మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ధారావాహిక నవల

జీవన మాధుర్యం

by Laxmi Madan April 9, 2025
written by Laxmi Madan


4వ భాగం

దూరంగా ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు.

అపర్ణ ఆ వ్యక్తిని చూసి ఒక్కసారి కలవరపడింది. అతనేనా? కాదా? అని ఆలోచనలో కూడా పడింది.

అతను కూడా అపర్ణని కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నాడు.

ఇంతలో భూమవ్వ అతన్ని చూసి,

“సారు! బాగున్నారా” అని అడిగింది.

“బాగున్న ” అని అతను అపర్ణ వైపు చూస్తున్నాడు.

ఇంతలో భూమవ్వ “అపర్ణమ్మ ఈయన భూపాల్ రెడ్డిసారు కొడుకు శ్యామ్ రెడ్డి సార్” అని చెప్పింది.

ఆశ్చర్యం నుండి తే రుకున్న అపర్ణ , అతన్ని చూసి చిరునవ్వు నవ్వింది. అతను కూడా అపర్ణ వైపు చూసి నవ్వి..

” అపర్ణ బాగున్నావా”? అడిగాడు.

” నేను బాగున్నాను శ్యామ్” అన్నాది.

భూమవ్వ అప్పుతో “అమ్మ నేను లోపలికి పోతా! వసంతమ్మా నాకోసం చూస్తుంది” అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది.

శ్యామ్ అప్పటిలాగే ఉన్నాడు. అతని అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఈ వయసులో కూడా మొహంలో మంచి తేజస్సు కనబడుతుంది. అలాగే అతని డ్రెస్సింగ్ కూడా అలాగే ఉంది. బ్లూ జీన్స్ పైన వైట్ షర్ట్ వేసుకున్నాడు. వత్తయిన జుట్టు కొంచెం పల్చబడింది. కానీ వన్నె ఏమాత్రం తగ్గలేదు. అలాగే అతన్ని చూస్తున్న అపర్ణ,

” లోపలికి వెళ్దామా శాం” అని అడిగింది.

” లోపలికి వెళ్తే నీతో మాట్లాడటం కుదరదు. కాసేపు నాకోసం ఇక్కడే కూర్చుంటావా?” అని అడిగాడు.

” అలాగే” అని అపర్ణ అక్కడే వాకిట్లో ఉన్న కుర్చీలో కూర్చుంది.

అపర్ణ లాగే శ్యామ్ కూడా అపర్ణ గురించి ఆలోచిస్తున్నాడు.
“ఎంత అందంగా ఉంది. అపర్ణను స్కూల్లో చూసినట్టుగానే అనిపిస్తుంది. కాకపోతే వయసుతో వచ్చిన అందం ఇంకా రెట్టింపు అయ్యింది. ఆమె కట్టుకున్న చీర ఆమె తయారైన విధానం చాలా సింపుల్ గా ఉంది.
మొదటినుండి సింపుల్ గా ఉండడమే తనకు అలవాటు. అదే ఆమెకు పెట్టని ఆభరణం అయింది.

” ఏంటి ఏం ఆలోచిస్తున్నారు? మాట్లాడుకుందాం అన్నారు?” అని అడిగింది.

” అదేం లేదు అపర్ణ! నాకు నిన్ను చూస్తే కొంచెం గిల్టీ అనిపిస్తుంది.నిన్ను స్కూల్లో ఉన్నప్పుడు చాలా ఏడిపించాను. కానీ నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అని నేను అనుకోలేదు. అప్పట్లో నాకు తెలియదు కూడా. కానీ నువ్వంటే చాలా ఇష్టం అది వ్యక్తపరిచే విధానం తెలియక నిన్ను పరి పరి విధాలుగా ఇబ్బంది పెట్టాను.నన్ను క్షమిస్తావా? కానీ ఒక్కటి మాత్రం నిజం. ఇన్నేళ్లలో నువ్వు నన్ను ఒక్కసారైనా గుర్తు చేసుకున్నావో? లేదో? తెలియదు. కానీ ప్రతి క్షణం నేను నిన్ను గుర్తు పెట్టుకున్నాను. నీతో ఆ విధంగా కాకుండా వేరే విధంగా ప్రొసీడ్ అయినట్లయితే నువ్వు నాకు దూరం అయ్యే దానికి కాదేమో! నీ మనసులో నా పట్ల కోపం నిండేలా నేనే ప్రవర్తించాను. అయినా ఆ వయసులో ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఏది ఏమైనా ఇప్పుడు నాకు మనసు ప్రశాంతంగా ఉంది” అని చెప్పాడు శ్యామ్.

” నేనెప్పుడో మర్చిపోయాను శ్యామ్. మన వయసెంతని? నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను. ఇవన్నీ చిన్న చిన్న విషయాలను నేను తేలికగ తీసుకోవాల్సింది. అనవసరంగా నేను సార్ కి కంప్లైంట్ చేశాను .అందరిలో సార్ నిన్ను తిట్టారు. నేనే నిన్ను క్షమించమని అడుగుతున్నాను. ఇవన్నీ ఆ వయసులో సాధారణమే. మనమిద్దరం ఎప్పుడు స్నేహితులమే !అవన్నీ మర్చిపో” అంటూ నవ్వింది అపర్ణ.

శ్యామ్ కూడా నవ్వుతూ…

” హమ్మయ్య మనసు కుదుట పడింది. నీకు ఇంకా నాపై కోపం ఉందేమో అని భయపడ్డాను. నువ్వు ఇక్కడ ఇంకా ఎన్ని రోజులు ఉంటున్నావు? ఉంటే ఒకసారి మా ఇంటికి వచ్చి నా భార్య పిల్లల్ని కలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఏమంటావ్?” అన్నాడు శ్యామ్.

” సమయాన్ని బట్టి చూస్తాను శ్యామ్ .నాకు కూడా రావాలనే ఉంది. లోపలికి వెళ్దామా ఇలా బయటే కూర్చుంటే బాగుండదు” అని ఇద్దరు లోపలికి వెళ్లి కూర్చున్నారు.

లోపలికి వెళ్లేసరికి అంకురార్పణ స్టార్ట్ అయింది.ముగ్గురు స్నానాలు చేసి పట్టు వస్త్రములు ధరించి పీటల మీద కూర్చున్నారు. నవధాన్యాలు మట్టి కంచుళ్ళలో వేయించి నీరు పోయించి పూజా విధానం అంతా చేయించారు. ఇదంతా ఒకపక్క చూస్తూనే ఆలోచనలోకి వెళ్ళిపోయింది అపర్ణ.

అప్పుడు తను పదవ తరగతిలో ఉంది. ఎప్పటిలాగే ఆరోజు కూడా స్కూలుకు బయలుదేరింది. కొంచెం వర్షం కూడా మొదలయ్యింది. ఎప్పుడూ తనను వెంబడించే శ్యామ్ కనబడలేదు. గత రెండు నెలలుగా వెనకాల రావడము, ఒక విధంగా నవ్వడం ఏదో రకంగా టీజ్ చేయడం కావాలని తన పేరు పిలవడం ఇలా చేస్తున్నాడు. తను ఏ సమాధానం చెప్పినా దానికి కౌంటర్ వేస్తున్నాడు. ఆ కళ్ళల్లో పొగరు పెదవుల పైన నిర్లక్ష్యమైన నవ్వు చూసి చాలా కోపం వచ్చేది అపర్ణకి.

” హమ్మయ్య ఈరోజు నన్ను వెంబడించడం లేదు వీడు” అని మనసులో అనుకొని సందు చీరల్లో తనతో కలిసే స్నేహితురాలుని చేరుకుని గబగబా నడవ సాగింది. వాన చినుకులు ఎక్కువ కాసాగాయి.ఇంకా పుస్తకాలు తడుస్తాయేమోనని స్కూలుకు కొంచెం దగ్గరలో ఉన్న ఒక కిరాణా షాప్ లో వెళ్లి నిలబడ్డారు అపర్ణ , స్నేహితురాలు సువర్ణ.

“ఎలాగే వర్షం తగ్గేలాగా లేదు. స్కూల్లో ఈరోజు యూనిట్ టెస్ట్ కూడా ఉంది. ఎలా వెళ్దాము? “అని అపర్ణ అన్నది.

” నువ్వు మరీ చెప్తావు అప్పు! మన సారైనా వర్షంలో తడుస్తూ వెళ్లాల్సిందే కదా! అతను ఇంకా వెళ్ళలేదు. ఎవరూ రాకుండా యూనిట్ టెస్ట్ ఎలా తీసుకుంటారు? నీకు అన్నిటికీ భయమేలే. వర్షం కారణంగా రేపు పెట్టవచ్చు. లేదా మరొక రోజు అంతే గాని ఊరికే టెన్షన్ పడకు” అన్నది సువర్ణ.

చదువు అంటే ఎంతో ఇష్టం. ఈ విషయంలో మాత్రం నిక్కచ్చిగా ఉంటుంది .ఆటలు ఎన్ని ఆడినా అల్లరి ఎంత చేసినా, చదువును మాత్రం నిర్లక్ష్యం చేయదు. అందుకే ఎగ్జామ్ మిస్ అవుతానే మోనని భయపడింది.

ఆ తర్వాత ఆ ఊర్లో ఉన్న చిన్న టాకీస్ లో చూసిన సినిమా గురించి మాట్లాడుకుంటూ, వెనక్కి తిరిగి చూసింది అపర్ణ.

తనకు కొంచెం దగ్గరలోనే నిలబడి ఉన్నాడు శ్యామ్. ఒక్కసారి ఉలిక్కి పడింది.తను పిరికిదేమి కాదు. కానీ ఈ విషయం తనకి అర్థం కావడం లేదు. చాలా కొత్త కొత్తగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎలా దీన్ని పరిష్కరించుకోవాలో కూడా అర్థం కావడం లేదు. తల్లిదండ్రులకు చెప్పాలనుకుంటే అర్థం చేసుకుంటారో? లేదో? తెలియదు. మళ్లీ ఈ భయంతో చదువు ఆపేస్తారేమోనని మరో భయం. ఇలా ఆలోచిస్తూ నిలబడ్డ అపర్ణకి, అతని ఏదో కామెంట్ చేయడం వెకిలినవ్వు నవ్వడం చూస్తే చిరాకు అనిపించింది.

” పదవే సువర్ణ! స్కూలుకు వెళ్ళిపోదాం “అని వర్షం లోనే బయలుదేరింది .

” ఏ ఆగు ఇంత వర్షంలో ఎలా వెళ్తాం? కాసేపు ఇక్కడే నిలబడదాం” అని అరిచింది సువర్ణ.

” నీ ఇష్టం నువ్వు వస్తే రా లేకుంటే నేను వెళ్ళిపోతున్నాను” అని నడవ సాగింది అపర్ణ. ఇంకా తప్పదని సువర్ణ అపర్ణని అనుసరించి వెళ్లిపోయింది. అలా తడుస్తూనే స్కూలుకు వెళ్లిపోయారు.

స్కూలుకు వెళ్లిన అపర్ణ తన బ్యాగు తెరిచి అందులో ఉన్న వస్తువుని చూసి భయపడిపోయింది. కళ్ళ వెంబడి నీళ్లు వస్తుంటే, అలాగే చూస్తూ కూర్చుంది.

తన స్కూల్ బ్యాగ్ తెరిచి చూసిన అపర్ణ కు ఒక ఎర్ర గులాబీ కనిపించింది .దానిని మెల్లగా తీసింది. గులాబీ చాలా అందంగా ఉంది. దాని తొడిమెకి తెల్ల పేపర్ చుట్టి ఉంది. తనతో వచ్చిన తన స్నేహితురాలు సువర్ణ అలాగే కళ్ళు తెరిచి చూస్తుంది” ఏంటే ఇది?లెటర్ లాగా ఉంది.అమ్మో! ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా” అని భయపడుతూ గట్టిగా మాట్లాడసాగింది.

” సువర్ణా! ఆగు . కొంచెం నీ గొంతు స్థాయి తగ్గిస్తావా? అసలే నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. కాస్త నన్ను ఇది ఏంటో చూడనీ.నన్ను కంగారు పెట్టకు” అని అన్నది.

అప్పటికే సువర్ణ గొంతు విన్న కొంతమంది మగ పిల్లలు ఇటువైపు చూడడం మొదలుపెట్టారు.

అదేమీ పట్టించుకోకుండా అపర్ణ తను కూర్చునే బెంచ్ లో కూర్చుని మెల్లగా కాగితం విప్పింది. ఊహించిందే అంతకన్నా ఏముంటుంది కనుక. “ఐ లవ్ యు”❤️ అని చక్కని అక్షరాలతో రాసి ఉంది .కాస్త కళాపోషణ ఉందేమో! దానిని కొంచెం కళాత్మకంగా రాసి, పువ్వులు తీగలు పెట్టి ఇచ్చాడు.

ఆ ఉత్తరం చదివిన అపర్ణ లోపల కొంచెం ఆందోళన పడ్డా కూడా, మీదికి ఏమీ పట్టనట్లు మొహం పెట్టుకొని ఆ ఉత్తరాన్ని చించి ముక్కలు చేసి చెత్తబుట్టలో పడేసి వచ్చింది .అలాగే పువ్వుని కూడా బయటకు విసిరేసింది. ఇంతలో క్లాస్ టీచర్ వచ్చారు మొదటి పీరియడ్ ఇంగ్లీష్ . ఆరోజు సార్ గ్రామర్ చెప్తున్నారు. అన్యమనస్కంగా ఉంది.కానీ అది ఏమీ లేనట్టుగా గ్రామర్ వినసాగింది . మనసు అక్కడ లేనేలేదు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. “ఇలాంటివి ఇంట్లో తెలిస్తే తన పరిస్థితి ఏంటి? తన చదువు ముందుకు సాగుతుందా!” ఇలా ఆలోచిస్తున్న అపర్ణకి సారు అపర్ణని ఒక క్వశ్చన్ అడిగాడు.

“అపర్ణా! వచ్చి ఆక్టివేస్ లో రాసిన సెంటెన్స్ ని పాసి వైస్లో రాసి చూపించు” అని అడిగాడు.

అపర్ణకి ఆమాట వినిపించలేదు. అలాగే కూర్చుని ఉంది.

“ఏంటమ్మా క్లాసులో నిద్రపోతున్నావా? ఎప్పుడూ చురుగ్గా ఉండే దానివి ఏమైంది ఈవేళ నీకు ?అసలు క్లాస్ వింటున్నావా లేదా?” అని అన్నారు సార్.

ఒక్కసారి ఈలోకంలో వచ్చిన అపర్ణకి, సార్ అడిగేది అర్థం కాక లేచి నిలబడి “సారీ సార్” అన్నది.

సరే ఇప్పటికైనా వచ్చి బోర్డు మీద ఇది చేయి” అన్నారు.

వెంటనే చాక్ పీస్ తీసుకొని వెళ్లి అపర్ణ దానిని మార్చి వచ్చింది. సార్ తో పాటు క్లాసులో అందరూ చప్పట్లు కొట్టారు. మనసు మళ్ళీ చురుగ్గా అయిపోయింది. “ఇలాంటి పిచ్చి రాతలతో మనసు నేనెందుకు పాడు చేసుకోవాలి? నేను చదువుకోవాలి అనుకున్నాను. చదువుకుంటాను. ఇలాంటి చిన్న చిన్న వాటికి నేను బెదిరిపోను”అని దృఢనిశ్చయంతో వచ్చి తన సీట్ లో కూర్చుంది.

ఆ నోటా ఈనోటా తెలిసిన తన తరగతి అమ్మాయిలు విచిత్రంగా చూడ సాగారు “లవ్ లెటర్ వస్తే కూడా ఇంత ధైర్యంగా ఉంటారా” అని గుసగుసలాడుకోసాగారు.

ఇదేమి పట్టకుండా అపర్ణ ఎప్పటిలాగానే స్కూల్ అయ్యాక సాయంత్రం ఇంటికి వెళ్ళింది. ఇంట్లో మాత్రం ఈవిషయం ఏమి చెప్పలేదు. కాసేపు హోం వర్క్ చేసుకొని ఇంటి పక్కన ఉన్న వేరే స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళింది. ఆ విషయం దాదాపు మర్చిపోయింది కూడా.

తెల్లవారి మళ్లీ స్కూల్ కి వచ్చింది? వస్తూనే బుక్స్ డెస్క్ లో పెట్టడానికి చేయి పెట్టింది. మళ్లీ చేయికి మెత్తగా తగిలింది చూస్తే ముందు రోజు లాగానే గులాబీ పువ్వు ఉత్తరం ఈసారి చదవకుండానే చింపి పడేసింది అపర్ణ. ఇలా వరుసగా మూడు నాలుగు రోజులు జరిగాక, ఆ ఉత్తరం తీసుకెళ్లి ఆఫీస్ రూమ్ కు వెళ్లి క్లాస్ టీచర్ కి ఇచ్చింది.

సార్ ఇది రాసింది మన స్కూల్ వాళ్లేనా? లేక ఇంకెవరైనా? మీరు హ్యాండ్ రైటింగ్ చూసి కనుక్కోండి. ఈ విషయం ఏమాత్రం మా ఇంట్లో తెలియకూడదు. తెలిస్తే నాచదువుకు ఆటంకం జరుగుతుంది .అమ్మ వాళ్లు బాధపడతారు. నేను బయటకు వస్తే భయపడతారు. అందుకని రహస్యంగా ఇది చేసి పెట్టండి సార్” అని చెప్పింది.

ఆమె ధైర్యానికి ముచ్చట పడ్డ మాస్టారు,
” అలాగే తల్లీ! నీకు చదువు పట్ల ఉన్న శ్రద్ధకు నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఇలా జరిగితే వేరే ఆడపిల్లలు భయపడి పోయి రాద్ధాంతం చేసి ఇంట్లో చెప్పి స్కూల్ మానేసేవాళ్ళు. కానీ ఇలాంటివి పట్టించుకోకుండా నువ్వు ధైర్యంగా ఉన్నావు చూడు, ఇది నాకు చాలా నచ్చింది. నేను తప్పకుండా నా వంతుగా ప్రయత్నం చేసి కనుక్కుంటానుమ్మ! అయినా నువ్వేం భయపడకు ?చక్కగా చదువుకో ఏఅవసరం వచ్చినా నేనున్నాను” అని చెప్పారు.

సంతోషంతో తల ఊపిన అపర్ణ క్లాస్ కి వెళ్ళిపోయింది.
వయసుకు మించిన పరిణితి కలిగిన ఆ అమ్మాయిని చూస్తూ అలాగే ఉండిపోయారు మాస్టారు.

ఆ మరుసటి రోజు తరగతికి వచ్చిన అపర్ణ కు ఒక ఆశ్చర్యకరమైన వార్త తెలిసింది.

ఎప్పటిలాగే తరగతికి చేరుకున్న అపర్ణకి ఆశ్చర్యకరమైన వార్త ఎదురైంది. తనకు ఇన్ని రోజులుగా ఉత్తరాలు రాస్తూ భయపెట్టింది శ్యామ్ అని తెలిసింది. తన క్లాస్ కి వెళ్లేసరికి నిలబెట్టి సార్ గట్టిగా తిడుతున్నారు.

అపర్ణ చూసిన సార్…

“రామ్మ అపర్ణ! ఇన్ని రోజులుగా నిన్ను ఇబ్బందులకు గురిచేసింది వీడే. వీడ్ని ఏం చేయమంటావ్” అని అన్నాడు.

ఏమి తోచనీ అపర్ణ ” మీ ఇష్టం సార్” అని తలవంచుకొని తన స్థానంలో వెళ్లి కూర్చుంది.

సార్ శ్యామ్ ను బెదిరించాడు

” ఇది మొదటి తప్పుగా నేను ఊరుకుంటున్నాను. ఇంకొకసారి ఇలా చేస్తే టీసి ఇచ్చి పంపించేస్తాను. ఇప్పుడు నిన్ను వేరే సెక్షన్ మారుస్తున్నాను. వేరే సెక్షన్ లో వెళ్లి కూర్చో. ఇంకొకసారి ఏ పిల్లనైనా ఏడిపించావో ఊరుకోను” అనగానే అవమాన భారంతో మొహం కందిపోయింది శ్యాంకు.

తరగతి మారిన తర్వాత తనను మళ్ళీ ఎప్పుడు ఏర్పించలేదు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్ళకే అతన్ని చూసింది.

ఒక్కసారి భాజాలు చప్పుడుకు ఈ లోకంలో వచ్చిన అపర్ణకి వసంత పిలుస్తూ కనిపించింది.

“ఇక్కడ అంకురార్పణము మిగతా కార్యక్రమాలు అన్ని అయిపోయాయి కదా !అందరూ భోజనాలకు వెళ్ళండి. ఆడవాళ్లు మాత్రం ఉండి, అమ్మాయిని పెళ్లికూతురుని చేసి, గాజులు వేసుకోవాలి. అందరం పందిట్లోకి వెళదాము ” అని చెప్పింది. చాలామంది ఇంటి వెనక పందిట్లో ఏర్పాటు చేసిన భోజన శాలకు వెళ్లారు. పందిట్లో పచ్చ ముగ్గుతో విస్తాళ్ళ ముందట తీగలాగా ముగ్గులు వేశారు. కూర్చోడానికి చాపలు పచ్చటి విస్తర్లు పరిచారు. కూర్చో లేని వారికి టేబుల్స్ వేసి వడ్డిస్తున్నారు.

సాంప్రదాయకమైన వంటలు ఘుమ ఘుమలాడుతున్నాయి..

ఏ శుభం జరిగిన ముందుగా విస్తట్లో కుడివైపు పంచదార, ఎడమవైపు ఉప్పు వడ్డిస్తారు. తర్వాత టమాటా పప్పు, కూరల్లో మహారాణి అయిన వంకాయ సోగి,బెండకాయ శాకము. బీరకాయ పచ్చడి, ముక్కలు వేసినా చారు, పెళ్లికూతురుని చేసే రోజు కాబట్టి భక్షాలు తప్పకుండా ఉండాల్సిన బూందీ లడ్డు, మిర్చి బజ్జి, అప్పడాలు వడియాలు ఇవన్నీటి వాసనలు ఎప్పుడెప్పుడు భోజనం చేద్దామా అనిపించేలా ఉంది. అంతా వడ్డన జరిగాక చక్కగా దైవ ప్రార్థనతో భోజనం చేయడం ప్రారంభమైంది.

బాబాయ్ కొంచెం పప్పు వేసుకో!

తాత ఇంకో లడ్డు తిను.

ఇదిగో ఈ మిర్చి బజ్జి తిన్నారంటే ఆహా! అంటారు తినండి.

పెద్దనాన్న!సాంబార్ లో ముక్కలను తప్పకుండా తినండి. అంటూ కొసరి కొసరి వడ్డిస్తున్నారు. ఆనాటి పెళ్లిని తలపిస్తుంది ఈనాటి పెళ్లి .ఒకసారి పందిరంతా కలియతిరిగిన అపర్ణ లోపలికి వెళ్ళింది.

“అపర్ణ! పెళ్లికూతురుని చేస్తారు కదా! మేనమామ తెచ్చిన చీర కట్టించు.కాస్త సంగతి చూడు” అన్నది వసంత.

“సరే “అని లోపలికి వెళ్ళింది అపర్ణ. అప్పటికే అక్కడ పెళ్లికూతురు కట్టుకోవలసిన చీర వేసుకోవాల్సి నగలు ఉంచింది వసంత.

ఎర్రని పట్టుచీర.. బంగారు రంగు జరితో మెరిసిపోతుంది… దానికి మ్యాచింగ్ ఎర్ర రాళ్ల నెక్లెస్ గాజులు జుంకీలు ఉన్నాయి. చీర కట్టడంలో సహాయం చేసిన అపర్ణ ,వసంత కూతురితో మాటలు కలిపింది.

“నేను తెలుసా నీకు”? అని అడిగింది.

“అదేంటి అత్త అలా అంటారు ?అమ్మా ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది. ప్రతిరోజు మిమ్మల్ని గుర్తు చేస్తుంది .అందుకని మీరు నాకు కొత్తగా అనిపించడం లేదు” అని చిరునవ్వు నవ్వింది. ఆ మాటలు ఎంతో సంతోషాలు ఇచ్చాయి అపర్ణకు. అమ్మాయిని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుని.

” చాలా అందంగా ఉన్నావు. సాయంత్రం దిష్టి తీస్తాను” అని చెప్పి

“పద పందిట్లోకి వెళ్దాము” అని ఇద్దరు కలిసి పందిట్లోకి వచ్చారు.

పచ్చని ఆకులు పరిచిన పందిరి కావడం వల్ల చాలా చల్లగా, ఒక విధమైన పరిమళం వస్తూ ఉంది. వాకిలంతా చాపలు పరిచి ఉంచారు. బుట్టలో ఆకుపచ్చ ఎరుపు రంగు గాజులు అందంగా పేర్చి ఉంచారు .ఒక్కొక్కరి చేతుల సైజును బట్టి ఏర్పాటు చేశారు. పెళ్లికూతురు కూర్చోవడానికి ఒక పీఠం వేసి ఉంచారు. ఒక ఐదు మంది ముత్తైదు వులకు పెళ్ళికూతురుతో గాజులు ఇప్పించి, మిగతావి అందరినీ వేసుకోమని చెప్పారు. పెళ్లికూతురుకి ముందుగా కళ్యాణ తిలకం తీర్చిదిద్ది, కాళ్లకు పసుపు పారాణి రాసి కూర్చోబెట్టారు. ముందుగా చేతుల నిండా పెళ్లి కూతురికి ఆకుపచ్చని గాజులను వేశారు.

తర్వాత అందరూ ఒకరి తర్వాత ఒకరు వాళ్లకు నచ్చిన రంగును వేసుకొని ముచ్చటగా చూసుకుంటున్నారు.

ఓ వదిన ఏంటి శోకా? కొన్ని గాజులే వేసుకుంటున్నావు. లేక మా అన్నయ్యతో ఉన్నప్పుడు చప్పుడు బయటకు వనిపిస్తుందని వేసుకోవడం లేదా”? అని ఒక వదిన వరుస ఉన్న ఆవిడను పరాచకం ఆడుతుంది మరో మహిళ.

” పోమ్మా! ఇంత వయసు వచ్చినా నీకు చిలిపి మాటలు పోలేదు” అని సిగ్గు పడింది మొహం అంతా ఎర్రగా కందిపోయింది.

“అయ్యో నేను ఏమన్నా వదినా? అందరికీ ఉన్నదే అన్నాను .కానీ కొత్తది ఏమైనా అన్నానా” అని ఈ మరదలు అన్నది.

” ఊరుకొండమ్మ.. పెళ్ళికాని పిల్లలు ఉన్నారు. వింటే ఎలా ఉంటుంది “అని ఒక పెద్ద ఆవిడ కోపం నటిస్తూ అన్నది. కానీ మనసులో ఆ సంభాషణ కొనసాగాలని ఉన్నది తనకి కూడా..

ఇలా రకరకాల కబుర్లతో ఆ కార్యక్రమం సంతోషంగా జరిగిపోయింది.

పెళ్లికూతురుతో పాటు అందరూ భోజనాలకు వెళ్లారు. పెళ్లికూతురుకు పీట వేసి ముగ్గు వేసి పచ్చని విస్తరి పరిచి రెండు దీపాలను అటు ఇటు పెట్టి, కూర్చోబెట్టారు. ఇంతలో పెళ్లికూతురు ఫోన్ మోగింది. లోపల నుండి ఆ అమ్మాయి స్నేహితురాలు ఫోన్ పట్టుకొని వచ్చి,

“మీ ఆయన ఫోన్ నేను మాట్లాడనా! పర్వాలేదులే నేను మాట్లాడతాను. భోజనం చేస్తుందని చెప్తాను” అని ఉడికించ సాగింది.

“ఏయ్ సాధన” ఫోన్ ఇలా ఇవ్వు అంటూ పరిగెత్తింది అలేఖ్య. అందరూ నవ్వుకున్నారు.

అలా ఫోన్ కోసం బయటకు పరిగెత్తిన అలేఖ్య ఎదురుగా కనబడిన వస్తువులను చూసి ఆశ్చర్యపోయింది. ఒక బుట్ట నిండా ఎర్రని గులాబీ పూలు, మరొక ఐదు బుట్టలలో రంగురంగుల గాజులు, ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ అందులో అలేఖ్య పెళ్లి కొడుకు మనోహర్ మొదటిసారి కలిసినప్పుడు తీసుకున్న ఫోటో. ఎంతో అందంగా ఉన్న ఆ ఫోటోని నిలువెత్తు చిత్రంగా మలచబడింది. ఆ చిత్రం ఎంతో సజీవంగా ఉంది. అవన్నీ చూసి ఆశ్చర్యము ఆనందము రెండూ కలగలిసి ఏమీ మాట్లాడలేక నిలబడిపోయింది. అలేఖ్య.మొహం లో కొంచెం సిగ్గు కనబడుతుండగా ,తన స్నేహితురాలు సాధనను చూసి

” ఫోన్ ఇవ్వవే ఒకసారి” అని అడిగింది.

ఇంకా ఎక్కువ ఏడిపించడం ఇష్టం లేని సాధన ఫోన్ అలేఖ్య కి ఇచ్చింది. అలేఖ్య తన గదిలోకి వెళ్లి మనోహర్ తో ఒక పది నిమిషాలు మాట్లాడి ,మళ్లీ భోజనం చేయడానికి పందిట్లో కి వెళ్ళింది. అప్పటికే అందరూ పెళ్లికూతురు కోసం ఎదురు చూస్తున్నారు.

“ఏమే మనవరాలా! ఓ రెండు రోజులు ఆగు. మీ ఆయన కొంగుముడి వేసుకుందువుగాని! అప్పుడే ఒకరినీ ఒకరు వదలలేకపోతున్నారా?” అని అమ్మమ్మ వరస ఒక ఆవిడ పరాచకం ఆడింది.

” ఇంతకు ఏమన్నాడే మా కొడుకు” అన్నది వరుస ఆవిడ.
ఇలా అందరూ పరాచకాలాడుతూ నవ్వుకుంటున్నారు. అలేఖ్య ముఖం ఎర్రని గులాబీలా మారింది. చిన్నగా చిరునవ్వు నవ్వుతూ వచ్చి తనకోసం వేసిన పీటపై కూర్చుంది. పెళ్లి కూతురికి వెండి కంచం అరిటాకు పెట్టి వడ్డన మొదలుపెట్టారు.

అక్కడే ఉన్న అలేఖ్య నాయనమ్మ.
.”ముందుగా తీపి పదార్థం నోట్లో పెట్టుకోమ్మా! ఈరోజు పెళ్లికూతురుని చేస్తున్నారు కదా” అని చెప్పింది.

” సరే నాయనమ్మ” అని లడ్డును కొంచెం తుంపి నోట్లో పెట్టుకుంది.అందరూ భోజనాలు మొదలుపెట్టారు.

భోజనాలు చేసి అందరూ తాంబూలం సేవించి హాల్లో పరిచిన చాపల మీద నడుం వాల్చారు.ఇంతలో అలేఖ్య అమ్మమ్మ వచ్చి, ఇలా అందరూ పడుకుంటే ఎలా? అందరూ గోరింటాకు పెట్టుకోవాలి. ముందుగా పెళ్ళికూతురుకు పెట్టి, అందరూ పెట్టుకోండి. మళ్లీ రాత్రి అయితే అందరూ అలసిపోతారు. ఇప్పుడే పెట్టుకోండి” అని చెప్పింది.
వసంత వాళ్ళ తోట నుండి తెప్పించిన గోరింటాకు అని చక్కగా ఇంటి వెనక రోట్లో రుబ్బి పట్టుకొచ్చింది భూమవ్వ.

పెళ్లికూతురుకి వేళ్ళకొనలకి, కాళ్ళకి నూరిన ఆకులు పెట్టి అరచేతిలో అంతా మెహేంది కోన్ తో డిజైన్లు వేశారు. ఇక మిగతా అందరూ పాత పద్ధతిలో ముద్దలుగా, చుక్కలు చుక్కలుగా పెట్టుకున్నారు. ఇదంతా అయ్యేసరికి సాయంత్రం 5 అయ్యింది.

ఇంతలో అందరికీ ఛాయా కాఫీ మరియు బిస్కెట్లు వచ్చాయి. ఇదంతా అయ్యాక అపర్ణకి ఊళ్లోకి వెళ్లి వాళ్ళ ఇల్లు చూడాలి అనిపించింది.

వసంత దగ్గరికి వెళ్లి,

” వసంతా! నేను ఒకసారి మా ఇంటి వైపు వెళ్లి వస్తానే. నాకు ఎప్పుడెప్పుడు వెళ్లి మా ఇల్లు చూద్దామా అనిపిస్తుంది” అని అన్నది.

” ఇప్పుడు వెళతావా! చీకటి పడుతుంది కదా! సరే నీ ఇష్టం వెళ్ళిరా నేను ఎన్నోసార్లు ఆ వైపు వెళ్లాను కాని నాకు ఇంట్లోకి వెళ్లాలనిపించలేదు” అని అన్నది.

“ఇన్నేళ్లుగా నేనే వెళ్లలేదు. అమ్మానాన్న అప్పుడప్పుడు వచ్చి వెళ్తారంట తమ్ముడు అక్క కూడా వచ్చి చూశారట నేను మాత్రమే రాలేకపోయాను. ఏమో అలా జరిగిపోయింది. మా మేనత్త వాళ్లే ఆ ఇంట్లో ఉంటుంది. నీకు తెలుసు కదా సుధత్త. కాబట్టి నాకు కూడా సంకొచం ఏమీ ఉండదు ” అని చెప్పింది అపర్ణ.

“అయితే డ్రైవర్ ను పంపిస్తాను” అన్నది.

” వద్దే! అలా నడుచుకుంటూ చిన్నప్పుడు తిరిగిన రోడ్డంతా చూసుకుంటూ వెళ్తాను. ఇక్కడి నుంచి దగ్గరే కదా” అన్నది అపర్ణ.

“సరే తొందరగా వచ్చేయాలి మరి” అన్నది వసంత.
” అలాగే తొందరగా వచ్చేస్తాను” అని చెప్పి లోపలికి వెళ్లి మామూలు చీర కట్టుకొని హ్యాండ్ బాగ్ తీసుకొని బయలుదేరింది.

సందులో నుండి మెయిన్ రోడ్ కి చేరుకుంది అపర్ణ.. ఆ రోడ్డు అంతా చూసేసరికి తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మనసులో మెదిలాయి. చేతిలో పుస్తకాలు పట్టుకొని స్కూలుకు వెళ్ళేది ఈ రోడ్ మీదనే. ఏది కొనుక్కోవాలన్నా ఎక్కడికి వెళ్లాలన్నా ఈ రోడ్డు మీదే నడుచుకుంటూ వెళ్లేవాళ్లు. రోజుకు ఎన్నిసార్లు తిరిగే వాళ్ళని. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. పెద్ద పెద్ద షాప్స్ వెలిసాయి. పాతకాలం దుకాణాలన్నీ కూల్చివేశారు. గుర్తుపట్టలేనంత మారిపోయింది. మెయిన్ రోడ్డు మీద ఉన్న స్కూలు కూడా లేదు. వర్షాలకు కూలిపోతే వేరే చోట కట్టించారట. స్కూలు లేకపోవడం చూసి మనసు కలుక్కుమంది అపర్ణకు. గుడి, బడి ఒక్కటని తలచిన ఆ రోజులు, అల్లరి చేసిన రోజులు ,ఆడుకున్న రోజులు, చదువుకున్న రోజులు ,అన్ని అక్కడే అలా నీళ్లు నిండిన కళ్ళతో స్కూల్ వైపు చూసింది. మసకగా ఎన్నో జ్ఞాపకాలు. మెల్లిగా అలా నడుస్తూ ముందుకు వెళ్ళిపోయింది. అపర్ణ వాళ్లు ఉన్న వీధిలోకి చేరుగానే, వారి ఇంటికి ఎదురుగా ఉన్న ఇళ్లన్నీ మేడలైపోయాయి. వీళ్ళ ఇల్లు మాత్రమే పెంకుటిల్లు గా ఉంది. ఇల్లు కొంచెం పాతబడిపోయినా కూడా ఏమాత్రం కళ తగ్గలేదు. రాజసంగా నిలబడినట్లు ఉంది ఆ ఇల్లు,ఎత్తైన ఇంటిముందు అరుగులు మాత్రం నేలలోకి కూరుకు పోయినట్లు అయ్యాయి. రోడ్లు వేయగా, వేయగా అరుగులు చిన్నవి అయిపోయాయి. అవి అరుగులు కావు. జ్ఞాపకాల సొరుగులు. ఆరుగుల మీద కూర్చున్న కొంతమంది లేచి నిలబడి
“నువ్వు నువ్వు అపర్ణమ్మ కదా” అని అడిగారు.

” అవును నేను అపర్ణ నే.నువ్వు రాజవ్వవు కదా!” అన్నది.

” నా తల్లి, నా తల్లి! నన్ను ఇంకా మర్చిపోలేదా ?యీడి నుంచి పోయినప్పుడు చిన్నపిల్లవు. అయినా యాది పెట్టుకున్నవ్” అని దగ్గరకు తీసుకుంది రాజవ్వ.

అక్కడే ఉన్న అందరూ కుశల ప్రశ్నలు వేశారు. అందరితో ఎంతో చక్కగా మాట్లాడింది అపర్ణ. అందరూ ఎంతో ఆత్మీయులుగా అనిపించారు. నిజంగా చిన్నప్పటి పరిచయాలు బంధాలు ఎంత గొప్పవి కదా? అనిపించింది.ఇన్ని రోజులు తను ఏం కోల్పోయిందో అర్థమైంది. అందరితో మాట్లాడటం అయిన తర్వాత మెల్లిగా పెద్ద దర్వాజా నుండి వాకిట్లోకి అడుగు పెట్టింది. ఇల్లంతా అప్పటి లాగే ఉంది. వాకిట్లో మూలకు పెద్ద రాధా మాధవ చెట్టు. పూలు విరగబూసి ఉన్నాయి. మరో మూలన సన్నజాజి, చుట్టూతా బంతి చామంతి, సత్యనారాయణ మొక్కలు ఉన్నాయి. చిన్నప్పుడు తాను ఆ మొక్కల చుట్టూతా సిమెంట్ గట్టు కట్టుకున్నది గుర్తుంది. తను ఎంతో శ్రమపడి మొక్కలకు అలా గట్టు కడుతుంటే చూసి వాళ్ళ నాన్న మేస్త్రిని పిలిపించి,

“నా కూతురుకు ఎలా
కావాలో అలా ఆ మొక్కల చుట్టూ గట్లు కట్టండి” అని చెప్పారు అది కళ్ళముందు కనబడింది అపర్ణకి. అలా ఆజ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వాకిట్లో ఉన్న వరండా మెట్లు ఎక్కింది. అప్పటిలాగే వరండాలో ఒక ఆరం కుర్చి వేసి ఉంది. మెల్లిగా భవంతిలోకి కాళ్లు పెట్టింది. ఒక్కసారి మనసంతా పులకించిపోయింది. కళ్ళ ముందు తన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ కదలాడ సాగాయి. ఇంతలో లోపలి నుండి

“ఎవరు”? అంటూ ఒక ఆవిడ వచ్చింది. ఆవిడను అలాగే చూస్తూ ఉండి పోయింది అపర్ణ..

లోపలి నుండి నవ్వుతూ వస్తున్న మేనత్తను చూసి అలాగే నిలబడిపోయింది.

దాదాపు మేనత్త చూసి ఐదేళ్లు దాటిందేమో! తనకన్నా ఒక ఏడేళ్ళు పెద్దది.తనని చిన్నప్పుడు ఎంతో ఆడించేది. ఎక్కడికెళ్ళినా తనతో పాటుగా తీసుకుని వెళ్ళేది.పచ్చని పసుపు రంగుతో, వంకీల జుట్టుతో ఎంతో అందంగా ఉండేది మేనత్త సుధ. ఇన్నేళ్లు లండన్ లో ఉన్నారు వాళ్ళ కుటుంబం అంతా.కానీ దురదృష్టవశాత్తు ఆమె భర్త పోవడం వల్ల (అంటే అపర్ణ మామ) అక్కడ ఉండాలనిపించక భారతదేశానికి తిరిగి వచ్చింది. పిల్లలు ఎంత బ్రతిమిలాడినా కూడా ఉండలేదట. నేను నా పుట్టిన ఊరు వెళ్ళిపోతాను అక్కడ అన్నయ్య ,వదిన ఉన్నారు అని అంటే వాళ్ళు అక్కడ ఉండటం లేదు కదా! ఎందుకు నువ్వు అక్కడ ఒంటరిగా ఉండడం అని చెప్పినా కూడా నేను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఇంట్లో ఉంటాను. నాశేష జీవితం తృప్తిగా అక్కడే గడుపుకుంటాను” అని చెప్పి ఇండియాకు వచ్చి అపర్ణ తండ్రి తో మాట్లాడి తను పుట్టి పెరిగిన ఇంట్లో ఉంటుంది.

” అప్పు ఎలా ఉన్నావే! ” అంటూ దగ్గరికి వచ్చింది మేనత్త సుధ. అప్పటి కళాకాంతులే లేవు అసలు .తన అత్తనేనా అనిపించింది అపర్ణకి.

“అత్తా! నేను బాగున్నాను కానీ నువ్వేంటి ఇలా అయ్యావు? అసలు ఎలా ఉండే దానివి ఎలా అయ్యావు” అని అత్తయ్యను కౌగిలించుకొని ఏడ్చేసింది అపర్ణ.

” బాగానే ఉన్నానే. మీ మామయ్య పోయిన బాధలో ఒక సంవత్సరం పాటు తీరని దుఃఖం అనుభవించాను. మెల్లమెల్లగా నన్ను నేను ఊరడుంచుకుని అన్నయ్యను అదే మీ నాన్నను అడిగి ఇక్కడ మన ఇంట్లో ఉంటున్నాను” అని చెప్పి,

” నిలబెట్టే మాట్లాడుతున్నాను. ఇలా రా చిన్నప్పుడు మనిద్దరమూ పడమటింటి గదిలో కూర్చొని ఆడుకునే వాళ్లం కదా! అక్కడికి వెళ్లి కూర్చుందాం రా” అని లోపలికి తీసుకెళ్ళింది సుధ. ఒక్కసారిగా పాత అనుభూతులన్నీ కళ్ళల్లో మెదిలాయి.

ఆ గదిలో మట్టితో చేసిన గోళాలు ఉండేవి. అందులో బియ్యం పప్పులు అన్ని నిలువ చేసేవాళ్ళు. విశాలమైన గది కావడం వల్ల మిగతా గదంతా పడుకోవడానికి బట్టలు పెట్టుకోవడానికి వాడుకునే వాళ్ళు. ఎప్పుడు ఇంటి నిండా వచ్చి పోయే జనం. పెద్దవాళ్ళు ఎన్ని పనులు చేసుకున్నా కూడా, పిల్లల పైన కూడా ప్రభావం పడేది. సుధ అయితే ఎంతో చేదోడు వాదోడుగా ఉండేది అమ్మకు, నాయనమ్మకు. అందరికీ సుధ అంటే ఇష్టమే. పిల్లలందరినీ స్కూలుకు తయారు చేయడం వారికి తినడానికి ఏదో పెట్టడం, అన్నీ తానే చేసేది.ఇంట్లో ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపించేది.

” సుధా! సుధా! ఆ గిన్నె కనిపించడం లేదు ఎక్కడుంది? ” అని వదిన.

” సుధా! సుధా! నా పంచ కనపడటం లేదమ్మా ఎక్కడుంది? ” అని అన్నయ్య.

“సుధత్త! నా నోటుబుక్కు కనబడటం లేదు”

” సుధత్త !నా పెన్సిల్ కనపడటం లేదు”

” సుధత్త నాకు ఈ లెక్క రావడం లేదు” ఇలా అందరి పనులు సుధనే చేసేది క్షణంలో కళ్ళముందు ప్రత్యక్షమయ్యేది. చక్కని లంగా వోని, బారుగా ఉన్న జడ, ఎంతో అందంగా ఉండేది.

” అపర్ణ! ఏంటే ఆలోచిస్తున్నావు మనిషివి యి క్కడున్నావు కానీ నీ ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. అసలు నిన్ను ఇక్కడ చూస్తాను అనుకోలేదు. అసలు ఎప్పుడొచ్చావు? ఎలా వచ్చావు .అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళొచ్చావా! అందుకే నిన్ను చూడగానే అలాగే ఆశ్చర్యపోయాను!”
అని అన్నది సుధ.

“ఫ్రెండ్ కూతురు పెళ్లికి వచ్చాను అత్త. నేను నా పెళ్లయిన తర్వాత ఇక్కడికి రానేలేదు. అమ్మా,నాన్న హైదరాబాద్లో ఉండటం వల్ల ఎప్పుడో ఒకసారి అక్కడికి వచ్చి వెళ్లడమే జరుగుతుంది. అందుకే నా ఫ్రెండ్ వసంత పెళ్లికి పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చేసాను .అందులో నా బాధ్యతలు కూడా తీరాయి కదా! ఊరంతా చూడాలని ఆశగా అనిపించింది. నీ విషయం కూడా తెలిసింది .అందుకే నీకు చెప్పకుండా నిన్ను కలిసి వెళ్లాలని అనుకున్నాను” అని అన్నది అపర్ణ.

” అవునా చాలా సంతోషమే. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోవే !పెళ్లి ఎల్లుండి కదా రేపు పొద్దున వెళుదువు గాని, మనం మాట్లాడుకుందాము. ఎన్ని రోజులు అయిందో చూసి, కడుపులో నుండి ఏదో బాధ తన్నుకొచ్చేస్తుంది. నీతో గడిపితే నాకు ఊరటగా ఉంటుంది. ఎన్నోసార్లు మనం ఫోన్లో మాట్లాడుకున్నాము. కానీ ఇలా కలుసుకోవడం ఇప్పుడే జరిగింది. ఉంటావా ప్లీజ్ “అని అడిగింది సుధ.

” వసంత ఏమంటుందో? అత్త ఒకసారి ఫోన్ చేసి చెప్పి చూస్తాను” అని వసంత కు ఫోన్ చేసింది.

” వసంత ఏమీ అనుకోకు. అత్త ఉండమని బలవంతం చేస్తుంది. బాధపడుతుంది కూడా, ఈ పూట ఇక్కడే ఉండి రేపు పొద్దున వచ్చేస్తాను” అని చెప్పింది.

” సరేలేవే ఆమె కూడా బాధలో ఉంది. నీ ఓదార్పు కూడా అవసరం. కానీ పొద్దున్నే వచ్చేయాలి” అని చెప్పింది వసంత.

” అలాగే వచ్చేస్తానే” అని చెప్పింది అపర్ణ..

వంటింటి లోకి వెళ్ళిన అపర్ణకి వంటింట్లో ఏదో అలికిడి వినిపించి ఆ వైపు చూసింది.. ఒక్కసారి భయంతో బిగుసుకుని పోయింది అపర్ణ.

సశేషం

April 9, 2025 136 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

వన ప్రాశస్త్యం

by T Venkateshwara Raju April 8, 2025
written by T Venkateshwara Raju

వేదాలు గద్దించాయి
ఇతిహాసాలు ప్రశాంతంగా చెప్పాయి
పురాణాలు ప్రవచించాయి
గ్రంథాలు ఘోషించాయి
వనాలు
మన ప్రాణాలని
శాస్త్రం చెప్పింది
సామాన్యుడూ చెప్పాడు
ప్రకృతి ప్రకోపాలకు
విరుగుడు అడవులేనని

విద్యాభ్యాసంనుండి
వానప్రస్థం వరకు
పశుపాలననుండి
పరిపాలన వరకు
సంస్కృతి చెప్పింది
సాంప్రదాయం నిలబెట్టింది

ప్రజాస్వామ్యంలో
ప్రజాపాలనలో
మాటలు కోటలు దాటుతున్నాయి
చేతలు శాసనాలకే పరిమితమౌతున్నాయి

హరితహారమంటారు
హడావిడి చేసేస్తుంటారు
వేలకోట్ల వాయినాలిస్తారు
వనాలశాతం పెరగలేదంటారు

భూపందేరానికి
భూకామందులమంటారు భూకామాంధులైపోతుంటారు
పచ్చని అడవుల్లో
పశుపక్ష్యాదులు లేవంటారు
బుల్డోజర్లతో
భస్మీపటలం చేస్తుంటారు

అరణ్యాలు
ఆరోగ్య ప్రదాయిణులు
పెరగనివ్వండి
ప్రభుత్వస్థలాలంటూ
ప్రేలాపనలు మానండి
జీవవైవిధ్యాన్ని
అవనిపై మననీయండి
వన ప్రాశస్త్యాన్ని గుర్తించండి
ఘన వారసత్వాన్ని నిలబెట్టండి

April 8, 2025 22 comments
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

తప్పిపోయిన చోటవెతుకులాట-‘మళ్లీ మనిషి లోకి’

by Bellamkonda Sampathkumar April 7, 2025
written by Bellamkonda Sampathkumar

ఒక సహించని తనం, సహనం లేనితొందరలు, మనిషి మీద మనిషికి అకారణంగా ఏర్పడుతున్న ద్వేషం, అసూయ, స్వార్థంసామాజిక వికారాలకు కారణమవుతున్నాయి. మనిషిని మానవత్వాన్ని తప్పించిన,మనిషిలో మనిషి లేనిఅనేక పరిస్థితులనేపథ్యంనుంచి, కవి తన పరిసరాల నుంచి మొదలై రాసినకవితాగుచ్చం‘మళ్లీ మనిషి లోకి’ కవితా సంపుటి. మనిషిలో మనిషి ప్రవహించటం లేదు. మనిషిలో మనిషితోటి వారినికనీసం మెచ్చే పరిస్థితి లేదు.మనిషి తప్పిపోయిన చోటు నుండి.దూరమైనదగ్గరితనంలోంచి మళ్ళీమనిషి మనిషి లోకి రావాలనికలల సంపుటిని వెలువరించాడు కవి. ఆదిలాబాద్ ప్రజల గొంతుక.  – ”పచ్చని కోరికలతో/పంటనే ప్రపంచ మనుకొని/లోకమే తన వాళ్లనుకొని/బతుకుపయనమై పోతున్నప్పుడు/ఆకుపచ్చని కలల రాజు మట్టి గొంతుక కవిఉదారి నారాయణ.

మళ్లీ మనిషి లోకి ఉదారి నారాయణ కవితా సంపుటిలో మొత్తంయాభై ఎనిమిది కవితలు ఉన్నాయి.ప్రతి కవిత దేనికదే వస్తు శిల్పాలతో అలరారుతుంది.కవితా సంపుటిలో ప్రజల దుఃఖముంది. భావోద్వేగాలు ఉన్నాయి.మార్పు కోసం పడుతున్న తపన ఉన్నది. ప్రబోధం ఉన్నది. సందేశం ఉన్నది. ఇన్నిటి వ్యాఖ్యానమే మళ్ళీ మనిషి లోకి. ఇక్కడ రెండు పార్శ్వాలు ఉన్నాయి.ఒకటవ పార్శ్వంలోఎక్కడ గాయమవుతున్నదో అక్కడే మొదలవుతున్న కవికనిపిస్తాడు. రెండవ పార్శ్వంలోఒక భిన్నత్వము నుండి మళ్లీ మనిషి లోకిఒకటిగా చేర్చబడటం. పుస్తకం టైటిల్ని చూస్తే మళ్ళీ మనిషి లోకి అంటే ఏమిటి అని ప్రశ్న ఉదయిస్తుంది. కానీకవితా సంపుటి చదివిన తర్వాతకవి వేదనలన్నీ అర్థమవుతాయి.
మనిషిలోఅనేక శత్రువులు వచ్చి పడ్డారు.ఇవాళమనిషి మనిషిగా లేడు.మనిషిలో నుండిమనిషి తప్పిపోయాడు. మనిషితనాన్ని గుర్తించి మళ్లీ ప్రసరించమని కవికోరుకుంటున్నాడు. కవిత్వానికి తగినట్టుగా సంపుటి పై గల ముఖచిత్రం అంత మార్మికతను కలిగి ఉన్నది.మళ్లీ మనిషి లోకి వెళ్లే ముందు ఒక ప్రాథమిక ప్రశ్న – నేను ఎవరిని అని ప్రశ్నించుకోవటం.నేను అని పలకడంలో ఏక వచనం సూచిస్తుంది కానీ, నాలో నేనే లేనప్పుడు నేను అనే అస్తిత్వానికి అర్థం ఏమి ఉంటుంది? నేను అనబడే మనిషిలో అనేక బాధలు ఉన్నాయి,అపజయాలున్నాయి, గాయాలు ఉన్నాయి, చెప్పలేనన్ని అగాధాలు ఉన్నాయి. గాథలు ఉన్నాయి.నేనిలా ఒక్కడినే ఉండాలి, బాధలతోనే ఉండాలి అని ఎవరనుకుంటారు? ఇవాళ సగటు మనిషి ఒంటరి అయిన తర్వాత వేధిస్తున్న ప్రశ్నలు ఎన్నో కవినీ వేధించాయి. సామాన్యులను చుట్టుముట్టుకున్న అనేక సమస్యల పొరలను ఒకటి ఒకటిగా వలిచి చూపిస్తున్న ప్రయత్నమే ఈ కవితా సంపుటి.బాధలకు కన్నీళ్ళకు కారణమైన వాళ్లను చూపిస్తూ మనిషి కమ్మని సందేశం ఇస్తున్నాడు. దురాక్రమణ స్వభావం, ఆధిపత్య భావన, అసూయ ఒకరిని కూలదోయాలనే కుట్రపూరితమైన ఉద్దేశాలు, తోసుకొని ముందుకు పోవాలని కుటిలం మొదలైనవన్నీమనిషిని మనిషి నుంచి తప్పిస్తున్నాయి.

ఎవరి మనసులు వీళ్లు అనే కవితలో కవిపక్షం‘గుండుసూది నుంచి రాకెట్ దాకా / నెత్తుటి ముద్దలైనోళ్ళు/కంపెనీ లేబుళ్ల కిందజిగురుపూతైనోళ్లు / ఎక్కడికి వీళ్ళ పయనం/వాళ్ల బాధలను తుడిచే గుండెల వైపు/ వాళ్లు మొలకెత్తిన మట్టి వైపు /వాళ్ల మనుషులు ఉండే దారి వైపు ‘ప్రజల వైపు. నమ్ముకున్న శ్రమ, ఫలించినపుడు వలసపోయి బతుకుతున్న బాధలో కవి వెతుకులాట ఆదిలాబాధ ప్రజలనిషానీ చిత్రం.ఆదిలాబాద్ గుర్తులను బాల్యాన్ని నెమరు వేసుకున్నాడు. జీవితంతో సంభాషణ, చెట్టుతో జ్ఞాపకాలు జ్ఞాపకాలైన సంభాషణ,అవి ఎంతటివోచిత్రిక చేస్తూ ‘ నేను మనసుతో మాట్లాడాలనుకున్నప్పుడు / ఈ చెట్టు నీడనే చేరుకుంటాను /చెట్టుతో మాట్లాడుతానని అంటాడు కవి. అట్లా మాట్లాడితే చెట్టు వింటుంది. కవిత్వం అంటే మనిషే. ”కవిత్వం మరేమీ కాదు కాలమే.హృదయం తోలుచుకొని వచ్చే వేడి వేడి అక్షరాలపనితనం. అక్షరాల అల్లిక అని చెబుతూడా. నందిని సిధారెడ్డి మొత్తం మీద జీవితం వాసన రావాలే అంటారు. కాల సందర్భాన్ని, కవిత్వాన్ని, అట్లాసంపుటిలో రూపు కట్టించాడు కవి.మనిషికి మనిషి తనానికిదగ్గరై మళ్ళీ మనిషి లోకి -సంపుటిని అందించాడు ఉదారి నారాయణ. ఆయనప్రజలను ప్రేమించడం వలననే దుఃఖాన్ని అర్థం చేసుకున్నాడు. ప్రజలలో తాను ఒకడై కవిత్వం రాశాడు.సింగల్ చాయ్, ఒక డబల్ రొట్టెతో ఆకలిని చల్లబరుచుకునే అతి సామాన్యులలో సామాన్యుడైతే తప్ప ప్రజల హృదయాలలోకి తొంగి చూడలేరు. అట్లాంటి సామాన్యులకు ధనస్వామ్యులలో తుపాతులు ఏం తెలుస్తాయి? “మీ రియల్ దందాలకు ఆల్ ఇండియా కుట్రదారులకు నేను అడ్డు రాను/ మా కాందానంతా గిదే పని చేసి/ గీన్నేఇంతఖాల్ అయ్యిండ్లు /మీ అందరి భరోసా తోనే /బతుకు డకల్ బండిని దొబ్బుక స్తున్నా / గీ మట్టిలోనే పుట్టినోన్ని /గీ మట్టిలోనే పదిలమయ్యేటోన్ని /నన్ను దొబ్బెయ్యకుండ్లి /నన్ను గీడ్నుంచి  గెదమకుండ్లి / నా బతుకును కూలగొట్టకుండ్లి “అంత స్పష్టంగా చెప్పిన కవి ఉదారి నారాయణ. ఇది ధిక్కారం. కవి సున్నిత మనస్కుడు కనుక సెన్సిటివిటీని తీసుకుంటూనే ఖచ్చితత్వాన్ని ప్రకటించాడు.నతన వెంట పాఠకులను తీసుకువెళ్లడానికి నిలిపి ఆలోచింప చేయటానికి ప్రజలపై సానుభూతిని కలిగించటానికితగిన భావవ్యక్తీకరణను భాషలో పొందుపరిచాడు.
మానవత్వమే గెలుస్తుందని చెప్పటానికి కరోనా వైరస్ వింత పోకడలను కవిత్వీకరించటము ఒక దాఖలా.ఒక అప్పటి కాలంలో ప్లేగు ప్రబలి ప్రజా జీవితాలను అతలాకుతలం చేసింది. ఆ అనుభవాలు మనముందుపై తరాల వాళ్లకు ఉంది.అప్పటి కొన్ని జాగ్రత్తలు , అందులో నుండి బయటపడేకొన్ని వ్యూహాలుకొంతవరకు అందినప్పటికీ, కరోనామహమ్మారికొత్త రకం గా వచ్చింది.ఇట్లా కరోనాపీడించటాన్ని అనుభవించాం.ఇక్కడఎప్పటికైనా మానవత్వమే గెలుస్తుందని ఒక ధీమానికవి వెల్లడించిన తీరుఆశాజనకమైంది.ఈ కరోనాకు కులం లేదు మతం లేదు ఏ వివక్షత లేదు కానీ అన్ని వివక్షతలు ఉన్న మనిషికి సోకింది.ఎప్పటికైనా ఆ మనిషి లోకి తొంగి చూసే కవిత నేల దిగిన నెలవంకలు. కరోనా వైరస్ తో మరణించిన హిందువులకు ముస్లిం సోదరులు అంత్యక్రియలు చేసిన సందర్భాన్ని’శరీరాన్ని పాయలుగా చీల్చుకొని / జీవజలాన్నిచ్చే నది లాంటివాడని…గుర్తుంచుకో “ఇది చారిత్రకసందర్భంగా కవి గుర్తు చేశాడు.
మన పరిసరాలనుమనలను ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకోకపోతే మనం ఎట్లా ఉండలేమో మన మెదడును అలాగే శుభ్రం చేసుకో లేకపోతే అట్లానేమనగలగలేం.అందుకు కవిత్వం గొప్ప ఉపకరణ.మన ఆలోచనలు పరిణతి చెందటానికిగొప్పగా ఉపకరిస్తుంది.భావనలను సృజనతో మేళవించుకోవటానికి మనకున్న పెద్దదిక్కు కవిత్వమే.ఆలోచింపచేసేది కవిత్వం.రూపాంగానే మిగిలిపోయిన మనిషినైతికంగా మిగలలేదు. ఆత్మీయతను కోల్పోయిన చోటఆగమైపోతున్నాడు. కనుక మనిషిని పునస్తాపితం చేయడానికి మనిషి లోకి తొంగి చూడమనిమళ్లీ మనిషి లోకి కవిత్వమంతా ఆర్ద్రమై పరుచుకున్నది.
సమాజంఇట్లా ఉండటానికి వైరుధ్యాలను చెప్పి స్వీయానుభవాలను జతచేసి ఆలోచింపజేశాడు కవి.’ఆ పెద్దలు నా బతుకు దాతలు /నా మెతుకు మెతుకుపై /నిజాయితీ శిల్పం చెక్కిన /శిల్పకారులు వాళ్లు .ఎంతో సహజంగా చెప్పాడు. అలానే “కుమ్మరి కుండను నేను/ నీ పగలెత్తు అలసటను నిద్రలోకి పంపే /గౌండ్ల మల్లేషు కల్లు బుంగను నేనే / నా చూపు ఒక కళాఖండం అన్నాడు.శ్రమ చేస్తున్న జీవులను కళాత్మకంగా చూస్తూ కవిత్వమయ్యాడు .ఉపాధ్యాయ వృత్తిలోతెలుగు సబ్జెక్టు బోధించే టీచర్ఉదారినారాయణ. భావవాదం ఎక్కువగా కనిపించే వారి కన్నా భిన్నమైన వాడు. వాస్తవికతను అధ్యయనం చేశాడు కనుక పిల్లల మీద ముద్ర వేయగలరచనలు చేశాడు.భద్ర జీవితమే ముఖ్యం అనుకుంటేఉదారి నారాయణ కవి కాలేకపోయేవాడు.వివక్షతల పూరితమైన సమాజంలో డబ్బు పీడన ఎలా ఉందో రైతు వేదనలు ఎలా ఉన్నాయోఅర్థం చేసుకున్న కవి ఊరు కండ్ల ముందే చిద్రమవుతున్న ధైర్యాన్ని రాశాడు.పల్లెలు పట్టణాలుగా మారిపోతుంటే ఆహారం వేషధారణ వ్యవహారం మారిపోతూ ఉంటే ఇది నాగరికథ అన్నాడు.
వ్యవసాయం ఒకప్పుడురైతు చేతిలో ఉండేది.ఎరువులు విత్తనాలు అన్ని రైతే సమకూర్చుకునే వాడు.ఇవాళ మార్కెట్ పై ఆధారపడపలసిన స్థితి ఏర్పడింది.రైతు పరాధీనమయ్యాడు.చివరకు ఆత్మహత్యల పర్యంతమయ్యాడు.ప్రపంచీకరణ కనిపించని శత్రుదాడిలో యుద్ధం ఎక్కడ చేయాలో దిక్కుతోచని పరిస్థితిలోఎవరికి ఎవరుఏమీ కానీ ఒంటరితనంలోకి వెళ్ళిపోయారు.కార్పొరేట్ వైద్యం ప్రజలకు మరింతభారమైపోయింది.ఎక్కడో ప్రకృతి లోసహజ సుందర అడవుల మధ్య స్వచ్ఛమైన జీవనం మధ్యఉన్న ఆదిలాబాద్ ప్రజలు కూడా ఇవాళ్ళ ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి .పల్లె ఎప్పుడూఇంకా పచ్చని కొంగుపరచి చూస్తదికానీ వచ్చి వాలుతున్నవి డేగలు కదా!అందుకే కవి”రేపైనా ఎప్పుడైనా/ నా చిన్ని బొమ్మరిల్లు/ లారీల్లోనో లాకర్లలోను కరెన్సీ కావచ్చు/ అప్పటి చర్నాకోలలు/చెరి సగం మైనింగులా / చప్పరించవచ్చు ” కవిత్వమైపారించాడు.
జీవితమంతా సంఘర్షణ అయిఉన్నది.అందుకే ప్రజల జీవితాన్ని అర్థంచేసుకోవలసిన ఆగత్యమున్నది. ఉదారి నారాయణఆ ప్రయత్నంలోభాగంగా కవితా సంపుటిని వెలువరించాడు.ఆయనకవిత్వంలో స్థానికత ఉంది.కొత్త ఒరవడితో రాయాలనే ప్రయత్నాలుఉన్నాయి. గోగు పువ్వును కొత్తగా అభివ్యక్తిచేశాడు.పరిస్థితినిఉన్నదిఉన్నట్టుగాప్రజల వద్దకు తీసుకుపోవడానికిప్రజలనుచైతన్యం చేయటానికికవికంకణబద్ధుడైయున్నాడు.నిత్యమై మెలకువతో ఉన్న కవిమళ్లీ మనిషి లోకిఅభినందనీయమైంది.

April 7, 2025 22 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

గళమెత్తిన మహిళా పత్రికలు

by రంగరాజు పద్మజ April 5, 2025
written by రంగరాజు పద్మజ

         ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతం వలసలు పోయి జీవించడం వాటివల్ల ఆయా ప్రదేశాల స్థానిక ప్రజలు, విద్య- ఉద్యోగావకాశాలు కోల్పోయి, భాష -ఆచార వ్యవహారాల అస్తిత్వం కోల్పోయి, అవమానింపబడి ఎంతో హీనమైన జీవితం గడుపుతూ… మళ్ళీ  ఆ అవకాశాలు తమ స్వంతం చేసుకుని మెరుగైన జీవితం జీవించాలన్న కోరిక ఉండడం సహజమే కదా!

     ఆ కోవలోనే మహిళలు వారి ప్రతిభలను ఎక్కడా ప్రదర్శించుకునే అవకాశాలే లేక  వివక్షకు గురైన సంఘటనలెన్నెన్నో…  అవకాశాలు లేవు కానీ ప్రతిభకు లోటులేదని చెప్పడానికి ఆ కాలంలోనే పత్రికలలో మహిళలకు ప్రత్యేక కాలమ్స్ నడిపారు.

    ఇటీవల ఒక మహిళ తమ సంతానం అమెరికాలో సెటిల్ అవ్వాలనుకున్న వారి ఆశలు అక్కడి ప్రభుత్వ పాలనా విధానాలు  అడియాసలుచేస్తే.. తమ పిల్లలు తిరిగి మన దేశం

 రావడం చాలా బాధాకరమని చెప్పి బాధపడింది.

   ఈ సంఘటన విన్నాక మా నాన్నగారు చెప్పిన ఒక విషయం గుర్తుకు వచ్చింది. “ఎప్పుడైనా అవసరం ఒక మార్గాన్ని ఎన్నుకుంటుందని అది  అణచివేతలో తమ ఉనికిని చాటుకునేందుకు చేసే చర్య రచనా రూపంలో కానీ, తిరుగుబాటు రూపంలోనైనా కానీ వారిలోని అసహనం వెళ్లగక్కవచ్చు, సాధించవచ్చు” అని, ఒక పత్రిక స్థాపనకు దారితీసిన వైనం చెప్పారు.

   1901 లో మద్రాసులో కమలా సత్యనాథన్ అనే  ఒక మహిళ *ఇండియన్ లేడీస్ మ్యాగ్జిన్* అనే ఆంగ్ల పత్రికను స్థాపించి సంపాదకీయం చేసిన మొట్టమొదటి భారతీయ మహిళా పాత్రికేయురాలు అనీ,  ఈ పత్రికలో ఆమె చర్చించని విషయం అంటూ లేదనీ, మా సోదరి దయామతీ దేవి కూడా చెప్పేవారు.

  ఉత్తేజపూరితమైన సంపాదకీయాలు రాస్తూ, స్త్రీలకు ప్రేరణ కలిగించేదనీ, అంతవరకూ వారు ఇల్లే సర్వస్వం అనుకున్నవారు ఓహో! ఇలా కూడా తమ ప్రతిభను చాటుకోవచ్చా? అనే

ఆలోచన కలిగించే విధంగా ఆయా సంపాదకీయాలుండేవట. అంటే మహిళల అస్తిత్వం కోసం, సంస్కృతి సంప్రదాయాలను రక్షించడం కోసం  మహిళలకు ఆ పత్రికలో పెద్దపీటనే వేసింది కమలా సత్యనాథన్.

       ఎందుకంటే? తరతరాలుగా సంస్కృతీ వారధులు మహిళలే కనుక ముఖ్యంగా ఆనాడు  వలసరాజ్య నిబంధనల వల్ల ఎక్కువ నష్టపోయింది కూడా స్త్రీలే కావడం! పితృ స్వామ్య వ్యవస్థలో అణగారి పోతున్న  అతివల పక్షాన వారి హక్కులు- బాధ్యతలు తెలుపుతూ సమాజంలో ఎదగాలన్న ఆశను కలిగించింది ఆ పత్రిక.

   అందుకోసం స్త్రీలకు  విద్య యొక్క ఆవశ్యకతను తెలుపుతూ, పిల్లల పెంపకం, ఇంటి నిర్వహణ, తోటల పెంపకం, కుటీర పరిశ్రమలు, కుట్లు- అల్లికలు, ఇలా స్త్రీ సంబంధమైన అన్ని అంశాల్లో నిష్ణాతులను పరిచయం చేస్తూ, ప్రేరణా మూర్తులను సామాన్య గృహిణులకు పరిచయం చేస్తూ  జ్ఞాన ప్రసరణలు చేసిన మాన్వి కమలా

సత్యనాథన్.

   ఆ కాలంలో ఆడవారు మంచి భావకులై  రచనలు చేసే సత్తా ఉన్నా… ఏ పత్రికలోనైనా  ప్రచురించుకోవాలంటే… ఎవరేమనుకుంటారో?? అని సంఘంలో ఒక బెరుకు- బిడియంతో ఉన్న కాలంలో మహిళలతో నాటకాలు, కథలు, పనులలో శ్రమను మరచిపోయే పాటలను, సీరియళ్లు రాయించి, ప్రచురించి సంపాదకత్వం వహించిన కమలా సత్యనాథన్ అభినందనీయురాలు.

    ఆ కాలంలోనే కాదు! ఏ కాలంలో నైనా కుటుంబాలు యావత్తు ఆడవారి సేవల మీద ఆధారపడి నడిచేవే… కనుక సక్రమంగా పనులు చేయాలంటే ఆడవారికి ఆరోగ్యం ముఖ్యమని భావించి, ఆరోగ్య సంబంధ రచనలు అచ్చు వేసేవారు.

   పత్రికలో  ఒకటి రెండు కాలమ్స్ కేవలం  మానవీయ విలువల ప్రచురణకే కేటాయించేవారు. ఆ కాలంలో సాధికారత సాధించిన మహిళామణులు రమాబాయి,

సొరాబ్జీ,  జోసెఫ్ లాంటి గొప్ప మహిళలు చేపట్టిన పనులను- అందులో వారు సాధించిన విజయాలను  వరుసగా ఆ పత్రికలో  ప్రచురించేవారు.

     అయితే పత్రిక  ఆర్థిక ఇబ్బందులతో పాటు ఎన్నో కారణాలు వల్ల కొంతకాలం పత్రికను ఆపాల్సి వచ్చింది. ఇంకొందరు ఏమంటారంటే?  అప్పుడప్పుడే జాతీయ ఉద్యమాలు ఊపందుకుంటున్న ఆ తరుణంలో ఆ ఉద్యమాలను ప్రోత్సహిస్తూ పత్రికలో ఏ రచనలు రాలేదనీ, అందుకే పాఠకులు ఆదరణ చూపలేదని అంటారు. కానీ దేనికైనా ఒక పరిధి ఉంటుంది కదా?  ఆ కాలంలో రాజకీయాల జోలికి వెళ్లేంత సాహసం స్త్రీలకు లేదేమో? అని నేను అనుకుంటాను.

   అంతే కాదు రాజకీయాలలో ప్రవేశించమని మహిళలకు పిలుపు ఇవ్వలేదని ఒక అపవాదు కూడా ఉన్నది. ఆమె మహిళలను కుటుంబ పరిధి దాటిపోనివ్వని సనాతన వాదురాలనే ఒక అపప్రథను ఎదుర్కొంది. అందుకు ఆమె

సంపాదకీయాలు అలానే ఉండేవని మా సోదరి చెప్పేది.

ఏదేమైనా ఆర్థిక ఒడి దొడుకులతో పాటు ఇతర కారణాలతో కష్టమైనప్పుడు ఆమె  వ్యాపార ప్రకటనలు ఆయా పారిశ్రామిక వేత్తల దగ్గర సేకరించి పత్రికలో  ప్రచురించి ఆ విధంగా ఆర్థికంగా ఆసరా తీసుకున్నారు.

    1901 లో స్థాపించిన పత్రిక 1918 వరకు మాసపత్రికగాను,  1927 నుండి 1938 వరకు ద్వైమాసిక పత్రిక గాను నడిపారు. తర్వాత ఆమె కూతురు పద్మినీ సత్యనాథన్ పత్రిక పగ్గాలు చేతబట్టి, సహసంపాదకురాలిగా సేన్ గుప్తాను నియమించి; తాను ప్రచురణ నిర్వహణ చేస్తూ పత్రిక ను నడిపింది.

  ఇక్కడ పత్రిక ఎందుకు ఆగిపోయిందన్న ప్రస్తావన కాదు ముఖ్యం… వలసవాదుల వల్ల ప్రజలు ఇబ్బంది పడినప్పుడల్లా ప్రజల పక్షాన పత్రికలు గొంతెత్తేవి  అనేది ముఖ్య విషయం. అలా వెనక్కి వెనక్కి పయనిస్తే ఇలాంటి సంఘటనలు కోకొల్లలు.

  గుజరాత్ లోనూ జాతీయోద్యమం ( అప్పటికా పేరు లేదు ) కానీ వలసవాదుల అణచివేతను తట్టుకోలేక  స్త్రీలను చైతన్య పరచాలనే ఉద్దేశ్యంతో  *స్త్రీ బోధ్* మహిళా పత్రిక 1857లో స్థాపించటం జరిగింది.

    అలాగే కేరళలోనూ మలయాళ పత్రిక

*కేరళ సుగుణ బోధిని* అని తిరువనంతపురం నుండి మరో పత్రిక వెలువడింది.

1992 లో *తూర్పు పనోరమా* అనే పత్రిక మహిళాసారధ్యంలో స్థాపించబడింది. ఇది మొట్టమొదటి ఈశాన్య భారతదేశం నుండి వెలువడిన ఆంగ్ల పత్రిక. ఆ కాలంలో ఆ ప్రాంతంలో విధి వంచితులైన , క్రూర వైధవ్య దుఃఖ పీడితులైన, వారిని తొక్కివేసే సామాజిక నిర్బంధాలు, ఇక్కడ పేదనా, బడుగు వర్గాలా? అనే తేడాలేదు… వివిధ వర్గాలలోని స్త్రీలు జీవితపు సుడిగుండంలో చిక్కుకుని, అర్ధాంతరంగా అసువులు బాసిన అతివల  యధార్థ గాథలు వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. వారి ఆక్రోశమూ, తీరని కోరికల నేపథ్యమూ, ఆస్తి

హక్కులు లేక దీనావస్థలో పడిన వైనమూ, ఇలా ఎన్నెన్నో సమస్యలను చర్చించిందా పత్రిక.

  ఎవరు ఏ పత్రిక స్థాపించినా స్త్రీలను సంతోషంగా ఉంచడమని, సమాన హక్కులతో జీవించమని చెప్పడమే…. ధ్యేయం… అలాగే అదే సమయంలో వారిని ఉత్తమ గృహిణులుగా ఉండాలనే సమాజ దృష్టి… ఎవరైనా కాస్త వారి హక్కుల కోసం పోరాడితే వారిని తెగించిన ఆడవారిగానే ఆ కాలంలో పరిగణించారు. అది దాదాపు 1930 వరకు నడిచింది. స్త్రీలకు బయట ప్రపంచంలో ఏం జరుగుతున్నదని తెలియకుండా పురుష సంపాదకత్వంలో వచ్చిన పత్రికలు కొంచెం జాగ్రత్త పడ్డారనే చెప్పవచ్చు. అందుకే ఈ మహిళా పత్రికల స్థాపన జరిగిందేమో?

  తమ ఉనికిని నిలబెట్టుకునేందుకు మహిళల పక్షాన నిలిచిన పత్రికలు మహిళా సంపాదకీయం  చేస్తూ విలువైన సందేశాలను ఇచ్చి, ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా… స్వతంత్రంగా మన భావాలు వెలిబుచ్చుకొనే తోవ చూపిన మహిళ పత్రిక స్థాపకులకు, మహిళా సంపాదకులకు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ…           

April 5, 2025 23 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

కవి మిత్రుల హృదయ భాషణం

by Gaddam sulochana April 5, 2025
written by Gaddam sulochana

ఫిబ్రవరి 16 తెలంగాణ రచయితల సంఘం జంట నగరాలు నిర్వహించిన సోపతి సప్తతి సభ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, కందుకూరి శ్రీరాములు, నాళేశ్వర శంకరం, నందిని సిధారెడ్డి ఈ ముగ్గురు కవులకు జరిగింది. ఈ సభలో మచ్చుకైనా తొంగి చూడని హంగులు ఆర్భాటాలు. దరిచేరని గజమాలలు ఫోటోల గోలలు లేకుండా సాదాసీదాగా సభ ఆసాంతం సాహితీ ప్రసంగాలతో గుబాళించింది . ఇదే సప్తతి సభల సందేశమైనది. ఈ ముగ్గురు కవులు ఈ సందర్భంగా తమ మనసును పంచుకున్న కొన్ని మాటలు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.

కందుకూరి శ్రీరాములు తన సాహితీ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ, సిధారెడ్డి గారి ‘భూమి స్వప్నం’ నాళేశ్వరం శంకరం గారి ‘దూది మేడలు’ అచ్చయిన చాలా కాలానికి తన కవితా సంపుటి ‘వయోలిన్ రాగమో! వసంత మేఘమో!’ 1993లో అచ్చైందన్నారు. తానప్పుడు మినీ కవితలు తుమ్రీలు రాసేవాడినని, అవి తనకు చాలా ఇష్టంగా ఉండేవని చెప్పారు. “కళ్ళు పోయినా/ కాళ్లు చేతులు పడిపోయినా/ గుండెల్లో తడుండాలిగానీ/ నాలుకైనా నాలుగ క్షరాలు రాస్తుంది” అనే తన మినీ కవితను ఒక సభలో దేవి ప్రియ గారు చదివి వినిపించి మెచ్చుకున్నారట.
ఓ సారి విశాఖపట్నం కవి సమ్మేళనంలో పాల్గొనవలసి ఉండగా, ఒక కవిత రాసి శివారెడ్డి గారికి చూపిస్తే, మరో కవిత రాయమని చెప్పారని, అది బాగా లేదని అర్థం చేసుకున్నానని, ఆ సాయంత్రం సముద్రాన్ని చూసి, తెల్లవారగానే సముద్రం వద్దకు వెళ్లి ,”ఓ విశాఖ సముద్రమా/ నువ్వు ఆకాశమంత ఎదగడానికి/ ఎన్నేళ్ల దీర్ఘ తపస్సమాధి లో ఉన్నావో ” అని 30 లైన్ల కవిత రాసి ఆ సాయంత్రం కవి సమ్మేళనంలో చదివినప్పుడు గొప్ప స్పందన వచ్చిందని, శివారెడ్డి గారు కూడా మెచ్చుకున్నారని చెప్పుకున్నారు.
సినారె, శివారెడ్డి, సిధారెడ్డి, బెడిద రాజేశ్వరరావు వీరు తను సాహిత్యంలో ఎదిగి స్థిరపడడానికి హార్దికంగా ఆర్థికంగా ఎంతో తోడ్పాటునందించారు. 1974లో ఒక కవిత రాసి ‘సినారె‘ గారికి పంపిస్తే వారు ‘మీ కవితా జిజ్ఞాసను అభినందిస్తున్నా’నని లేఖ రాశారని అది ఇప్పటికీ తన వద్ద ఉందని ఆనాటి జ్ఞాపకాలను సంతోషంతో పంచుకున్నారు.

1979లో ఆర్ట్స్ కాలేజీలో చేరడం, 30 మంది కవుల పరిచయం, అక్కడి సాహితీ వాతావరణం తన జీవితంలో తనను తాను నిలబెట్టుకోవడానికి తోడ్పడిన మంచి అవకాశంగా భావించారు. వరవర రావు గారు ముందుమాట రాసిన “సందర్భం” కవితా సంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, తెలుగు యూనివర్సిటీ అవార్డు రావడం జీవితంలో గొప్ప మలుపు. మినీ కవితలు రాయడం మానేసి పెద్ద కవితలపై దృష్టి పెట్టాలని చెప్పిన సిధారెడ్డి గారి సలహాను పాటిస్తూ, పెద్ద కవితలు రాయడంలో శ్రద్ధ పెట్టానని, దశాబ్ద కాలంలోనే అనేక కవితా సంపుటాలు తీసుకువచ్చానని అందరితో తన సంతోషాన్ని పంచుకున్నారు. నందిని సిధారెడ్డి, నాళేశ్వరం శంకరం ల స్థాయి తనకు లేకపోయినా, వాళ్లతో కలిసి సప్తతి జరుపుకోవడం ఆనందంగా ఉందని, వారి స్నేహం తనకు గొప్ప అదృష్టమని చెప్పారు. కాస్త పేరు ప్రతిష్టలు రాగానే సంపాదన పెరగగానే, బంధువులను, స్నేహితులను, చేయూతనిచ్చిన వారిని మర్చిపోయే ఈ రోజుల్లో ఎంతో ప్రేమగా స్నేహంగా ఇలా చెప్పడం చాలా బాగా అనిపించింది. ఈ మధ్యనే 2024లో ‘పలకల నుంచి పలుకులవైపు’ కవితా సంపుటి కూడా అచ్చువేసారు.

నాళేశ్వరం శంకరం గారిది సప్తతి రెండవ సభ. జీవితం వ్యక్తిత్వం సాహిత్యంతో ముడిపడిన తన జీవిత విశేషాలను సదస్సులతో పంచుకున్నారు. 70 సంవత్సరాలుగా తన బతుకు ఒకే తీరుగా ఉందని, తనలాంటి బతుకు ఎవరికి ఉండొద్దని అందరూ సుఖంగా ఉండాలని ఆకాంక్షించారు.

తన ఊరిపై అవ్యాజమైన ప్రేమానురాగాలు కురిపించారు. వారి ఊరికి రెండు చెరువులు, తాటివనం, 10 ఊర్లకు సరిపడే ఈత కల్లుండేదని, హైదరాబాదు కూడా మా ఊరి ముందు చిటికెన వేలుకు కూడా సరిపోదని గొప్పగా చెప్పుకున్నారు. తన ప్రేమ కథ దేవదాసు సినిమా కన్నా గొప్ప కథట. ప్రేమంటే తెలియని నాలుగవ ఐదవ తరగతిలోనే ఒక అమ్మాయిని ఇష్టపడ్డారు. తర్వాత ఆమే అతని జీవిత సహచరిగా అయింది. కులాంతర వివాహం, తండ్రి తిరస్కారం, తీవ్రమైన దూషణ వ్యతిరేకత వల్ల ఊరికి దూరమయ్యానని, మళ్ళీ ఆ వూరు స్మశానంగా మారినాకే (పోచంపాడులో మునిగింది) వెళ్లానని చెప్పారు. తన ఇంటి స్థలం వెతుక్కోవడానికి వేప చెట్టు ఆనవాలుగా గుర్తించి, అక్కడే చాలాసేపు గడిపి వచ్చానని చెప్పారు. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఎంత దుఃఖం కలిగిందో, ఊరును స్మశానంగా చూసినప్పుడు అంత దుఃఖాన్ని అనుభవించానని ఆవేదనగా చెప్పుకున్నారు. వారి ఊరి వాళ్ళు వయసు వచ్చి కాక, రాజకీయ ఆర్థిక సాంఘిక కారణాల వల్ల చనిపోయిన వాళ్ళే ఎక్కువ అని వాపోయారు. జంగాలైన తాను చిన్నప్పుడే ‘భిక్షాం దేహి” అని అడుక్కునేవాడినని, అమ్మ పాలిచ్చి పెంచితే ఊరు తనకు అన్నం పెట్టి పోషించింది. బతుకునిచ్చింది. తనను తన కుటుంబాన్ని పోషించింది అని చెప్పారు. తనకు వాళ్లు భిక్షను వేసి బాలశివుడు వచ్చాడని తన కాళ్లకు మొక్కడం ఆశ్చర్యమనిపించేదని, అడుక్కుంటున్నాను కదా! నేను కదా వారి కాళ్లకు మొక్కాలని ఆలోచన అప్పుడే తనకు కలిగేదని,ఆ భావజాలంతో తీవ్రమైన స్వభావం ఉండేదని, బహుశా అదే తనను కవిగా మార్చిందేమోనని అభిప్రాయపడ్డారు.

ఇల్లు, ఊరు విడిచి రావడం, చదువు ఉద్యోగం ఇబ్బందులు అన్ని చెప్పారు. తన భార్య వైపు వారు గొప్పగా ఉన్నప్పటికీ తాను ఎవరిని ఎప్పుడు కూడా కలవలేదని, తన విలువ వ్యక్తిత్వం కాపాడుకోవడం తనకు ముఖ్యమని చెప్పారు.ఇలా చెప్పడం శంకరంగారి మానసిక పరిణతికి గొప్ప సాక్ష్యం.ఆయన నమ్ముకున్న విలువలు గొప్పవి.

‘దూది మేడలు’ ఒక్క పుస్తకాన్ని అచ్చు వేశానని అంటారు కానీ, ప్రస్తుతం కొనసాగుతున్న సమాజంలో అనేక పుస్తకాలుగా దాన్ని భావిస్తున్నట్టు చెప్పారు. బెడిద రాజేశ్వరరావు బతికి ఉంటే కనుక మా అందరి కన్నా చాలా ముందుండే వారన్నారు. బైసా రామదాసు మొదటి స్నేహితులని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, ఇంటర్ కాలేజీ మ్యాగజైన్ ఎడిటర్ గా తన కవిత ‘వాణి నా రాణి’ ఒక ఫుల్ పేజీ వేశాడట అది అప్పట్లో శంకరం గారికి గొప్ప సంతోషం కలిగించిందట. అతను గనుక జర్నలిజంలోకి వెళ్లి ఉండకపోతే గొప్ప కవి అయ్యేవారని “కాళ్లు ఇనుప స్తంభాలు/ భవంతులను మోస్తున్నాయి/ చేతులు విసనకర్రలు/ సుఖ గాలులు వీ స్తున్నాయి” అని ఇంటర్లోనే రామదాసు గారు రాసిన కవిత తనకు బాగా నచ్చిందన్నారు.

చలంగారిని తెలంగాణకు తెచ్చానని, కేవలం ఇక్కడ స్త్రీల ఉద్యమాలు ఎస్టాబ్లిష్ కావాలని అలా చేశానని బాగా నడపానన్నారు. ఓల్గా లాంటివారు చాలామంది వచ్చారు. అయితే అది మగవాళ్లది అన్న ఉద్దేశంతో స్త్రీవాద ఉద్యమం దాన్ని పక్కకు పెట్టింది కానీ, చలం చేసినంత కృషి స్త్రీలకు మరెవరు చేయలేదని అభిప్రాయపడ్డారు. ఇది తనకు పెద్ద మలుపు అని కూడా చెప్పారు. తన ప్రియమిత్రుడు నందిని సిధారెడ్డి గురించి కూడా ఎంతో అభిమానంగా ప్రేమగా ఇలా చెప్పారు…. తన తండ్రి తనను జీవితాంతం కోప్పడేవాడని, సిద్ధారెడ్డి కూడా నాన్నలా కోప్పడతారని ఆయన కోపం మాత్రం అమ్మపెట్టే ముద్ద అంత ఆత్మీయంగా ఉంటుందని, తనకు నాన్న చేయవలసిన ఎన్నో పనులు తనకి చేసి పెట్టారని ప్రేమను వ్యక్తపరుస్తూ, స్నేహ పరిమళాలను సభంతా పరిచారు.

సోపతి సప్తతి మూడవ సభ నందిని సిధారెడ్డి గారిది స్నేహం గొప్పతనాన్ని సమాజానికి తెలిపాలని వారి ఉద్దేశ్యం అందరికీ ఆచరణీయం అనుసరణీయం. 50 సంవత్సరాలుగా ఏ అరమరికలు లేని స్నేహంగా, కవిత్వంగా, జీవితాన్ని కొనసాగిస్తున్న ముగ్గురు కవుల సప్తది సభ జరగడం ఒక ప్రత్యేకత. ఇదొక మంచి సందేశాన్ని అందించే అపూర్వ సన్నివేశం. లక్షల మందిలో మాట్లాడడం కంటే, కొద్ది మంది ఆత్మీయుల మధ్య మాట్లాడడం, ఆత్మీయులు ఇచ్చే స్ఫూర్తి గొప్పది అని అభిప్రాయపడ్డారు.

ఆర్ద్రత నిండిన మనసుతో తన చిన్ననాటి సంఘటన ఒకటి గుర్తు చేసుకున్నారు చంకలో తమ్ముని ఎత్తుకొని, చేతితో తనను పట్టుకొని, చేదబావిలో దూకి చనిపోవాలనుకుందట వాళ్ళ అమ్మ. ముందు చంకలో బిడ్డను వేయాలా, చేయి పట్టుకున్నతనను వేయాలా అని ఆలోచిస్తున్నంతలో, పక్కన ఉండేటటువంటి వడ్ల అంతయ్య పరుగున వచ్చి, మందలించి ఆ ప్రయత్నాన్ని విరమింప చేశారని, అదే అంతయ్య కొన్ని రోజుల తర్వాత కుటుంబ సమస్యతో ఉరి వేసుకున్నప్పుడు, అప్పుడే నీళ్లకు వెళ్ళిన వాళ్ళమ్మ అతనిని లేవట్టి అందర్నీ పిలిచి అతని ప్రాణాలు కాపాడిందని ఇది రూల్ అని చెప్పారు. ఇతరులకు మనం ఏదైతే ఇస్తామో! అది మనకు తిరిగి వస్తుందనే సత్యం ఈ సంఘటన ద్వారా మనకు స్పష్ట మవుతుంది.

ఆరుద్ర గారి “పులి వస్తే పులి ఎన్నడు అదరదు/ మేక వస్తే మేక ఎన్నడు బెదరదు/ మాయ రోగమదేమో కానీ/ మనిషి మనిషికి కుదరదు” అనే కవితా పంక్తులు ఉదాహరిస్తూ మనుషులు మనుషులు విడిపోతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో కవులు మరీ వింతగా ప్రవర్తిస్తున్నారు. నేనే కవిని అనే ధోరణి పెరిగిపోతుందని, కవిని చూస్తే మరో కవి ఓర్వడని, మనుషుల యొక్క నైజాన్ని ఒకింత ఆవేదన హాస్యాన్ని మిళితం చేసి ఉదహరించారు.

ఒక సందర్భంలో తెలంగాణ భాషలో మంచి కవిత్వం రాసిన కవి మోత్కూర్ అశోక్ గారి కోరిక మేరకు మెదక్ పుస్తక ఆవిష్కరణ సభకు ‘చేరా’ గారిని తీసుకొని వెలితే, అతనక్కడ ‘తెలంగాణ కవులు ఇట్లాంటి కవిని చూసి తల ఎత్తుకోవచ్చు’ అన్నారట.అసలు తెలంగాణ కవులు తల ఎత్తుకునే ఉన్నారు. అది చెప్పడానికి ‘చేరా’ అవసరం లేదు. నా కవిత్వానికి బలం చేరా నుంచి రాలే! అలంకార గ్రంధాల నుండి రాలే! తెలంగాణ మట్టి నుండి వచ్చింది. మా బాపు అవ్వ మా ఊరి నుండి వచ్చింది. వివక్షాపూరితమైన విమర్శకుడైన చేరాలాంటి వాళ్లతో గొడవ పడ్డానని, నా మట్టినాకు రోషాన్ని ఇచ్చిందని,అది నా గర్వమని, నిర్మోహమాటంగా నిక్కచ్చిగా తేల్చేశారు.

కవిత్వం అలంకార శాస్త్రాల నుంచి రాదు. జీవితాల నుండి వస్తుంది. గాథాశప్తశతిలో ఉన్నది ఆనాటి గాథలు సామాజిక జీవితమే! కవిత్వానికి కొలమానం విమర్శకుల ప్రశంసలు కాదు.” నేను రాస్తా వాళ్ళు చదువుతారు మధ్యన ఈ విమర్శకులెవరు?” అన్న కాళోజీ మాటల్ని గుర్తు చేసుకున్నారు. “హైదరాబాదు/ అందమైన సీతాకోకచిలుక/ దాని కాళ్లకు కత్తులు కట్టి/ కోడిపందాలు ఆడకండి” అన్న రాజు గారి కవిత్వాన్ని చదివి ఇంతకన్నా జీవితం నేర్పిన కవిత్వం ఏముంటుంది. ఇదే కదా కవిత్వం అన్నారు. ఈ ప్రాంతం కాకపోయినా ఆరుద్ర, కుందుర్తి, సోమసుందర్ మొదలైన వారు తెలంగాణ మీద కవిత్వం రాశారన్నారు. ఒక పోతన, సోమన, వేమన లేకుండా సిధారెడ్డి లేడు. ఒక కవికి బలం అనేకమంది పూర్వకవులు సమకాలీన కవులేనని గుర్తు చేశారు.

విప్లవోద్యమం తన కవిత్వాన్ని స్వీకరించిందని “మా మౌనం ప్రమత్తతే అనుకుంటావు/ నీకు తెలుసో తెలియదో/ గోడకు వేలాడే తుపాకీ కూడా/ మౌనంగానే ఉంటది “అనే కవితా పంతులు సైన్స్ కాలేజీలో, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో, తిరుపతి హాస్టల్లోనూ కనిపించిన సందర్భాలను వివరిస్తూ, కవిత్వం ఎవరు చదువుతారు అనుకుంటాం కానీ, ఎవరికి అవసరమో వాళ్ళు చదువుతారని వివరించారు. నేను తెలంగాణ ఉద్యమాన్ని ప్రేమించాను. ఆ సామాజిక సందర్భం గొప్పది. మంచి అక్షరాలు రాసే అవకాశం నాకు వచ్చింది. మనుషుల్ని ఏరుకోవడం అనుభవాల్ని, వస్తువుల్ని, సన్నివేశాలని ఎన్నుకోవడం తెలుసు. సహజ సుందరమైన అలంకారికమైన ప్రజల భాష శక్తి కలిగిన భాష. దాన్ని ఏరుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. జీవితంలో స్పష్టత లేకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. దాశరధి ప్రజా జీవితంలో నుండి వచ్చారు. మెల్లమెల్లగా తప్పిపోయారని గుర్తు చేసుకున్నారు. ఎవరికైనా ఒక స్పష్టత ఒక నిర్ణయం ఒక విధానం అవసరమని, చుట్టూ ఉన్న మయసభను తెలుసుకొని అడుగులు వేయాలని సూచించారు.

కులం ఇప్పుడు కొలమానమైనది. కానీ నాకు కులంతో సంబంధం లేదు. మనుషుల హృదయాలను ప్రేమించాను. హృదయాలతోనే నడుస్తాను. కులాన్ని ఇష్టపడే వాళ్ళు ఇష్టపడండి కానీ, కులంలోనూ మంచి వాళ్లను ప్రేమించండి. కవులు ఏం చేయాలి? మనుషుల్ని కవిత్వాన్ని జీవితాన్ని సమాజాన్ని ప్రేమించాలి. నేను అట్లా ప్రేమించాను. మనుషుల్ని స్నేహితులను సంస్థలను నమ్మాను. కాబట్టే నాకు మంచి మిత్రులు ఉన్నారు. మంచి కవిత్వము రాశాను. అనీ సంతృప్తిని వ్యక్తం వ్యక్తం చేస్తూ ,మంచి సందేశాన్ని అందిస్తూ ముగించారు.

ఇలా కందుకూరి శ్రీరాములు గారు, నాళేశ్వరం శంకరం గారు, నందిని సిధారెడ్డి గారు తమ సాహితీ ప్రయాణాన్ని తమ జీవితాలను వ్యక్తిత్వాలను 50 ఏళ్లుగా కలిసి సాగిస్తున్న స్నేహ ప్రయాణాన్ని అందరితో పంచుకున్నారు. ‘చూస్తాం చేస్తాం రాస్తాం’ అని సిధారెడ్డి గారు చెప్పినట్లుగానే వీరి ప్రయాణం ఆయురారోగ్యాలతో, ఉత్సాహంగా, సామాజికంగా మార్గదర్శనం చేస్తూ, కొనసాగాలని ఆశిద్దాం.

April 5, 2025 22 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఈ రాత్రి శూన్య మెలా అవుతుంది**?

by Dilawar April 2, 2025
written by Dilawar

ఈ రాత్రి నాలుగు వైపులనుండీ అంటుకుంటున్నది
స్వప్నం కాలేకపోయిన యీ రాత్రి
పచ్చి పుండై సలుపు తున్నందుకు హాయిగానే ఉంది
నేనీ దిగులు రాత్రిని దు:ఖంలో ముంచకొని పానం చేస్తున్నాను
నేనీ కలత నిద్రల రాత్రిని మేఘ మల్హార రాగం లో గానం చేస్తున్నాను
తుఫానులను ఉచ్చ్వాసగా
అగ్ని జ్వాలలను నిశ్వాసగా
చేసుకున్న వాడికి
బతుకును చీకటి సముద్రపు
టలల్లోకి విసిరేయడం
గుండెల్ని పిండే విషాదం కాదు కదా
వలపు తీర విరహిణులతో ఐక్యం కాలేని
హృదయ నాదం
జీవం లేని శబ్దమై నీరసించి తుది శ్వాస విడిచింది
దారుల్ని పారేసు కున్న గాయం
ఎవరికోసమో ఉన్మత్తంగా అన్వేషిస్తున్నది
అయినా బొత్తిగా శూన్యం అలుముకోలేదు
జ్ఞాపకాల నుంచి ఒక్కొక్క నెత్తురు బొట్టూ
పచ్చిగా చిక్కగా రాలుతూనే ఉంది
నగరం నడిబొడ్డుకింద జారిన చీకటిలో
సామూహిక స్ఖలనాల్లో తడిసిన
బిచ్చగత్తే ఆర్తనాదం శూన్యం కాదు కదా
తుపాకి వనంలో విరిసిన బుల్లెట్ల పువ్వుల మధ్య
వీచిన మృత్యు పరిమళం శూన్య మెలా
అవుతుంది?
భళ్ళున మాతృత్వం పగిలి
చీకటి ముళ్ళ పొదల మధ్య
తెగిన పేగు బంధపు నెత్తురు గుడ్డును
శూన్యమని ఎవరంటారు?
గుండెల్ని చీలుస్తూ మొరుగుతున్న
కుక్క గొంతు శ్రుతిలోని జీర శూన్యానికి సంకేతాలేనా?
దేన్నీ పట్టించుకోకుండా కొండ చిలువలా కాలాన్ని ఆబగా మింగుతున్న గడియారం ముళ్ళు
చైతన్యానికి ప్రతీకలే కదా?
మెల్లగా ఏకాంతం; అలజడి ఉప్పెన అవుతూ నన్ను సుడివేస్తున్నది
అదే పనిగా మీటుతున్న గుండె ఏకతార లోంచి
రక్తం వెచ్చగా స్రవిస్తున్నది
ఇక యీ రాత్రి ఇంతే….
నా సుందర స్వప్నం,ఈ రాత్రి పిరమిడ్ కింద
క్లియోపాత్ర గా మారి మూల్గు తున్నది

April 2, 2025 21 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

‘మంటల స్నానం’ కవిత్వం ఏం చెబుతోంది ?

by Bandari Rajkumari April 2, 2025
written by Bandari Rajkumari

దిగంబర(2009), గరళమ్(2013), తప్త స్పృహ(2015)తో సుపరిచితమైన కవి ‘మౌనశ్రీ మల్లిక్’. ఇప్పుడు “మంటలస్నానం'(2025) తో పలకరిస్తున్నడు. తన కవిత్వ పుస్తకాల శీర్షికలు ఆలోచింపజేసేవిగా వుంటయి. వ్యక్తిగా తన ప్రస్థానం అనేక ఆటుపోటుల సమాహారం. జీవితంలో నిలదొక్కుకోవడానికి ఎన్ని పోరాటాలు చేసాడో అది అతని వ్యక్తిగతం. ‘కవిత్వం, పాట’ తోటి మనిషికి ఎంత సన్నిహితునిగా మార్చాయో అదంతా సామాజికం. కవి జీవితంలో కవిత్వం ఎంత? కవిత్వంలో కవి జీవితం ఎంత? అనే ప్రశ్నలు వేసుకుంటున్నప్పుడు కవి ఆచరిస్తున్న సూక్తి లాంటి నినాదప్రాయ కవిత్వ వాక్యాలు మనల్ని ఆలోచింపజేస్తయి.

” జీవితంలో కవిత్వం వరించడం ఉత్సవం! కవిత్వంలో జీవితం తరించడం ఉద్యమం!!”

ఆచరణ – జీవితం రెండూ వేర్వేరు కానప్పుడు వ్యక్తి ఆదర్శనీయుడు అయితడు. నిజంగానే ‘మౌనశ్రీ’ ఆదర్శవంతుడనుకుంటే ఆచరణ జీవితం జమిలీగా కలిసిన ఒక మెటాఫర్ అయితది. కవిత్వానికి సంబంధించి, కవిత్వపుస్తకాలకు సంబంధించి, ప్రచురణకు సంబంధించి, వాక్య నిర్మాణానికి సంబంధించి తనదైన ప్రత్యేక శైలి తనకుంది. ఒక కవిత్వ పుస్తకానికి ‘ఎడిటర్’ ను పెట్టుకోవడం తెలుగు సాహిత్యంలో చాలా అరుదు. మౌనశ్రీ ఈ విషయంలో అందరికంటే ముందు వరుసలో ప్రథముడుగా అవుపిస్తడు. విరామ చిహ్నల ఉపయోగం, ఇవ్వవలసిన స్పేస్ – వాక్యంలోనూ, పేరాగ్రాఫ్ లోనూ, స్టాంజాలోనూ అర్థం చెడిపోకుండా అక్షరం పట్ల వున్న అమితమైన భక్తి మౌనశ్రీ రాతల్లో ప్రస్ఫుటంగా మనం దర్శించవచ్చు. ‘తప్తస్పృహా’ కు ‘మంటలస్నానం’ కవిత్వానికి మధ్య దశాబ్దకాలపు దూరం వున్నప్పటికీ సాహిత్యానికి దూరంగా, అక్షరానికి దూరంగా ఎడబాటు విరహం లేదు. అంతేకాదు ‘మంటలస్నానం’ కవిత్వం ‘తప్తస్పృహ ‘ లోని లోటుపాట్లను సవరించుకోగలిగింది. దిగంబర, గరళమ్ లో వున్నంత బిగి తప్తస్పృహ కాలానికి సడలినప్పటికీ ‘మంటల స్నానం’ అంతకు మించి బూమరాంగ్ లా తనచేతికి అందివచ్చింది. ప్రాణం పెట్టి పాట రాసినా అందులో ఎంతకాలం స్వేచ్ఛగా బ్రతుకుతాడో తెలియదు గానీ కవిత్వ పంక్తుల్లో అక్షరమక్షరం స్వేచ్ఛను అనుభవించగలడు, జీవించిన క్షణాల్ని మనతో పంచుకోగలడు. ఈ స్వేఛ్ఛ రాతకు సంబంధించింది. రాయగలిగే స్వేచ్ఛకు సంబంధించింది.
*
కవిత్వం ఎవరి పక్షం? జవాబుగా ప్రజల పక్షం అంటూ సర్వదిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వని వినిపిస్తుంటది. కవిత్వం ప్రజల పక్షం అయితే ఏంటి? కాకుంటే ఏంటి? ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఏంటి? ఈ కవిత్వం ప్రజలు చదువుతారా? తమ బాధల్ని చెమట వాసనతో నెత్తుటి సిరాలో ముంచి రాసిన కవిని హత్తుకుంటారా? మరెందుకీ కవిత్వం! కవులకీ, శ్రమజీవులకీ మధ్య వారధి ఎవరు నిర్మించాలి? కవిత్వాన్ని మోసుకెళ్లి వారి హృదయాల్ని తాకేలా ఎవరు చేయగలరు? ఎప్పుడు కవి అవసరం? అసలు ఈ ప్రపంచానికి కవుల అవసరం వుందా? చర్చ ఫలవంతంగా జరిగే ఒక సుహృద్భావ వాతావరణం కావాలి. కవిత్వం రాతల్లోనే కాదు చేతల్లోనూ పని చేస్తుందని ప్రపంచంలోని వివిధ ఉద్యమాలు నిరూపించిన సందర్భాలు లేకపోలేదు. యితర ఉద్యమాల మాటేమో గాని ‘తెలంగాణ ఉద్యమం’ సాక్షీభూతంగా పేర్కొనవచ్చు.

“రోజులో ఒక్కసారైనా
ఎండలో మాడి స్వేదమై రాలాలి
జీవితంలో ఒక్కసారైనా
చెడుపై దావానలమై ఎగబడి దాడి చేయాలి” (మంటల స్నానం)

కవి ప్రభోదకుడై వుంటడు. ఉత్ప్రేరకమై పనిచేస్తడు. ఉద్యమాలకు ఆయువుపట్టు అయితడు. ఆరిపోని జ్వాలకు రక్షణ కవచమై నిలుస్తడు. చెనుట చిందించేవాడే మనిషి అని ఎలుగెత్తి చాటుతడు. అభ్యర్థించటం కాదు పిడికిలి బిగించమనే సందేశాన్ని పంపిస్తడు.
*
వస్తువును కవి నిర్దేశిస్తాడా? లేక కవులను వస్తువు నిర్ధేశిస్తుందా? రెండు రకాలుగా జరుగుతుందని అనుకుంటే ‘వస్తువు’ ను నిర్దేశించే కవులు మొదటి రకం. వస్తువు చేత నిర్దేశింపబడే కవులు రెండవరకం. మొదటిరకం కవులకు వస్తువు స్థిరమైనది. దాన్ని దాటి బైటికి రాలేరు. భక్తి కవులు, ప్రకృతి ఆరాధకులు మొ.నవారు ఈ కోవకు చెందుతరు. రెండవ రకం కవులు చలన సహితమైన సమాజంలోని మార్పులకు స్పందిస్తూ కాలంతో పాటుగా కొంతమంది, కాలం కంటే ముందుగా కొంతమంది చైతన్యవంతులై కొనసాగుతరు. మౌనశ్రీ ఈ రెండోరకం కవి అని చెప్పటం నా ఉద్దేశ్యం. వర్తమాన అంశాల్ని ఇప్పటి మనుషుల భావోద్వేగాల్ని, వీటిని కూడా కవిత్వం చేయగలమా? అనిపించేవి ‘వస్తువు’ లుగా కనిపిస్తయి. అయితే చాలా వరకు ‘వస్తువులన్నీ నిర్దిష్టంగా గాక సాధారణీకరించినట్టుగానే మాట్లాడతయి. కవి విశ్వ మానవతావాదిగా కనిపిస్తడు. నిర్దిష్టం(Specific )గా మాట్లాడనంతవరకు మనం సేఫ్ మోడ్ లో వున్నట్టు భావించాలి. సాధారణీకరించి (Generalised) మాట్లాడుతున్నప్పుడు, మానవత్వం ఎజెండాగా కొనసాగుతున్నప్పుడు రక్షణ తంత్రాలు (Defense mechanism) అంతగా అవసరం పడవు. అందరూ బాగుండాలి – అందులో మనముండాలి అనే ఆశావాహ దృక్పథం, పాజిటివ్ నేచర్ ‘మౌనశ్రీ’ కవిత్వంలోనూ కనిపిస్తయి. ఎంత సాధారణీకరించి మాట్లాడుతున్నప్పటికీ నిర్థిష్టమైన స్వరం అప్పుడప్పుడూ తొంగిచూసి వెళ్తుంటుంది.

“కొంతకాలానికి
ఊరు నోరు తెరుచుకుంటుంది
నీ గురించి మాట్లాడటానికి’ బంధుగణం ఒళ్లు విరుచుకుంటుంది.
నిన్ను జైకొట్టడానికి!
నీ చిరపరిచితులకు చలనం వస్తుంది
నిన్ను కలిసి తరించడానికి” (చెప్పు తెగేలా చెప్పు)
*
మౌనశ్రీ కవిత్వ నిర్మాణ పద్ధతుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇవి తన కవిత్వ శిల్పాన్ని గురించి విడమరిచి చెబుతయి. నెగెటివ్ గా మాట్లాడి పాజిటివ్ దృక్పథాన్ని పెంపొందించే నిర్మాణ వ్యూహం ‘మొక్కలు నాటకండి’ కవితలో చూడొచ్చు .

పుస్తక రచయిత మౌనశ్రీ మల్లిక్
సినిమా, టీవీ పాటల కవి

“దయ చేసి మొక్కలను అస్సలు నాటకండి
ఒకవేళ బుద్ధి పుట్టి నాటినా వాటి సంరక్షణ మరిస్తే మాత్రం
ఆ మొక్కలను హత్య చేసినట్టే కాదు
ఈ పుడమిని అభిమానభంగం చేసినట్టు
ఔను మరి చెట్టుంటేనే కదా
అవని అయినా ప్రాణి అయినా ఉండేది”
*
మానసిక ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసే బాహ్య ప్రపంచపు అలజడికి కార్య కారణ సంబంధం నెరిపి, రెండు సందర్భాలకు ఔచిత్య వంతమైన అన్వయ సంయమనం ప్రదర్శించి ఒక తీర్పును వెలువరించే నిర్మాణ వ్యూహం “పిట్టమనసు’ కవితలో దర్శించవచ్చు.

“పిసరంత పిట్టకైనా
చెట్టంత మనిషికైనా
కడుపు తీపి ఒక్కటే”
*
సాధారణమైన, సామాన్యమైన అంశాలు విరోధాబాసను తెలీకుండానే ఎలా ప్రదర్శిస్తాయో తెలిపే నిర్మాణ వ్యూహం ‘గమనిస్తే’ కవిత చెబుతది.

” జై కొట్టే సమూహంలో బుసకొట్టిన గుంపూ ఉంటుంది”
*
గతాన్ని నెమరేసుకోవడం అంతా ‘నాస్టాల్జియా’ అనుకుంటే పాఠకుడు వింటున్నట్టుగా ముచ్చట చెప్పుకుంటూ జ్ఞాపకాల దొంతరల్ని ఉల్లి పొరల్లా ఒలుస్తూ ఒల్శెంత దుక్కాన్ని ఒక్కమాటలో చెప్పి కంట తడి పెట్టిస్తడు. జీవితం మొత్తం చెప్పడం ఒకెత్తు. ముగింపు చెప్పడం మరో ఎత్తు.

” అది నా మనుగడను మలుపు తిప్పిన ఇల్లు మాత్రమే కాదు
మా అమ్మ తుదిశ్వాస విడిచిన ఇల్లు” (పాత అద్దె ఇల్లు)
*
కవి యుద్ధం గురించి మాట్లాడుతడు. యుద్ధం పుట్టకతో ముడిపడి వున్న బంధాన్ని చెబుతడు. యుద్ధం ఎక్కడలేదని ప్రశ్నిస్తడు? పాలస్తీనా – ఇజ్రాయేల్ సందర్భాన్ని ప్రస్తావిస్తడు. బుద్ధుడు, జీసన్, ప్రవక్త ఏయే యుద్ధాలు చేసారు? కవి ఎటువంటి యుధ్ధాన్ని కోరుకుంటున్నడు? ఈ కవిత మాట్లాడుతది.

“ఔను యుద్ధం జరగాలి. మతాల సరిహద్దులు దాటి కులాల గీతలు దాటి
మేం మనుషులమని
ప్రపంచం ముక్త కంఠంతో నినదించే
యుద్ధం జరగాలి
ఔను యుద్ధం జరగాల్సిందే! (యుద్ధం జరగాల్సిందే..!)
*
వస్తు సృహ, కవిత్వ నిర్మాణ కౌశలం మెండుగా వున్న కవి మౌనశ్రీ మల్లిక్. విరహమైనా, శృంగారమైనా, కరుణను ఒలికించినా ఏ రసాస్వాదనలోనైనా పాఠకులు మునకలు వేసేంత సమ్మోహన వాక్యం తనది. తను సాహిత్య ఇగురం తెలిసిన కవి. తనను తాను, తన కవితావాక్యాన్ని నిత్యం పుటం పెట్టుకుంటూ సానబారిన కవిత్వ వెలుగుల్ని మున్ముందు మరిన్ని పంచాలని కోరుకుంటూ ‘మంటల’ స్నానం’ వెలువరిస్తున్న శుభ సందర్భంగా అభినందనలు.

April 2, 2025 28 comments
1 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

వాస్తవిక జీవన కథనం – ధూళిపాళ అరుణ కలం

by ఒద్దిరాజు మురళీధరంరావు March 31, 2025
written by ఒద్దిరాజు మురళీధరంరావు

         మన చుట్టూ ఉన్న సమాజంలో అనేకమైన సంఘటనలు మనలో ఎన్నో అలజడులను సృష్టించి మనసును కకావికలం చేస్తాయి. కవులు, రచయితలు ఆ భావోద్వేగాలను తమ రచనల ద్వారా బహిర్గతం చేస్తారు. ఆ విధంగా వెలువడినదే ధూళిపాళ అరుణ రచించిన “మిగిలేవి గురుతులే” కథా సంపుటి.        ఇందులోని కథలన్నీ వాస్తవ జీవన చిత్రణలే. తనకళ్ళ ముందు కుటుంబాలలో జరిగిన అనేక వెతలను ఆమె కథలుగా మలచింది. అవన్నీ యథార్థ గాథలే. స్వతహాగా కవయిత్రి కూడా కావడం వల్ల కొంత కవితా శైలి కూడా కనిపించి పాఠకుల హృదయాలను హత్తుకుంటుంది.

        పుస్తకం పైన కవర్ పేజీ ఎంతో రంధితో కూడుకున్నదిగా కనిపించి చివర పేజీలో ‘హమ్మయ్య! పుస్తకం పూర్తయింది’ అన్నట్టు నవ్వు ముఖం కనిపిస్తుంది. ఇందులోని 15 కథలూ వాస్తవాన్నిచూపిస్తూ ఆసక్తికరంగా ఉండి పాఠకులను చదివింప జేస్తాయి. కథల్లో అక్కడక్కడా కొన్ని వాక్యాలు తెలుగు భాషలో చెక్కబడినవా? అన్నట్టు తోస్తాయి. నేను కథల విశ్లేషణ జోలికి వెళ్లకుండా నాకు నచ్చిన అలాంటి కొన్ని వాక్యాలను ఉదాహరిస్తాను.

“మునుముందుకు నడవడమే మనిషి కర్తవ్యం”

మనిషి జీవితానికి ఎన్నో సవాళ్లు, ఎదురీతలు ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకు సాగుతూనే ఉండాలన్న కర్తవ్యబోధ ఇక్కడ కనిపిస్తుంది.

“బలహీనంగా ఉన్నంతవరకు సమాజం అణచి వేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది”

ప్రస్తుత కాలంలో బలమున్న వాడిదే పైచేయిగా ఉండడం మనం గమనిస్తున్నాం. అదే బలహీనుడైతే సమాజం అణచివేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఇది సమాజస్వరూపం.

“రక్షించవలసిన తండ్రే కాటేస్తే సమాజం ఏం చేస్తుంది? నీడనివ్వని చెట్టువల్ల ప్రయోజనం ఏమిటి?”

వీరేశ్ కూతురు మీద చేసిన అఘాయిత్యాన్ని వివరిస్తూ రచయిత్రి చెప్పిన పాఠకులను ఆలోచింపజేస్తాయి.

కనుల నీరు పెట్టిస్తాయి.

“కంటిలో నుండి ఊట బావి లాగా నీరు ఊరుతూనే ఉంది”

“కళ్ళు నిండు తటాకాలయ్యాయి”

“నిద్ర ఎక్కడో ముఖం చాటేసింది”

“కన్నీటికి కన్ను నిరంతర ఆవాసమైంది”

ఇలాంటి కవితాత్మక వాక్యాలు అరుణలోని కవయిత్రిని మనముందు నిలబెడతాయి.

“నాపై వేలాడదీసిన కాలసూచి రాత్రి రెండుగంటలు దాటినట్టు చూపిస్తోంది”

గోడమీద గడియారాన్ని గురించి అన్యాపదేశంగా రాసిన ఈవాక్యం రచయిత్రి రచనా ప్రతిభను తెలియజేస్తుంది.

“కొన్ని తొందరపాటు నిర్ణయాలు, కొన్ని ఆలస్యపు నిర్ణయాలు జీవితాంతం శిక్షను విధిస్తాయి”

జీవితంలో మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి తొందరపడటం, మరొక్కసారి సమయానికి సరైన విధంగా తీసుకోకపోవడం. ఈ రెండూ ప్రమాదమే. వాటివల్ల జరిగే అనర్థం ఒక్కోసారి యావజ్జీవితం అనుభవించాల్సి ఉంటుంది. ఎంతో

అనుభవం గడిస్తేనే ఇలాంటి వాక్యాలు రాయడం సాధ్యమవుతుంది.

మరో కథలో….

“ఏ శిల్పానికైనా ప్రాణం కళ్ళే కదా! గీయడంలో కొద్ది తేడా అయినా అందమంతా చెడిపోతుంది”

వినాయక విగ్రహాలను చేసే కుటుంబాన్ని గురించిన ఈ కథలో విగ్రహాన్ని ఎంత బాగా తయారుచేసినా కళ్ళను చిత్రించడంలో ఏమాత్రం తేడా వచ్చినా బొమ్మ అందం చెడిపోతుందని చెప్పడం ఆమెకున్న అవగాహనను తెలియజేస్తుంది.

అదే కథలో….

“హృదయపు త్రాసు కూతురి వైపు మొగ్గింది”

“తనకన్నా బిడ్డ జీవితమే ముఖ్యమనుకున్న తల్లి గుండె బలహీనమై కొట్టుకోవడం చేతగాక ఆగిపోయింది”

అనే వాక్యాలు మాతృత్వపు త్యాగానికి అద్దం పడతాయి.

ఇంకో కథలో….

“జీవితమంతా పోరాడిన ఆమె మరణం కోసం పోరాడలేదు”

ఒక స్త్రీ జీవితమంతా కష్టాలలో మునిగి,

అకాల మరణంతో హఠాత్తుగా చనిపోవడాన్ని గురించి చెప్పిన వాక్యమిది. ఏ అనారోగ్యం, వార్ధక్యం మీద పడకుండానే ఆమె సునాయాసంగా మరణించడం ఒక విధంగా ఆమె పాలిట వరమే. కనీసం మరణ సమయంలోనైనా ఎలాంటి బాధ ఆమె పొందకపోవడం

ఒక రకంగా అదృష్టమే.

“లోకంలో ప్రతి మనిషికి సలహా చెప్పడమంత సులువు మరేదీ ఉండదేమో?”

ఇది అందరికీ అనుభవమే. చాలామంది వాళ్ళు ఆచరించని ఎన్నో విషయాలను ఇతరులకు సలహాలుగా ఇస్తుంటారు. లోకం పోకడ ఇది.

         ఈ విధంగా ఈ కథా సంపుటిలో సమాజానికి, వ్యక్తులకు అన్వయించగలిగే ఎన్నో వాక్యాలను ధూళిపాళ అరుణ గారి కలం నుండి చూడగలం. ఇలాంటి రచనలు ఆమె ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను.

March 31, 2025 29 comments
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

సన్నాయి మహిమ

by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, March 31, 2025
written by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,

నరసింహపురం అనే గ్రామంలో శరభయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఆ గ్రామం గత మూడు సంవత్సరాలుగా వర్షాలు లేక కరువు కాటకాలతో సతమతమైంది. ఆ సంవత్సరం ఆ శరభయ్య పొలం కూడా వర్షం లేక పైరు ఎండిపోయింది. అతడు దాన్ని చూసి బాధపడుతున్న సమయంలో అక్కడి నుండి ఒక సన్యాసి పోతూ ఆ రైతును పిలిచి ఎందుకు బాధపడుతున్నావని ప్రశ్నించాడు . ఆ రైతు తన పొలం ఎండిపోయిందని,తాను ఎలా బ్రతికేదని బదులిచ్చాడు . అప్పుడు ఆ సన్యాసి ఒక సన్నాయిని తన సంచిలో నుండి తీసి బిగ్గరగా ఊదాడు . వెంటనే ఆ పొలం పచ్చగా నిగనిగలాడింది.
ఆ రైతు ఎంతో సంతోషించి ” మహాత్మా! ఒక్క నా పొలం పచ్చగా ఉంటే సరిపోదు. మా ప్రజలందరి కడుపులు నిండాలంటే మీరు మా గ్రామంలో గల అన్ని పంటచేలను పచ్చగా చేయాలి” అని కోరాడు. ఆ రైతు పరోపకార బుద్ధికి ఆ సన్యాసి ఎంతో సంతోషించి ఆ సన్నాయిని ఇస్తూ ” ఓ. ఉపకారీ! ఈ సన్నాయి నేను ఊదితే ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది. అడిగిన వారి కోరికను తీరుస్తుంది. కానీ ఇప్పుడు అది ఇక నా చేతిలో పనిచేయదు. అందువల్ల దీనిని నీకు ఇస్తున్నాను. తీసుకో! దీనిని నీవు ఊదితే అది మూడు సార్లు నీ కోరికలను తీరుస్తుంది. కానీ ఒక్క షరతు. నీవు ఇప్పుడు కోరినట్లే ఇతరులకు ఉపయోగపడే కోరికలను మాత్రమే కోరాలి. స్వార్థంతో నీవు ఏ కోరిక కోరినా ఇది పనిచేయదు” అని దానిని ఆ రైతుకి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
ఆ రైతు సంతోషంగా దాన్ని తీసుకొని తమ తోటి రైతుల పొలాలన్ని పచ్చగా ఉండాలని, పంట బాగా పండాలని కోరి దానిని ఊదాడు. వెంటనే మిగతా రైతుల పొలాలన్ని పచ్చదనంతో నిగనిగలాడాయి. ఒక కోరిక ఆ విధంగా నెరవేరింది. తర్వాత ఎండాకాలం తమ గ్రామంలోని చెరువులన్నీ ఎండిపోవడం చూసాడు. మూగజీవాలకు నీటి కటకటను గమనించాడు. తమ గ్రామంలోని చెరువులన్నీ నిండాలని తన కోరికగా కోరి తిరిగి ఆ సన్నాయిని ఊదాడు. వెంటనే ఆ గ్రామంలో గల చెరువులన్నీ ఆశ్చర్యంగా నిండిపోయాయి. ఆ తర్వాత మూడవ కోరికగా అడవిలోని, గ్రామంలోని ఎండిపోతున్న చెట్లన్నీ ఆకుపచ్చదనంతో కళకళలాడుతూ ఉండాలని ఆ సన్నాయిని ఊదాడు. వెంటనే ఆ అడవిలో,గ్రామంలో ఉండే చెట్లన్నీ ఆకుపచ్చదనంతో నిగనిగలాడాయి. మూడు కోరికలు పూర్తి కావడంతో ఆ సన్నాయి తన మహిమను కోల్పోయింది. ఆ చెట్ల వల్ల భారీ వర్షాలు పడి ఆ గ్రామంలో పంటలు చాలా పండాయి. దానితో ఆ గ్రామం కరువు కాటకాలు తీరిపోయాయి. తమ గ్రామ కరవుకాటకాలు పోగొట్టిన ఆ రైతును గ్రామస్థులు అందరూ అభినందించారు.

March 31, 2025 27 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

వని ‘తలకు’ జోహార్…జోహార్…

by Devaraju Revathi March 31, 2025
written by Devaraju Revathi

స్త్రీ చైతన్యం తొలిమెట్టు
అదే ఆశయాలమలిమెట్టు
మహిళల చేతనం నవోదయం
ప్రతి ఇంటికి ఆమే ఉషోదయం

పాత్ర ఏదైనా‌‌ అందు‌ జీవించడం
సహనం కరుణా మమతలతో
ఎదుటివారిని మెప్పించడం
తనకంటూ ఓ ప్రత్యేకతను
నిలుపుకుంటూ‌ ముందుకేగడం

బాధ్యతలెన్నోమోస్తూ తానూ
కొవ్వొత్తిలా కరిగి వెలుగివ్వటం
బాధనుగుండెల్లోదాచుకుని
బ్రతుకుదెరువుకైపోరాటం

మహిళలు జాతికి రత్నాలు
ఆదర్శం గానిలబడుతారు
స్ఫూర్తి‌ ప్రదాతలు మరెందరో
నిత్య‌ నూతన సృజనలతో
కళామతల్లుల గాథలుయెన్నో

ప్రతిభా సంపద పరిమళాలతో
వివిధ రంగాలలోరాణిస్తూ
కీర్తిప తాకము లెగురేస్తూ
తారాజువ్వలు గా దిగంతాలకు
చంద్రికలై కాంతులు విరజిమ్మే
వనితలందరికీ జోహార్ జోహార్

చంద్రయానమునశాస్త్రవేత్తలై
సాంకేతిక విప్లవసారథులై
వినూత్న రీతుల వేగంతో
జాబిలమ్మనే దరిజేర్చే
మార్గాన్వేషణ‌ పరిశోధకులు
మగువలు మీకివె అంజళులు

March 31, 2025 84 comments
1 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • వేకువ పాట
  • చాణుక్యుడు ఆదిశంకరాచార్యుల ప్రభావం ఒక సింహావలోకనం
  • సనాతనమంటే?
  • సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి- డా. జి. చెన్నకేశవరెడ్డి
  • సాహిత్యాకాశంలో నక్షత్రాక్షర తోరణం- అక్షరగీతం

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us