శీర్షిక. అంబోధిలో ఆణిముత్యాలు
విషయ సూచిక
1ముందుమాట 2రచయిత,చిరుపరిచయం
3 కథల సమీక్షలో,
పాత్రలు
సంభాషణ
అంతరార్థం
సందేశం. మొ!!నవి
1ముందుమాట
సంగీత సాహిత్యాలు రెండు, సరస్వతిదేవి మానవులకు ప్రసాదించిన క్షీరామృతాలు.
సంగీతం,శృతి మధురం.వింటేనే ఆనందం కలుగుతుంది. క్షీరంవలె
సులభతరం.
సాహిత్యం, అమృత మదనంవలె
కష్టతరం. అందుకే నన్నయ్య కవిత్వాన్ని (భారతాన్ని) “లోనారసి”
చూడాలన్నాడు. మన కవిత్వాది రచనలకు
సమీక్షలు,వివరణలు, ముందు మాటలు పీఠికలు ఉండడం వల్లే ఆ యాకావ్యాల విలువ, మనం తెలుసుకుంటున్నాం.
అందుకే జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సి నారాయణరెడ్డి గారు ఇలా అన్నారు “కప్పి చెప్పేవాడు కవి, విప్పి చెప్పేవాడు విమర్శకుడు”అని.
కథలు కాలక్షేపం కోసం రాయకూడదు.
సమాజ క్షేమం కోసం
సందేశాత్మకంగా రాయాలి. కవి, లేదా కథా రచయిత సమాజ స్పృహ కలిగి ఉంటేనే
అది సాథ్యమవుతుంది
***
2) రచయితపరిచయం
సాహిత్య సస్యాభివృద్ధికి
మాగాణి, కవి పండితులకు పుట్టినిల్లు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జన్మస్థలమైన సిరిసిల్ల, కిరణ్ కుమార్ గారికి కూడా జన్మస్థానం కావడం విశేషం.
ఉమా, కనకయ్య గార్ల మొదటి సంతానం కిరణ్ కుమార్ గారు.
కనకయ్య గారు మున్సిపల్ కౌన్సిలర్ గా రాజకీయాలలో ఉంటూ, వంశపారపర్యంగా ఉన్న వృత్తి, వస్త్ర వ్యాపారాన్నీ సాగించారు. కిరణ్ కుమార్ తండ్రికి సహాయంగా ఉంటూనే M.com పూర్తి చేశారు. కాలేజీ రోజులలో నుంచి సాహిత్య సేద్యం ప్రారంభించి అచిర కాలంలోనే
సాహిత్య బృందావనాన్నీపెంచి వివిధ సాహిత్య ప్రక్రియా పుష్పాలను
వందల సంఖ్యలో
పూయించిన ఘనత కిరణ్ కుమార్ గారిదే.
. ఆసంఖ్యాక అవార్డులు బహుమతులు వారి సొంతం.అతి చిన్న వయస్సు లోనే అలుపెరుగని సాహితీ ప్రయాణం ప్రారంభించి
ఉన్నత స్థాయికి ఎదిగిన కిరణ్ కుమార్ గారు శ్రమించే స్వభావం కలవారు, సౌమ్యులు, సాహిత్యా భిలాష వారిఊపిరి.
***
3) కథల సమీక్ష
కథ, నవలా ప్రక్రియలకు పాత్రలు సంభాషణలు ప్రాణం
వంటివి.
ప్రస్తుత సమీక్షలో కిరణ్ గారి రెండు కథలను సమీక్షకు ఎన్నుకున్నాను.
1 అనుబంధం.
2 ఉషోదయమా…
ఈ రెంటినీ ఎన్నుకోవడంలో ఉద్దేశం, ఈ రెండు కథలకు పాత్రలు, సంఘటనలు ఒకటే కావడం ముఖ్య కారణం.
రెండు కథలలో సమాజానికి కావలసిన సందేశాలు, ఉపదేశాలు మొదలైన వాటిని పాఠక హృదయాలకు దగ్గరగా తీసుకువచ్చే ప్రయత్నమేఈ సమీక్ష.
కబీర్ చెప్పినట్లు ఏదైనావిషయాన్ని ఉపమానంతో చెప్పాలి.
రసాల మామిడిపండును బాగా రసం తీసి గ్లాసులో పోసి ఇవ్వుచ్చినప్పుడు తాగేవాళ్లు బాగా ఆనందిస్తారు అలాగే కథలలో, రచనలలో ఉండే అంతరార్థాలను, సంభాషణ చాతుర్యాలను, ప్రజలకు ఆచరణీయమైన సందేశాలను సమీక్షలో విపులంగా చూపించగలిగినప్పుడు ఆకథ, సమీక్ష రెండు ధన్యమవుతాయ్.
.ముందు అనుబంధం+ ఉషోదయమా అనే వాటిని గురించి మీకు వివరించాలి.
అనుబంధం అనేది కిరణ్ కుమార్ గారు రాసినమొట్టమొదటి కథ.
అటు తరువాత ఉషోదయమా? అనే కథ తన మొదటి కథ, “అనుబంధా”నికి పొడిగింపుగా రాసిన రెండో కథ. ఇవి విడివిడిగా చదివినా, లేక కలిపి చదివినా వాటి వాటి సందేశం సమగ్రంగానే ఉన్నది. కానీ కలిపి చదివినప్పుడు పాఠకుని లోతుగా ఆలోచింపజేస్తుందనడంలో సందేహం లేదు.
మొదటి దానిలో మోసం కనపడితే రెండవ దానిలో మోసానికి తగిన ప్రతిఫలం, దర్పణంలో చూపించినట్లు చూపించారు రచయిత కిరణ్ కుమార్. అందుకే రెండు చదివినప్పుడు సంపూర్ణమైనటువంటి అవగాహన చదువరులకు ఏర్పడుతుంది.
అందువల్ల నేను అనుబంధం+ ఉషోదయమా? రెంటిని కలిపి సమీక్షిస్తున్నాను.
ఈ కథలను గురించిన ఒక గొప్ప విషయాన్నీ మీ ముందు సంతోషంగా సగర్వంగా నేను సమర్పిస్తున్నాను.
ఏ కొద్ది మంది రచయితలకోదక్కే ఇటువంటి అదృష్టం మన కిరణ్ కుమార్ గారికి దక్కింది అని చెప్పడం సమచితం
పై రెండు కథలలో
ఓ కొడుకు మోసం
ఓ తండ్రి నిర్ణయం కలిసి “ఓ తండ్రి తీర్పు” అనే లఘు చిత్రంగా తయారయింది. ఆ చిత్ర విశిష్టతను గురించి క్లుప్తంగా వివరించడం జరుగుతుంది.
ఓ తండ్రి తీర్పు లఘు చిత్రానికి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులు రెండు వరించాయి.
ఐ ఎఫ్ యం ఏ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్) వారి అవార్డు మరియు పిన్ టీవీ సంస్థ వారి అవార్డులు గెలుచుకున్నాయి.
శ్రీరామదూత ఫిల్మ్ మేకర్ పతాకంపై చిట్టా రాజేశ్వరరావు చిట్టా అపూర్వ అనేవారు నిర్మించగా ఈ చిత్రానికి ఐదు ప్రభుత్వ నంది అవార్డులు అందుకున్న శ్రీ గాదంశెట్టి ఉమామహేశ్వరరావు గారు దర్శకత్వం వహించారు. అంతర్జాల విఫణి నుండి 10 ఓ టి టి ఏజెన్సీ ఫ్లాట్ ఫార్ముల ద్వారా
ప్రేక్షకులు వీక్షిస్తున్నారు.
అనేక కుటుంబాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఇతివృత్తంగా తీసుకున్న కథా నేపథ్యంలో కొనసాగింది ఈ చిత్రం.
తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాల్సిన తనయులే తమ బాధ్యతను విస్మరిస్తున్నారని, నిరాదరణకు గురి అవుతున్న తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని యువతలో మార్పు కోరే దిశగా ఈ లఘు చిత్రం నిర్మించబడింది.
ఓ తండ్రి తీర్పు లఘుచిత్రం లింక్, కథా సమీక్ష అనంతరం
చూడగలరు.
ఇక కథలోకి తొంగి చూద్దామా!
1వ కథ అనుబంధం.
****”
పాత్రలు 1 రంగనాథం 2 రాజా 3 ఆదిత్య
గుడ్డి ప్రేమ ప్రమాదం.
పిల్లలనుప్రేమించు
కానీ నమ్మవద్దు. నీ ఆస్తి, ఏదైనా నీ తర్వాతే ఎవరికైనా.
పిల్లవాడు నీ వాడే వాడి భార్య పరాయిది.
ఇత్యాది నిత్య సత్యాలను తెలిపే కథ అనుబంధం.
రంగనాథం గారి పిచ్చి ప్రేమను వాడుకొనీ ఆయన కొడుకు
రాజా, నాన్నగారి ఆస్తులుఅన్ని అమ్మించి తనపేర డబ్బు వేసుకొని నాన్నను ఎయిర్ పోర్ట్ లో వదిలే గుట్టుగా అమెరికా వెళ్ళిడం, రంగనాథం గారు
పక్కింటి ఆదిత్య సహాయంతో ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి రావడం తో కథ ముగుస్తుంది.
కానీ ఈ కథలో రెండు విషయాలు అసంపూర్ణంగానే ఉన్నాయని రచయిత కిరణ్ గారికి అనిపించిది. ఆ రెంటిని పాఠకులకు తెలపడానికి రెండో కథ రాయడం జరిగింది.
అదే ఉషోదయమా…
అన్న పేరు గల రెండో కథ.
2)ఉషోదయమా..
“ముఖ్య”పాత్రలు 1 రాజా2 రాజా భార్య, నిషా 3 నిషా అన్న.4. రంగనాథం (రాజా తండ్రి )
“””””””””””””””””””
మనం తప్పు చేస్తుంటే ఎవరు చూడలేదనుకుంటా ము.
కానీ చూచేవాడు చూడనే చూస్తాడు. తగిన శిక్ష వేస్తాడు.
ఒకప్పుడు నిజంగా జరిగింది సాఫ్ట్వేర్ రంగం ఎందరో లక్షాది కారులు భిక్షాధికారులు అయినారు. అందులో రాజా నిషా ప్రధములు. ఉన్నదంతా ఊడ్చుకొని పోతే పొట్ట చేత పట్టుకుని ఇండియాకి వస్తారు
బావ మరిది తన నాన్నను కూడా రాజాకు అప్ప చెప్పి నాగపూర్. జారు కుంటాడు
రంగనాథం గారిని మోసం చేసి ఆస్తి కాజేసిన రాజాను, నిష ను నిష పుట్టింటి వాళ్ళు పురుగులను చూసినట్టు చూస్తారు ఇక్కడ సందర్బానికి తగ్గ సంభాషణతో కథ
రక్తి కట్టింది.
మూలిగే నక్క మీద తాటికాయ పట్టేట్టు
రాజా నిషాల జీవితం
దుర్భరమైంది.
రాజా, ఓమిత్రుని సహాయంతో, తనకు నిషాకు ఉద్యోగాలుసంపాదించినా ఆ ఉద్యోగాల్లో అనుకొని ఆపద వస్తుంది. తన మీద మోపిన నేరాన్నీ
తన యజమానికి చెప్పుకోవడానికి వెళ్లిన రాజా, నిషా, అక్కడ యజమాని స్థానంలో
ఉన్న రంగనాథం గారిని చూచి
వణికిపోతారు. ఇంతవరకు వారిని కమ్ముకొని ఉన్న అహంకారమనే చీకటి (నిషా ఆమెకు తగ్గ పేరు) తొలగి వారిలో ఉషోదయ రేఖలు కనపడినట్లు పశ్చాత్తాపంతో రంగనాథం గారి పాదాలపై పడతారు.
రంగనాథం గారు నిష్పక్షపాతంగా, కోర్టులో న్యాయమైన తీర్పు చెప్పే జడ్జి లాగా వారిద్దరిని అడగవలసిన అడిగేసి గెట్ లాస్ట్ అంటాడు.
దానికి కారణం రంగనాథం గారి
సిద్ధాంతాలు రెండు. 1) నమ్మిన వారినిమోసం చేయకూడదు.
2)
ఆత్మ విశ్వాసమే నీ ఆయుధం.
వాటిని నమ్ముకున్న రంగనాథం గారు కొడుకును కోడలిని
నిర్ధాక్షిణ్యంగా శాశ్వతంగా వదులుకున్నారు. ఇదే “ఓ తండ్రి తీర్పు” కొడుకు వల్ల రిక్తహస్తాలతో నిలిచిన రంగనాథం గారు ఆత్మవిశ్వాసంతో ఈనాడు కోట్లకు అధిపతి అయినారు.
చారిత్రాత్మకమైన ఈ తీర్పు ఈనాటి యువతీ యువకులకు గుణపాఠం కావాలి.
చివరి దశలో ఎవరు చూస్తారో (పనిమనిషో
పరాయి వాళ్ళోఎవరైనా)
,వారికి తమ ఆస్తినీ తల్లిదండ్రులు ఇచ్చేసే నిర్ణయానికి రావాలి.
ఈ కథలో ఇది చక్కని సందేశం.
విలువైనవిషయాలు..
1) కొడుకు మోసానికి గురైన రంగనాథం గారిని,తల్లి తండ్రి లేని ఆదిత్య, “నిన్ను నాన్నా అని పిలవచ్చా” అన్న వాక్యం, సందర్భానికి విలువనిచ్చే వాక్యం.
2)ఎంతవిద్యావంతులైనా,
నిషాలాంటి వారి నోట
వచ్చే మాటలు.”ఆ ముసలాడిడబ్బులు
కూడా అయిపోయాయి” అన్నది
2) తన కొడుకు, కోడలికి కనపడకుండా అటు తిరిగి కూర్చున్న రంగనాథం గారు “నేను తప్పు చేయలేదు నాపై కేసు పెట్టారు”అన్నకొడుకు మాటలకు “నీకు మోసం చేయడం, తప్పు చేయడం తెలియదా?” అంటూ కొడుకు వైపు తిరిగిన రంగనాథం గారి మాటలు,కదలిక చక్కగా సందర్భోచితంగ ఉన్నాయి..
ఇలాంటివి కవి యొక్క పదప్రయోగ దక్షతకు, వాక్య నిర్మాణ చాతుర్యానికి, పాత్ర పోషణ నైపుణ్యానికి
నిదర్శనం.
సాహిత్యాభిమానులు,సకల సాహిత్య ప్రక్రియా నిపుణులు,
అన్నిటికంటే ఓర్పు నేర్పు, గల రచయిత డా. చిటికన కిరణ్ కుమార్ గారు చక్కటి కథా రచయితగా ఈ కథల ద్వారా గుర్తింపు పొందారు. దానికి నిదర్శనమే “ఓ తండ్రి తీర్పు” ఇది పేరుకు లఘుచిత్రం. పెద్దరికం లో అలఘు చిత్రం.
ఈ సమీక్షతో కూడా ఆ లఘుచిత్రాన్ని జోడించడం జరుగుతుంది. పాఠకోత్తములు కదా సమీక్షలు చదివి లఘు చిత్రాన్ని వీక్షించి ఆనందిస్తారని ఆశిస్తూ…
ఐ. ఎఫ్. ఎమ్. ఎ మరియు పిన్ టి. వి ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు అందుకున్న ” ఓ తండ్రి తీర్పు”లఘు చిత్రం




