మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

“సమాయత్తం కావలసినవేళ..!!”

by Kala Gopal September 28, 2022
written by Kala Gopal

కాదనగలవా? ..వాతంకమ్మి నబాలింత లాంటి పుడమి తల్లిని ప్రకృతి వైపరీత్యాలేవో/

 నిత్యమూపొడుచుకుతింటుంటే..నెపమేదో ../వంచనఎరుగనిపంచభూతాలపైతోసేసి../

రాసుకున్నఒప్పందాలూ..ఒడంబడికలూనేడువధ్యశిలపైవేలాడుతుంటే../

క్షిపణులువాలుతున్ననేలపైఇప్పుడిక ../

నీకంటూమిగిలేదినిశ్చలశ్మశానవేదికనేనని..!/

కాదనగలవా?..శివారుప్రాంతాలమురికిబూడిదకుప్పల్లో ../

చెదలుపట్టినఅంకురమేదోలోనికి..లోలోనికికుంగిపోతుంటే../

పొగగొట్టాలవిసర్జకాలవిసురుకు../

 సిమెంటువృక్షాలకతీతంగావిస్తరించినహరితశ్వాసకోశాలు../

కరకుగొడ్డళ్ళధాటికివంటచెరకుగా..

 ముక్కలుచెక్కలైఆక్రందనలతోనేలకొరుగుతుంటే../

నీఖననానికైనాఒకకట్టెకూడాదొరకనిశూన్యశవపేటికలో..నీవిప్పుడునిర్జీవదేహానివని..!/

కాదనగలవా?..ఒకచెట్టునుహత్యచేయడమంటే.. 

వేలమనుషులనుఖననంచేసినట్టేననీ../

కాదనగలవా?..తగులబడ్డఅమెజాన్అడవులపొత్తికడుపుకార్చిచ్చులోమాడిపోయిన../

లక్షలపక్షులవిశ్వదుఃఖపుఅశ్రుసమీక్షణననువేటాడినశిఖండుడిగా../

కృత్రిమమేధస్సుతోజినోమ్..క్లోనింగ్ ల నీడన/ జబ్బలుచరుస్తూవిర్రవీగేనీబోన్సాయ్బతుకుకిక../

శాశ్వతచిరునామానిర్జనఎడారిలోనిర్వాసితమేనని..!/

ఒప్పుకుంటావా?..చనిపోయినప్రతిచెట్టూ..కొన్నివేలపిట్టలమృత్యుగీతాల్నిఆలాపిస్తుందని..!/

ఇప్పుడిక ఏ మలయమారుతమూసోకనినీరాతిదేహాన్నిమోసుకుంటూ/ ప్రాణవాయువులింకినసిమెంటురాస్తాలలో ../అలసటతో ఏ చెట్టునీడనకూలబడతావు??/

స్వర్గారోహణంమొదటిమెట్టులోనేఒరిగిపోయిన/ సహదేవుడిలా ..సాకునేదోనలగ్గొట్టకముందే../

సమ్మతిస్తావా?..మూలమిదేనంటున్న..మట్టిలావిస్తరించిరాబోయేతరాలకికనైనానాలుగుపచ్చనిచెట్లనురాసివ్వాలని../

ఒప్పుకుంటావా?..ప్రతిరోజూకూలుతున్నప్రతిచెట్టూ..తగ్గుతున్ననీఆయుఃప్రామాణికసూచికిసంకేతంలా../

నేటిపరాన్నజీవులసమతౌల్యతాచక్రంలో..నేలకొరుగుతున్నప్రతిచెట్టుసాక్షిగా../

ఇకనైనాసమ్మతిస్తావా?..

అగ్గిపెట్టెల్లాంటిఆకాశహర్మ్యాల్లో ..

ప్లాస్టిక్మొక్కలతోఅందాన్నినింపుకునేబోన్సాయ్బతుకులకేంతెల్సు..?/

ఒకపచ్చనిచెట్టువిలువయని.!/

ఋతువుమారినప్పుడల్లా..నవనవలాడేతనపత్రహరితంతో..

అదిపంచేమాతృసదృశచల్లనిస్పర్శ..!/

దిక్కులేనిసముద్రంలోఒంటరికొయ్యపడవపైని..

 చివరిపక్షొకటితప్పెవరిదంటూ ..??

తనరెక్కలతెరచాపనెత్తకమునుపే../

సమ్మతిస్తావా?..నదిలాబాహువులుచాచిపచ్చనిపొదుగులా../

మనఆకుపచ్చనిస్వప్నాల్నితలాదోసెడుకన్నీళ్ళుపోసైనాసరేపండించుకోవాలని../

పరాజితఆక్రందనలాప్రతిధ్వనించే “ఆ ఒక్కఆకూరాలకమునుపే..!”/

సమ్మతిస్తావా?..లక్షలఉల్కాపాతాల్నిమోస్తున్న../ ఆకాశంలోనిగుడ్డిసూర్యునిలామిగిలిపోక../

“సమాయత్తంకావలసినవేళగా..!!”

తరుణమిదేనంటూ..

కోట్లప్రాణాలచక్రభ్రమణంలో../

 కొన్నివేలసార్లుమరణించైనాసరే..ప్రకృతిప్రసాదించినవరంగా../

“వృక్షాందేహీ..!” అంటున్నజీవనోత్సవపుమురిపాలపచ్చనికలనొకటిని../ విప్పార్చుకొనేందుకుఇంకొక్కసారైనాపునర్జన్మించాలని…!!!!

September 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మూగబోయిన వసంతం

by Kiran Vibhavari September 28, 2022
written by Kiran Vibhavari

ఆమె ..

పాతబడినటూరిస్ట్బస్సు

ఎక్కేవారూదిగేవారేకానీ

అక్కునచేర్చుకునేవారులేక

తుప్పుపట్టిచూస్తోంది!!

ఆమె…

పీలికలైనమసిగుడ్డ

అతడికల్మషకామాన్ని 

శుభ్రంచేసిచేసి

రోగాలతోచెత్తకుప్పల్లోపడిఉంది!! 

ఆమెకొకప్పుడుకండోమ్స్నిత్యావసరం

పట్టెడన్నంమెతుకులిప్పుడుఅత్యవసరం

ఆమనివేళల్లో,

మధుకలశాలతోసీతాకోకలాఎగిరినామే

ఆకాశంకోల్పోయికూలబడింది

ఆమె

ఓ మూగబోయినవసంతం

శిథిలశిశిరానికిఉపమేయం

ఆకలిశాపానికిచేసినపాపానికి

అప్పటికీఇప్పటికీఎప్పటికీఆమెనేరస్తురాలు

తప్పుచేసేదిఇద్దరైనాశిక్షమాత్రంఆమెకే

ఈ చట్టాన్నిచేసేచేతులకీనిలువెత్తుపక్షపాతమే

ఇదొకఅనామకవలయం.. 

ఆడదైతేచాలు

పసికందులుసైతంనలిగిపోయేవెగటుజీవనవృత్తాంతం

ఆమెబిడ్డలకుబడులుండవుషోకులుమాత్రమే

ఆటలుండవుకానీఆటవస్తువులవుతారు

నియాన్లైట్లవెలుతురులోకామక్రీడలు

ఒళ్లంతాకుప్పగారోగాలతోరాజులకైఎదురుచూపులు 

అంటించిపోయేవారుఅంటించుకుపోయేవారేవారంతా

చీకట్లలోఆమెనగరంమేల్కొంటుంది.. 

ఆమెజీవితంమాత్రంఎన్నటికీవెలగనంటోంది

ఆమె..

రాతిహృదయాలమధ్యయవ్వనమంతాధారపోసినా

ఏ రాతిబండమీదాఆమెపేరుండదు

ఆమె..

నిగ్రహంలేనికామికులకల్పవృక్షమేఅయినా

విగ్రహంకాదుకదాస్వగృహంకూడాలేదామెకు

ఎయిడ్స్తోఎయిడ్కోసంఎదురుచూస్తుంటే

చీదరించయినాక్షుదతీర్చేవారేలేరామెకు!!

శిధిలావస్థకుచేరినశిలకుకూడాఆకలుంటుందని

తెలియనిజనాలేలోకమంతా!! 

ఎన్నిఫలలిచ్చినా 

చెదలుపట్టినచెట్టునుకొట్టేస్తారనీ , 

అక్కరకువచ్చినంతవరకేలెక్కల్లోఉంచుతారనీ

త్రుణింపబడ్డపువ్వుపూజకుపనికిరాదనితెలియదామెకు!!

ఒళ్లంతాపంటిగాట్లేపచ్చబొట్లు..

సిగరెట్వాతలేదిష్టిచుక్కలు..

ప్రాణమున్నబొమ్మవాడివికృతిచేష్టలకుఆనవాళ్లు

రంభాఊర్వశులేఆమెకులదైవాలు..

ఆమె

శరీరంఒకప్పుడుకాముకులకోప్రయోగశాల..

ఆమె

నిర్జీవదేహమిప్పుడుక్రిములకుఆకలితీర్చేపాకశాల!

ఆమె 

గుమ్మానికిగబ్బిలాల్లా  తోరణాలై 

ఎదురుచూసేపులిరాజాలఆకలితీర్చేఆకుచిలకఒకప్పుడు,

కానీ, ఆమె

మున్సిపాలిటీవానులోఒకశవమిప్పుడు!!

ఆమె..

మరుజన్మలోమడిషిగాపుట్టకూడదని 

కోరుకుంటున్నట్టేఉంది

జంతువుల్లోకూడావేశ్యలుంటాయా!?

ఆమె.. 

ప్రశ్నిస్తున్నట్టేపడుకుంది!! 

అయోనిగాపుట్టినాబాగుండు

ఆమెవేడుకొంటోంది!! 

అంపశయ్యపైఅనాధశవం

ఊరంతటికిచుట్టమే

శవయాత్రకేఎవరూలేరు!

September 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆమె లేకుంటే  

by Varnasi Nagalakshmi September 28, 2022
written by Varnasi Nagalakshmi

మబ్బుల్లోంచి నేలకు రాలితే వాననుకున్నా

కొండల్లోంచి చెంగున దూకితే జలపాతమనుకున్నా

గులకరాళ్లపై గుసగుసలాడితే వాగనీ  

కొండరాళ్లపై పరవళ్ళు తొక్కితే సెలయేరనీ

పేర్లేవేవో పెట్టుకున్నా

సైకత సీమల్ని సవరిస్తూ

పచ్చికబయళ్లని పలకరిస్తూ పరుగులెత్తి

చెలికత్తెల్ని దరికి చేర్చుకుంటూ పొంగులెత్తి

నిండుగర్భిణిలా నెమ్మదించి

తరళ గంభీర ప్రవాహమైనపుడు 

‘అది నది కదా’ అనుకున్నా

అంబరాన్నంటాలని ఎగసెగసి పడితే

ఆ సంబరాన్ని చూసీ … 

బడబాగ్ని కీలల్ని గర్భంలో దాచి కల్లోలపడితే 

ఆ సంక్షోభాన్ని గమనించీ …

ఆ అనంత చైతన్యాన్నే సాగరమంటారని తెలుసుకున్నా 

చలికి హిమమై కురిస్తే నీహారమనుకున్నా 

వేడికి వ్యాకోచించి నింగికెగస్తే బాష్పమనుకున్నా 

భిన్నరూపాల్లో కనిపిస్తూ కరుణ కురిపించే

ఆ జీవన దాతని-

ఒకే అణువెత్తిన అనేక అవతారాలుగా

అర్ధం చేసుకోలేకపోయా

తిరస్కరించినా వెంటపడుతూ

తృణీకరించినా తీర్ధమందిస్తూ,

యుగయుగాలుగా నిర్లక్ష్యం చేసినా

ఆదరించి దాహార్తిని తీరుస్తూ 

నా చుట్టూ తిరుగుతుంటే….

అమ్మని కసురుకునే ఆకతాయి బిడ్డనై  అలక్ష్యం చేశా

సీతమ్మలా భూమి లోలోపలకీ,

యోగమాయలా ఆకాశంలో పైపైకీ

అందకుండా వెళ్లిపోతుంటే

ఇపుడు తెలుస్తోంది…. 

ఆమె లేకుంటే నాకు మనుగడే లేదని!

September 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మగ హత్య

by Amulya Chandu kappagantula September 28, 2022
written by Amulya Chandu kappagantula

తినడానికి తిండి లేని
ఈ దేశంలో…
గుప్పెడు నేల
కూడా విషమైపోయిన
ఈ రాజ్యంలో…

కాళ్లు చాపుకోడానికి
కనీస స్థలం లేని
ఈ కర్మభూమిలో..
రోడ్డు మీదకు వెళితే
సౌచాలయాలు కోసం
వెతుక్కునే ఆడాళ్లున్న
ఈ దేశంలో…

కనీసాదాయం లేక
ఉరికొయ్యలకు వేళ్లాడుతూ
చావునే ఉద్యమంగా
మార్చుకుంటున్న
ఈ చీకటి చెరసాలలో..

నెలసరొచ్చినా
శానిటరీ పాడ్స్ దొరకని
ఈ స్వచ్ఛభారతంలో…

నల్లధనాన్ని తెల్లగా
తెల్లధనాన్ని నల్లగా మార్చే
అబ్రకదబ్రక బాబాలున్న
ఈ పుణ్యభూమిలో…

బేటీ బచావో నినాదం
నీలగిరి కొండ మీంచి దూకి
ఆత్మహత్య చేసుకున్న
ఈ దేశంలో…

అన్ని రంగాల్ని
అగ్నిప్రవేశం చేయించి …
ఆకలి కేకల పందిళ్ల మీద
ఎండిన డొక్కల
శాలువాల సాక్షిగా…
నా మనసులో మాట.
చెప్తున్నా
ఏదో ఒక రోజు
మహిళా దినోత్సవం సాక్షిగా
నన్నూ అమ్మేసి బ్రోతల్ అని పేరు
పెట్టి నా శవం మీద
మీసం మెలేస్తాడేమో…

September 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మృత్యు వాంగ్మూలం..!

by ManapuramRaja Chandrashekar September 28, 2022
written by ManapuramRaja Chandrashekar

మానాపురపు చంద్రశేఖర్

యుద్ధంఎప్పుడూఒకరాక్షసక్రీడే!

సరిహద్దుల్లోమోహరించినమృత్యుకెరటాలన్నీ

రణశకటాలుగాఎగిసిపడుతుంటే,

గగనతలంలోంచిఇలాతలంలోకి

విపత్తుసమయాల్లోజారవిడిచిన 

ఆహారపొట్లాల్లాయుద్ధక్షిపణులు

మానవబతుకుల్నిఛిద్రంచేస్తూ

వర్తమానవిధ్వంసాన్నిసృష్టిస్తున్నాయి!

మస్తిస్కానికీమేధోమథనానికి 

అంతరంపెరుగుతున్నవేళ

ఆహంకారంఅధికారమదంగారూపాంతరంచెందితే

శృతిమించినరాజ్యకాంక్షపాశవికంగామారితే

ఈ నేలపైరాల్చడానికి

ఒకకన్నీటిబొట్టూమిగలదు

సర్వంబూడిదమయమే..!

బాగస్వామ్యదేశాలపై 

అధిపత్యపట్టుకోసం

ఉక్రెయిన్ ‘నాటో’ కూటమిలోచేరికపై 

గుర్రెత్తినరష్యాబలగాలు!

సమస్యఒకప్రాంతానిదికాదు

మానవత్వంకరడుకట్టినచూపులతో

దేశంమొత్తంశవాలగుట్టలతోవల్లకాడైపోతోంది! 

శిథిలమైనభవనాలు..కుప్పలుతెప్పలుగాపడినశవాలు

మిన్నంటినబాధితులరోదనలు

జననంఖననంకోసమేఅన్నట్లుగా

అగ్రబలగాలసామూహికముట్టడితోముప్పేటదాడి

ఇదిమూడుదశాబ్దాల 

వివాదవైరిఫలితంమాత్రమేకాదు

యుద్ధశరణార్థుల 

ఆంతరంగికమౌనవేదనలప్రతిధ్వనికూడా!

ఈ నేలపైఆధిపత్యపోరుకోసం

బలిపశువులఆర్తనాదాలరణన్నినాదాలమృత్యుఘోష!

కార్చిచ్చురగిల్చడంతేలికే! 

బూడిదలోశూన్యమైనకలలకట్టడాల్ని

పనర్నిర్మించడమే ఒక ప్రశ్నార్థకం?!

ఎన్నిదౌత్యపైత్యాల్నిసంధిప్రయత్నాలుగానెరిపినా

శాంతిమంత్రాలన్నీఅపశ్రుతులుగానేరాలిపోతున్నాయి

చరిత్రఒకరణస్థలనితెలిసినా

ఈ బహిరంతరయుద్ధకాంక్ష

జీవనమానవవ్యామోహంగానేమిగిలిపోయిందిప్పుడు!

September 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

కంచికి చేరని కథ

by Sudharshan Chintapatla August 22, 2022
written by Sudharshan Chintapatla

బెంచీల మీదనుంచి లేచి వెళ్ళిపోయిన జంటల వెచ్చదనం ఇంకా అలాగే ఉంది. పొదలు తమ పక్కనే కూచుని మాట్లాడుకున్న ప్రేమికుల గుసగుసలు మననం చేసుకుంటున్నవి. పచ్చిక తన మీద నడచిన సున్నితమైన పాదాల స్పర్శను ఇంకా అనుభవిస్తూనే ఉంది.

చిల్లు బడ్డ డబ్బాలోంచి కారుతున్న తారులా చీకటి క్రమక్రమంగా వ్యాపిస్తున్నది. మసక వెలుతురులో బూరు మిఠాయి చుట్టిన కర్రల్లా కనిపించసాగాయి చెట్లు.

‘ఇంక వెళ్దామా?’ అన్నాడు ఐదడుగుల పది అంగుళాల పొడవైన బలమైన శరీరమూ, రింగుల జుట్టూ సన్నటి మీసం, వెడల్పాటి నుదురు ఓనర్.

‘అప్పుడేనా?’ అన్నది అతని కంటే నాలుగు ఇంచీలు పొడవు తక్కువ సున్నితమైన బంగారు రంగు దేహమూ, సన్నటి ముక్కు, అక్వేరియంలో కదిలే చేపల్లాంటి కళ్లు ధనుస్సులా తీర్చి దిద్దినట్టున్న పెదాల స్వంతదారు.

పోలీసు వ్యాన్ సైరన్ శబ్దానికి పారిపోయిన దొంగల్లా మాయమై పోయేయి నక్షత్రాలు. ఉన్నట్టుండి ఆకాశంలోకి తొండాలు ఎత్తి పట్టుకున్న ఏనుగుల గుంపు ఒకటి వచ్చి చేరింది.

‘లే…. లే… పార్కు మొత్తం ఖాళీ అయింది మనమే ఉన్నట్టున్నాం’ అన్నాడతను తన చేయి ఆమెకు అందిస్తూ.

అతని చేయి అందుకుని  పైకి లేచింది ఆమె. ఇద్దరూ పార్కు గేటు దాటారు. వీళ్ళు పార్కుకు రావడం మొదలు పెట్టి రెండేళ్ళాయింది అనుకుంది. గేటు పక్కన ఉన్నా బోగన్ విల్లా కాసిని ఎర్రపూలు ఆమె తలమీద రాలుస్తూ.

పార్క్ చేసిన బైక్ దగ్గరికి నడిచాడతను. ఆమె పరుగెత్తింది. ఇద్దరూ ఎక్కాక బైక్ చక్రాలు పరుగెత్తేయి.

*   *   *

గోడమీద గడియారంలో జంట ముళ్ళు తిరుగుతున్నాయి. దానికింద జంటగా ఓ టేబిలూ కుర్చీ ఉన్నాయి. కుర్చీలో ఎందరినో జంటలుగా కలిపిన సుదీర్ఘమైన అనుభవం వల్ల ఒక్క వెంట్రుకా మిగలక మైదానంగా మారిన బట్ట తల మోస్తున్న రిజిస్ట్రార్ ఉన్నాడు.

ఆయనకు ఎదురుగా కొత్త జంటలో ఒకడవ బోతున్న శంకర్ ఉన్నాడు. అతనికి ఎదురుగా పంచదార బొమ్మలాంటి రమ్య ఉంది. శంకర్ రమ్యల రిజిస్ట్రేషన్ పెళ్ళికి పదిమంది మిత్రులొచ్చారు. వాళ్ళల్లో ముగ్గురు అమ్మాయిలూ ఉన్నారు. జెయింట్ సైజు బౌండు రిజిష్టర్లో తెర్చుకున్న పేజీ వుంది. ఆ పేజీలో శంకర్ సంతకం చేశాడు. రమ్య సంతకం చేసింది. సాక్షులు సంతకం చేశారు. రెండు జతల సంతకాలతో ఒక జత జత అయింది. ఇద్దరూ మార్చుకున్న దండల్లో చిక్కుకున్న పూలు పరిమళాలు వెదజల్తాయి. స్నేహితులు అభినందించారు.

*   *   *

పార్కులో కల్సుకునే శంకర్ రమ్యలు అద్దె యింట్లో అడుగుపెట్టారు. కుడికాలు ముందు పెట్టి లోపలికి రామ్మా అనే వారు లేకపోయేరు. రెండు కుడి కాళ్ళు ముందుపెట్టి ఇద్దరూ అద్దె స్వర్గసీమలో అడుగుపెట్టారు. హాల్లో వెలిగిన ట్యూబ్ లైట్ వాళ్ళకు స్వాగతం పలికింది. వాళ్లు కన్న కలల్ని నిజం చెయ్యడానికి జీరోబల్బు వెలిగింది.

*   *   *

ప్రభాకరరావు ఒక బిజినెస్ మాగ్నెట్. ఆస్తీ అంతస్తూ డబ్బూ అన్నీ ఎక్కువే కనుక ఆయనకు మమకారం కన్నా అహంకారం ఎక్కవ. ఈ అహానికి అతని గొప్ప కులం కూడా ఓ కారణమే. ప్రభాకరరావుకి ఇద్దరు కూతుర్లు ఓ కొడుకు. కూతుర్లలో ఒకరి పేరు రమ్య.

రమ్య తక్కువ కులంవాడిని ఇష్టపడ్డం రహస్యంగా పెళ్ళాడ్డం తన దారి తను చూసుకోవడంతో ప్రభాకరరావు పరువు ప్రతిష్ట ప్రమాదంలో పడ్డవి. ఆస్తీ అంతస్తూ అడ్రసూ లేనివాడు అల్లుడవడం భరించలేకపోయేడు.  చీలిన పాము నాలుకల్లా ఎగసి పడుతున్న ఆగ్రహజ్వాలలు తనని దహిస్తుంటే ప్రతీకారం కోసం నిరీక్షణలో ఉన్నాడు. ఇంట్లోనే పట్టు చీరల షోరూము, జూయల్రీ షాపు ఉన్న తల్లి తల ఎక్కడ పెట్టుకోవాలా, నలుగురికీ మేం సమాధానం చెప్పుకోవాలా అని నిత్యం విచారించసాగింది.

*   *   *

శంకర్ తప్ప తనకు లోకంలో ఇంకెవ్వరూ లేరు అనుకుంది రమ్య. మొట్టమొదటిసారి శంకర్ ను చూసినప్పుడు ఆమె గుండ యిదివరకటి లయను వదిలేసి కొత్త రిథమ్ ను అందుకుంది. అది శంకర్ నే కోరుకుంది. ఆమెకు అతని మాట తీరు నచ్చింది. అభిప్రాయాలూ ఆలోచన్లూ బాగున్నాయనుకుంది. అతని సెన్నాఫ్ హ్యూమర్ కు ఫిదా అయింది.  అతనిలోని ప్రేమికుడు అయస్కాంతంలా ఆమెను తన దగ్గరికి లాక్కున్నాడు. అప్పుడామెకు ఆస్తీ అంతస్తూ కులమూ ఏవీ గుర్తుకు రాలేదు. పరువు కోసమే బ్రతికే తండ్రి మాటే మర్చిపోయింది. తను తన ఇంట్లో అనుభవించిన సుఖాల్ని, రిచ్ లైఫ్ ని ఆమె ప్రేమ కోసం త్యాగం చెయ్యవచ్చు ననుకుంది.

ఇప్పుడు రమ్యకు జీవితం అంటే యిదే అనిపిస్తున్నది.  ఒకటీ ఒకటీ కలిస్తే రెండు కాదు ఒకటే అనుకుంది. తన కాళ్ళకి బంగారు పట్టీల కంటే శంకర్ ఇష్టపడే గజ్జెల వెండి పట్టేలే విలువైన వనుకుంది. తన తండ్రి ఇంట్లో తోటలోని రకరకాల రంగురంగుల పూలకంటే కిటికీ అవతల పూలకుండీలోని పూలే అందంగా ఉన్నాయని ఫిక్సయిపోయింది.

శంకర్ రమ్యలు నెలల్ని రోజులుగా రోజుల్ని గంటలుగా గంటల్ని మధుర క్షణాలుగా ఒకరికి ఒకరుగా ఒకరి కళ్ళల్లో మరొకర్ని చూసుకుంటూ లైఫ్ ఈజ్ బ్యూటిఫులం అనుకుంటున్నారు.

కొడుకు తమకు చెప్పకపోతేనేం పట్నంలో ఉద్యోగం చేస్తూ తనకు నచ్చిన అమ్మాయిని  పెళ్లి చేసుకోవడం శంకర్ తల్లీ దండ్రులకు సంతోషాన్నే కలిగించింది.

కొడుకు సంసారాన్ని చూడటానికి సిటీకి వచ్చారిద్దరూ. వాళ్లను చూశాక కానీ రమ్యకు శంకర్ కులం గుర్తుకు రాలేదు. అతని కుటుంబ స్థాయి అర్థం కాలేదు. వాళ్లు వచ్చిననాడు రాత్రి తండ్రి కోసం ‘మందు’ అందులోకి చికెనూ తీసుకువచ్చాడు శంకర్. అప్పుడు తెలిసి వచ్చింది రమ్యకు శంకర్ ‘నాన్ వెజ్జీ’ అని మందు రుచి తెల్సినవాడని ఇన్నాళ్ళూ తన కోసం అదేమిటో ఎరుగని వాడిలా ఉన్నాడని.

గదిలో శంకర్ తల్లీ తండ్రీతో ఉన్న సమయంలో రమ్య బయట హాల్లో నుదుటి మీద మొలుచుకు వస్తున్న మూడవ కంటితో అసహనంగా కూచుంది. ఈ అసహనం, కోపం రమ్యలో అత్తామామ ఉన్నంతకాలమూ పెరుగుతూ పోయి వాళ్ళు వెల్ళిపోయాక ‘కంటిన్యూ’ అయింది.

ఇదివరకు శంకర్లో కనిపించని చెడ్డ లక్షణాలన్నీ ఇప్పుడు రమ్యకు ఒక్కటొక్కటిగా కనిపించసాగాయి. అతను మాట్లాడే భాషలో, తిండి తినే పద్ధతిలో శుచీ శుభ్రత పాటించే తీరులో తేడాలు ఆమెకు తన కళ్ళకు బిగించుకున్న భూతద్దంలో చాలా పెద్ద సైజులో కనిపించసాగాయి.

ఇద్దరూ కల్సి బయటకు వెళ్ళినప్పుడు డబ్బు ఖర్చు చేసేప్పుడు అతనిలో పిసినారి కనిపించాడు. తను ఔనన్నది కాదనడంలో అతనిలోని అజ్ఞాని దర్శనమిచ్చాడు. తక్కువ మార్కులతో డిగ్రీ పాసయినా అతనికి ప్రభుత్వ ఉద్యోగం రావడానికి రిజర్వేషన్ తప్ప మెరిట్ కారణం కాదని ఆమె అనుకోసాగింది.

కాలం గడుస్తున్న కొద్దీ ఆమెలో ప్రేమ గ్లోబల్ వార్మింగ్కి కరగి నీరైపోతున్న హిమాలయంగా మారింది. వెట్రోల్ కి మ్యాచ్ బాక్స్ మేచ్ అయినట్టు ఒకటి రెండు సార్లు శంకర్ ఫ్రెండ్స్ తో డ్రింక్ చేసి రావడంవల్ల జరిగిన వేడి వాదోపవాదాల కారణంగా ఆమెను తను శంకర్ ని చూడ్డానికి ముందు ఉన్న రమ్య క్రమక్రమంగా ఆక్రమించసాగింది.

*   *   *

ఒక సాయంత్రం శంకర్ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే నవ్వుతూ ఎదురొచ్చింది రమ్య. అమావాస్యనాడు పొరపాటున చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడే అనుకున్నాడు శంకర్. కాఫీ అందిస్తూ దేవతలకు అమృతం పంచిన మోహినిలా కనిపించింది.

ఇక నుండి తను జాగ్రత్తగా ఉండాలని రమ్యకు కోపం తెప్పించకూడదని అనుకున్నాడు శంకర్.

ఇద్దరూ భోజనం చేస్తున్నప్పుడు అంది రమ్య.

‘మా అక్కయ్య ఫోన్ చేసింది’ ఉలిక్కి పడ్డాడు శంకర్. ఉలిక్కి పడ్డ శంకర్ మాట్లాడకుండా రమ్యవైపు చూశాడు.

‘అమ్మ కూడా మాట్లాడింది’

అవునా అన్నట్టు చూశాడు కళ్ళు ఎత్తి మనసులో రకరకాల ఆలోచన్లు ముళ్ళల్లా గుచ్చుకుంటుటే.

‘తమ్ముడి పెళ్లి వారం రోజుల్లో మనిద్దర్నీ రమ్మన్నారు. వాళ్లకు మన మీద కోపం పోయినట్టుంది. డాడీ కూడా చెప్పమన్నారట. వెళ్దాం ప్లీజ్ అంది రమ్య చేతిలో ఉన్న అన్నం ముద్దని అలాగే పట్టుకుని తాము పార్కులో కలిసే రోజుల్లో అతనివైపు చూసిన చూపుల్ని రిపీట్ చేస్తూ అంత సడన్ గా ఆమె చెప్పింది వినడానికి అతను సిద్ధంగా లేడు. కానీ ఆమె అడిగింది కాదన లేడు. కాసేపు సీలింగ్ ఫ్యాన్ కేసి చూశాడు. అది తనలోపల జొరబడి గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. ఇన్నాళ్లకు వాళ్లు ఫోన్ చెయ్యడం ఏమిటో అర్థం కాలేదు. కులం కన్నా కూతురు  ముఖ్యం  అనుకున్నారేమో. ఆస్తికన్నా అమ్మాయి మీది ప్రేమ ఎక్కువనిపించిందేమో అనుకున్నాడు.

‘నీకు వెళ్లాలని ఉందా?’ అన్నాడు చివరికి కంచం అంచుమీద చేయి ఆనించి.

‘చెప్పాను కదా. వాళ్ళ కోపం పోయింది. మనల్ని తమ వాళ్ళు అనుకుంటున్నారు. ఇంతకంటే కావల్సిందేముంది’ అందామె ఎడమచేతిని సుతారంగా అతని భుజం మీద వేస్తూ.

ఆ వేళ్ళ కొసలు భుజంలోకి ట్రాన్స్ ఫామ్ చేస్తున్న విద్యుత్ షాక్ ను తట్టుకుంటూ

సరే! నీ ఇష్టం వెళ్ళాలనుకుంటే నువ్వు రేపే వెళ్ళు. నన్ను రమ్మని ఫోర్స్ చెయ్యకు అన్నాడు. ఇద్దరి మధ్య ఈ విషయం మీద సుహృద్భావ చర్చ జరిగింది. రమ్య తను వెళ్తానని ముందు ముందు అతనూ రావల్సి ఉంటుందని అన్నది.

*   *   *

తమ్ముడి పెళ్ళికి వారం రోజుల ముందే తను  దాటిపోయిన గడపలోకి మళ్ళీ వచ్చింది రమ్య. అక్కడ ఎవ్వరిలోనూ ఏదో జరిగి పోయిందనే భావన కనిపించలేదు. ఎప్పటి లాగానే మాట్లాడారందరు. తండ్రి ఎదుట పడలేదు కానీ చిన్నాన్న మాటి మాటికీ ఎదుట పడసాగాడు. కొందరు యే విషయాన్నైనా సరదాగా ప్రస్తావిస్తారు. గుచ్చినట్టు తెలీకుండానే సూది గుచ్చేస్తారు. అలాంటి వాడే రమ్య చిన్నాన్న. రమ్యకు తెలీకుండానే ఆమె బ్రెయిన్ వాష్ చేసే పని మొదలు పెట్టాడు. అనుకోకుండా అన్నట్టుగా వివిధ కులాల మనుషుల మనస్తత్వం మ్యాపుగీశాడు. కులాంతర వివాహాల వల్ల వచ్చే కష్టనష్టాల్ని తూకం వేసి చెప్పాడు. ఒకసారి దేశంలో పెరుగుతున్న పరువు హత్యల గురించి, మరోసారి రాష్ట్రంలో జరుగుతున్న దుస్సంఘటనల గురించి వివరించాడు.

అసలు డబ్బు ఉన్న వాళ్లందరిదీ కులరహిత సమాజమని డబ్బు మాత్రమే కులాల ఎక్కువతక్కువల్ని బ్యాలెన్సు చేసే మహామంత్రమని సెలవిచ్చాడు. విన్నా వినకపోయినా చెబుతూనే వుంటాడని చిన్నాన్న మనస్తత్త్వం తెల్సిన రమ్య కొన్నిసార్లు విన్నది. కొన్నిమార్లు విన్నట్టు నటించింది. ఏది ఏమైనా చిన్నాన్న మాటల్లో కొన్ని రమ్య మెదడు అడుగు భాగం దాకా వెళ్లి పోయేయి.

పొగ త్రాగడం ఆరోగ్యానికి ఎంత హానికరమో పోలిక కూడా అంత హానికరమైనదే. అది రమ్య తన ఇంటికి వచ్చిన రెండవ నాటి నుంచే చాపకింద నీరులా మొదలైంది. గదిలో కప్ బోర్డులో తన దుస్తులు, బాక్స్ లో తండ్రి తన కోసం అపురూపంగా చేయించిన నగలు చూస్తున్నప్పుడు ఆమె మనోసముద్రంలో వాయుగుండం ఏర్పడింది. తమ్ముడి పెళ్లి సందర్భంగా జరుగుతున్న సెలిబ్రేషన్స్, విందు వినోదాల వల్ల, పడవ కారులో వెళ్లి తను చేస్తున్న షాపింగ్ల వల్ల అది మరింత బలపడింది. రమ్య తను శంకర్ తో గడుపుతున్న జీవితాన్ని ఇక్కడి జీవితాన్ని పోల్చి చూసుకోవడంతో తుపానుగా మారింది. ఎన్ని సంవత్సరాలయినా తాము ఇలాంటి జీవనం గడపలేము అని అనుకుంది. మొట్టమొదటిసారి తను లోతు తెలియని నీటిలో దిగేశానా అని ‘బ్లైండ్ ఎండ్’ ఉన్న రోడ్డులో నడిచానా అని అనుకుంది.

పెళ్లికి వచ్చిన చుట్టాల్లో మేనత్త కూతురు నళిని రమ్యకు పెళ్లి పట్ల ఉన్న నిబద్ధత వెన్ను విరిచేసింది. ప్రేమించిన వాడితో వెళ్లిపోయి ఈ మధ్యే ఇంటికి తిరిగి వచ్చి తమ స్టేటస్ కు తగినవాణ్ణి మళ్లీ పెళ్లి చేసుకున్న నళిని భర్తతో కలసి పెళ్ళికి వచ్చింది. తండ్రి తలుచుకుంటే షాపులో ఖరీదయిన బొమ్మని కొనిచ్చినట్టు తనకు ఓ కుర్రాణ్ణి కొనియివ్వగలడు అన్న వేరు పురుగు ఆమె ఒంట్లో ప్రవేశించింది.

*   *   *

పెళ్లి అయిన మర్నాడు రమ్యకు ఫోన్ చేశాడు శంకర్. ఇన్నాళ్ళూ ఆమె బిజీగా ఉంటుందని గొంతుక విన వస్తుందని అనుకున్నాడు, చెవులు రిక్కించాడు కాని ఆమె ఫోన్ ఎత్త లేదు. మరో గంట ఆగి మళ్ళీ ఫోన్ చేశాడు. ఈసారి కూడా అతని చెవి నిరాశ పడాల్సి వచ్చింది. రమ్య ఫోన్ స్పిచ్ ఆఫ్ అని తెల్సింది.

రెండు గంటల తర్వాత మరో నాలుగు సార్లు ఫోన్ చేసిన తర్వాత పరిస్థితిలో మార్పు లేకపోవడంతో దిగులు పడ్డాడు. ఏం జరిగిందోనని భయపడ్డాడు.

పెళ్లి హడావిడి తగ్గాక రమ్య గదిలోకి వచ్చి తల్లీ దండ్రీ చాలాసేపు మాట్లాడారు. తండ్రి అంత ప్రేమగా మాటాడ్డం రమ్యకు ఎంతో ధైర్యాన్ని కలిగించింది. వాళ్ళు గదిలోంచి వెళ్ళిపోయాక రమ్య సెల్ ఫోన్ లో ఉన్న సిమ్ కార్డు కిటికీలోంచి బయటకు విసిరేయబడింది.

మళ్లీ మళ్లీ ఫోన్ చేశాడు శంకర్. ఈ నంబర్ తో యే ఫోనూ పనిచేయడం లేదు అని అనేకసార్లు విన్నాక ఒక నిశ్చయానికి వచ్చాడు శంకర్.

*   *   *

సెక్యూరిటీ వాళ్లు అరగంట గేటు దగ్గర ఆపి లోపలికి పంపించారు శంకర్ ని. ఇంటి ముందు లాన్ లో కూర్చోమన్నారెవరో.

ఏ వైపు నించైనా రమ్య కనిపిస్తుందేమో నన్న ఆశతో భవనం వైపు చూస్తూ కూచోవడం వల్ల తన ఎదురుగ్గా వచ్చి కూచున్న మనిషిని చూడలేదు శంకర్.

తను రమ్య చిన్నాన్నానని పరిచయం చేసుకున్నాడు ప్రకాశ్ రావు. రమ్య నాన్నగారు బిజీగా ఉండటంవల్ల తను రావాల్సి వచ్చింది అన్నాడు. ఆయనకు కాస్త దూరంలో నలుగురు బౌన్సర్లు నిలబడి ఉండటం గమనించాడు శంకర్.

శంకర్ ముఖం కొద్దిగా ఎర్రబడింది. ప్రకాశ్ రావు చిరునవ్వు విసిరాడు.

అన్నయ్య నీ మీద చాలా కోపంగా ఉన్నాడు.  కులం తక్కువవాడివైనా మా స్థాయికి యే మాత్రం సరిపోనివాడివైనా అన్నయ్య మంచివాడు కనక నిన్ను క్షమించాడు…. లేకపోతే… వాక్యాన్ని అసంపూర్ణంగా వదిలేశాడు ప్రకాశరావు.

శంకర్ కు కోపం లోపల్నించి తన్నుకు వస్తున్నది. రమ్య ఒక్కసారి బయటకు వస్తే బాగుండేది. ఏమైనా చేసి ఉండేవాడిని అనుకున్నాడు.

ఆ మాటే అన్నాడు.

‘ఒకసారి రమ్యను పిలుస్తారా మాట్లాడాలి’

రమ్య నీతో మాట్లాడదు. నువ్వు జరిగిందంతా మరచిపోవటం మంచిది.

‘మాకు ఇలాంటివి కొత్తేం కాదు. మా పరువునీ, ప్రతిష్టనీ ఎలా నిలబెట్టుకోవాలో మాకు తెలుసు’ అంటూ వెనక్కి తిరిగి ఇంటివైపు నడిచాడు ప్రకాశంరావు.

మొదలు నరికిన చెట్టులా కూలి పోయాడు శంకర్.

శంకర్ దీనస్థితిని చూడలేక ఆకాశంలో నక్షత్రాలు కనపడకుండా పోయాయి.

చిల్లు పడ్డ డబ్బాలోంచి కారుతున్న తారులాంటి చీకటి శంకర్ ముఖాన్ని కప్పేసింది.

August 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

కథా పంచకం

by Dr. Lakshmanacharyulu M August 21, 2022
written by Dr. Lakshmanacharyulu M
  1. ఓ నిజాయితీ మనిషి

భూషణంగాదు ఓ పెద్దమనిషి. కొందరైతే ఆయన్ని అసలు ప్రపంచంలో కెల్లా గొప్ప వ్యక్తి అని అంటూ ఉంటారు. దీనికి ఎన్నో కారణాలున్నాయి. ఆయన పేదల పాలిటి పెన్నిధి. మంచి విషయాన్ని ప్రచారం చేస్తాడని, ఓ గొప్ప నిజాయితీ పరుడని… ఇలా… ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉంటారు జనం.

ఇవాళ పొద్దు నుంచి ఎందుకో మరి ఆయన చాలా బాధ పడిపోతున్నాడు. తన చుట్టూతా ఉండేవారి బాధల్ని దుఃఖాల్ని చూసి ఆయన పాపం, తీవ్రంగా బాధ పడిపోతాడు. వెంటనే తన సెక్రటరీని పిలిచాడు. ఆయన వచ్చి మౌనంగా తలొంచుకునే ‘సార్! మీరు నన్ను పిలిచారా?’ చెప్పండి సార్. ఏం చేయమంటారు? అని అడిగాడు.

‘ఆఁ నిన్ను పిలిచా. నీకు తెలుసు కదా! ఎవరన్నా సరే, బాధపడితే నేను చూడలేనని. చూడు! మన వీధిలోనే ఒక ‘విధవరాలు’ ఉంది కదా! ఆమె యవ్వనంలో ఉన్నఅందగత్తె కూడా. ఆమెకి ఎవరైనా మంచి కుర్రాణ్ణి తెచ్చి పెళ్ళి చేయాలని ఉందోయ్!’ అన్నాడు.

దానికి సెక్రటరీ ఒక్క క్షణం ఆలోచించి “సార్! మీ తమ్ముణ్ణి మించిన యోగ్యుడూ, మంచివాడూ, అందగాడు మరెవరున్నారు మన వీధిలో? పైగా అతనికి పెళ్ళి కూడా కాలేదు కదా!”

‘అంతే! మర్నాడే పాపం! ఆ సెక్రటరీ గారి ఉద్యోగం ఊడి పోయింది.

2. అనుకరణ (నకలు)

25 సంవత్సరాల సుధారాణికి వ్యతిరేకంగా ఉన్న కేసు ఎలాంటి మెలికలు, ఇబ్బందులు లేకుండా, స్పష్టంగా ఉండడంతో – ఒక జడ్జిగా – నా నిర్ణయఁ పెద్దగా కష్టపడకుండానే, వినిపించా.

తీర్పు చెప్తూ – సుధారాణీ! నువ్వు మాదక ద్రవ్యాలకు అలవాటుపడి, నీ ఆరేళ్ళ కూతురు మీనాని ఇద్దరు కుర్రాళ్ళకి అప్పగించేసావ్. పాపం, అపరాధాల చరిత్రలో బహుశా ఇది అన్నిటికన్నా ఘోరాతి ఘోరం. దీనికిగాను నువ్వు 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.  పారిపోయిన ఆ కుర్రాళ్ళిద్దరి సంగతి పోలీసు చూసుకుంటుంది” అని అన్నా.

తీర్పు వినిపించాక, ఒక తాత దృష్టితో నేను ఆ పాప మీనాని చూసా. రేపు ఈ అమ్మాయి కూడా వాళ్లమ్మను అనుకరించదు కదా! అలాగే తయారవదు కదా”!  అని అనిపించింది నాకు

3. ఫోటో

కార్యక్రమం ఎంతో హంగూ – ఆర్భాటాలతో హడావుడిగా ప్రారంభమైంది. పెద్ద షామియానా, లోపల, క్రింద నేలపై పెద్ద సంఖ్యలో కూర్చుని ఉన్న నిరుపేదలు, పైన వేదికపై చక్కగా అలంకరించిన మేజా బల్ల, కుర్చీలు అన్నీ యథాస్థానంలో అందంగా ఉన్నాయి.

ఇక మొదలైంది కార్యక్రమం. ఉపన్యాసాలు మొదలైనాయి. ఒకరి వెంట ఒకరు వచ్చి గోపాలయ్యను, ఆయన గొప్పతనాన్ని పోటీపడి పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మేడనిండా పూలమాలలో గోపలయ్యగారు గంభీరంగా, చిద్విలాసంగా ఉన్నాడు. ఏదో అప్పుడప్పుడు చిరునవ్వులు రువ్వుతూ ఉన్నాడు.

సరే, భోజనాలు, కంబళ్ళు పంపిణీ కార్యక్రమం… అన్ని మునిగిపోయి, అందరూ ఒక్కొక్కరే మెల్లగా వెళ్లిపోయారు. ఫోటోగ్రాఫర్ కూడా వెళ్లిపోయాడు. అదిగో, అప్పుడొచ్చాడు ఓ ములి నిరుపేద వ్యక్తి, తన మనవడి సహాయంతో వచ్చి గోపాలయ్యను దీవించి, “అయ్యా1 నేను అనాథను, నిరుపేదను, కొంచెం ఆలస్యం అయింది. మన్నించండి. సమయానికి రాలేకపోయా. ఒంట్లో బాగాలేదు. వీడూ లేడు దగ్గర. చివరికి ఎలాగో రాగలిగా! దయచేసి నాకు కంబళి, భోజనం దయచేస్తే…”

గోపాలయ్యగారు అతని మాటల్ని వినీ విననట్లుగా అలా ముందుకి వెళ్లి – “ముసలోడు పిచ్చోళ్ళా ఉన్నాడు. అంతా అయిపోయాక వీడికెవరిస్తాడు కంబళి, భోజనం? ఆ ఫోటో గ్రాఫర్ ఉంటే, పరిస్థితి మరోలా ఉండేదేమో! అయినా… ఫోటో లేకుండా పుణ్యకార్యక్రమాలు, దానధర్మాలు చేస్తే స్వర్గం దొరకదు కదా!” అన్నాడు చిన్నగా నవ్వుతూ తన అనుచరుడితో

4. దర్యాప్తు

ప్రజలు పెట్టిన గగ్గోలు విని మంత్రిగారు లక్షల రూపాయల కుంభకోణం కేసు పరిష్కరించేందుకుగాను ఒక ‘కమీషన్’ని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఎంతో నిజాయితీగా, న్యాయబద్ధంగా తన పని ప్రారంభించింది.

ముందుగా ఆ విభాగం అధ్యక్షుణ్ణి, వారి క్రింద పనిచేసే ఉపాధ్యక్షుణ్ణి, అలాగే వరుసగా పెద్దా – చిన్నా అధికారులందరినీ లోతుగా విచారణ చేసింది ఆ కమిటీ. అందరూ తమ తమ తెలివి తేటల్తో, మరో కారణాలతో చక్కగా తప్పించుకున్నారు. చట్టం వారికి చుట్టం అయింది. చివరికి ఆ కార్యాలయంలో పనిచేసే ఓ అటెండర్ (చప్రాసీ) ఇరుక్కున్నాడు. ఆ విచారణ కమిటీ తన నిర్ణయం వినిపిస్తూ – మాయమైన 5 లక్షల కుంభకోణం కేసులో ప్రధానమైన వేరులాంటివాడు ఈ అటెండర్. అందుకనే మేం ఆ ‘వేరును’ తొలగించేసాం. ఇక చెట్టు, కాండం, ఆకులు, పూలు అన్నీ ఆనందంగా ఉన్నాయి. ఈ విభాగం ప్రగతిపథంలో చక్కగా పరిగెడుతుంది అని అన్నారు.

5 

నేనొక శిల్పిని. విగ్రహాలు రూపొందిస్తూ ఉంటాను. ఓ రోజున సీతారామయ్యగారు తన మనసులోని మాట చెప్పడంలో నేను ఆయన అభిమానుల్ని కలిసి, సంప్రదింపులు జరిపా. అంతా చక్కగా నిర్ణయించి, ఆయన విగ్రహం ఒకటి ఏర్పాటు చేయడానికై ఏర్పాట్లు ప్రారంభించాడు. విగ్రహం రూపొందించే పని నా కప్పగించారు. చివరికి విగ్రహం తయారైంది. దాన్ని స్థాపించడం  సీతారామయ్య తాను జీవించి ఉండగానే తన విగ్రహావిష్కరణ దృశ్యం చక్కగా చూడగలిగాడు. కొన్ని రోజుల తర్వాత ఆయన మరణించాడు. ఓ రోజు రాత్రి ఆయన నా కలలోకి వచ్చి చాలా బాధతో – “నా విగ్రహం కారణంగా నేను చాలా బాధపడుతున్నా. విగ్రహం పెట్టిన కొత్తల్లో నాకు చాలా ఆనందం కలిగేది. విగ్రహం ఏర్పాటు కాగానే నా బాధ మొదలైంది. విగ్రహం విగ్రహమే కదా! అది జీవించి ఉండేవారి స్థానం భర్తీ చేయగలదా? అది కేవలం పైన పక్షులకి, క్రింద కుక్కలకు, పందులకు ఆశ్రయం ఇస్తోంది” అని అన్నాడు. ఇప్పుడేమీ ఆ విగ్రహం పేరు తలచుకుంటేనే వాళ్ళు కంపరమెత్తిపోతుంది. దాని స్థితి చూస్తే నాకు కడుపులో దేలినట్టౌతోంది. ఇది మీకే కాదు, నాకూ అవమానమే. ఇప్పుడు నేను కూడా ఆ విగ్రహంలా వివశత్వంతో, తప్పించుకోలేని స్థితిలో ఉన్నా” అని ఆయన నిట్టూర్చాడు.  

August 21, 2022 2 comments
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

చందమామ పుస్తక సమీక్షా

by lalitha chitte August 21, 2022
written by lalitha chitte

31.07.22 ఆదివారం గోదావరిఖనిలో..
అనూశ్రీ గౌరోజు గారి దోసిట్లో చందమామ కవితా సంపుటి ఆవిష్కరింపబడినది.
ఆ వేదికపై దోసిట్లో చందమామను పరిచయం చేసే అవకాశం నాకు లభించింది.

వేదికపై సుద్దాల అశోక్ తేజ గారు, మౌనశ్రీ మల్లిక్ గారు, ఎం.ఎల్.ఏ. కోరుకంటి చందర్ గారు, దాస్యం లక్ష్మయ్య గారు, జెవి రాజు గారు, శ్రీనివాస్ గారు, ముక్కెర సంపత్ గారు, వైరాగ్యం ప్రభాకర్ గారు, నాగా నూగూరి గారు, ఉషామధు వెగ్గలం గారు, వకుళవాసు గారు వున్నారు..💐
శ్రీ శ్రీ కళావేదిక మహిళా అధ్యక్షురాలిగా స్త్రీల తరపున గళాన్ని వినిపించడం సంతోషాన్ని కలిగించే విషయం.

* *

తెలంగాణా కోటి రతనాల వీణ అన్న దాశరథి కృష్ణమాచార్యులు గారు, సి. నారాయణ రెడ్డి గారు, కాళోజీ లాంటి మహామహులు జన్మించిన పోరుగడ్డ..

గోదావరి ప్రవహిఒచే పుణ్యభూమి తెలంగాణా.

స్త్రీగా.. శ్రీ పదాల రూపకర్తగా.. అడ్మిన్ గా గ్రూపును నిర్వహిస్తూ సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్న అనుశ్రీ సాహిత్యాభిలాష అభినందనీయం.

ఒక స్త్రీగా  ఆమె సంకల్పం ఉన్నతమైనది.

పరాక్రమ శాలిని రుద్రమ దేవి పుట్టిన ఈ గడ్డలో ప్రతి స్త్రీ రుద్రమ దేవే. తుచ్చమైన ంలేచ్చులను తరిమి కొట్టిన పౌరుషాగ్ని రుద్రమ స్ఫూర్తిని, గుణ గణాలను పుణికి పుచ్చుకున్నదే ప్రతి మహిళ.

ఆ రుద్రమకు వారసురాలిగా ఎన్నో అడ్డంకులను ధాటీగా ఎదుర్కుంటూ.. ముందుకు దూసుకుపోతూ, కవిత్వంతో ఘన కీర్తిని పొందిన అనూశ్రీ గారికి ప్రశంసలు.

వారి కలం నుండి వెలువడిన దోసిట్లో చందమామ.. ఏమంటోందో ఇప్పుడు చూద్దాం.

💐💐💐💐💐

శ్రీ పదాలు ప్రథాన అడ్మిన్ జె.వి. రాజు గారి సౌజన్యంతో రూపుదిద్దుకున్న ఈ దోసిట్లో చందమామ..

140 పేజీలలో 90 కవితల కౌముదీ కిరణాలతో అలరిస్తోంది.

ప్రముఖ రచయిత మౌనశ్రీ మల్లిక్ గారి అనుశ్రీ అనురాగ లిపి అనే ముందు మాటలతో..

ప్రముఖ కవయిత్రి మాతృ సమానురాలు మెరాజ్ ఫాతిమా గారి అనుశ్రీ అక్షర సోయగం అనే ఆశీస్సులతో..

అనూశ్రీ కి ఎదగడమే కాదు ఒదగడం తెలుసు అన్న కవి సాయంత్రం గ్రూపు అడ్మిన్ ముక్కెర సంపత్ కుమార్ గారి మాటలతో,

ప్రథాన అడ్మిన్ జె.వి రాజు గారి భావ సౌరభాలతో మొదలైన ఈ చందమామ లలితమైన పద ఝరులతో ఆకట్టుకుంటోంది.

🌿🌿🌿

కవయిత్రి అనుశ్రీ గౌరోజు గారి

దోసిట్లో చందమామ…

~~•••••~~💐

చందమామ ఆకాశంలో వుంటుందనుకున్నాను.. కానీ మన కవయిత్రి అనూశ్రీ ఆ చందమామను మన దోసిట్లోకి తెచ్చింది.

ఈ ప్రేమ కవిత్వాన్ని చదువుతుంటే తెల్ల చీర కట్టుకుని తలనిండా మల్లె పూలు పెట్టుకుని పండు వెన్నెల్లో ఇంటి ముందరి తోటలో హాయిగా విహరిస్తున్నట్లు అనిపించింది.

వెన్నెల్లో గోదారి తిన్నెల్లో కూర్చుని ప్రియునితో సంభాషిస్తున్నట్లు అనిపించి అంతటి హాయి మృదువుగా మదిలోకి ప్రవహించింది.

అనూశ్రీ గారి హృదయం ఎంతటి నవనీతమో, మధురమో, సున్నితమో, భావరాగ తరంగమో ఈ దోసిట్లో చందమామను చదివితే మనకు అర్థమవుతుంది.

ఇది కమర్షియల్ కవిత్వం కాదు. పాఠకులనో.. ఎవరినో ఆకట్టుకునే ప్రక్రియా కాదు.

ఇది అనూశ్రీ గారి హృదయ స్పందన. భావాల సమాహారం. ఇదొక అపురూపమైన ప్రేమ కావ్యం. అనూశ్రీ గారు తమ హృదయాన్ని ఇందులోకి ప్రేమగా ఒంపేసారు. ప్రతి అక్షరాన్ని ప్రేమతో పద్ధతిగా అమర్చారు.

ఇందులోని ఒక్కో వాక్యం వీణా తంత్రుల వలె మదిని మీటుతుంటే చదివే పాఠకులు ఆమె భావ ప్రకంపనలకు ఆశ్చర్య చకితులై పోవాల్సిందే.

అవని నుండి ఆకాశందాకా మదిలోని గోడలన్నీ మారుమ్రోగే స్వరం ఇది.

గోదావరి అలల గలగలలు ఆమె తమ పదాలలో ఒంపుకున్నారు అనుకుంటాను. అందుకే ఆ పదాల హోరు జోరు మాటల్లో వర్ణింప శక్యం కానిది.

*

గుండె సడి అనే కవితలో ఆమె

కన్నీటికి చెప్పిన నిర్వచనం అబ్బుర పరిచింది.

కళ్ళవెంట జారే కన్నీళ్ళు

బాధకు ఆనవాళ్ళే కాదు

ప్రేమకు సైతం చిరునామాలు..

నేనింతవరకూ కన్నీళ్ళు బాధకు సాదృశాలు అనుకున్నాను. కానీ ఇది చదివాక కాసేపు ఆలోచనలోకి ప్రయాణించాను.

నిజమే ఎంత ప్రేముంటే కన్నీరు బయటికి వస్తుంది..

ప్రేమే లేకపోతే బాధనేది లేదు కదా… అనిపించింది.

ఒకే మూసలో.. ఒకే ధోరణిలో, ఒకే కోణంలో, ఎవరినో అనుసరించి ఆ పంథాలో ఆవిష్కరించేది కవిత్వం కాదు. అది కాపీ అవుతుంది.

సరి కొత్త భావాలు.. అర్థాలు.. జవాబులు.. నిర్వచనాలు చెప్పేదే కవిత్వం.

అలాంటి ఒరవడితో నిండిన కవిత్వమే అనూశ్రీ గౌరోజు గారి దోసిట్లో ఒదిగిన చందమామ.

*

నీ వల్ల కలిగిన దు:ఖమంటేనే అది కొండంత ఆవేదన

అది తోడిపోసేందుకు

నేను అనంతమైన నదినై ప్రవహించాల్సిందేగా..

నదులన్నీ సంద్రాన్ని చేరడం అందులో కలిసిపోవడం మనకు తెలుసు. అది సహజం కూడా..

కానీ ఆశ్చర్యంగా కొత్త విషయాన్ని ఇక్కడ చదివాను.

కొండంత ఆవేదనను తోడిపొయ్యడానికి నదినై బయటికి ప్రవహిస్తా అనడం కొత్తగా వుంది.

భావాలను తలక్రిందులు చేసి వింతైన కొత్త అర్థాలను సృష్టించడం ఈ కవయిత్రికే చెల్లింది.

హేట్సాఫ్ అనుశ్రీ…

నిను చేరు వేళ కవిత అద్భుతమైన ప్రేమకు ప్రతీక. సాగర సంగమం ప్రతి నదికీ అనివార్యం.

నదిని స్త్రీతో సంద్రాన్ని పురుషునితో పోల్చి చెప్పడం అనంతమైన భావం.

ఈ కవిత నేను రాసిన మది నదిలో… కవితల సంపుటిని గుర్తుకు తెచ్చింది.

ప్రతి స్త్రీ ఇలాగే ఆలోచిస్తుందేమో..

నదిలా సాగాలని.. ఎత్తుపల్లాలను అధిగమిస్తూ, మలుపులను తిరుగుతూ.. సుధీర్ఘ ప్రయాణం తరువాత ప్రియుని పరిష్వంగంలో అలసటను తీర్చుకుని ఇన్నాళ్ళ ఎడబాటును మరిచిపోవాలని….

నది నాకిష్టమైనది. నన్ను నేను నదితో పోల్చుకుంటూ వుంటాను.

నది స్త్రీలాగే ఎన్నో సంస్కృతులను సృష్టించింది. నదీ తీరాలు నాగరికతకు ఆలవాలాలు.

స్త్రీ ని నదితో పోల్చడం ఈ కవితను ఉన్నతమైన శ్రేణిలో నిలబెట్టింది అనడం సముచితం.

అంతేకాదు.. ప్రేమనే కాదు, ఎడబాటును, ఎదకోతను కూడా అనూశ్రీ గారు అద్భుతంగా వ్యక్తీకరించారు. హృద్యంఫా ఆవిష్కరించారు.

అన్ని భావాలను ఒడిసిపట్టి అక్షరాల్లో నింపి చందమామగా మలచి మన దోసిట్లోకి చేర్చారు.

ఈ కవితా సంపుటికి ఈ పేరు సరిగ్గా అమరింది. కవిత్వానికి తగిన శీర్షిక ఇది.

**

ఇందులో ల్ని నలుపురంగు అనే కవిత ప్రేమిక హృదయాన్ని కొత్తగా ఆవిష్కరిస్తోంది.

నాలోకి నేను ప్రవహిస్తూ నిన్ను అన్వేషించాలంటే చిక్కటి చీకటి రాత్రి కావాలి అనే అర్థింపు సమంజసంగా వుందనిపిస్తోంది.

ప్రేమలోని లోతులను, గాఢతను, తీవ్రతను, ఒత్తిడిని, మధురిమను కవయిత్రి కలం ఆర్తిగా పొదివి పట్టుకుంది. అన్నిరంగుల్లో అక్షరమై ప్రవహించింది.

*

మరో కవిత ఆనంద తీరం..

చదువుతుంటే చిరునవ్వును పెదవులపై నిలిపింది..

ఆనందాల తీరం నీవే

సమస్యల ఉప్పెనవూ నీవే..

నిన్ను దాటలేని అలను నేను అంటూ..

ప్రేమించిన స్త్రీ హృదయ సంఘర్షణను చక్కగా అక్షరీకరించారు.

కవయిత్రి ప్రతిభకు తార్కాణం ఈ ఆనంద తీరం.

**

నీ చేరువ అనే కవిత అవ్యక్తానుభూతికి లోను చేస్తుంది.

ప్రేమ తరంగాలను ఒడుపుగా హృదయంలోకి ఒలికిస్తుంది.

త్వమేవాహం, ప్రయాణం..మాధుర్యాలు.. మౌనరాగాలు..ఆశల నిచ్చెన.. అనివార్యం మదిని కలవరపెట్టే కవితలు.

కొన్ని గిలిగింతలు, కొన్ని కలవరింతలు, మరి కొన్ని కేరింతలు, పులకరింతలు కలగలిసి అనూశ్రీ కవిత్వం పురుడు పోసుకుంది.

కవిత్వం రాయాలంటే ప్రసవవేదన పడతారు కవులు అంటారు. కానీ ఈ దోసిట్లో చందమామలో ఆ లక్షణాలు ఎక్కడా కనిపించవు.

అలవోకగా అంతర్లీనంగా మది గదిలో దాగిన భావాలను కలంలోకి ఒంపినట్లు కనబడుతుంది.

అనూశ్రీ అక్షరం అలరిస్తుంది. కవిత్వం ఆసాంతం ఆకట్టుకుంటుంది. చదివాక మదిని మైమరిపిస్తుంది. అవ్యక్తానుభూతికి లోనయ్యేలా చేస్తుంది.

ఉప్పొంగే నదిలాంటి ఆ ఒరవడి ఒక్కుదుటున చదివింపజేస్తుంది.

ముఖ్యంగా ఆకట్టుకునే కవిత్వం వెలువడాలంటే ఆత్మ సౌందర్యం ముఖ్యం.

నిష్కల్మషమైన హృదయం అవసరం.

ప్రేమించే మనసుకే అది సాధ్యం.

ఈ లక్షణాలన్నీ పుష్కలంగా వున్న కవయిత్రి అనూశ్రీ గౌరోజు గారు.

వారు మరిన్ని సంపుటాలను వెలువరించాలని, వారి ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరాలని, మరెందరికో స్ఫూర్తిదాయకమై, ప్రేరణ కలిగిస్తూ సాహితీ శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను.

ధన్యవాదములు.


August 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

అద్దం..

by Chandu Pendyala August 21, 2022
written by Chandu Pendyala

ఎవరయినా తన ముందుకు
రావాలని కోరిక
వచ్చిన వారి చిత్ర విచిత్ర
ముఖ కవళికలను
చూడాలని తపన

తీరొక్క మంది
తీరుతెన్నులు
తేరిపారా తన మెరుపులో బంధించాలని ఆశ

వివిధ భంగిమలను తనలో
బధ్రపరుచుకోవాలన్న ఎదురుచూపులు

తన ముందుకు వచ్చేవారు
నవ్వుతూ నాట్యం చేయాలని
దు:ఖాన్ని దువ్వెనల దులుపాలని
పట్టులంగా వేసుకున్న గారాల పట్టిని
తన గోళం లో బంధించాలని
పట్టుధోతి కట్టుకున్న చినరాయుని
చిద్విలాసం కనాలని
లేలేత లేడిపిల్లలంటి భావాలకు గాలం వేయాలని
ఆనంద రూపాల
అందాలను అద్దుకోవాలని
నూనూగు మీసాల
కుర్రతనం చూడాలని
తను శుభ్రంగా ముస్తాబయి
ఎదుటివారిని తనలా
తనలో చూసుకోవాలని ఉందనంటది…

August 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

స్వరాంజలి -9

by Krishna Kumari Yagnambhatt August 21, 2022
written by Krishna Kumari Yagnambhatt

 త్యాగయ్య గారు నవవిధ భక్తి మార్గాలలో రచించిన కీర్తనలు కొన్ని పరిశీలిద్దాం. 1)శ్రవణం ..

పల్లవి ­- రామకథా సుధారస పానమొక రాజ్యము చేసునే!

ధర్మాద్యఖిల ఫలదమె మనసా -ధైర్యానంద సౌఖ్య నికేతనమే

కర్మబంధ జ్వలన ఆబ్ది నావయే -కలిహరమే త్యాగరాజ వినుతుడగు!!

ఈ కీర్తనలో రామనామ మహిమ చెప్పబడింది.

2)కీర్తనం..

పల్లవి-

రామాభిరామ మనసు రంజిల్ల  బల్కరాదా!

బంగారు మేటి పాన్పు పై భామామణి జానకి

శృంగారించుకొని చెలువొంద నినుగని

పొంగుచు మల్లె విరుల పూజించు వేళ శ్రీ హరి

సంగీతము పాడుచును త్యాగరాజు నితో!!

త్యాగయ్య ప్రతి కీర్తనలో రామ కీర్తనం వివరంగా ఉంటుంది. ప్రత్యేకించి ఏదో ఒక కృతిని ఉదహరించడం కొంత కష్టమే.

” ఏలావతార మెత్తు కొంటివి -ఏమి కారణము రాముడై “ అను కీర్తనలో

 “యోగులను జూచుటకా భవ రోగులను బ్రోచుటకా శత

రాగ రత్న మాలికను రచించిన త్యాగరాజు నకు వర మోసంగుటకు’

అని తన శత రాగ రత్న మాలిక నంగీకరించి వరమిచ్చుటకై అవతరించి నాడని  రామచంద్రుని కీర్తించుట ఎంతో మనోహరమైన భావన.

3 )స్మరణము..

“ శ్రీపతే నీ పద చింతనే జీవనము’

అను కీర్తనమున భగవంతుని స్మరించుటయే తన జీవిత లక్ష్యమని అట్టి చింతనే ఇంద్రాదులు గొప్ప మహిమను పొందారని చెప్పుచు

 ‘రామ నామ స్మరణము వల్ల నామ రూపమే హృదయము నిండి ప్రేమ పుట్ట జేయగలేదా’

 అంటూ స్మరణ విశిష్టతను తెలిపారు.

4 )పాద సేవనం..

‘శ్రీరామ పాదమా! నీ కృప జాలునే చిత్తానికి రావే!

అను కృతిలో పాదాభివందన మొక్కటే అన్ని దురితాలను అపహరించగల సామర్థ్యం ఉందని చెప్పుతూ అహల్య వృత్తాంతాన్ని నిదర్శనంగా పేర్కొని, బ్రహ్మాదుల చేత పూజింపబడే ఆ పాదాలు  తన మనస్సులో నిరంతరం స్థిరంగా నిలవాలని ప్రార్థించాడు. సందేహమును దీర్చవయ్య సాకేత నిలయ’అను కృతిలో

 ‘వర మౌను లెల్ల జరణమ్ములను,స్మరియింప నీడు పద మొసంగెనో

భరతార్చనచే  బాదుకలు ,ధర నిన్నొసంగె త్యాగరాజ భాగ్యమా!!  

అంటూ శ్రీ రామ చంద్రుని చరణాల కన్నా ,వాటిని సేవించిన పాదుకలు మరింత గొప్పవని  భరతుని వృత్తాంతాన్ని నిదర్శనంగా  పేర్కొని కీర్తించారు.

 ‘రఘునాయక !నీ పాద యుగ రాజీవముల నే విడ జాల’ అను కీర్తనలో భవ సాగరమును దాటగోరు  వారికి శ్రీ రాముని తప్ప వేరుగతి లేదని తెలిపారు.

‘శ్రీ మానినీ మనోహర ! చిరకాలము మాట యొక టేరా ‘ అను కృతిలో భక్తులు తమ సర్వస్వాన్ని భగవంతుని చరణాల యందు సమర్పించి పాద సేవచే ధన్యులవుతారు అంటూ ప్రశంసించారు.

5 )అర్చన..   

. రార సీతా రమణీ  మనోహరా’ అను కృతిలో

‘బంగారు వల్వలు నే  బాగుగా గట్టెద మరి

శృంగారించి సేవ చేసి కౌగిట జేర్చేద

సారెకు నుదుటను కస్తూరి తిలకము బెట్టేద  

సారమైన ముక్తా హారములు నిక దిద్దేద ‘

అంటూ అనేక విధాలుగా పరమ భక్తితో భగవంతుని సేవ చేసి తరింతు నని

పేర్కొన్నారు.

 ‘తులసీ బిల్వ మల్లికాది జలజముల పూజలు గైకొనవే ‘అనే కృతిలో

‘ఉరమున ముఖమున శిరమున భజమున

గరమున నేత్రమున చరణ యుగమ్మున

గరుణతో నెనరుతో పరమానందముతో ‘అంటూ వివిధములైన పుష్పాలతో శాస్త్రవిధిని పాదాది శిరః పర్యంతము ప్రత్యంగ పూజ చేసే విధానాన్ని వివరించారు. 6 6 )వందనము..

‘వందనము రఘు నందన’అనే కృతిలో పరమ భక్తి భావము మనసులో ఉప్పొంగు చుండగా భగవంతునకు నమస్కరించు పద్ధతి తెలియ చేశారు.

7 )దాస్యము..

‘తవ దాసోహం తవ దాసోహం దాశరథి’ అను కృతిలో త్యాగరాజు దాసత్వమే సరియైన తరణొ పాయమని విశ్వాసంతో పలికారు.

8 )సఖ్యము..

‘సామికి సరి జెప్ప జాల వేల్పుల’అనే కీర్తనలో

‘తన కంటి కెంతో ముద్దు తప్ప దాడిన వద్దు చనువు చేయునొ  పొద్దు చల్లని చూపు కద్దు

అన్నీ వేల్పుల లోన అతనికి సరిగాన

తన్ను బ్రోచిన ఘన త్యాగరాజు సఖు డైన’

ఆంటూ శ్రీ రాముని పట్ల తనకు గల స్నేహ భావాన్ని ప్రకటించారు.

9 )ఆత్మ నివేదనము..

‘కాలహరణ మేలరా హరే’ అన్న కృతిలో

‘చుట్టి చుట్టి పక్షు లెల్ల చెట్టు వెదకు రీతి

 భువిని పుట్టగానే నీ పదముల బట్టుకొన్ననన్ను బ్రోవ

దినదినమును తిరిగితిరిగి  దిక్కు లేక శరణు జొచ్చి

తనువు ధనము నీదే యంటి  త్యాగరాజ వినుత రామ’

అంటూ అనన్య గతికత్వముతో శరణు కోరారు త్యాగయ్య ఈ కృతిలో.

‘నన్ను విడిచి  కదలకురా’ అనే కృతిలో కూడా మనసు కరిగే విధంగా శరణు వెడుతూ తన సర్వస్వాన్ని రామ చంద్రునికి సమర్పించారు.

ఈ రకంగా ఎన్నో విధాల తమ కవితా శక్తిని ప్రదర్శించి తమ భక్తిని అనేక కృతులలో వర్ణించారు. ప్రాచీన కవులకు ఏ మాత్రం తీసిపోని విధంగా ,భక్తా గ్రేసరులైన నారదాది ఋషుల లాగా తమ భక్తి ప్రపత్తులను వెల్లడి   చేసిన ఉత్తమోత్తమ వాగ్గేయ కారులు త్యాగయ్య గారు.

                      **************************************

August 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us