ఉత్తమలక్షణం నాటి రాజులకుందని, ప్రజారంజనమే ప్రభువు ప్రథమ ధర్మమన్నట్లు నాటి రాజు చూసినారని ఎర్రన కవిత్వంలో రాజనీతికి సంబంధించిన పద్యాలు కూడా ఉన్నాయని యశోదారెడ్డి నిరూపించినారు.

ఎర్రన ఉత్పల, చంపకమాలలే కాక, మత్తకోకిల, క్రౌంచపదము, మందాక్రాంత, మాలిని, స్రగృణి, తోదకము, కంద తదితర వృతాలను ఉపయోగించాడని యశోదారెడ్డి అభిప్రాయం. ల-ళ, శ-స, ద-ధ, ఖండాఖండ బిందు ప్రాసలు ఎక్కువగా వాడినాడు. టకార-డకారల ప్రయోగం, బహువచనంపై బహువచన ప్రయోగాలు, ఇకార సంధులు, ప్రత్యయాలు, సందర్భోచిత పద ప్రయోగాలు, చమత్కారాలు ఎర్రన కవిత్వంలో ఉన్నాయని శబ్ధరత్నాకరములోనూ ఈ పద ప్రయోగాలకు అర్ధాలు లేవని యశోదారెడ్డి పరిశోధనలో తేలింది.

పద్నాలుగవ శతాబ్దంలో ఉన్న కవుల కవిత్వమే ఆ తరువాతి కవుల కవిత్వానికి ఆదర్శప్రాయమైంది. ప్రాచీన సమ్మతమైన వేదవ్యాసముని ప్రతిపాదితమైన, హరిహరభేద తత్వమును తిక్కన, ఎర్రన, నాచనసోమన ప్రభోదించగా, పోతన ప్రధాన తత్త్వంగా స్వీకరించి భాగవతంలో పరిపూర్ణత సాధించాడు.

అనువాద సందర్భాల్లో నన్నయ, తిక్కన, నాచనసోమనాధుల కన్న కొంత భిన్నంగా, విశిష్టమైన ఎర్రన అనువాద విధానంతో ప్రభావితుడైనవాడు శ్రీనాథుడు. ఎర్రన సూక్తివైచిత్రియే శ్రీనాథునికి ప్రశంసలను తెచ్చిపెట్టింది. నన్నయ ధారాశుద్ధి, తిక్కన తెలుగు తీయదనము, తన సహజ పరిశీలనాదృష్టితో మేళవించి ఒక కొత్త వికాసంతో పద్యాలను అల్లినవాడు ఎర్రన అని స్థిరమైన అభిప్రాయాన్ని యశోదారెడ్డి వెలువరించింది.

March 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మనం విస్మరించిన కవి రచయిత – యజ్ఞకృష్ణమదాసు

by Nakka Harikrishna March 11, 2023
written by Nakka Harikrishna

ఈ నేల ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు. సాహిత్య పవనాలు సమృద్ధిగా కలిగిన ప్రాంతమిది. సృజనాత్మకతకు, బహుముఖ ప్రజ్ఞకు చిరునామాగా ఎందరో వైతాళికులు ఇక్కడ నడయాడారు. పోరాట తత్వాన్ని, తత్వ జ్ఞానాన్ని కలిగి శరీరాన్ని కరిగించి లోకహితం కోసం ధారపోశారు. అలాంటి వారు ఎందరో అక్షరమూర్తులు మనకు ప్రాతఃస్మరణీయులుగా ఉన్నారు. వారిలో ఒక మేలిమిరత్నం యజ్ఞ కృష్ణమదాసు,

యజ్ఞకృష్ణదాసు 1899వ సంవత్సరం మెదక్ జిల్లా మారేపల్లిలో, ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు. వారిది పద్మశాలి కుటుంబం. చాలీచాలని వ్యవసాయం ఉన్నప్పటికీ, కొంత నేతపని, కూలి పనులతో రోజులు గడిచేవి. ఆయన బాల్య జీవితం ఎక్కువగా పశువులను కాయటంలోనే గడిచిపోయింది. బడికి పోయి అక్షరాలు దిద్దవలసిన వయసులో ఆయన పశువుల కాపరిగా ఉన్నాడు. అందుకు ప్రభలమైన కారణాలు ఉన్నాయి. ఆ రోజులలో ఉర్దూ ప్రధాన రాజభాషగా కొనసాగింది. ప్రభుత్వ లావాదేవీలన్నీ కార్యాలయ వ్యవహారాలన్నీ ఉర్దూ మాధ్యమంగా జరిగేవి. ఉర్దూ పాఠశాలలు తహతన్య, వస్తిమియా ప్రాథమిక ఉన్నత విద్యగా పిలువబడ్డాయి. అవి ప్రధానమైన తాలూకా కేంద్రాలలో మాత్రమే ఉండేవి. అవికూడా తాలూకా కేంద్రాలకు వెళ్లి చదువుకోవటం గ్రామీణ విద్యార్థులకు ఇబ్బందికరంగా పరిణమించింది. అందువలన గ్రామంలో అక్కడక్కడ నడిచే ఖాళీ పాఠశాలలలో కొంత మటుకు విద్యాభ్యాసం మాతృభాషలో జరిగింది. ఇది కూడా చాలా తక్కువ అని మాత్రమే చెప్పాలి.

విద్యా అవకాశాలు తక్కువగా ఉండటం వలన నిరక్షరాస్యత శాతం అధికంగా ఉండేది. ఆ విధంగా ఎందరో విద్యకు దూరం అవుతున్న సందర్భంలో తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం ప్రారంభమైంది. 1901 లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం స్థాపించబడటం ఎంతో స్ఫూర్తిదాయకమైంది. తెలంగాణ రాష్ట్రంలో గ్రంధాలయాలు స్థాపించబడ్డాయి. గ్రంథాలయ ఉద్యమం జరుగుతున్న దశలోనే అణాగ్రంధమాల ప్రాచుర్యంలోకి రావటం వలన విద్య పట్ల చదవడం పట్ల అభివృద్ధి పెరిగింది. గ్రంథాలయ ఉద్యమం తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఆలంపల్లి వెంకట రామారావు గారు ఆంధ్ర జన సంఘం ఏర్పడటానికి పాదులు వేశారు. ఈ సంఘటన తరువాత మాతృభాష పట్ల ఆలోచనలు పెరిగాయి. ఆ వెంటనే ఆంధ్ర జన సంఘం స్థాపించటం ఆంధ్ర మహాసభలు ఏర్పడటం చైతన్యకారకాలు. ఈ ప్రేరణతో ఈ ప్రాంతపు కవులు రచయితలు నవతరాలను ఏర్పరచగలిగారు.

వడ్డేపల్లి సోదరులుగా పేరుగాంచిన దేశబంధు పత్రిక నిర్వాహకులు బెల్లంకొండ నరసింహచార్యులు, బెల్లంకొండ వెంకటాచార్యులు మెదక్ సుభలో గల జోగిపేట నందు అవధానం చేస్తున్న సందర్భంగా వారికి యజ్ఞకృష్ణను దాసు పరిచయమయ్యాడు.

బెల్లంకొండ సోదరులు యజ్ఞకృష్ణమ దాసులో గల పరణాభిలాషను తెలుసుకొని ఆయనకు తన 15వ ఏట అక్షరాభ్యాసం చేశారు. సంస్కృతం ఉర్దూ భాషలు నేర్పించారు. తెలుగులో చందస్సు అలంకార శాస్త్రం నేర్పించారు. యజ్ఞకృష్ణదాసు అక్కడితో ఆగకుండా దేశబంధు సోదరులతో పాటు పత్రికా సంపాదకుల సమావేశానికి హాజరయి, ఆంధ్ర మహాసభలు, ఆర్యసమాజ కార్యక్రమాలు అణాగ్రంథమాలలో పాలుపంచుకునే స్థితి దాకా ఎదిగాడు. హైదరాబాద్ కోటిలో దేశబంధు సోదరులు ప్రతి నెల నిర్వహించే పత్రిక సంపాదకుల సభా నిర్వహణ చేసే స్థాయి దాకా ఎదిగాడు. అక్కడి నుండి ఆయనలో చెప్పుకోతగినంత సాహిత్య పరిణతి కలిగింది.

యజ్ఞకృష్ణమదాసు కవి, కథకుడు, విమర్శకుడు, యక్షగానాలు రచించాడు, పాండవోద్యోగము, శ్రీకృష్ణ రాయబారం, దక్షయజ్ఞము ఆయన రాసిన యక్షగాన రచనలు. వీటితోపాటు జ్యోతిష శాస్త్రాన్ని రచించాడు. ఆయన విస్మృతికి గురైన కవి రచయిత. ఆనాటి పరిస్థితులలో కార్యకర్త. ఆయన కృషిని డా. బెల్లంకొండ సంపత్ కుమార్ వెలుగులోకి తెచ్చారు. యజ్ఞకృష్ణమదాసు కథలను సేకరించి “మెతుకు కతలు”లో ప్రచురించాడు. మలిదశ తెలంగాణ ఉద్యమం అస్తిత్వం ఫలితంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో గల ఎందరో రచయితలు ఈ గ్రంథం ద్వారా పరిచయమయ్యారు. ఈ పుస్తకానికి వేముగంటి మురళీకృష్ణ, డా. బెల్లంకొండ సంపత్ కుమార్ సంపాదకత్వం వహించారు.

వంద సంవత్సరాల కిందట ఆయన రాసిన రచనలు ఇవాళ చాలా అలభ్యంగా ఉన్నాయి. దేశ బంధు పత్రికలలో జీర్ణప్రతులలో కొందరి పరిశోధకుల కృషి వలన ఆయన గురించిన సమాచారం పరిమితంగానే లభ్యమవుతుంది. యజ్ఞకృష్ణమదాసు కృతజ్ఞతా పూర్వకంగా రాసిన పద్యం ఆయన వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది. పశువుల కాపరై పద్మశాలిగపుట్టి

కట్టెలేరుకొనియు గడుపు నన్ను

అవధానములు చేయు నట్టిసభనజూచి

కడుపేద నైనను కరుణజూపి

సంస్కృతముద్దూయు ఛందస్సులను నేర్పి

నట్టిబెల్లంకొండ నాచార్య సోదర

ద్వయముకంజలి తనువు వీడువరకు

యజ్ఞకృష్ణపుదాసు యనెడి నన్ను

తే. దేశ బంధుపత్రికనాకు దిశనుజు

పత్రికసభల అధ్యకునై పాల్గొనుమని

బెల్లంకొండసోదరులైన వారె నిలను

నొందినఘనులనేమని నుడువువాడ

యజ్ఞ కృష్ణ దాసు కథలు:

యజ్ఞకృష్ణమదాసు మరొక గురువు గణపతి శర్మ. తొలి దశలో గణపతి శర్మ వద్ద అక్షరాలు దిద్దుకున్నప్పటికీ కొద్ది కాలానికే విద్యాభ్యాసం ఆగిపోయింది. పశువుల కాపరిగానే వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడటం వలన పరిస్థితులు అనుకూలించక ప్రోత్సాహం లేకపోవటంతో విద్య ఆగిపోయింది.

యాజ్ఞకృష్ణదాసు అర్ధశత కథలు రాసినట్టు బెల్లంకొండ సోదరులు దేశబందులో తెలిపారు. వాటిలో లభ్యమవుతున్నవి నాలుగైదు మాత్రమే. యజ్ఞకృష్ణమదాసు రాసిన కథలలో ఇంద్రమాలిక కథ వైవిద్య భరితమైంది. ఇంద్రమాలిక అనే పేరు కథకు శీర్షిక చేయటం ఎంతో ఔచిత్యవంతంగా ఉన్నది. ఈ కథ ఆనాటి పరిస్థితులను కండ్లకు కడుతుంది.

ఇంద్రమాలిక ప్రజావ్యతిరేక రాచరికన్ని నిలువరించే రచనగా మనకు అర్ధమవుతుంది. కల్పవృక్షం కామధేనువు వలె ఇంద్రమాలిక ఒక విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉన్నది. పూర్వగాధాలహరిలో ఇంద్రమాలిక అనే పదానికి అర్థం ఒక కమలమాలిక అని అది ఎన్నడును వాడిపోనిది అని. దీనిని ఎవరు ధరించినను వారిని ఏ ఆయుధములు కూడా తాకలేవు అని. ఈ మాలికను ఇంద్రుడు ఉపరిచర వసువునకు ఇచ్చెను. అనే వివరం పేర్కొంది.

ఈ కథలో ఆనాటి రాజ్యపాలన ఉన్నది పాలకుల క్రూరత్వం నిరంకుశ విధానాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రజల లోకాల నిరసనలను ఈ కథ తెలియజేస్తుంది.

ఇంద్రమాలిక కథలో మంజీరకా దేశం ప్రస్తావన ఉన్నది. మంజీరకా దేశంలో నారయ్య అనే ఒక గృహస్థుడు ఉన్నాడు. అతడు శ్రీ చూర్ణం తిరుమణి కలిగి ఉండి మతభేదములు లేక విభూతి భస్మం ఒక సందూక పెట్టెను ఉంచుకొని దుఃఖితులైన ప్రజలకు దివ్య ఔషధాలను ఇస్తూ ఉంటాడు. వారు ఎద్దులను అలంకరించేవారు. వ్యవసాయ శ్రమను నమ్ముకొని జీవించేవారు. నారయ్య తాతదండ్రులు ఇంద్రమాలిక విద్యను నేర్చుకున్నారు. గండర కత్తెరలు తలలు తెంపినా అతికించగల నేర్పరులు వారి తాత తండ్రులు ఇంద్రమాలిక అనబడేడు కవచం ఒక విద్యగా రచయిత ఈ కథ ద్వారా తెలిపాడు.

కథలో వర్ణనలు ఉన్నాయి. వర్ణనలు కథా శిల్పంలో అమరినట్టు ఉండటం కథలో ఉన్న కొత్తదనం. “ఒక శ్రావణ పూర్ణిమ దినం నవనాడులు జీరములలో నూక మంజీరకా దేశ స్వరమృత్తికన ఆహ్లాదకర వాయువులు వీచుచుండ ఆ జామున ముసళ్ళు నీటి ఉపరితలము మీన నిద్రించుచుండ పవళిని బీద వదనంబున ప్రకృతి విషాదకాంత వలె శంకువులేరుచు వెన్నెల, మెరుపున ఒలలాడుచున్నది”. పవళిని అనే స్త్రీ పాత్రను కథలో ప్రవేశింప చేయడానికి రచయిత వర్ణనను కథకు తగినట్టుగా అమరిక చేశాడు.

పవళిని రాజ్యపాలకులు వంచించారు. ఆమె కుటుంబం అంతా పాలకుల వలన దెబ్బతిన్నది. పాలకుల క్రూరత్వానికి కుటుంబం బలి అయిపోయింది. ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు కామోన్మాదిరాజు గా రచయిత పేరులోనే ప్రజా వ్యతిరేకతను కనబరిచారు. అతని దుశ్చర్యలకు పవళిని కుటుంబం మాత్రమే కాదు ఎన్నో కుటుంబాలు బలైపోయినాయి.

ఆమె నారయ సహాయం తీసుకోవటం కథకి మలుపు. నారయ్యకు ఇంద్రమాలిక విద్య వచ్చును. ఇంద్రమాలిక నిద్రించువారల మేలుకొలుపునది అని రచయిత కథాంశంలో చెప్తాడు.

ఒకనాటి మాఘస్నాన ప్రారంభంలో రాజు గర్వానికి అడ్డుకట్ట వేసి సందర్భం ఏర్పడుతుంది. రాజు పల్లకి మోయటానికి బోయిలు వస్తారు. వారు నారదాసుని మామిళ్ళ తోట దారిన తీసుకు వెళుతూ ఉన్నప్పుడు నారయ్య రాజు పల్లకిని మోసే బోయిగా ఉంటాడు. ఇక్కడ కథలో ప్రధానమైన మలుపు ఉన్నది. నారయ్య మామిళ్ల తోట వద్ద స్నానం ఆచరించి అలంకారం చేయించుకుంటున్నప్పుడు ఆయన కండ్లకు నారయ ఒక అంజనాన్ని లేపనం చేస్తాడు. అంజనం ప్రభావంగా రాజు అపస్మారక స్థితిలోకి వెళ్తాడు. ఆ రాజును బోయిలు దక్షిణ పర్వతశ్రేణిలోకి తీసుకొని వెళ్తారు. రాజును బంధీగా చేసి కట్టివేస్తారు. తెల్లారి అతనికి మేలుకోవచ్చి చూసుకుని అయిన విషయాన్ని గ్రహిస్తాడు. రాజు ఇంద్రమాలిక విద్య వలన బంధి అయినాడు. ఈ విషయం తెలిసిన ప్రజలు ఆనందంతో పండుగ చేసుకుంటారు. రాజు రాజ్య బ్రష్టుడౌతాడు. ఆ రాజ్యమున ఆకలి అనే మాట లేదు. ఆనాటి నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకమైన ఆలోచనలు ఈ కథలో ఉన్నాయి. ఈ కథ ఆంధ్ర మహాసభల నేపథ్యంలో వచ్చింది.

విమర్శ:

కృష్ణ దాసు “భారతీయ సాహిత్యము” అనే విమర్శనాత్మక వ్యాసాన్ని రాశాడు. ఈ వ్యాసం దేశ బంధు పత్రిక ప్రమోదూత నామ సంవత్సరం పాల్గుణ మాస పత్రికలో ప్రచురించబడింది. పాశ్చాత్యుల సాహిత్య భావనలు భారతీయ సాహిత్య భావనలు వేరుగా ఉన్నాయని రచయిత పరిశీలించాడు. పాశ్చాత్యులు భారతీయ లాక్ష్యానికులు రాసిన గ్రంథాలను అభ్యసనం చేశారని తెలిపారు. సాహిత్యం జీవన పరిధిలోనిది. అందువల్ల పాశ్చాత్య సాహిత్యం భిన్నంగా ఉండటంలో ఆశ్చర్యం లేదని తెలిపాడు. ఈ వ్యాసంలో భారతీయ సాహిత్య వారసత్వం కావ్య స్వరూపంలో ఇహపర లోక

సార్ధకత ఏ విధంగా పరిరవిల్లిందో అదే విధంగా సాహిత్యం మోక్షగామిగా అనుకూలమైన సందర్భాలను రచయిత పరిశీలించాడు. రామాయణ భారత భాగవతాలను రచించిన వారి జన్మ ధన్యంగా ఆధ్యాత్మిక చింతన యొక్క ప్రాధాన్యతను తెలిపాడు. భారతీయ లాక్యనికులు చెప్పిన కవితా పద్ధతులు వాటి ప్రయోజనం గురించి రచయిత వివరించాడు. కేవలం కావ్యాన్ని స్పర్శించినంత మాత్రాన ఎవరు కవులు కాజాలరు అని చెబుతూ కవికి నిత్య సాధన అవసరమని తెలిపాడు. “దర్శనా ద్వ ర్ణనాచ్చాడ రూడాలోకే కవి శ్రుతి. “రామాయణ రచనలలో వాల్మీకి మొదట కరుణరస హృదయుడైనాడు తర్వాత రచనామయుడైనాడు” అని యజ్ఞకృష్ణమదాసు తెలిపాడు.

ఆయన కవితత్వాన్ని పరిశీలిస్తూ వస్తువును అగోచరముగా దర్శించినవాడు ఉత్తమ కవి కాజాలడు అన్నాడు. “కమనీయం కావ్యం” కావలెనని ఆ లక్షణాలు రామాయణ భారత భాగవతాలకు ఉన్నాయని పరిశీలించాడు.

“సశబ్దో నసన్యా యోన సావిద్యా నసా కళా

తే యన్న కావ్యాంగ మతో భారో మహా కమే”

సావిద్య పట్ల అవగాహన కలిగి ప్రతిభా పాటవాలు రచన సామర్థ్యం కలిగి ఉన్నవాడు కవి కావటానికి అర్హుడని యజ్ఞకృష్ణమదాసు చెప్పాడు. ‘సావిద్య’ అంటే చైతన్యం. చైతన్యం అనేది కాల చైతన్యాన్ని తెలుపుతుంది. రచన ఇతివృత్తాల పట్ల సరైన అవగాహన కలిగి ఉండటం, అందుకు ప్రతిభ తోడు కావాలనేది కృష్ణమదాసు భావన. అవి కాకపోయినా పర్వాలేదు కానీ కవిత్వానికి భిన్నంగా అకవిత్వం రాయటం సమంజసం కాదు అని కృష్ణమదాసు ఈ వ్యాసంలో పరిశీలన చేయ తలచాడు. యజ్ఞకృష్ణమదాసు వ్యుత్పత్తి లోపం వలన ప్రతిభ నశించి పోతుందని చెప్పటానికి

” అవ్యుత్పత్తి కృతో దోషః శక్తా సంప్రియతే కవేః

జ స్త్వశక్తి కృతస్థన్య ఝడిత్యేవా వభాసత “

అని తెలిపాడు. ప్రతిభ గుణ సంపదల చేత పరిపూర్ణమవుతుంది. కవి ఈ గుణ విశేషములను పుష్కలంగా కాంచవలెనని యజ్ఞ కృష్ణమదాసు కవితా విమర్శనం చేశాడు.

ఈ విధంగా కృష్ణమదాసు యక్షగాన రచయితగా పద్య రచయితగా, గ్రంథకర్తగా, కథా రచయితగా, విమర్శకుడిగా, పత్రిక రంగంలో వడ్డేపల్లి సోదరుల నిర్వహణలో పత్రికా సంపాదకుల సమావేశానికి అధ్యక్షత వహించి సురవరం ప్రతాపరెడ్డితో మెప్పు పొందిన మేటి రచయితగా బహుముఖంగా దర్శనమిస్తాడు.

యజ్ఞకృష్ణమదాసు కవి రచయిత మాత్రమే కాదు. ఆయన ఆర్య సమాజ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆంధ్ర మహాసభలతో ప్రేరణ పొందాడు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపాడు. నాటి ప్రముఖులతో స్నేహ సంబంధాలు కలిగి ఉన్నాడు. ఆయన 1969వ సంవత్సరం తుదిశ్వాస విడిచే వరకు స్ఫూర్తివంతమైన జీవితం గడిపాడు. యజ్ఞకృష్ణమదాసు వంటివారి సేవ ఎంతటిదైనా అటువంటి వారి కృషి పట్టుదల ఆదర్శనీయత భావితరాలకు మార్గదర్శకమైంది. అట్టి వారి సేవలను విస్మృతికి గురి కాకుండా కాపాడుకోవాల్సిన అవసరము ఉన్నది.

March 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

సవ్యసాచి సబల

by చంద్రకళ దీకొండ March 11, 2023
written by చంద్రకళ దీకొండ

పరాయి చోటయినా
మెట్టినింటిలో పాదుకొంటో!

పెరిగిన చోటేదైనా…
కాలు పెట్టిన ఇంటిని తన ఇంటిగా తీర్చిదిద్దుకొంటూ!

బాధల వేవిళ్ళెన్నో భరించి
మరో జీవికి పునర్జన్మనిస్తూ!

ఉనికిలోనే తెగువ కల మగువలు!

కట్టుబాట్ల సంకెళ్లను తెంచుకున్న మగువలు…
చైతన్యంతో చూపుతున్నారు తెగువ!

గలగలలాడే గాజుల చేతులు…
గగన విహారం చేస్తున్నాయి!

గరిట మాత్రమే పట్టిన చేతులు…
గడగడలాడిస్తూ లాఠీ ఝుళిపిస్తున్నాయి!

జోలలు పుచ్చే కరములు…
జోరుగా నడుపుతున్నాయి కార్లు!

కుసుమ కోమల కరములు…
కంప్యూటర్ కీ బోర్డును టకటకలాడిస్తున్నాయి!

నేలను మాత్రమే చూసే
వారి చూపులు…
తలెత్తి అందరినీ శాసిస్తున్నాయి!

వంటింటి గడప వరకే
పరిమితమైన వారి అడుగులు…
అంతరిక్షానికి సైతం పయనిస్తున్నాయి!

ఇంటి బడ్జెట్ నిర్వహణకు మాత్రమే పరిమితమైన వారి మేధ…
దేశ బడ్జెట్ ను రూపొందిస్తో…
శాస్త్రీయ పరిశోధనలో పాలుపంచుకుంటో…
పదవీ నిర్వహణను సమర్థంగా చేపడుతూ…
సవ్యసాచిలా ఇంటా బయటా…
సంయమనంతో,సహనంతో
సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తోంది!

చెప్పండి అందరూ ఇప్పటికైనా…
ఆడాళ్ళూ-మీకు జోహార్లని!!!

March 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

స్త్రీ సంతకం

by Ramesh March 11, 2023
written by Ramesh

క్షీరసాగర మధనంలో
అందం తాలూకు అమృతబిందువుల్ని
మహిళాలోకం ఒడిసిపట్టుకున్నారా బహుశా
అందం కురిసిన అసలు ఆ రాత్రి
ఆడవాళ్లు మాత్రమే మెల్కొని ఉన్నారేమో తెలివిగా,ఆశగా
పారిజాతంలా ,పున్నాగంలా
నా వాక్యాలకు అందని ఇంకాఏదోఅవ్యక్తసౌందర్యరాశిలా
‘అందం’ వాళ్ల వశమై పరవశమయ్యింది
మగమానవుడు వాళ్లకౌగిట జీవిత ఖైదే ఈనాటికికూడా
సహనంత్యాగం,సాహసం వాళ్ల పుట్టుపూర్వోత్తరాలు
అందం,ఆనందం, సున్నితత్వం వాళ్లతో ముడిపడ్డాయి అనాదిగా
అతివలదే ఘనతంతా
వనితలదే చరితంతాను

బ్రహ్మచారికిమోక్షంగృహస్థాశ్రమంలోఉందంటారుపండితులు
మగువతోడు లేని మగరాయుడిజీవితమంతా సన్యాసం కాదంటే శూన్య విన్యాసమే అంటారు బాధితులు
శిశిర మోడుల మౌనాకాశంలోంచి
శిలలశిధిల పరమ నిశ్శబ్దంలోంచి
ఒక వసంతగాన పులకిత పుడమిలా
మగాడు గాయపడ్డప్పుడు
ఈ బాధామయ,కన్నీటికధల నుంచి
గుండె పగిలే క్షణాల్నుంచి
ఆమె అమలినప్రేమవర్షంతో తడుస్తూ
అనంత ఓదార్పు నదిఒడిలో స్నానిస్తూ
ఆమెఅనంతదయాపారావారం తీరం చేరి
ఉపశమనిస్తున్నాడు,తిరిగి మానవత్వమున్న మనిషౌతున్నాడు పురుషపుంగవుడు
రేయి పగలు యుగయుగాలుగా….
శక్తి,చేతనత్వాలకు పర్యాయపదం కదా మానవి
స్థావర జంగమాత్మక ఈజగత్తు సమస్తం
సమ్మోహనపరాశక్తి స్త్రీ సంతకమే కాబోలు

ఏమని చెప్పనుఇంకా ఎంతని చెప్పగలను
నాతో నడుస్తున్న మా ఆవిడకు
నన్ను నడిపిస్తున్న మా అమ్మకు
అందమైన మనసుగల ఈ ఆడాళ్లకు
ఈ జన్మకు కృతజ్ఞతలు తప్ప.

March 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

అన్వేషణ

by Madhavapeddi Usha March 11, 2023
written by Madhavapeddi Usha

“ఈసారి ఏమని వ్రాసారండి పెళ్లివారు?” జానకమ్మగారి గొంతులో ఆరాటం.

“ఏముందిలే మళ్లి మామూలే! పెద్దమ్మాయి నచ్చలేదట.  చిన్నమ్మాయిని యిస్తే చేసుకుంటామని వ్రాశారు.

చిన్నమ్మాయయితే కట్నం కూడా వద్దట. అందుకే పెళ్లివారికి సునితని చూపించవద్దంటే విన్నావు కాదు. నేను చెప్పేది నువ్వు తలకెక్కించుకోనంత కాలం ఇదిగో ఇలాగే ఏడుస్తాయి వ్యవహారాలు” అనానడు మూర్తి. తనలో కలిగిన నిరాశ, నిస్పృహను భార్యమీద చిరాకు రూపంలో ప్రదర్శిస్తూ.
 “నేనే చేయనండి మధ్యన… అమ్మాయి నా మాట వింటేనా అలా చెల్లిని దాచిపెట్టి చేసే పెళ్ళి నాకొద్దు అని మొండికేస్తేనూ…. పెళ్ళైనాక ఎలాగూ తెలుస్తుంది. అప్పుడు చెల్లెలిని చేసుకుంటే బాగుండేది అని అనుకునేందుకే ఆస్కారం ఇవ్వకూడదని మీ కూతురు పట్టు పట్టిందాయే మరి” అంది జానకమ్మ సంజాయిషీ ధోరణిలో! అప్పుడే పోస్టుమేన్ ఇచ్చి వెళ్లిన ఉత్తరం తాలూకు చర్చ అది.

లోపల గదిలో ఏదో పుస్తకం చదువుతూ ఈ సంభాషణ అంతా వింటున్న సుజాత విసురుగా హాల్లో కూర్చున్న తల్లిదండ్రి దగ్గరకి వచ్చింది. “నాన్న నేనొక మాట చెప్తాను వింటారా?” అంది తీవ్రంగా. “చెప్పమ్మా ఏమిటది? సబబుగానూ, సమంజసంగానూ ఉంటే తప్పక వింటాను” అన్నాడు మూర్తి.  కూతురు చెప్పబోయేదేంటో అంచనా వేయటానికి ప్రయత్నిస్తూ.

“అయితే వినండి. మొదటిది ఈ రోజుతో నాకు పెళ్లి సంబంధాలు చూడటం మానేయండి. రెండు ఈ సంబంధం అన్ని విధాల మంచిది అని తోస్తే చెల్లెలు ఇష్టపడితే దానికి పెళ్ళి చేసేయండి” అంది నిశ్చలంగా.

ఒక్క క్షణం మాటలు రానివారిలా వుండిపోయారా దంపతులు. వెంటనే మూర్తే తేరుకొని “అదెలా కుదురుతుందమ్మా అక్కకు పెళ్లి కాకుండా చెల్లెలికి పెళ్ళ చేయటమనేది మన సంప్రదాయంలో లేదమ్మా! ఒకవేళ చేసినా ఆ తరువాత నీకు పెళ్లి చేయడం చాలా కష్టం అయిపోతుంది. ఏదో లోపం ఉండబట్టే అక్కకు పెళ్లి కాలేదని ఏవో అవాకులు చవాకులు

వాగుతారు.  అసలే లోకులు కాకులు. నీకు పెళ్ళికాకపోవడానికి లక్ష కారణాలు సృష్టిస్తారు.  ఆ తరువాత మనలను తలెత్తుకు తిరగనీయకుండా చేసి ఆనందిస్తుంది సమాజం.”

అదంతా ట్రాష్ నాన్నా! ఈ సమాజానికి భయపడి ఇప్పుడు మన జీవితాలను ఎందుకు నాశనం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అంతెందుకు ఇప్పుడు నువ్వు చెప్పావే చెల్లెలికి ముందు పెళ్లి చేయటం మన సంప్రదాయంలోనే లేదని, మరి ఈ విషయం తెలిసే చిన్నమ్మాయినిస్తే చేసుకుంటామని ఎలా అడుగుతున్నారంటావు? పెద్దమ్మాయిని ఏం చేద్దామని వాళ్ల ఉద్దేశం?  పోనీ పెద్దమ్మాయికి కూడా ఓ పెళ్లి కొడుకును వెతికి పెడతారేమో కనుక్కోండి…. అప్పుడు ఇద్దరి పెళ్ళిళ్లూ ఒక్కసారే చేసేయచ్చు. కానీ అది సాధ్యఁ కాదు. ఎందుకంటావా? వాళ్ళు వెతికి పెట్టబోయే పెళ్ళి కొడుకు మాత్రం అందమైన చెల్లెలిని వొదిలిపెట్టి అక్కని చేసుకోవడానికి ఎందుకు వస్తాడు? మన పిచ్చిగానీ. అందుకే నేను ఇప్పట్లో పెళ్ళి చేసుకోదలచుకోలేదు. బి.ఇడికి అప్లై చేశాను. నా కాళ్ల మీద నేను నిలబడాలి ముందు. ఆ తరువాత నేను నా వ్యక్తిత్వం పూర్తిగా పూర్తిగా నచిచనవాడు తారసపడితే వెళ్ళాడు తాను. లేదా అలాగే ఉండిపోతాను. మీరేమన్నా సరే నా నిర్ణయం మారదు.” ఏమంటారానన్నట్లు తండ్రి వంక చూసింది. తన కళ్లముందే కూతురు ఇంతగా ఎదిగిపోవడం చూసిన ఆ తండ్రి మాత్రం ఏమనగలడు? అందుకే మౌనంగా ఉండిపోయారు. మూర్తిగారు అంగీకారాన్ని సూచిస్తూ.

సునీత, సుధాకర్ పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిపోయింది. పెళ్ళి పనుల్లో ఎంతో సరదాగా ఉత్సాహంగా పాల్గొంది సుజాత. ఆమెను చూసి చుట్టాలు ఆశ్చర్యపోయారు. అదేంటి తనకు పెళ్లవకుండా చెల్లెలికి పెళ్లవుతుంటే ఈ పిల్లకి కొంచెం అయినా బాధగా లేదా? పైగా సంతోషంగా ఉందే అనుకున్నారు. ఈ కామెంట్స్ విన్న సుజాత మనసులోనే నవ్వుకుంది వాళ్ళ అమాయకత్వానికి. మరికొంతమంది అక్కకి పెళ్లి కాకపోవడానికి వేరే ఏదైనా కారణం ఉండి ఉండొచ్చుగా అని లా పాయింట్ తీసి మరీ చెవులు కొరుక్కున్నారు.

తోటి మనిషిలో లేని చెడును ఊహించుకొని ఆనందపడటం మనిషి బలహీనత. అందుకే పెళ్ళిలో చుట్టాల కామెంట్స్ ను అస్సలు పట్టించుకోలేదామె. సునీత భర్తతో అత్తవారింటికి వెళ్ళిపోయింది.

చూస్తూ ఉండగానే ఐదేళ్ళు గిర్రున తిరిగాయి. సునీత బి.ఇడి పూర్తిచేసి స్కూల్ లో టీచర్ గా చేరింది. సునీతకి మూడేళ్ళ బాబు, ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెంటం. ఈసారి పురుడు అక్కడే పోస్తామని వాళ్ల అత్తగారు కబురు పెట్టారు. సునీతకి నెలలు నిండాయి. రేపో మాపో శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు మూర్తి జానకమ్మ. ఇంతలో పిడుగులాంటి వార్త! కాన్పు కష్టం అయి ఆపరేషను చేసి బిడ్డను బయటకు తీశారు. కానీ తల్లిని కాపాడలేకపోయారట డాక్టర్లు. మొదలు నరికిన చెట్టులా కుప్పకూలిపోయారు ఆ తల్లిదండ్రులు. ఈ షాక్ నుంచి సుజాతే ముందు తేరుకొని తల్లిదండ్రిని ఊరడించింది.

అంతా బయలుదేరి సునీత అత్తవారి ఊరు వెళ్ళారు. జరగవలసిన తతంగమంతా అయిపోయినాక బరువెక్కిన హృదయాలతో జీవచ్ఛవాలలా తిరిగి వచ్చారు.రోజులు భారంగా దొర్లస గాయి. పిల్లా పాపలతో కళకళ లాడవలసిన చెట్టంత కూతురి జీవితం అర్థాంతరంగా ముగియడంతో మూర్తిగారు జానకమ్మ పూర్తిగా కృంగిపోయారు.

ఆరునెలలు గడిచాయి ఏ మార్పు లేకుండా.

ఆ రోజు సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన సుజాత తల్లిదండ్రీ చెప్పిన విషయం విని ముందు విస్తుపోయింది. ఆ తరువాత ఛీ… మనుష్యులలో ఇంత స్వార్థం కూడా ఉంటుందా? అని ఏవగించుకొని తన చెల్లెలి మామగారు వ్రాసిన ఉత్తరం చదివింది.

 వెంటనే బట్టలైనా మార్చుకోకుండా తన గదిలోకి వెళ్లి ప్రక్కమీద వాలిపోయింది. ఆలోచనలు మెదడును తొలిచేస్తున్నాయి. ఇప్పుడేం చేయటం… భగవంతుడు తన కిటువంటి విషమ పరీక్ష పెడతాడని తనెన్నడూ ఊహించలేదు. చీకూ చింతాలేని జీవితం గడపాల్సిన లేత వయస్సులోనే అతి విలువైన తల్లి ప్రేమకు దూరం అయిన ఆ పసివాళ్ల మీద జాలి చూపేదా, లేక ఒక్కప్పుడు తనను నిరాకరిఁచిన సుధాకర్ ని తృణీకరిఁచి తన కక్ష తీర్చుకొనాలా? ఏమిటిప్పుడు తన కర్తవ్యం? ఎటూ తేల్చుకోలేకపోతున్నదామె మనస్సు.

సరిగ్గా ఆమె ఆలోచనలు ఒక నిర్ణయంగా రూపుదిద్దుకుంటున్న సమయంలోనే మూర్తి ఆమె గదిలోకి వచ్చి ఆమె దగ్గరగా కూర్చొని, చేత్తో తలని నిమురుతూ అడిగారు వాత్సల్యం తొణికిసలాడే స్వరంతో “ఏమ్మా ఏమాలోచించావు సుధాకరం విషయం?”

“ఆత్మాభిమానం కల ఏ ఆడపిల్లయినా ఇందుకు ఒప్పుకుంటుందనే అనుకుంటున్నావా?” ఆమె గొంతులో నిష్ఠూరం.

“అది కాదమ్మా. ఈ పంతాలు పట్టింపులూ మీ వయస్సులో సహజమే. కానీ ఈ వయస్సు కాస్తా దాటిపోయిన తరువాత నీ నిర్ణయం నీకే తప్పుగా అనిపించవచ్చు. ఎన్నాళ్ళని ఒంటరిగా వుంటావు.

ఒంటరితనాన్ని మించిన శత్రువు మరొకటి లేదని అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది. తీరా తెలుసుకున్నాక సమయం మించిపోవచ్చు. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం?

అదేకాదు సుధాకర్ని పెళ్ళి చేసుకుంటే ఆ పసివాళ్ళకు తల్లిలేని లోటు తీర్చిన దానివవుతావు. జీవితంలో ఇంతకన్నా ఏం పరమార్థం సాధించదలచుకున్నావమ్మా!”

“నేను బాగా ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చాను నాన్నా! ఆ పసివాళ్ళను తలచుకుంటే నాకు జూలిగానే ఉంది. కానీ ఈ పెళ్లితో నేను  పిల్లలకి తల్లి కాగలనేమోగాని అతనికి భార్యను మాత్రం కాలేను.  ఆ పిల్లలకు నా అవసరం కొన్నాళ్ళే. ఆ తరువాత వాళ్ళు రెక్కలు వచ్చి ఎగిరిపోతారు. అప్పుడు నాకు మిగిలేది ఒంటరితనం కాక మరేమిటి నాన్నా?”

కూతురి మొహంలోని గాంభీర్యతని చూశాక ఆమె నిర్ణయం మారదని అర్థం చేసుకున్న మూర్తి ఒక నిట్టూర్పు విడిచారు.

వారం రోజుల అనంతరం సునీత భర్త సుధాకర్ ఓ లేఖ అందుకున్నాడు. ఫ్రం అడ్రస్ సుజాత అని ఉంది. ఆత్రంగా విప్పి చదివాడు. “సుధాకర్ గారికి”, మీ ఉద్దేశం తెలుసుకున్నాను. కానీ ఈ ప్రపోజల్ తేవడానికి మీకు మనస్సెలా ఒప్పుకుందో నాకు అర్థం కావటం లేదు.  ఒక్కప్పుడు నేను మీ భార్య కావటానికి అనర్హురాలినని నిర్ణయించింది మీరే! కాని ఇప్పుడు పిల్లల కోసం నన్ను పెళ్ళాడతానంటున్నారు. అంటే మీ అవసరాలనుబట్టి మీ యిష్టాయిష్టాలు కూడా మారిపోతుంటాయన్న మాట. ఆ ఎదుటి అమ్మయి ఏం కోరుకుంటుందో మీకు అవసరం అని స్పష్టంగా తెలుస్తున్నది. ఇది ఈనాడు కొత్తగా వచ్చిన విషయమేమి కాదు. అనాదిగా వస్తున్న పురుషాధిక్యతే. అందులో ఏమీ మార్పురాలేదు. కానీ ఈనాటి ఆడపిల్లల దృక్పథంలోనే మీరూహించని మార్పు వచ్చేసిందని మీరు తెలుసుకుంటే మంచిది.

పైగా పిల్లల కోసం అంటూ, ఆడదానిలోని సహజ మాతృత్వాన్ని ఎక్ల్సాయిట్ చేయటం మానలేదు మీ మగవారు. అప్పుడూ ఇప్పుడూ కూడా!! చెల్లెలి పిల్లల మీద నేను జాలిపడాలని మీరాశించే బదులు, మీ కన్న పిల్లల మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే మీరసలు పెళ్ళే చేసుకోరు.

ఇకపోతే మీరు పెళ్ళి చేసుకొంటననగానే ఎగరి గంతేసి ఒప్పుకుంటాననుకొని ఉంటారు. స్త్రీకీ పెళ్ళే పరమావధి కాదు. నా దృష్టిలో వివాహం జీవితానికొక కొత్తమలుపు మాత్రమే. అదే గమ్యం కాదు. కాకూడదనేది నా దృఢాభిప్రాయం. ఈ ప్రపంచం సువిశాలం. అందులో నా వ్యక్తిత్వానికి విలువనిచ్చి, నన్ను నన్నుగా స్వీకరించి, నా హృదయసౌందర్యాన్ని చూడగలిగిన ఒకే ఒక వ్యక్తి తప్పక లభిస్తారనే నమ్మకం, ఆత్మవిశ్వాసం నాకున్నాయి. అటువంటి వ్యక్తి తారసపడేవరకు నా ఈ అన్వేషణ ఇలా కొనసాగిస్తూనే ఉంటాను.

కానీ మీ హృదయంలో స్థానం లభించకుండా మీ జీవిత భాగస్వామిని మాత్రం కాలేను.  చెల్లెలి పిల్లలమీద నాకెప్పుడూ ప్రేమ ఉంటుంది. కానీ వాళ్ళ కోసం నా జీవితాన్నే త్యాగం చేసేంతటి స్థాయికి ఎదగమంటే మారతం… నో థాంక్స్. అంతటి విశాల హృదయం నాకు లేదు… సారి ఉంటాను

                                                                              – సుజాత

March 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us