మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
Uncategorized

సెప్టెంబర్ మయూఖ పత్రిక – విషయసూచిక

by mayuukha September 30, 2024
written by mayuukha

కవితలు:-

1 నీవెక్కడ నేనెక్కడ- చిట్టిప్రోలు వెంకటరత్నం

2. రెక్కలు,- పెద్దూరి వెంకట దాసు

3. నానీలు- జి. సులోచన

4. నవ్య కలం సినారె- డాక్టర్ వసుంధర, చెన్నై

5. శనార్తులు – దేవనపల్లి వీణా వాణి

6. వర్షం వర్షం వర్షం – మహమ్మద్ అబ్దుల్ రషీద్

7. ఉదయ సంధ్యలో- లక్ష్మీ త్రిగుళ్ళ

8. అంగూరు గుత్తులు- రమేష్ నల్లగొండ

9. కల్తీ యుగం -రుద్రాక్షల మఠం ప్రభులింగ శాస్త్రి

10. ఆత్మ సౌందర్యం- రాధిక సూరి

11. వృక్ష మాత- పద్మశ్రీ చెన్నోజ్వల

12. సహన ధాత్రి- అరుణా ధూళిపాళ

13. మహిళా చైతన్యం-కీర్తి శేషులు గొడవర్తి సంధ్య

కథలు:-

1 పాద యుగళం – ధర్మముళ్ళ చంద్రశేఖర్

2. కుజదోషం- డాక్టర్ మజ్జి భారతి

3. మరుగుజ్జు బుద్ధులు – శీలా సుభద్ర దేవి

4. కుబేర- ఒద్దిరాజు సుభాష్ చంద్ర

5. నా ఇల్లు- కథ రెండవ భాగం లక్ష్మీ మదన్

6. సభ్య సమాజం -నారాయణరావు (తరానా)

7. తనూజ లక్ష్మీ త్రిగుళ్ళ

వ్యాసాలు :-

1. లేఖ సాహిత్యంలో భాషా విశేషాలు- డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి

2. తొలి తెలుగు కవయిత్రి మొల్ల- విజయ రంగనాథం

3. నాకు తెలిసిన బిఎస్ రాములు డాక్టర్ భూతం ముత్యాలు

4. తోరణాలు – విజయ కందాళ

5. తెలంగాణ ఉద్యమ కవి కాళోజి – డాక్టర్ అరుణపరంధాములు

6. తెలంగాణ భాషా దినోత్సవం- డాక్టర్ చీదర్ల సీతాలక్ష్మి

7. తంజావూరు కవయిత్రి- మధురవాణి విజయ రంగనాథం

8. ఇల్లు మనిషి చిరునామా,- ఆచార్య కడారు వీరారెడ్డి

9సాహితీ సిరిమల్లి మన వడ్డేపల్లి- డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్

10. కవిత్వాస్వాదన – ఈశ్వర్ చరణ్ కవిత ఉషస్సు సంధినేని నరేందర్

11. జాతీయాలు -రంగరాజు పద్మజ

12. ఇంద్రధనస్సులో ఏడోరంగు- దేవనపల్లి వీణా వాణి

13. విద్యుత్కవి డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ – ఎన్.నరేష్ చారి

14. విశ్వ కవి  – మన కవి-రవీంద్రనాథ్ ఠాగూర్ -రాధిక సూరి

15. గూటి పక్షులు గులాబీ ముళ్ళు పద్మశ్రీ చెన్నోజ్వల

16. మహాప్రస్థానం మళ్లీ చదువుదాం – కె.కె.తాయారు

17. శ్రీమతి దుర్గాబాయి దేశ్ ముఖ్ – కీర్తిశేషులు గొడవర్తి సంధ్య

ధారావాహిక:-

జీవన మాధుర్యం 2 వ భాగం

బాల సాహిత్యం:-

1.ఓ మేక ఓ తోడేలు (అనువాద కథ) ఒద్దిరాజు మురళీధర్ రావు

2.ఆర్మీ వీరుడు – దార ప్రీతిక

ఇంద్రధనస్సు:-

1. మన ఉపాధ్యాయుడు – ముదుగంటి ప్రతాప్ రెడ్డి – సందినేని నరేందర్

2. వేగుచుక్కలకే వేగుచుక్క – రంగనాయకమ్మ – రంగరాజు పద్మజ

3. ప్రజ్ఞాన్ విద్యార్థి ప్రజ్ఞ- వలిపె రామ్ చేతన్

4. కరణ్  బజాజ్ – నారాయణ రావు ( తరానా)

5. సాహిత్యాన్ని ప్రేమించిన కవయిత్రి గొడవర్తి సంధ్య గారికి శ్రద్ధాంజలి

-మయూఖ సంపాదకులు

ఇంటర్వ్యూ లు

1 బహుముఖ ప్రజ్ఞాశాలురు – సంగనభట్ల నరసయ్య గారు-అరుణ ధూళిపాళ

2

పుస్తక సమీక్షలు:-

1. విజ్ఞానం కలిగించే ఆయుధం ఆనందలహరి

-నన్నపురాజు విజయశ్రీ

2. కళ్యాణం శ్రీనివాస్ “పిడికిలి”

— నరేందర్ సాదినేని

3. మాటల చెట్టు మాటలు:-

-కట్టెకోల విద్యుల్లత

అనువాద సాహిత్యం:-

1. “గుల్జార్ షాయరీ” గీతాంజలి విశ్లేషణ -నరేందర్ సందినేని

2. పాఠశాల అనే విశాల భావం ముందు ఎవరు తెలుసుకున్నారు! (అనువాద కథ)-ఒద్ది రాజు మురళీధర్ రావు

3. “వచన కవితగా…”- (అనువాద కవిత)-ఎలనాగ

4. “మీ ఔర్ మీరా ఆంగన్”( అనువాద కవిత)

మూలం : వారాల ఆనంద్

 విజయ రంగనాథం (హిందీ అనువాదం)

September 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

శబ్దసంపదను పెంచుకోవాలి- అనేక కవుల కవితారీతులను అవగాహన చేసుకోవాలి – డా.గండ్ర లక్ష్మణ రావు

by Ananthaacharaya K.S. September 30, 2024
written by Ananthaacharaya K.S.

డా.గండ్ర లక్ష్మణ రావు గారితో ముఖాముఖి

కే.ఎస్‌ : నమస్కారం సర్

గండ్ర : నమస్కారం అనంతాచార్యా

కే.ఎస్‌. .మీది ప్రధానంగా వ్యవసాయ కుటుంబం.పంటలు, పశువులు ఆ నేపథ్యం లోంచి పద్యం పట్ల సాహిత్యం పట్ల అభిరుచి ఎట్లా మొదలయింది. ? బాల్యం నుంచే కళల పట్ల ఆసక్తి ఎవరి ప్రభావం వల్ల మొదలయింది.?
గండ్ర : మాది పల్లెటూరు. వ్యవసాయ కుటుంబం. మా బాపు చదువుకున్నవారు. ఆరోజుల్లో మూడవ తరగతి అనుకుంటా. కాని భారత, భాగవత , రామాయణాలుచదివేవారు, వాటిలోని అనేక కథలు రాత్రులు కల్లాల దగ్గర చెపుతుండేవారు. సాయంకాలాలు ఇంటి ముందర కూచొని వచ్చినవాళ్ళతో అవీ ఇవీ మాట్లాడుతూ ఏదో ఒక కథ వాటిల్లోంచి చెపుతుండేవారు. వేసవికాలం రాత్రులు ఆరుబయట మంచంలో పడుకొని పద్యాలు వల్లెవేయించేవారు. హరియను రెండక్షరములు వంటి భాగవత పద్యాలు నోటికి చదివించేవారు.
మా ఇంటి వెనుక తోటలుండేవి. వాటికి మోటలు కొట్టి నీరు పారించేవారు. అప్పుడు పాలేర్లు పోటీలు పడి పాటలు పాడేవారు. ఇంటికి వచ్చిన రకరకాల బిచ్చగాళ్ళు పదాలో పాటలో పాడేవారు. ఇవన్నీ చిన్నప్పుడు నన్నాకర్షించాయి. ఊరిలో కొందరు పద్యాలు, పాటలు కీర్తనలు చదివేవారుండేవారు. ఆయా సందర్భాలలో వారిని చూశాను. విన్నాను. హరికథలు , బుడిగ జంగమవారి కథలు, చిరుతల రామాయణం నాటకాలు, భాగవత నాటకాలు మొదలైనవి మా ఊరి వారే ప్రదర్శించేవారు. ఇంట్లో మా అమ్మ దగ్గరనుంచి ఇంటి చుట్టు ఉన్నవారు ఇతరులు అనేక సందర్భాలలో మాట్లాడే మాటాల్లో దొర్లే సామెతలు బాగా ఆకర్షించేవి.  ఇట్లా అనేకానేక గ్రామీణ సాంస్కృతిక వాతావరణం నాకు తెలియకుండా నన్ను సాహిత్యం వైపు మళ్ళించింది. నా చిన్నతనంలో మూడవ తరగతి, నాలుగ తరగతిలో నా చేత వారు రాసిఇచ్చిన ఉపన్యాసాలు ఇప్పించేవారు. నేను బాగా చదివి నిర్భయంగా నోటికి చెప్పేవాడిని అదే నన్ను ఇప్పుడు వేదికలమీద నిలబెట్టింది.

కే.ఎస్‌, అకాడెమిక్‌ గా బి.ఎస్‌.సి గణితం చదివిన మారు సాహిత్యం వైపు ఎట్లా మరలారు? అట్లా సాహిత్యం వైపునకు రావడానికి దిక్సూచి ఎవరు? ప్రోత్సహించింది ఎవరు? ..
గండ్ర :  నేను చిన్నప్పటి నుండి గణితంలో చురుకుగా ఉండేవాడిని. మా ఊరులో చదువుకునేటప్పుడు వేమన పద్యాలు, సుమతి పద్యాలు చెట్ల కింద కూర్చోబెట్ట వల్లింప జేసేవారు. బాల ప్రసాద్‌ అనే టీచరు మా ఇంట్లోనే ఉండేవారు. ఆయన సాహిత్యం పట్ల అభినివేశం గలవారు. మాచేత మాటలు, పాటలు, పద్యాలు చదివించేవారు. నాటకాలు వేయించేవారు. హైస్కూలులో తెలుగు అధ్యాపకులు పలుగులు భూమారెడ్డి పద్యాలు చాలా అందంగా చదివేవారు. డిగ్రీ చదివేటప్పటికే గణితంతో పాటు సాహిత్యం మీద రుచి పెరిగింది. పి.యు.సి.చదివేటప్పుడు మా కాలేజికి విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చారు, డా. సి.నారాయణ రెడ్డ గారు వచ్చారు,  గొల్లపూడి మారుతీరావు వచ్చారు, ఇట్లా నాలో అంకుర రూపంగా ఉన్న సాహిత్యాభిలాషకు ఈ అన్ని సన్నివేశాలు నీరుపోసి పెంచాయి. డిగ్రీలో ఉండగా 1969లో సెకండ్‌ ఇయర్‌. తెలంగాణ నాన్‌ ముల్కీ ఉద్యమం వచ్చింది. ఒక సంవత్సరం కళాశాలలు మూతపడ్డాయి. ఆ సంవత్సరమంతా నేను విపరీతంగా సాహిత్యం చదివాను. అందుకు దోహదం చేసింది, ప్రోత్సహించింది, ఏవి చదవాలో చెప్పిన వారు కోవెల సంపత్కుమారాచార్యులు. అప్పుడు వారు మాకు తెలుగు ఉపన్యాసకులు. వట్టి గాలి చదువునుండి అచ్యమైన సాహిత్యం వైపు మళ్ళించిన వారు సంపత్కుమారగారు. అప్పుడే విశ్వనాథ, అడవిబాపిరాజు,కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ,ఆరుద్ర, దాశరథి, కాళోజి( జీవనగీత), బాపురెడ్డి  మొదలైన వారిని అత్యంత ఆసక్తితో అభిమానంతో చదివాను. అంతేకాదు సింహాసన ద్వాత్రింశిక, హరవిలాసం, ప్రభావతీ ప్రద్యుమ్నము, కళాపూర్ణోదయము మొదలైన ప్రబంధాలు చదివాను. ఆరుట్ల భాష్యాచార్యులుగారు మాకు మరో తెలుగు ఉపన్యాసకులు వారి వద్ద చనువుతో అనేక విషయాలు అడిగి తెలుసుకునే వాడిని. అప్పుడు మా ప్రిప్పిపాల్‌ కొండలరావుగారు. అయన ప్రతి సబ్జుక్టులో  వారం వారం సెమినార్లు నిర్వహించే వారు. శ్రీశ్రీ పై జరిగిన సెమినార్‌ లో నేను ప్రసంగం చేశాను. నాకు హైస్కూలునుండి సహవిద్యార్థి మిత్రులు ఆచార్య అనుమాండ్ల భూమయ్య నేను కలిసి ఆముక్త మాల్యద, మనుచరిత్ర ,వసుచరిత్ర వంటివి వేదం వారి టీకాతో ఉన్నవి కలిసి చదివాం. అట్లా గణితం మీదనుండి తెలుగుకు ఎక్కువ మొగ్గు చూపడం జరిగింది.

కే.ఎస్‌…సీరియస్‌ గా సాహిత్యం చదువుకున్న మీరు అధ్యయనం,అధ్యాపనం, సృజన మూడింటిని ఎట్లా సంయమనం చేశారు? మూడింటిని ఎట్లా సమాంతరం చేశారు?
గండ్ర : అధ్యయనం నా నిత్యజీవితంలో భాగమయింది. ఇప్పటికీ రోజూ ఏదో ఒక పుస్తకం చదువకుండా ఉండలేను. అధ్యాపనం కోసం కూడా పుస్తకాలు చదివేవాడిని. పాఠం చెప్పడం కోసం ఆయా పాఠాలు ఉన్న కావ్యాలు, కవుల గురించి అధ్యయనం చేసేవాడిని. ఎం.ఏ లో ఆచార్య దివాకర్ల వేంకటావధాని, డా. సి.నారాయణ రెడ్డి, జి.వి. సుబ్రహ్మణ్యం వంటి వారు ఎన్నెన్ని పుస్తకాలు ఉటంకించేవారో చూసి ఆశ్చర్యమనిపించి అట్లా అనేక రచనలు చదవాలని అధ్యయనం పట్ల మరింత ఆసక్తి కలిగింది. ఎన్నిసార్లు చెప్పిన పాఠమయినా క్లాసుకు పోయే ముందు తప్పక మరోసారి ఇంటి దగ్గరైనా చదివేవాణ్ణి. ప్రతిసారి కొత్త విషయాలు స్ఫురించేవి. అవి అధ్యయనం వల్ల కలిగిన మేలు. అధ్యాపనం నాకు చాలా ఇష్టమైన వృత్తి. పాఠం చెపుతున్న ప్రతి గంటా నా ఆయుస్సును పెంచుతుంది,,,,, అని నేను ఒక కవితలో రాసుకున్నాను. నా ఆరోగ్య రహస్యం ఏమిటని చాలామంది అడుగుతారు. ఒకటి అధ్యయనం, రెండవది అధ్యాపనం. వీటిలో మురిసపోయిన నేను సృజన వైపు చాలాకాలంగా దృష్టి పెట్టలేదు. అప్పుడప్పుడు మాత్రమే రాసేవాడిని. మూడింటిలో రెండింటికే ఎక్కువ ప్రాధాన్యత. తరువాత అధ్యాపకుడి మలిథలో సృజనవైపు ఎక్కువ దృష్టి పెట్టాను.

కే.ఎస్‌……సాహిత్య సంస్థల నిర్వహణలో మీ పాత్ర గొప్పది. అధిక సమయం వెచ్చించారు. అది మీ సృజనాత్మక పైన ఎంత వరకు ప్రభావం చూపించింది? ఇప్పుడు మీరేమనుకుంటున్నారు?
గండ్ర :  కరీంనగర్‌ లో 1978లో పనిచేస్తున్నప్పుడు మా సహచర ఉపన్యాసకుడు డా. గోపు లింగారెడ్డి జానపద సాహిత్య పరిషత్‌ రాష్ట్ర కార్యదర్విగా కార్యక్రమాలు నిర్వహించేవారు. అప్పుడు నాయని కృష్ణకుమారిగారు అధ్యక్షులు. కరీంనగర్‌లో ఆయన నిర్వహించే కార్యక్రమాలన్నిటిలో నన్ను భాగస్వామిని చేయడమే కాక జిల్లా కార్యదర్శిగా పెట్టారు. వాటితో పాటు ఆయా కవులు జయంతుల సందర్భంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ సమయానికి రావలసిన ప్రసంగం చేయాల్సిన వారు రాకపోతే నా చేత మాట్లాడించేవారు. తరువాత నూకలమర్రి గంగయాచారి కరెంటు ఆఫీసుల పనిచేసే అతను సమతా సాహితి అని ఏర్పాటు చేపి నన్ను, డా.బి. దామోదర్‌ రావును, డా.డింగరి నరహరి ఆచార్యను, త్రిపురారి సోమేశ్వర శర్మను, పర్శరామారావును, గజేందర్‌ రెడ్డిని కార్యవర్గ సభ్యులుగా నియమించి ఆయన స్వయం సౌజన్యంతో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఒక విధంగా మా సమయమంతా ( కాలేజి అయినాక) వాటికే గడిచిపోయింది, .. సాహితీ గౌతమి ఏర్పాటు, సినారె పురస్కారం ఏర్పాటు ఆయా కార్యక్రమాలు , అప్పుడే సమైక్య సాహితి , మాడిశెట్టి గోపాల్‌, కె.ఎస్‌అనంతాచార్య  ప్రారంభించడం ఇట్లా కరీంనగరం సాహిత్య వాతావరణాన్ని పెంచాయి. ప్రతి సాహిత్య కార్యక్రమంలో నేను నిర్వాహకుడిగానో, వక్తగానో, ఆయా పనులు చేసేవాడిగానో పాల్గొనని సందర్భం లేదు. ప్రభుత్వం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పాల్గొనడం తప్పనిసరి అయింది. నెహ్రూ యువకేంద్ర విద్యాసాగర్‌ రావుగారు కో ఆర్డినేటర్‌ గా అనేక కార్యక్రమాలలో మమ్ములను భాగస్వాములను చేశారు. మా సహోపన్యాసకులు పార్వెళ్ళ గోపాల కృష్టగారు అవధానాలు చేశారు.సమతాసాహితి, సాహితీ గౌతమి సంస్థలకు అధ్యక్షులుగా అనేక సంవత్సరాలు పనిచేశాను, ఈ కార్యక్రమాల, సంస్లల నిర్వహణ నా సృజనాత్మక దృష్టికి ఆటంకమే అయినాయి. మిత్రులు కూడా మీరు ఈ పనులు మానేస్తే చాలామంచి కవిత్వం, రచనలు చేస్తారు అని అంటుండేవారు. అయితే నా రచనలే కాదు ఎంతో సాహిత్యం ఉంది, అది అధ్యయనం చేసే ఒక ప్రేరణ కలగాలని, కొత్త వారికి సాహిత్యం పట్ల ఉత్సాహం కలిగించాలని ఎక్కువ ఆరాటపడ్డాను.

కే.ఎస్‌…..కవిత్వంలో నీవు అనే ఆది మకుటంతో శతకం రాశారు. ప్రయోగాత్మక మయిన ఆ శతకం గురించి వివరించండి. తెలుగు సాహిత్య ప్రపంచంలో దానికి లభించిన స్థాన ఏమిటి?
గండ్ర : పద్యం చదవడం, అంటే ఇష్టపడే నేను పద్యాలు రాస్తుండే వాడిని. డిగ్రీలో ఉన్నప్పుడే నేను అనుమాండ్ల పద్యాలు రాశాం. ఎం.ఏ లో జి.రామశేషయ్య నేను ఒకే గదిలో అద్దెకు ఉండి కలిసి చదువుకునేవాళ్ళం. అప్పుడు మేం పద్యాలురాశాం. కృష్ణాపత్రికలో అచ్చయినాయి. మళ్ళీ చాలాకాలానికి పద్యాలు రాశాను. అయితే అప్పటికే ఉపనిషత్తులు అధ్యయనం చేయడం వాటి గురించి వ్యాఖ్యానాలు, భాష్యాలు వినడం చదువడం నన్ను బాగా ప్రభావితుడ్ని చేశాయి. అట్లా తత్వమసి అనే భావనను తెలుగులో నీవు అనే పేరుతో సంబోధించి కొన్ని పద్యాలు తాత్విక భావనతో రాశాను. అందులో మిగతా శతకాల వలె ఏ దేవుని సంబోధన గాని, పేరుగాని ఉండదు.తత్వం మాత్రమే ఉంటుంది. ఆ విషయం కొంత కష్టమే, దాంతో పాటు నీవు అనేది నొక్కి చెప్పాలని ప్రతి పద్యం అట్లే మొదలయితే బాగుంటుందని అనుకొని అట్లారాశాను. అప్పుడు ఛందోపరమైన ఇబ్బందులున్నాయి. కాని వాటిని అదిగమించ గలిగాను. అది కూడా వీలయినంత వరకు తెలుగులోనే, సంస్కృత సమాస ప్రయోగాలు లేకుండా చేశాను.
                ఈ శతకానికి చాలా ప్రశంస వచ్చింది. మా రామశేషయ్య బాగా ప్రోత్సహించాడు. తరువాత మాదిరాజు బ్రహ్మానందం, గిరిజామనోహరబాబు, సంగనభట్ల నరసయ్య వంటి వారు అమితంగా ఆదరించారు. కపిలవాయి లింగమూర్తిగారు, సముద్రాల లక్ష్మణయ్యగారు, కోవెల సుప్రసన్నగారు అభినందించి ఆశీర్వదించారు. తెలుగులో ఏకప్రాస శతకాలు గతంలో ఒకటి రెండు వచ్చాయిగాని ఆది మకుటంతో రాలేదు. ఇదే తొలి ప్రయోగం. మహామహోపాధ్యాయ, పద్మశ్రీ శ్రీ భాష్యం విజయసారథిగారు ఈ శతకాన్ని చదివి పాతిక పైగా ప్రశంసా శ్లోకాలు రాశారు.అంత బాగున్నాయి పద్యాలు అని మెచ్చుకున్నారు. మహామహోపాధ్యాయులు అవధాని శ్రీ తిగుళ్ళ శ్రీ హరిశర్మగారు సంస్కృతంలోకి అనువాదం చేస్తున్నారు.

కే.ఎస్‌…. పద్యంతో పాటు ముగ్గు, వర్తమాన సంధ్య, శతద్రు లాంటి వచన కవిత్వం కూడా రాశారు. ఆధునిక ప్రాచీన సాహిత్యాలలో మీరు దేనిని ఎక్కువ ఇష్ట పడతారు? ఏది రాయడం మీకు సులువు, అభిమానం?
గండ్ర : కవిత్వం పద్యమైనా, గేయమైనా, వచన కవిత్వమైనా ఇష్టమే. వచన కవిత్వం ఈనాడు ప్రాచుర్యంలో ఉన్న రూపం. నేను కూడా అట్లా వచన కవిత్వం రాశాను. సంపత్కుమార వంటి వారితోపాటు సినారె, శేషేంద్ర, కాళోజి  మొదలైన వారి అధ్యయనం ప్రభావం ఎక్కువ.
ఏది సులభం అని ఏమీ లేదు. నిజం చెప్పాలంటే కవికి ఒక భావన వచ్చినపుడు అది తన రూపాన్ని తానే ఏర్పరుచుకొని బయటికి వస్తుంది.  ఆ రావడం ఒకసారి గేయంగా కావచ్చు, పద్యం గా కావచ్చు, వచనంగా కావచ్చు. తనంతగా వచ్చిందే సరిగ్గా ఆ భావానికి తగిన రూపమవుతుంది. ఈ భావాన్ని నేను పద్యంలో చెపుతాను, వచనంలో చెపుతాను అని అనుకొని రాయడం కృత్రిమమే అవుతుంఇ.  నీవు కవీంద్రులన్‌ కవివి…. అని ఉత్పలమాల ఛందస్సులో ఆరంభం వచ్చిందంటే మిగతాది అందులో కుదిరిపోతుంది. నేను పనిని ప్రేమిస్తాను…. అని వచ్చింది వచనకవిత్వమే అది అందులోనో సరిపోతుంది…. భావానికీ రూపానికీ అవినాభావ సంబంధం ఉంటుంది. నేను పద్యాలు, వచన కవిత్వం రెండూ విరివిగా చదివిన అనుభవం ఉండటం వల్ల ఏది ఎట్లా వస్తుందో అట్లా రాశాను. శతద్రులో వట్టి వచనంలాంటి వాక్యాలు అట్లే ఉంచాను. వాటిని విరగ్గొడితే కవిత్వం కాదు. వాటిలో కవితా లక్షణముంటే అది కవిత్వమవుతుంది.అది వచనమైనా పరవాలేదు.

కే.ఎస్‌…..కవి సమ్రాట్‌ విశ్వనాథ నవలపై మీరు పరిశోధన చేశారు, దాంతో మీరు విశ్వనాథ అభిమానులు, ఆయన శిష్యులకు ప్రతిరూపం అంటారు మిమ్మల్ని, మీరెట్లా భావిస్తారు?
గండ్ర : విశ్వనాథను నేను చదువుకునే రోజుల్లో బాగా చదివాను. ముఖ్యంగా నవలలు  వేయిపడగలు, సముద్రపుదిబ్బ, శార్వరి నుండి శార్వరిదాక, కుణాలుని శాపము, దమయంతీ స్వయం వరం, చెలియలి కట్ట , ఏక వీర ఇట్లా ఎన్నో , పైకి చదివితే మా తో పాటు రూంలలో ఉన్న విద్యార్థులు, మా ఇంటి ఓనర్లు చదువురాని వారు కూడా విని రోజూ చదువుమనే వారు. ఆవిధంగా విశ్వనాథ పై అభిమానం కలిగింది. కాకతీయలో ఏ అంశం పై చేస్తావన్నప్పుడు ఏ ఆలోచించకుండా వేయిపడగలు అన్నాను. అప్పటికి దానిగురించి ఇది చేయాలని అనుకోలేదు. అంతగా మనసులో పడింది.
                జువ్వాడి గౌతమరావుగారు రామాయణ కల్పవృక్షం చదువుతుంటే ఎంతో మంది వచ్చి వినేవారు. లక్ష్మణ యతీంద్రులు,ఏలూరి పాటి అనంతరామయ్య,శ్రీలక్ష్మణ మూర్తి, బేతవోలు రామబ్రహ్మం, చేకూరి రామారావు, కోవెల సుప్రసన్న, సంపత్కుమార, విశ్వనాథ పావని శాస్త్రి , వాకాటి పాండురంగారావు, అనుమాండ్ల భూమయ్య  స్థానికంగా పార్వెళ్ళ గోపాల కృష్ణ …. వారి ఇంటిలో ఉంటూ రోజులకొద్తీ వినేవారు. వారిలో నేను కూడా ఒకడిని. అట్లా విశ్వనాథ పద్యకవిత్వం పట్ల కూడా అభిమానం కలిగింది. తరువాత విశ్వనాథ పద్యకావ్యాలు చదివాను ,సదస్సులలో వాటిపై పత్రసమర్పణలు చేశాను. కరోనా కాలంలో అంతర్జాలం మాధ్యమంగా మిత్రుల కోరికపై రెండున్నర సంవత్సరాలు రామాయణ కల్పవృక్షం లోని పన్నెండు వేల పద్యాలకు వ్యాఖ్యానం చెప్పాను. విశ్వనాథ సాహిత్యం పట్ల నాకు గల పరిచయాన్ని బట్టి నన్ను విశ్వనాథ అనుయాయి అని పిలుస్తుంటారు.

కే.ఎస్‌….. విశ్వనాథలో ప్రధానంగా మీకు నచ్చిందేమిటి? భాషనా? ఆధ్యాత్మికతనా? భావ వ్యక్తీకరణనా వివరించండి?
గండ్ర : విశ్వనాథ సాహిత్య క్షేత్రంలో పండించని పంటతేదు. అని వాడుక.ఒక్క వచన కవిత్వం జోలికి పోయినట్లు లేదు. కవిత్వం, నవల, నాటకం, కథ, విమర్శ వంటివాటిని సమర్థవంతంగా సాధికారికంగా అనితర సాధ్యంగా రాశారు. మధ్యాక్కరల వంటి ప్రయోగాలు కూడా నాకు ఇష్టంగా అనిపించేవి. నేను 6, 7 తరగతులలో ఉండగా మా బాపు విశ్వనాథ మధ్యాక్కరలు చదువడం చూశాను. అందులో ఒకచోట నాబిడ్డ ఈ కైత, దీని శోభాన గూడ వత్తురు …. అనే పదాలు పాదాలుచూసిన గుర్తు. అప్పుడప్పుడు మా బాపు ఎవరితోనైనా చెపుతున్నప్డుడు విశ్వనాథ సత్యనారాయణ కవిసమ్రాట్‌ కరీంనగర్‌ కాలేజి ప్రిన్సిపాల్‌… అనేవారు. ఆ మాటలు నాకు జ్ఞాపకం. ఆయన రచనలలో విశేషమేమిటంటే ఒకటి నచ్చితే అన్నీ నచ్చుతాయి. లేకపోతే ఏదీ నచ్చదు. గౌతమరావుగారు చెపుతుండే వారు ఆ రుచి తెలిసిన తరువాత మరేదీ అంతగా రుచించదు అని .
ఆయన ప్రతి రచనలోను ఒక వేదన ఉండేది. పైకి మాత్రం అవి కథలుగా నవలలుగా కావ్యాలుగా కనపడతాయి. కాని సమాజం పట్ల, దేశం పట్ల సంస్కృతి పట్ల అమితమైన అభిమానం అది క్రమంగా నశిస్తున్నదన్న వేదన అంతటా కనపడుతుంది. అది ఆయనను సంప్రదాయ వాదిగా ప్రచారం చేశాయి. కాని ఆధునికమైన దేనికీ వ్యతిరేకి కాదు. నవీనమైన ప్రతిదాన్ని స్వాగతిస్తాను. ఎంతవరకైతే మూలం చెడకుండా ఉంటుందో అంతవరకు అనేది ఆయన నిశ్చయం. భాష పాషాణ పాకం అనేది కూడా ప్రచారమే. రామాయణం చెపుతున్నప్పుడు చాలామంది ఇంత బాగా తేలికగా ఉందికదా? ఎంత గ్రామీణ జీవితం ఎన్ని జాతీయాలు, ఎంత వ్యవహార లక్షణం, ఎంత లోకం రీతి …అన విన్న మీవంటి ఆధునికులు, తెలుగు పండితులు, ఆనందించారు. అయితే ఆయన వ్యక్తీకరణ , శైలి ఆయనదే. లక్షపుటలు రాసినా ఒకరి ఎంగిలి లేదు, అని ఆయనే చెప్పుకున్నాడు.

కే.ఎస్‌….. మీరు విమర్శనా రంగంలో కూడా కృషి చేశారు. వర్తమాన తెలుగు విమర్శ ఎట్లా ఉంది? మీకు నచ్చిన విమర్శకులు ఎవరు? ప్రస్తుతం వస్తున్న సమీక్షలు, విమర్శలు, అర్థవంతంగా ఉంటున్నాయా? నిర్మాణాత్మక సూచనలు ఏమయినా చేయండి.
గండ్ర : కొందరు కవుల కవిత్వాన్ని గురించి, పుస్తకాల గురించి సాహితీ వనమాలి అనే పేరుతో ఒక పుస్తకం ప్రచురించాను,నిజానికి అంతకు కొన్ని రెట్ల వ్యాసాలు, ప్రసంగాలుఆయా పత్రికలలో సంచికలలో ముద్రితాలున్నాయి. విమర్శను కవి అంతరంగాన్ని బట్టి ,కావ్యంలో కవి చెప్పినదాన్ని బట్టి ఎక్కువగా విమర్శించాను.
ఈ రోజుల్లో సమీక్షల విమర్శలు అనే అభిప్రాయం పెరిగిపోయింది. విమర్వలో ప్రాచ్య పాశ్చాత్య విమర్శాధోరణులు, ప్రమాణాలు, సిద్ధాంతాలు ఎన్నో వచ్చాయి. వాటి అవగాహనతో విమర్శ చేస్తున్న వారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఆచార్య కోవెల సుప్రసన్న, ఆచార్య బేతవోలు , డా. సంగనభట్ల నరసయ్య, ఆచార్య అనుమాండ్ల, , నందిని సిధారెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి, కే.పి.అశోక్‌ కుమార్‌, యం. నారాయణ శర్మ, లక్ష్మణ చక్రవర్తి, జి.లక్ష్మీ నరసయ్య వారాల ఆనంద్‌ లవంటి వారు కొంతమంది విమర్శను గురించి తెలిసి విమర్శలు చేస్తున్నవారు.

కే.ఎస్‌… ఖలీల్‌ జిబ్రాన్‌ ది మ్యాడ్‌ మ్యాన్‌ పుస్తకాన్ని తెలుగులో వెర్రి మానవుము  పేరుతో తెలుగులో అనువదించారు. ఇప్పుడు అనువాద అవసరాన్ని వివరించండి.
గండ్ర : అది అనుకోకుండా జరిగింది. ఒకరోజు ఐ పాడ్‌ లో ఏదైనా పుస్తకం చదువుదామని రైటర్‌ ఆప్షన్‌లో ఖలీల్‌ జిబ్రాన్‌ నొక్కాను. చాలా పుస్తకాలు వచ్చాయి. ఎందుకో మాడ్‌ మాన్‌ చదువాలనిపించి చదివాను. వెంటనే తెలుగులో రాస్తే బాగుంటుందని మూడు రోజుల్లో అనువాదం చేశాను.
                ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషలలో అనేక గొప్ప రచనలున్నాయి. వాటిని అనువాదం చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఎందరో చేశారు. ఇప్పటికీ ఆ పని చేయాలి. వారాల ఆనంద్‌ ఇరుగుపొరుగు పేరుతో దేశంలోని విదేశాలలోని కవులను తెలుగులో అనువాదం చేస్తూ పరిచయం చేస్తున్నారు. అనువాదం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న కవితా ధోరణులు తెలియడంతో పాటు మానవుని ఆలోచనా విధానం, జీవన సంస్కృతి, దేశవిదేశాల పరిస్థితులు ఎన్నో వ్యక్తమై పాఠకుడిని విశాలం చేస్తాయి.

కే.ఎస్‌. ఏడు పదుల వయసులో మీరు అవధాన రంగంలో ప్రవేశించారు. అవధాన అవసరాన్ని మీ అనుభవాల్ని గురించి చెప్పండి.
గండ్ర :…. పద్యాలు కావ్యాలనుండి అలవోకగా సభలలో చదువడం, అప్పుడప్పుడు పద్యాలు ఆశువుగా చెప్పడం చూసిన మిత్రులు వేణుశ్రీ మీరు అవధానం చేస్తారు అని కరోనా కాలంలో నాకు రొజూ సమస్యలూ, దత్తపదులూ, వర్ణనలూ ఇచ్చి రాయమన్నారు. నేను వెంటనే పూరణలు పంపాను. తరువాత మిత్రులు రాజారామమోహన శర్మ ఒకరోజు నిర్ణయించి అవధానం చేయుమన్నారు. పృచ్ఛకులను నిర్ణయించారు. అట్లా ప్రారంభైన అవధానం నాకు కూడా ఉత్సాహంగానే అపినించింది. ఈ అవధాన ప్రక్రియ తెలుగులో అపురూపమైనది. కరీంనగర్‌లో ప్రస్తుతం ఎవరూ లేరు. నన్ను చూసి ఎవరైనా యువ కవులు పండితులు ముందుకు వస్తారని , అందుకు ప్రేరణగా స్ఫూర్తిగా నిలువాలని అవధానాలు చేస్తున్నాను. ఇంత వరకు జరిగిన అవధానాలు ప్రేక్షకులను సంతృప్తిపరచాయి. అదే నాకు ప్రోత్సాహకంగా ఉన్నాయి.

కే.ఎస్‌…. గత యాభైఏళ్ళలో తెలుగు సాహిత్యంలో పలు వాదాలు వచ్చాయి. వాటిలో మీరు ఎటు వైపు?
గండ్ర :     సామాజికమైన స్త్రీ వాదం, దళిత వాదం, మైనారిటీ వాదం, ఇట్లాంటివి వచ్చాయి. వీటి ప్రభావంత తెలుగులో కవిత్వం, కథలు, వెలువడ్డాయి.ఈ వాదాలు కవిత్వంలో భాగమే కాని వాదాలే కవిత్వం కాదు. సాహిత్య వాదాలలో సంప్రదాయం, అభ్యుదయం వంటి వాదాలు వచ్చాయి. మా గురువుగారు సినారె గారి వలె సంప్రదాయం జీర్ణించుకున్న ప్రయోగాన్ని, ప్రయోగంలో జీవిస్తున్న సంప్రదాయాన్ని, నేను ఇష్ట పడతాను.

కే.ఎస్‌…భువన విజయం నాటకం రాశారు. దాని వివరాలు చెప్పండి?
గండ్ర :…. ఒకరోజు శ్రీకృష్ణ దేవరాయల పంచశతి ఉత్సవాలు జరుగుతున్నాయని నంది శ్రీనివాస్‌ , గాజుల రవీందర్‌,   మీరు నన్ను కలిసి భువనవిజయం నాటకం వేద్దామనుకుంటున్నాం మీరు సహాయం చేయండి అని అడిగారు. సరే నన్నాను. తీరా దానికి తగిన రచన (స్క్రిప్టు) లేదన్నారు. రెండుమూడు రోజులలో కావాలన్నారు. ఆ రాత్రి కూర్చొని అష్టదిగ్గజ కవులు, రాయలు, మంత్రి, నరసరాజు వంటి పాత్రలతో పద్యాలు మాటలు కలిపి నాటకం రూపొందించాను. రెండు రోజులు ఆయా పాత్రలు అభ్యాసం చేసి ప్రదర్శన ఇచ్చాం. అందులో నేను తెనాలి రామకృష్ణుని పాత్ర ధరించాను. ఒకవైపు హాస్యం పండిస్తూ మరో వైపు ఆయా పాత్రధారుల లోపాలు సరిచేస్తూ నాటకం రక్తి కట్టించాం. ప్రముఖ కవి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ నాటకాన్ని చూసి అభినందించారు.

కే.ఎస్‌. : మీ అధ్యాపకత్వంలో ఎందరో శిష్యులను తయారు చేశారు? అధ్యాపకానుభవం గురించి , నేటి విద్యావ్యవస్థ గురించి చెప్పండి? సాహితీ సాంస్కృతిక రంగం వైపు పిల్లల్ని ఎట్లా ప్రోత్సహించాలి?
గండ్ర : అందరూ కోట్లు సంపాదించి ఆనందిస్తే నేను శిష్యకోటిని సంపాదించాను అని గర్వంగా చెప్పుకుంటాను. ఎందరో శిష్యులు ఏ రంగంలో స్థిరపడిన వారైనా నా పాఠాలను గుర్తు చేస్తుంటారు. ఇక మీ వంటి వారు తెలుగు పండితులు కాకపోయినా తెలుగు సాహిత్యంలో రచనలు చేస్తూ అద్భుతమైన సేవలందిస్తున్నారు. ఎందరో శిష్యులు తెలుగుపండితులుగా, ఉపన్యాసకులుగా, కవులు రచయితలుగా ఎదిగారు. తరువాతి తరాన్ని తయారు చేశాననే సంతృప్తి ఉంది. ఈ కాలం విద్యావిధానంలో సాంస్కృతిక రంగానికి కొంత ప్రాధాన్యత ఉన్నా ఎక్కువగా సినిమా పాటలు, జానపద గీతాలు నృత్యాలు వంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. భాష, వక్తృత్వము, కవిత్వము, సాహిత్యము వంటి వాటికి తక్కువ. ఆంగ్ల మాధ్యమం వచ్చిన తరువాత పూర్తిగా తగ్గిపోయిందనే చెప్పాలి. భాష పట్ల అభిరుచిని కలిగించాలి. మంచి  సంభాషణా చాతురిని, వాఙ్నైపుణ్యాన్ని కలిగించాలి. ఈ నాటికీ మాట్లాడడం, సరిగా సమాధానం చెప్పటం రాక ( తెలిసి) పోవడం భాషాలోపం. వ్యక్తిత్వ వికాసంలో భాగంగానైనా భాషను నేర్పించాలి.

కే.ఎస్‌…. నూతన కవులకు రచయితలకు మీరేమి చెపుతారు? ఏ సందేశం ఇస్తారు?
గండ్ర :   ఎవరు చదివినా చదవక పోయినా ఎంతో మంది కవిత్వం రాస్తున్నారు. పుస్తకాలు వేస్తున్నారు. కొందరు సరికొత్త పద్ధతుల్లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు. కొందరు కవిత్వం కాని దాన్ని కూడా కవిత్వం అని మురిసి పోతున్నారు. కవులుగా దలచిన వారంతా అధ్యయనం చేయాలి. ప్రాచీనాధునిక కవులను బాగా చదువాలి. పదానికి అర్థాలు తెలియక ఏదో అనుకొని ఏవో పదాలు ప్రయోగిస్తున్న యువ నవ కవులు కూడా ఉన్నారు. శబ్దసంపదను పెంచుకోవాలి, అనేక కవుల కవితారీతులను అవగాహన చేసుకోవాలి. ఎవరినీ అనుసరించకపోయినా ఆ అధ్యయనానుభవం తోడవుతుంది. ఒక పుస్తకం రాయగానే పురస్కారం రావాలని ఆశించడం వంటిది కూడా సాహిత్య రంగంలో అంత ఆశించదగినది కాదు.

ఎక్కువ మంది కవిత్వం రాయడం వల్ల తెలుగు భాష ఆయుర్దాయం పెరుగుతుందనే ఆశ మాత్రం కలుగుతుంది.

కే.ఎస్‌. ధన్యవాదాలు సర్‌.

September 30, 2024 0 comment
3 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

కరణ్ బజాజ్

by Taniparti NarayanaRao September 29, 2024
written by Taniparti NarayanaRao

అనగనగా ఓ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ నవలా రచయితయ్యాడు, అమ్మ పోయిన బాధలో యోగిగా మారాడు, అకస్మాత్తుగా సన్యాసం వీడి పారిశ్రామికవేత్తగా అవతరించాడు. ఓ స్టార్టప్ ని ప్రారంభించిన పద్దెనిమిదినెలల్లోనే దానికి 2240 కోట్ల రూపాయల విలువ కల్పించి… అనూహ్యంగా అమ్మేశాడు! అదికూడా జూమ్ మీటింగ్ లోనే, కొనేవారిని ముఖాముఖి కలవకుండా. ప్రస్తుతం అతని వయస్సు 42. చిన్న వయసులోనే ఇన్ని అవతారాలెత్తిన ఆ యువ యోగి-కమ్ -పారిశ్రామికవేత్త కరణ్ బజాజ్ ! చిత్రమైన అతని కెరీర్ ప్రయాణమే భారతీయ స్టార్టప్ రంగంలో గత ఏడాది హాట్ టాపిక్ . ఆ ప్రస్థానం గురించి కరణ్ మాటల్లోనే.

న్యూయార్క్ నగరంలో అదో పెద్ద రెస్టరంట్ . అక్కడ మా ఫ్రెండ్ బర్త్ డే పార్టీ జరుగుతోంది. ఆ రాత్రి కడుపునిండా తిన్నాను… పీకల్దాకా తాగాను. ఫ్రెండ్స్ తో ఉబుసుపోక కబుర్లేవో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఎంత చేస్తున్నా నా మనసులో బాధ తగ్గడంలేదు. పొగిలి పొగిలి వస్తున్న దుఃఖం ఆగట్లేదు. అప్పటికి అమ్మ చనిపోయి ఆరునెలలవుతోంది. క్యాన్సర్ తో బాధపడుతూ… మృత్యువుతో నిస్సహాయంగా పోరాడుతూ… నా కళ్లెదుటే చనిపోయింది. అమ్మ కోసం నెలన్నరపాటు సెలవుపైన ఇండియా వచ్చిన నేను ఆ బాధలన్నీ అతిదగ్గరగా చూశాను. మృత్యువు తనని నా నుంచి ఇలా దూరం చేయడం తట్టుకోలేకపోయాను. అప్పటిదాకా నేను చాలా పరిణతి ఉన్నవాడిననీ, తార్కిక బుద్ధి ఉన్నవాడిననీ… అనుకుంటూ ఉండేవాణ్ణి. కానీ అమ్మ మరణం నన్ను చిన్నపిల్లాడిలా… బేలగా మార్చింది. ఆ దుఃఖం ఓ వైపున ఉంటే మరో వైపు నాలో ఎన్నో ప్రశ్నలు. ‘అసలేమిటీ జీవితం… పుట్టుకేమిటీ? చావడమేంటీ? పెళ్ళీ పిల్లలూ సంసారం… వీటి గమ్యమేంటీ!’ ఇలా ఎన్నో తాత్విక ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేసేవి. ఈ బాధలూ, ప్రశ్నల నుంచి బయటపడదామనే ఆ రోజు పార్టీకి వచ్చాను. ఇక్కడ వేదన పెరుగుతోందే కానీ తగ్గలేదు. నా ఫ్రెండ్ కెరీతో ఇవన్నీ చెప్పుకుని ఏడ్చేశాను. తను ఓ ఐడియా చెప్పింది. ‘ఓ పని చేద్దాం కరణ్ … ఆధ్యాత్మిక యాత్ర చేద్దాం. అవి మన బాధని ఎంత వరకు తగ్గిస్తాయో చూద్దాం… తగ్గేంత వరకూ తిరుగుతూనే ఉందాం!’ అంది. నాకూ ప్రయాణాలంటే ఇష్టమే కాబట్టి ఆ తర్వాతి వారమే అమెరికా నుంచి బయటపడ్డాం. మమ్మల్ని బాహ్యప్రపంచంతో బంధించే సెల్ ఫోన్ , నెట్ , బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ వదిలేసి ప్రయాణం కట్టాం. అప్పటిదాకా… ఓ సగటు భారతీయుడు అమెరికాలో కోరుకునే విలాసాలన్నీ అనుభవిస్తూ వచ్చినవాణ్ణి నేను. అమెరికాలోని క్రాఫ్ట్ ఫుడ్స్ అనే సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ని. న్యూయార్క్ లోని సెంట్రల్ పార్కులోని ఓ పెద్ద లగ్జరీ ఫ్లాట్ లో నివాసం. అన్నింటినీ వద్దనుకుని కేవలం ఓ జతబట్టలు సర్దుకుని నేనూ కెరీ బయలుదేరాం. స్కాట్లాండ్ లోని బౌద్ధ కేంద్రానికి ఫ్లైట్ లో వెళ్లాం కానీ… ఆ తర్వాత మేం చేసిన ప్రతి ప్రయాణం రోడ్డుపైనే. ఇంచుమించు కాలినడకనే… అదీ ఇండియాదాకా! ఆ యాత్ర నన్ను యోగిని చేసింది. ఆ స్థితి నుంచి పారిశ్రామికవేత్తగా ఎందుకయ్యానో వివరించే ముందు… నా గురించి ఇంకాస్త చెప్పాలి మీకు…

బెస్ట్ సీఈఓగా గుర్తింపొచ్చినా..

మా నాన్న ఆర్మీ ఆఫీసర్ . ఆయనకి ఎన్నో బదిలీల తర్వాత మేం హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో స్థిరపడ్డాం. అక్కడి ఆర్మీ స్కూల్ లో చదువుకున్నాను. ఎంత బాగా చదువుతూ ఉన్నా సరే, నా మనసంతా ఎదురుగా ఉన్న హిమాలయాలపైనే ఉండేది… వాటిని ఎప్పుడు అధిరోహించాలా అని మనసు ఉవ్విళ్లూరేది. ప్లస్ టూ తర్వాత బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజినీరింగ్ లో చేరాను. ఆ తర్వాత మేనేజ్ మెంట్ పైన ఆసక్తి పుట్టి బెంగళూరు ఐఐఎంలో సీటు సాధించాను. అక్కడ ఎంబీఏ ముగించగానే ప్రాక్టర్ అండ్ గాంబుల్ (పీ అండ్ జీ) సంస్థలో మార్కెటింగ్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది. నాలుగేళ్లలోనే ఆ సంస్థ తయారుచేస్తున్న ఏరియల్ వాషింగ్ పౌడర్ కి బ్రాండ్ మేనేజర్ గా అమెరికాకి వచ్చాను. ఏరియల్ తో నేను సాధించిన విజయానికి గుర్తుగా అమెరికాకి చెందిన యాడ్ -ఏజ్ సంస్థ 2007లో ‘టాప్ మార్కెటీర్ 40 అండర్ 40’ జాబితాలో నన్ను చేర్చింది. కానీ ఆ విజయాన్ని ఎక్కువ కాలం ఆస్వాదించలేకపోయాను. టీనేజీ నుంచి నాలో ఏదో మూల ఉన్న ‘రచయితని కావాలనే కల’ నన్ను వెంటాడింది.

రచయితని కావాలంటే కొద్దిగానైనా ప్రపంచాన్ని చూడాలి కదా అనిపించింది! దాంతో ఆరునెలలు సెలవుపైన మొదట దక్షిణ అమెరికా దేశాలైన పెరూ, చిలీ, అమెజాన్ ప్రాంతాలనీ, తూర్పు యూరప్ దేశాలనీ, మంగోలియానీ చూశాను. ఈ ప్రయాణంలో నేను చూసిన అసాధారణ వ్యక్తులకే నా ఊహల్నీ జోడించి ‘కీప్ ఆఫ్ ది గ్రాస్ ’ అనే నవల రాశాను. ‘నేనూ రచయితనైపోయానోచ్ …’ అంటూ ఆనందంతో అమెరికా వస్తే అక్కడ ఆర్థిక సంక్షోభం విలయ తాండవం చేస్తోంది! దాంతో నా ఉద్యోగం పోయింది. అప్పటికి నా వయసు ముప్పై ఏళ్లు. నాతోటివాళ్లంతా పెళ్లై కార్లూ, ఆస్తులని కొనుక్కుంటూ ఉంటే నేను మాత్రం ఉన్న డబ్బంతా పర్యటనలోనే ఖర్చుచేసేసి… అమెరికాలోని మా అక్కవాళ్లింట్లో తలదాచుకున్నాను. దాంతో కుటుంబం, బంధువులే కాదు స్నేహితులు కూడా నన్ను ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఆ హేళనల మధ్య నాకు ధైర్యం నూరిపోసింది అమ్మే. తనిచ్చిన ధైర్యంతో ఉద్యోగాలకి ప్రయత్నిస్తూ బోస్టన్ కన్సల్టన్సీ గ్రూప్ (బీసీజీ)లో చేరాను. అందులో మళ్లీ నన్ను నేను నిరూపించుకున్నాను. ఈలోపు 2010లో నా మొదటి ఇంగ్లిష్ నవల ఇండియాలో అచ్చయి సూపర్ హిట్టయింది! అప్పట్లో పేరున్న రచయితల పుస్తకాలే ఐదువేల కాపీలు పోవడం గగనమైతే… నా మొదటి పుస్తకం ఏడాదిలోనే 70 వేల కాపీలు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. అది నా జీవితాన్ని మార్చింది. ఈలోపు నా మొదటి పుస్తకం ముద్రించిన సంస్థవాళ్లు రెండో నవల రాయమన్నారు. రాద్దామని కూర్చుంటే… ఏ కొత్త ఆలోచనలూ రాలేదు. మొదటి నవలతోనే నా సరుకంతా అయిపోయిందనిపించింది. దాంతో, నవల రాయడం కోసమే బ్యాగ్ సర్దుకుని ప్రయాణాలు మొదలుపెట్టాను. ఈసారి కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి ఆ అనుభవంతో మరో పర్యటక నవల ‘జానీ గాన్ డౌన్ ’ రాశాను. అది లక్ష కాపీలు దాటింది. దాన్ని సినిమాగా తీయడానికి బాలీవుడ్ నిర్మాతలు కాపీ రైట్స్ తీసుకున్నారు! ఆ తర్వాత క్రాఫ్ట్ ఫుడ్స్ సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా మారాను. ఈ విజయాలన్నీ ఆనందిస్తుండగానే అమ్మ మరణం… ఓ సునామీలా నన్ను ముంచెత్తింది. ఆ ఊపిరాడని పరిస్థితిలోనే ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టాను.

అదే ధర్మం అని తెలిసింది.

కెరీతో నా ప్రయాణంలో కొన్ని దేశాల్లో ప్లాట్ ఫామ్ పైన పడుకున్నాం. కొన్నిసార్లైతే ఆగకుండా 50 కిలోమీటర్లూ ప్రయాణించాం. అలా ఇండియా వచ్చి మదురైలోని శివానంద ఆశ్రమంలో చేరాం. రెండు నెలలపాటు అతికఠినమైన శిక్షణ ఇచ్చారక్కడ. ఉదయం ఐదున్నరకే లేచి మంచుగడ్డని తలపించే చన్నీళ్లలో స్నానం చేయడం, కటిక నేలమీద పడుకోవడం, రోజూ యోగా, ధ్యానం మా జీవిత దృక్పథాన్నే మార్చింది. ఆ తర్వాత రుషికేష్ లోని శివానంద ఆశ్రమానికి వెళ్లాం. అక్కడే నేను సన్యాసిగా మారాను. ఏడాది తర్వాతే నాలో చైతన్యం మొదలైంది. మన భారతీయ చింతన ప్రకారం… ప్రతి జీవికీ తాను మాత్రమే నెరవేర్చగల కర్తవ్యం ఒకటి ఉంటుంది. దాన్ని స్వధర్మం అంటారు. నేను ఓ యోగిగా హిమాలయాల్లో ఉండగలిగినా… నా స్వధర్మం పెద్ద సంస్థల్ని సృష్టించడమేనని అర్థమైంది. దాంతో సన్యాసానికి స్వస్తి పలికాను. అమెరికా వచ్చి కెరీని పెళ్ళి చేసుకున్నాను. ఆధ్యాత్మిక జీవనం మనస్సునీ, శరీరాన్నీ శక్తిమంతం చేయడమే కాదు… ప్రాపంచిక వ్యవహారాల్ని తామరాకుమీద నీటిబొట్టులా చూసేలా చేసింది. కోపతాపాలకి దూరం చేసింది. కాకపోతే, ఇంత పరిణతి తర్వాతా ఓటమి నాకు ఎదురవుతూనే వచ్చింది…

వరుస అపజయాలు.

భారతదేశంలో యోగిగా నా ఆధ్యాత్మిక అనుభవాలతో ‘ది సీకర్ ’ అనే నవల రాశాను. దాదాపు 62 పుస్తక ప్రచురణ సంస్థలు దాన్ని తిప్పికొట్టాయి! చివరికి పెంగ్విన్ సంస్థవాళ్లు అచ్చేసినా… ఆశించినంతగా అమ్ముడు పోలేదు. ఆ తర్వాత ఓ స్టార్టప్ లో పెట్టుబడులు పెడితే అందులోనూ నష్టం వచ్చింది. ఆ తర్వాత డిస్కవరీ ఛానెల్ ఇండియా సంస్థకి వైస్ ప్రెసిడెంట్ ని అయ్యాను. ఆ సంస్థ కోసం కొత్తగా హిందీ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ మొదలుపెట్టాను. మరెన్నో చేయాలనుకున్నాను కానీ సాధ్యం కాలేదు. నా ఉద్యోగం కాస్తా నెలకోసారి వెళ్లి ప్రధానమంత్రినీ, మంత్రుల్నీ కలవడంతోనే సరిపోయేది. అది నాకు సరిపడక రాజీనామా చేశాను. అంత మంచి హోదాకి రాజీనామా చేశానని తెలిసి నా భార్యవైపు వాళ్లు నన్ను పిచ్చోడిలా చూడటం మొదలుపెట్టారు. ఇద్దరు పిల్లల తండ్రిగా నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడాన్ని ఏ అత్తామామలు భరిస్తారు చెప్పండి! కానీ ఒకప్పుడు మా అమ్మ చేస్తున్నట్టు ఇప్పుడు మా ఆవిడ నన్ను వెనకేసుకొచ్చింది. ‘అతనో క్రియేటర్ … తను ఇలాగే ఉండగలడు!’ అని తనవాళ్లతో వాదించింది. తనకి నాపై ఉన్న ఆ నమ్మకమే నా ‘వైట్ హ్యాట్ జూనియర్ ’ సంస్థకి పునాది!

శిక్షకులందరూ మహిళలే.

పిల్లలకి కంప్యూటర్ కోడింగ్ ని ఓ ఆటలా నేర్పించే సంస్థ నాది. ఆన్ లైన్ లో ఇలాంటి శిక్షణ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వడం లేదని తెలిసి దీన్ని మొదలుపెట్టాను. కేవలం మహిళల్ని మాత్రమే టీచర్లుగా తీసుకున్నాను. ఇందుకూ… మా అమ్మ జీవితమే కారణం. అమ్మ అప్పట్లోనే పీజీ చేసినా నాన్న బదిలీల కారణంగా తనకంటూ కెరీర్ లేకుండా పోయింది. తనలోని ఆ బాధని నేను చిన్నప్పటి నుంచీ చూస్తూ వచ్చాను. అందుకే, నేను కోడింగ్ కోచ్ లుగా మహిళలు మాత్రమే ఉండాలనుకున్నాను! ఏ కాస్త ఆర్థిక స్వాతంత్య్రం ఇచ్చినా వాళ్లు అద్భుతాలు చేస్తారనే నమ్మకం నాలో బలంగా ఉండేది. మావాళ్లు దాన్ని నిజం చేశారు!

ఆ అద్భుతాలు ఇవి.

కేవలం పదిమంది ఉద్యోగులతో నా సంస్థని 2018 అక్టోబర్ లో ప్రారంభించాను. మొదటి ఏడునెలలు పెద్దగా లేదుకానీ ఆ తర్వాత పిల్లలూ, తల్లిదండ్రుల నుంచి మేం ఆశించిన స్పందన మొదలైంది. దాంతో టీచర్ల సంఖ్యని నాలుగు వందలకి పెంచాం. అక్కడి నుంచి మరో నాలుగు నెలల్లో నాలుగువేలకి చేర్చాం. అమెరికాలోనూ ఈ సేవలు అందించడం ప్రారంభించాం. రెవెన్యూ పది కోట్ల నుంచి వందకోట్ల మైలురాయిని అందుకుంది. రోజువారి క్లాసుల సంఖ్య పాతికవేలకి చేరింది. దాంతో బైజూస్ మా సంస్థని కొంటామంటూ ముందుకొచ్చింది. సుమారు రూ.2,240 కోట్లు… నగదుగా ఇస్తానంది! కేవలం ఏడాదిన్నర వయసే ఉన్న సంస్థకి ఇంత డిమాండు రావడం ఓ రికార్డు. నాకూ బైజూస్ ద్వారా నా ఆలోచనలు మరింత ఎక్కువమందికి చేరడం మంచిది అనిపించింది. అందుకే ఓకే చెప్పాను. సంస్థని అమ్మినా సీఈఓగా నిర్వహణ బాధ్యతలన్నీ నేనే చూస్తున్నాను. మా టీచర్ల సంఖ్యని లక్షమందికి చేర్చడం, దీన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడం ప్రస్తుతం నా లక్ష్యాలు. ఇవి పూర్తయ్యాక ఎప్పట్లాగే మరో సరికొత్త రంగంవైపు వెళ్లాలనుంది..!

మా ఆవిడ కెరీ చాలా గ్రేట్.

మా ఆవిడ కెరీ, నేనూ, మా ఇద్దరు పాపలు నీలా, రూమీ అందరం ముంబయిలోనే ఉంటున్నాం. మా ఆవిడ పిల్లల పోషకాహార నిపుణురాలు. తను లేకపోతే నా విజయాలే లేవని చెప్పడం అరిగిపోయిన రికార్డ్ లోని వాక్యంగా అనిపించొచ్చుకానీ… అది వందకు వెయ్యిశాతం నిజం. తనకే నా మీద నమ్మకం లేకుంటే ఇన్ని అపజయాల తర్వాత నిలదొక్కుకునేవాణ్ణి కాదు. బైజూస్ డీల్ తో సంస్థ ప్రొమోటర్ గా వెయ్యి కోట్లు వచ్చినా… ఒకప్పటి మా సన్యాస జీవితమే అలవాటై మేం సొంత ఆస్తులేవీ కొనలేదు. మాకు సొంతిల్లూ, కారూ లేవు. ఇప్పటికీ వీలున్నంత తక్కువ ఖర్చుతోనే నెట్టుకువస్తున్నాం. మా పిల్లలకీ ఈ ‘స్వచ్చంద పేదరికాన్ని’ నేర్పిస్తున్నాం!

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

పాఠశాల అనే విశాల భావం మొదట ఎవరు తెలుసుకున్నారు?

by ఒద్దిరాజు మురళీధరంరావు September 29, 2024
written by ఒద్దిరాజు మురళీధరంరావు

⁠గ్యాస్ కోయిన్ కు ఐదుగురు పిల్లలు. అతని భార్య అంటుండేది…” వీళ్లు ఆశ్చర్యం కలిగించే ఒక రకమైన మొసలి లాంటి జంతువులు” అని. ఆమె చెప్పేది వాస్తవమే.( కథల్లో ఆశ్చర్యానికి ఈ మొసలి పేరు వాడుతుంటారు).
ఈ ఐదుగురు పిల్లలు
ఉదయం నుండి చాలా రాత్రి వరకు బయట కీచులాడుతూ, కొట్లాడుతూ, బొడుపులు గాయాలు చేసుకొని తల్లికి చూపించేందుకు ఒకరి తరువాత ఒకరు ఏడ్చుకుంటూ ఇల్లు చేరుతుంటారు. ఈ విషయం గురించి తల్లి చేతులు జాడించుకుంటూ ,” తనకు ఒక్క క్షణం కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు ఈ దురుసు పిల్లలు త్వరలోనే నా తల నరాలు చిట్లిపోవడంలో సందేహం లేదు ” అని అనేది.
ఆమె అన్నదంతా వాస్తవమే అని ఆమె భర్త అంగీకరించాడు. ఆ అంగీకారం ఆమెకు మనసుకు ఎప్పటికన్నా ఎక్కువ బాధ కలిగించింది.
” అలా కూర్చొని తల ఊపకుండా బయటికి వెళ్లి ఏదైనా ఉపాయం చెయ్యి” అంది చికాకుగా.
ఇంట్లో పిల్లల అల్లరి, భార్య గులుగుడు భరించలేక భర్త ఏదైనా చేయాలనుకుని బయటికి వెళ్ళాడు.
ఆరోజు ఆయన అనుకోకుండా ఒక మిత్రుని కలుస్తాడు. పాపం ఆ మిత్రునికి పిల్లలు లేరు, ఉద్యోగం లేదు. ఆయన ఉద్యోగ వేటలో తిరుగుతున్నాడు. అతన్ని చూడగానే గ్యాస్ కోయిన్ మనసుకు ఒక ఆలోచన తట్టింది.
“ఒక ప్రత్యేకమైన బిల్డింగ్ కట్టించి గ్రామస్తుల పిల్లలందరిని కనీసం సగం రోజైనా దాంట్లో కూర్చోబెట్టి తన మిత్రుడిని అక్కడ పిల్లలను జాగ్రత్తగా చూసుకునేందుకు ఎందుకు ఏర్పాటు చేయకూడదు? పిల్లలు విసుగు చెందకుండా నా మిత్రుడు వాళ్లకు ఏదో బోధించవచ్చు. మధ్య మధ్యన చదివించడం, రాయించడం , సంగీతం బోధించడం చేయవచ్చు. అది పిల్లలకు చాలా ఉపయోగకరం అవుతుంది కూడా ! ” అనుకున్నాడు. ఆ తీరుగా అదే ప్రథమ పాఠశాల గా మొదలైంది. ఆ టౌన్ పిల్లలకు అతనే ప్రథమ ఉపాధ్యాయుడు అయినాడు. అందరికీ పిల్లలతో సమస్య లేకుండ అయింది. కానీ గ్యాస్నోయన్ ఐదుగురు చిచ్చర పిడుగులను అదుపులో ఉంచడంతో ఆ ఉపాధ్యాయుని తల త్వరలోనే నెరిసిపోయింది.
ఈ విధంగా మొదటి పాఠశాల అనే విశాల భావం గ్యాస్ కోయిన్ తెలుసుకున్నాడు. ( How Mr.Gascoyne invited school?
Internet కొత్త విషయాలను ఆవిష్కరిస్తుంది.)

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

వేదం

by K K Tayaru September 29, 2024
written by K K Tayaru

90% శాతం మంది భారతీయులకు ఆ పదం గాని, అసలు అవి ఏమిటో ఎన్నో కూడా తెలియదు..

మనం మరిచిపోయింది.. వేదాలనే కాదు.. ఒక మహా జాతి వైభావాన్ని..

వేదాలు సమస్తం జ్ఞానానికి మూలం.. విదేశీయులు చెప్తున్నారు.. జర్మనీ పార్లమెంట్ చెప్తుంది.. ఫ్రంక్పర్ట్ యూనివర్సిటీ చెప్తుంది.

శ్రీ బ్రహ్మ శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి !!

జర్మనీ వారికి ప్రియమైన తెలుగు పండితుడు” శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి”.

ఒక్క యజుర్వేదమే నాలుగు ముఖాలుగా, నాలుగు రూపాల్లో అవగతమవుతుంది. ఇన్ని విధాలుగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తికి ఈ నాలుగు శాస్త్రాల్లో అభినివేశం ఉండాల్సిందే.

అంత అభినివేశం, ప్రతిభ ఉన్నవారుగా ఇరవయ్యో శతాబ్దంలో పేరు పొందిన వారు దండిభట్ల విశ్వనాథశాస్త్రి. అంత ప్రతిభావంతులు కాబట్టే హిట్లర్‌ ఆయన్ని జర్మనీకి ఆహ్వానించారు!

రాజమహేంద్రవరం లో వ్యాకరణశాస్త్ర పండితులుగా పేరుపొందిన దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి అత్యంత ఆసక్తికరమైన సంఘటన – ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో పశ్చిమ జర్మనీకి పంపిన రాయబారికి అక్కడి అధికారులు తమ కార్యాలయాలు చూపుతూ ఓ చోట ఓ భారతీయుని ఫోటో చూపించి ఆయన పేరేమిటో చెప్పమని అడిగారట. తనకు తెలియదని ఆ రాయబారి అనడంతో వెంటనే జర్మనీ అధికారులు దండిభట్ల విశ్వనాథశాస్త్రి అని చెప్పి ఆయనకు జర్మనీలో గొప్పపేరు ప్రతిష్టలు రావడానికి కారణమేమిటో కూడా చెప్పారు.

తొలి ప్రపంచ యుద్ధం తాత్కాలికంగా చల్లారింది. జర్మనీలో కెయిజర్‌ ప్రభుత్వం పతనమైంది. ప్రపంచమంతా దాని ప్రభావంతో ఆర్థికమాంద్యం నెలకొంది. ఆ యుద్ధంలో బందీలయిన వేలాది మంది జర్మనీ సైనికుల్లో ఒకరు హిట్లర్‌. ఆయన ఆ అవమానాన్ని దిగమింగు కోలేకపోయారు. ప్రపంచ జాతుల్లో తనదే గొప్పజాతన్నది ఆయన విశ్వాసం. ఎలాగైనా తమ ఆధిపత్యం నిరూపించాలని ఆయన నాజీ పార్టీ స్థాపించారు. జర్మనులను దేశభక్తితో ఉత్తేజితం చేశారు.

వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా జర్మనీది పైచేయిగా మార్చడానికి ఎన్నో సంస్కరణలు ప్రారంభించారు. అలాగే కొత్త మారణాయుధాల అన్వేషణ ప్రారంభించారు. అప్పటికే సంస్కృత భాషాధ్యాయనం పట్ల జర్మన్లు ఆసక్తి పెంచుకొన్నారు. భారతీయ వేద-శాస్త్ర వాఞ్మయంలో మారణాయుధాల రహస్యాలున్నాయని ఆయన గ్రహించారు.

ఒకవైపు సంస్కృత సాహిత్యాన్ని తమప్రజలకు అర్థమయ్యేలా అనువదింపచేశారు. ఆ విధంగా తొలిసారిగా ముద్రణకు నోచుకొన్న ఆ వాఞ్మయం నుంచి జర్మన్లు అబ్ధి పొందడానికి గట్టిచర్యలు హిట్లర్‌ తీసుకొన్నారు. అయితే యుద్ధ పరికరాలు, ఆయుధాల నిర్మాణానికి సంబంధించిన రహస్యాలను వేదశాస్త్ర వాఞ్మయం నుంచి విడమరిచి చెప్పేవారికోసం ఆయన అన్వేషణ సాగిస్తూనే వచ్చారు. అదే సమయంలో దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి తెలుసుకున్న హిట్లర్‌ ప్రతినిధులు ఆయనకోసం అన్వేషణ ప్రారంభించారు.

దండిభట్ల విశ్వనాథశాస్త్రి నిత్యం శాస్త్ర విషయాలు ఆలోచిస్తూ, తమ ఇంటికి వచ్చేవారితో చర్చలు జరిపేవారు తప్ప లౌకిక విషయాలను పట్టించుకొనేవారు కాదు. ఓ రోజు ఆయన విశాఖపట్నం సమీపానున్న కొత్తవలస దగ్గర ఒక పల్లెటూరికి వెళ్లవలసి వచ్చింది. కాలినడకన వెళ్తోన్న సమయంలో హిట్లర్‌ ప్రతినిధులు ఆయన్ని సమీపించారు. వాదోపవాదాలకు తావులేకుండా ఆయన్ని అక్కడినుంచి ముందుగా విశాఖపట్నానికి, తర్వాత కలకత్తాకు తీసుకువెళ్లారు. కతకత్తాలో హిట్లర్‌ ప్రతినిధులు ఆయన మనసు మార్చడానికి అన్ని విధాలా ప్రయత్నించారు. చివరకు ఆయన్ని జర్మనీ తీసుకెళ్లారు. దండిభట్ల జర్మనీ చేరుకొన్న సమయం ఎటువంటిదంటే రెండో ప్రపంచ యుద్ధానికి రంగాన్ని సిద్ధం చేస్తున్న తరుణం!

బాంబులు తయారుచేసి రాశులు పోస్తున్నారు. అయితే నిల్వచేసే సమయంలో ఏమాత్రం వత్తిడి కలిగినా అవి పేలిపోతుండడంతో విపరీతమైన నష్టం సంభవించింది. అలా పేలకుండా నిల్వఉంచే మార్గం వారికి తోచలేదు. దండిభట్ల విశ్వనాథశాస్త్రి యజుర్వేదం నుంచి ఆ సమస్యకు పరిష్కారం సూచించారు. దాంతో దండిభట్ల పేరు మారు మోగింది. ఇక అప్పట్నించీ ఆయన పూజ్యపాదులయ్యారు.

తన శాస్త్ర పాండిత్యాన్ని ఆయన జర్మనులకు పంచి పెట్టారు. ప్రపంచ దేశాల్లో జర్మనీ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి తనవంతు సహకారం అందించారు. జర్మనీకి వెళ్లిపోయిన తర్వాత దండిభట్ల తిరిగి భారతదేశానికి రాలేక పోయారు.

దండిభట్ల జర్మనీకి వెళ్లిన చాలాకాలం వరకు కూడా వారి సతీమణికి మూడువందల రూపాయల సొమ్ము ప్రతినెలా అందింది. అయితే చాలా కాలం తర్వాత నెలకు తొంభై రూపాయలు మాత్రమే వచ్చేవి. అంటే దండిభట్ల జీవించి ఉన్నంత కాలం ఆమెకు మూడు వందల రూపాయల వంతున అంది, ఆయన మరణం తర్వాత కుటుంబ పింఛనుగా తొంభై రూపాయల వంతున అందింది. మరి కొంత కాలానికి అది కూడా ఆగిపోయింది!

అంటే వారు అప్పటికే పరమపదించి ఉంటారని ఆయన మిత్రులు, శిష్యులు అభిప్రాయపడటం గమనార్హం.

దండిభట్ల దేశానికి దూరమైన తర్వాత దేశం, రాష్ట్రం అన్నీ ఆయన్ని మరచి పోయాయి! అయితే జర్మనులు మాత్రం ఆయన్ని తమ వాడుగా, మాననీయుడిగా, మహనీయుడిగా ఇప్పటికీ నిలుపుకోవడం విశేషం.

ఇప్పటికి జర్మనీలో విదేశాంగ శాఖ కార్యలయంలో, పార్లమెంట్ లో దండిభట్ల వారి చిత్రం ఉంటుంది.

అది మన జ్ఞానసంపద, అది మన జాతి వైభవం. అటువంటి వేదాలను, వేదా విజ్ఞానాన్ని నాశనం చెయ్యాలని ఎందరో ప్రయత్నిస్తూనే ఉన్నారు ఇప్పటికి.

గుర్తుపెట్టుకో భారతదేశం అంటే ప్రపంచానికి జ్ఞాన జ్యొతి.

ఇప్పుడు కూడా టాప్ అంతా విదేశంలొ, స్క్రాప్ అంతా మనదేశంలో.

పెరటిమొక్క వైద్యానికి పనికి రాదన్నట్టు మన సంస్కృతి, సాంప్రదాయ సిద్ధం గా ఉండే వేదాల విలువ పరాయి దేశం వాడు చెపితేగాని మనకు తెలియవు.. మన యోగా గురించి పాశ్చాత్యులు చెపితే గాని మనం నమ్మలేదు. మనకు వీపు ఉందనే విషయాన్ని మన వెనకవాడు చెపితేగాని మనం నమ్మే పరిస్థితి లో లేము. మన దేశ ఔన్నత్యం ప్రపంచానికి చాటిన ఈ మహానుభావుని గురించి చదువుతుంటే ప్రతి భారతీయునికి ఛాతీ గర్వంతో ఓ ఇంచు పెరుగుతుంది.

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ఓ మేక పిల్ల ఓ తోడేలు

by ఒద్దిరాజు మురళీధరంరావు September 29, 2024
written by ఒద్దిరాజు మురళీధరంరావు

అనగా అనగా ఒక ఊరు, ఆ ఊరి చివర్లో ఒక చిన్న ఇల్లు. ఆ ఇంట్లో నెల్ అనే మేక తన కూతురు నెల్లితో ఉంటుండేది.
ప్రతిరోజు నెల్ క్యాబేజీ కొనడానికని దుకాణానికి వెళుతూ ఉండేది. ఆమె బయటికి పోయినప్పుడు నెల్లీ తో ” నువ్వు నేను వచ్చి తలుపు కొడితే తప్ప ఎవ్వరికీ తలుపు తీయవద్దు నెల్లీ” అని చెప్పేది.
నెల్లి తలుపు బోల్ట్ పెట్టేసి తల్లి తిరిగి వచ్చేవరకు ఎదురుచూస్తూ ఉండేది.
ఒకరోజు తోడేలు వచ్చి ” తలుపు తెరువు నా ముద్దుల మేకపిల్ల నేను నీ తల్లి నెల్ ను” అన్నది.కాని, నెల్లికి ఆ గొంతు కొద్దిగా వేరుగా అనిపించి తలుపు తెరవలేదు.
మర్నాడు కూడా తోడేలు అలాగే మళ్ళీ వచ్చింది. ఈసారి కీచు గొంతుతో దాదాపు మేక గొంతు లాగానే మాట్లాడుతూ
” పాపా! తలుపు తెరువు .ఇది నేనే! నేను ఇంటికి క్యాబేజీ తెచ్చాను.” అన్నది. నెల్లీ బోల్ట్ తీసి తలుపు తెరిచింది. వెంటనే ఒక నల్ల తోడేలు పంజా తలుపు నెట్టి లోపలికి రాబోయింది.
” నువ్వు నా తల్లివి కాదు”అని అరిచి నెల్లీ తలుపును గట్టిగా మూసేసింది. అలా అప్పుడైతే ప్రమాదం తప్పించుకుంది.
నెల్ ఇంటికి రాగానే ఆ చిన్న పాప నెల్లి జరిగిందంతా తల్లితో చెప్పింది.
‘ కొద్దిగా ఆగు పాడు బుద్ధి ముసలి తోడేలా’ అని తల్లి మనసులో అనుకున్నది తల్లి నెల్.
మర్నాడు ఆమె ఇంటి దగ్గరే ఉండి, ఎదురు చూస్తూ ఉన్నది.
ఒక మధురమైన గొంతు ” లోనికి రానివ్వండి” అని అన్నది.
ఎప్పుడైతే మేక పిల్ల తలుపు కొద్దిగా తెరిచిందో తోడేలు తన పిండి పడిన రెండు పంజాలు పాపను మోసం చేద్దామని లోపలికి చాపింది కానీ అది లోపలికి పోయే ప్రయత్నం చేయకముందే తల్లిమేక ఒక దుడ్డు కర్ర చేతిలో పట్టుకొని ఎట్లా కొట్టిందంటే…..
మేక పిల్లను తినేసి తన ఆకలి తీర్చుకుందామనుకున్న సంగతే తోడేలు మరిచిపోయింది, పరుగులెత్తింది.

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ఆపదలో సాయం

by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, September 29, 2024
written by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,

   సుందరవనం అనే అడవిలో ఒక బుజ్జి కుందేలు ఆహారం కొరకై బయలుదేరింది.   అది పెద్దపులి గాండ్రింపు విని  భయంతో పరుగెత్తి  పొరపాటున  ఒక పెద్ద గోతిలో పడింది.  ఆ పెద్దపులి అక్కడికి రానే లేదు. అది ఎటో వెళ్లి పోయింది.  అయినా ఆ బుజ్జి కుందేలు ప్రాణభయంతో    ” కాపాడండి! కాపాడండి!” అని గట్టిగా అరచింది. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక జిత్తులమారి  నక్క దానిని చూసి కూడా చూడనట్టు నటించి దానిని ఎవరు కాపాడుతారో అని అక్కడనే వేచి ఉంది.  
          అప్పుడే ఆ కుందేలు పిల్ల అరపులు విని  అక్కడికి పరుగున వచ్చిన ఏనుగు అది చూసి   ఆ బుజ్జి కుందేలును తన తొండంతో లాగి  ఆ గోతి నుండి కాపాడింది.   తర్వాత అది ఆ నక్కతో ” ఓ నక్కా! ఈ  పిల్ల కుందేలు ఆపదలో ఉంటే నీవు  కాపాడకుండా ఎటో చూస్తున్నావు. ఇది నీకు తగునా!   అది కాపాడమని అంటే వినరానట్టు ఉంటావా !”అని అంది. అప్పుడు నక్క ఏమి మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి  వెళ్ళిపోయింది.
         కొన్ని రోజులకు ఒక బుజ్జి నక్క కూడా  దూరంగా ఒక చిరుతపులి అరపు విని భయంతో పరుగెత్తి  ఇదే చోటకు వచ్చి అదే గోతిలో పొరపాటున పడింది. అది కూడా తనను  కాపాడమని  గట్టిగా అరిచింది.   దూరం నుండి ఇది చూసిన ఒక పెద్ద కుందేలు పరుగున వచ్చి ఆ బుజ్జి నక్కను ఒక కర్రను అందించి దాని  సాయంతో కాపాడింది .  వెంటనే దాని తల్లి  పెద్దనక్క పరుగున అక్కడికి వచ్చింది.  అప్పుడే అక్కడికి వచ్చిన ఇదివరకటి ఏనుగు ఇది చూసి  ” ఓ కుందేలా! నీవు ఈ బుజ్జి నక్క ప్రాణాలు కాపాడి దానికి   చాలా మేలు చేశావు.  ఈ నక్కనే గతంలో నీ బిడ్డను కాపాడలేదు. అయినా అది మనసులో పెట్టుకోకుండా ఒక తల్లి మనసును అర్థం చేసుకున్నావు.   అపకారికి ఉపకారమంటే ఇదే  “అని అంది.  అప్పుడు కుందేలు ” ఓ గజమా! ఆపదలో ఉన్న ఎవరినైనా కాపాడడం మన ధర్మం. అందులో అది చిన్న పిల్ల.  పొరపాటున ఆ గోతిలో పడింది.  మరేదైనా క్రూర మృగం చూస్తే దీని ప్రాణాలు దక్కవు.  అందువల్లనే నేను దానిని కాపాడాను.  అది సాయం చేయలేదని నేను కాపాడకుంటే  ఒకవేళ దాని ప్రాణం పోతే  తిరిగి వస్తుందా! అందుకే ఈ చిన్న మేలు చేశాను” అని అంది.
      అప్పుడు నక్క తాను గతంలో  కుందేలు బిడ్డకు చేసిన అపకారం గురించి చెప్పి కన్నీళ్లు కార్చింది.   తన బిడ్డను బ్రతికించినందుకు ఆ కుందేలుకు తన ధన్యవాదాలు తెలిపింది. ఆ  కుందేలు ఆ నక్క కన్నీళ్లను తుడిచింది.  తర్వాత    ఆ నక్క పశ్చాత్తాపపడి  మరోసారి ఎటువంటి తప్పు చేయలేదు. అంతేకాదు. ఆ కుందేలుతో అది  చాలా   స్నేహపూర్వకంగా మెలగింది.    అందుకే అపకారికి ఉపకారం చేస్తే  స్నేహం పెంపొందుతుంది. 

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

అచ్చంగా అచ్చులే

by Vijaya Kandala September 29, 2024
written by Vijaya Kandala

తెలుగు భాషకు అపారమైన పదసంపద ఉంది . మనలో చాలామందికి  తెలుగులో మాట్లాడడం ,రాయడం నామోషీ . తాము వాడే  కాసిన్ని మాటలు తా మనుకుంటున్న  అర్థాన్ని ఇస్తున్నాయా  అని తెలుసుకోవడం అవమానం. తెలిసిన పెద్దవారినీ ,నిఘంటువులనూ  సంప్రదించడము అనవసరమనే  విశ్వాసం . ఇవన్నిటికి  తోడు మనం మాట్లాడేది కల్తీ లేని తెలుగనీ అభిప్రాయం.

ఇలా నడుస్తున్న రోజులలో వచ్చిన కరొన ప్రపంచాన్ని ఓ కుదుపు కుది పింది .

దాంతో వ్యక్తుల ఆలోచన ధో రణిలో  కొంత మార్పు వచ్చింది . మన చా రిత్రక  , సాంస్కృతిక మూలాలను గురించి తెలుసుకోవాలనే  ఆలోచన మొదలైంది . మాతృ భాష చదవడం   సరిగ్గా రాకున్న విని ఆనందించడం ,కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆరాటం అనేకవిధాలుగా విస్తరిస్తున్నది . ఇది శుభ పరిణామం .

ఈ నేపధ్యంలో తెలుగు భాషాభిమానిగా నాకు తోచిన రీతిలో తరచుగా వాడే  పదాలలో కొన్నింటిని ఎంచుకొని ,వాటి వెనకున్న ఆసక్తికర అంశాలను క్లుప్తంగా తెలియచెప్పాలని ప్రయత్నించా  .

 ఒక ముఖ్య గమనిక . ఈ మాటల మూటలు  నిత్య జీవితంలో మాటలను ప్రయోగించేటప్పుడు  ,కాస్త  తెలుసుకోవాలనే ఉత్సాహవంతులకోసమే గాని ,పండితులకు , కవులకు ,  రచయితలకోసం  ఉద్దేశించినది కాదని మనవి .

   ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు భాష పట్ల ఆసక్తి పెరుగుతుందని ,పెరగాలని  చిన్న ఆశ.

ఎక్కడినుంచి మొదలెట్టాలి అనేదే పెద్ద ప్రశ్న . మాటలమూట  లు అనుకున్నాం గనుక అక్షరం నుండి మొదలెడతా  .

 అక్షరం అనే మాటను అక్కరం ,అచ్చరం అని కూడా అంటారు .  ఇది సంస్కృత పదం . క్షరం కానిది –నశించనిది అని అర్థం . భాష అనేది ధ్వనులుగా మొదలై లిపి ఏర్పడి ,తాటాకులు ,భూర్జపత్రాలు ,రాగిరేకులు ,శిలలపై  ప్రయాణం సాగించి ,కాగితాలు వరకూ సాగి, ఆ  తర్వాత అనేక విధాలుగా విస్తరించింది. ఈ రకంగా భాష , సాహిత్యం కలకాలం నిలిచి ఉంటుందని ,నశించనవి అనే అర్థంలో అక్షరాలన్నారు . కొందరి అభిప్రాయంలో అ నుండి క్ష వరకున్న వర్ణమాలలోని ఆద్యంతా లను చేర్చి , అక్షరమైందని అన్నారు .

  సంఖ్య లో వెల్లడించిన సమాచారం కన్నా ,అక్షరాలలో రాసిందే ప్రామా ణీకమనే  మన న్యాయ వ్య వ హారాల్లో నూ , బ్యాంక్ లా వా దేవీల్లోనూ   నమ్ముతారు . అందుకే దస్తావేజుల్లో  , బ్యాంక్ పత్రాల్లోనూ అక్షరా లా ఇంత అనీ  మళ్ళీ రాస్తారు .అంకెలను దిద్దినంత సులభంగా అక్షరాలను దిద్దలేము కదా . అదీ  సంగతి.

అంతేకాదు . ఆయన మాట అక్షరాలా జరిగి  తీ రాల్సిందే   అన్నప్పుడు తప్పకుండా ,మార్పు లేకుండా అనే అర్థాలు అక్షరాలా కు వర్తిస్తాయి . ఇదండీ  అక్షరాలా అక్షరాల కథ .

  అత్తెసరు

  నిఘంటువుల ప్రకారం చూస్తే ఇది అత్తు +ఎసరు అనే రెండు పదాలతో ఏర్పడ్డ సమాసం . వంటకు సంబంధించి ముఖ్యంగా బియ్యం అన్నంగా మారే  ప్రక్రియ లో వాడే మాట . ఇప్పుడంటే కుక్కర్లు వచ్చాయిగానీ ,ఒకప్పడు విడిగా వండి ,గంజి వార్చడం ఒక పద్ధతి . మరో విధానంలో నీళ్ళను మరిగించి ,తగిన పాళ్ళలో  కడిగిన బియ్యం వేసి ,ఉడికించడం . ఎన్ని నీళ్ళకు ఎంత బియ్యం అనేది అనుభవసారం . దీంట్లో అన్నం వార్చే పని ఉండదు . అయితే అన్నం బిరుసు గాను,పలుకుగాను ఉండకూడదు . అలా ఉంటే నీళ్ళు తగ్గినట్లు లేదా గిన్నె సరి పడిందిగా లేనట్లు . అన్నం మృదువుగా ఉండాలి . ఎక్కువగా ఉడికి ముద్దలా కారాదు .  అత్తెసరు  అంటే నీరు ,బియ్యం కలిసి అన్నం మాత్రమే మిగలడం అన్నమాట . దీ నికి సారూప్యంగా  అత్తెసరు మార్కులు అని వాడతారు . అంటే  బొటాబోటీగా  సరిపోయేటట్లుగా ,పెద్ద విశేషంగా చెప్పనక్కర్లేని అని  అర్థం.

 ఆటవిడుపు

ఈ రోజుల్లో చదువుల్ని ఆటపాట ల రూపంలో  నేర్పించాలనే పద్ధతికి  ఆదరణ పె రిగింది  . అదివారాలు , పండుగలు , వేడుకలప్పుడు  పరీక్షల తరువాత సెలవులు ఉంటూనే ఉంటాయి . మరి వెనకటి రోజుల సంగతి ఏంటి ?అని ఆలోచిస్తే వారికీ మరో  విధంగా సెలవులు ఉండేవి  .అలా అడుకోవడానికి కేటాయించే సమయమే ఆటవిడుపులు . ఒకప్పుడు ఆశ్రమాలకు , గురుకులాలకు వెళ్ళి చదువుకునేవారు . అ చదువంతా చెట్ల కిందనే జరిగేది . అందువల్ల ముసురు పట్టినా ,ఆశ్రమానికి ప్రముఖులు ,గురువులు వచ్చినా సెలవులే .దాంతో బాటు పౌర్ణమి  దానికి ముందు రోజు ,అమావాస్య ,దానికి ముందు రోజు ఇలా నాలుగు రోజులూ  అనధ్యయనపు దినాలు .అయితే , ఆ  రోజుల్లో దినమంత  ఆటల్లో  వృధా చేయకుండా ,కొంత చదువు , కొంత వినోదం కలిసొచ్చేలా కొన్ని కంట స్థ పద్యాలనిచ్చి నేర్చుకొమ్మనే వారు . ఇలా సాధారణంగా సుమతీ ,వేమన , కృష్ణ ,దాశరధి శతక పద్యాల నిచ్చి నేర్చుకునేలా  చేసేవారు . క్రమంగా అసలర్ధం   మరుగున పడిపోయింది . విశ్రాంతి ,పనిలేకపోవడం ,పని చేయకపోవడం అనే కొత్త అర్ధాలు స్తిరపడిపోయాయి .

ఇంగితం

         ఇంగితం అంటే సంస్కృతంలో అభిప్రాయం అని అర్థం . ఒకప్పుడయితే నుదురు చిట్లించడం ,బొమముడి అనే అర్థంలో కూడా వాడేవారు . ఈ పదాన్ని విశేషణంగా తీ సుకుంటే చలించిన ,కదిలిన అనే అర్థాలు ఏర్పడుతాయి . నామవాచకంగా తీసుకుంటే కదలిక , చలనం ,మనోభావం ,అభిప్రాయం  అనే అర్థాలు వస్తాయి .

ఇంగితజ్ఞు డు  అంటే ఇతరుల అభిప్రాయం తెలుసుకోగలిగినవాడని  భావం . అయితే  ఇంగిత  జ్ఞానం   అనే మాటకే వాడు కెక్కువ ఇంగితం  లేదంటే ఎవరితో  ఎలా మాట్లాడాలో తెలియని వాడ న్నమాట . పాత  అర్థాల  స్థానంలో కొత్త అ ర్థా లొచ్చేశాయి . 

ఈసడించు

ఇది క్రియా  పదం . డి క్షనరీల్లో వెతికేతే ,రోతపడు , కోపించు ,నిరసించు ఇలా ఎన్నో అర్థాలు .  నేటి కాలంలో తగ్గించి , తీసివేసి ,తక్కువ చేసి మాట్లాడు అనే అర్థాలు మిగిలా యి . ఈసడించారు ,ఈసడించి మాట్లాడారు . అనేవే నేటి ప్రయోగాలు .

ఉడుం పట్టు

ఉడుం అనేది బల్లి జాతికి చెందిన ప్రాణి . పాతకాలంలో అంటే రాజరికపు రోజుల్లో సైనికులు దీన్ని పెంచి , తర్ఫీదు నిచ్చి యుద్ధాలలో ,ముట్టడులలో  ఉపయోగించేవారు ఉడుం నడుముకు మోకుకట్టి ,బలంగా కోట గోడలమీదికి విసిరేవారు . దాని నాలుకకు తేనె రాసేవారు . ఏ పాటి పట్టు దొరికినా  అది గోడను కరిచి పట్టుకుంటుంది . ఎంత బలంగా అంటే వేలాడే మోకును పట్టుకుని సై నికులు పైకి పాకి కోట గోడ పైభాగానికి  చేరి ,లోపల్నుంచి తలుపులు తెరిచేవారు . బయటి నుండి  సైన్యం లోనికి చేరి, రాజనగరును ముట్టడించి స్వాధీనం చేసుకునేవారు .

ఇప్పుడు అలాంటి అవసరాలు లేకున్నా పట్టినపట్టు వీడని ,వదలని మొండి పట్టును సూ చించడానికి ఉడుం పట్టు అనే మాటను వాడు తున్నాం  .

ఊదరపెట్టు

               అదే పనిగా నస పెట్టు , పొగ బెట్టు అనే అర్థం లో వాడుతాము . ఎలుకల వంటి వాటిని బయటికి వెళ్ళ గొట్టడానికి పొగబెట్టడాన్ని ఉదరబెట్టడం అంటారు . చుట్టలను , సిగరెట్లను ఒకదానికొకటి ఆ నించి నిప్పు అంటించడాన్ని ఊదరబెట్టడమంటారు . అగ్గిపెట్టలు అందుబాటులోకి వచ్చాక దీ నీ  అవసరం తీ రిపోయింది  . మామిడి వంటి కాయలను త్వరగా పళ్ళుగా మార్చడానికి పెట్టే పొగను ఊదర అంటారు . ఒక విషయాన్ని పదే పదే చెప్తూ ఉండ డాన్ని  ఈ రోజుల్లో ఊదరపెట్టుగా అంటున్నాం

ఋ జువు

          ఋ కారాన్ని పలకడం , రాయడం ఎప్పుడో మానేసాము . అయితే వినిపించే కొద్ది మాటల్లో ఎక్కువగా వినిపించే మాట ఋ జువు . సంస్కృతం లో ఈ పదానికి సత్యం , సూటి అనే అర్థాలున్నాయి . నిదర్శనం అనే అర్థం లో తెలుగులో ఉపయోగిస్తున్నాం . ఈ అర్థంలో వాడే ఈ మాట పర్షియన్ నుంచి హిందీ ద్వారా తెలుగులోకి ప్రవేశించింది .

ఎద్దు

సరే దీని గురించి తెలియనిదేవరికి ? కాబట్టి దీనికి సంభందించిన కొన్ని విషయాలు చెప్పుకుందాం . ఎద్దు అనగానే నాకు స్పెయిన్ దేశం గుర్తొస్తుంది . అక్కడ ఎద్దుల్ని రెచ్చగొట్టి ,వాటితో పొడిపించుకుంటూ ,తొక్కించుకుంటూ ఆడే ,ఆడించే    Bull Fighting ఆటను   జనాలు వెర్రెత్తినట్లు ఆ డుతారు .  ఎ ద్దులమీద కుక్కల్ని ఉసిగొల్పి ,బుల్ రింగ్ లో ఆడించే ఆట కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది .

పూర్వం వేటాడడానికి  ఎద్దుల్ని ఎరగా చూపించి , సింహల్ని , పులులని వేటాడేవారు . దుక్కిటె ద్దుని హాలికం అని ,బండికి కట్టే ఎద్దుని అన ద్యాహమ్ అనీ  అంటారు . సాధు ఎద్దుని గంగిరెద్దు అంటారు .

నంద్యాల , నందిగామ , మహానంది వంటి గ్రామాలు మనకు ఎద్దులకూ ఉన్న  అనుభందాన్ని గుర్తు చేస్తాయి .

ఏ బ్రాసి

ఈ మాటను రోత మనిషి , అమాయకుడు , చేతగానివాడు మొదలైన అర్థాల్లో ఉపయోగిస్తారు . అసహ్యమైన వ్యక్తి అనే అర్థంలో సంస్కృతంలో ఏభ్య రాశి అనే పదం ఉంది . ఈ మాట నుంచి ఏర్పడ్డ తెలుగు పద్యం ఏబ్రాసి . ఏబ్రాసి వెధవ ,ఏబ్రాసిగాడు అనే వ్యవహారం

ఐ రావతం

ఐ రావతం అంటే భా రీ కాయంతో  తెల్లటి మేని ఛాయ తో ,మెరి సి పోయే ఏనుగు . ఇది క్షీర సాగర మధనంలో  పుట్టింది . ఇo ద్రు నికి వాహనం . దీ న్ని మేఘాల ఏనుగు ,సూర్యుని సోదరుడు అని కూడా పిలుస్తారు . మాతంగ లీల అనే గ్రంధం ప్రకారం బ్రహ్మ వరంతో 8 మగ 8 ఆడ ఏనుగులు పుట్టాయి . మగ ఏనుగులకు ప్రతినిధి ఐ రావతం .

         జైన ,బౌద్ధ మతాలలో కూడా ఐ రావతం ప్రస్తావన ఉంది . థా య్ లాండ్ ,లావోస్ వంటి దేశాలలో దీన్ని ఆరాధిస్తారు . అక్కడి ప్రాచీన రాజ్యాల పతాకాలమీద మూడు తొండములతో ఉండే ఐ రావతం బొమ్మ చిత్రించబడి ఉంటుంది

 ఒంటికంటి  రామలింగం

  ఓ అనగానే నాకు ఒంటికంటి రామలింగం గుర్తొస్తాడు   . ఆయనెవరు ? అని ఆడక్కండి . నాకూ  తెలీదు . ఇంకోలా చెప్పాలంటే ఎవరైనా కావచ్చు . ఎందుకంటే ఇక్కడ రామలింగం అనే  మాట పేరులా  కాక ఒక గుణా నికి ,స్వభావానికి ప్రతీకగా చెప్పుకుంటున్నాం . ఒంటి  కన్ను అంటే ఒక కన్నున్న వాడని గాక ఇతరుల సుఖశాంతులను చూసి ఓర్వలేని వాడని అర్థం .అసూయపరుడిని ఒంటికంటి రామలింగం అని సంభో ధిస్తూంటారు

ఓంకారం

  ఓ అనగానే ఓంకా రం  మెదులుతుంది మదిలో . ఇది అకార ,ఉకార ,మకారాల  సమ్మేళనం . సృష్టిలో మొదట వినబడ్డ శబ్దం ఓమ్ . దీన్ని పదేపదే జపించడం వల్ల శరీరంలో ప్రాణవాయువు శా తం పెరుగుతుంది .కంఠ నాళంలోని అడ్డంకులను తొలగిస్తుంది . స్పష్టమైన ఉచ్చారణకు  తోడ్పడుతుంది . సనాతన హిందూ ధర్మంలో ఓంకారా నికి ఎంతో ప్రాముఖ్యత ఉంది . పరమశివుని నాద రూపమే ఓంకారం . వేద సారం ఓంకారం. ఓమ్ అనేది ఏకాక్షర మంత్రం . ఇది కేవలం ఒక మతానికి సంబంధించినది కాదు .

 నిత్యం సాధన చేయడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది .. మానసిక అలసట తగ్గి ప్రశాంతత కలుగుతుంది. దీన్ని జపించే సమయంలో వచ్చే ప్రకంపనలు మన నాడీ వ్యవస్థ పై పాజిటివ్ ప్రభావాన్ని చూపుతాయి . ఏకాగ్రత మెరుగుపడుతుంది .

ఔచిత్యం

నీవు చెప్పిన మాట ఔచిత్యం గా లేదు. పెద్ద మనుషులున్నప్పుడు ఔచిత్యంగా  మాట్లా డా లని తెలీదూ అంటూ ఔచిత్యం ప్రదర్శిస్తూ ఉంటాం . కానీ నిఘంటువులలో ఉచితత్వం , యోగ్యత ,సత్యమనే అర్థాలే ఉన్నాయి . తగినవిధంగా ,యుక్తంగా ,యోగ్యతగా అనే అర్థాల్లోనే వాడుతున్నాం . సందర్భానికి తగినట్లు మాట్లాడుట ,ప్రవర్తించుట అనే సందర్భంగా ప్రస్తుతం వాడుతున్నాం .

  అం –అః

0 ( అః వీటిని వ్యాకరణ పరిభాషలో ఉభయాక్షరాలు అంటారు . ప్రస్తుతం బండి ఱ ను , అరసున్న ను వాడుకలోంచీ పక్కకు జరిపేసాము   . మిగిలిన  రెంటికీ విడిగా ప్రయోగం లేదు . 

అంబరం అంటే ఆకాశం సాధారణ అర్థం . అయితే దిగంబరుడు అంటే దిక్కులే అంబరంగా కలవాడు అని అర్థం చెప్పుకుంటాం . ఇక్కడ అంబరంఅంటే వస్త్రం . నిఘంటువుల్లో దీనికి దూది , అనుస్వారం అనే అర్థాలను ఇచ్చారు .

అంతఃపురం

విసర్గ కు సంస్కృతంలో  బోలెడన్ని ఉదాహరణలు దొరుకుతాయి . తెలుగులో విసర్గ అనగానే టక్కున గుర్తొచ్చే  పదము   అంతఃపురం . రాజుగారికి సంభంధించిన స్త్రీలు ఉండే ప్రాంతం అని అర్థం . రాణివాసం అని కూడా అనవచ్చు గానీ మనకు అంతఃపురమే నచ్చుతుంది ..

ఇ దండీ  అచ్చంగా అచ్చులే  చిరు  వ్యాసం.    కేవలం వ్యాకరణ పరిభాషలో కాకుండా కాసింత ఉప్పు , పులుపు ,కారం  కలిపి గుచ్చెత్తి , వండి వార్చిన వంటకం .

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తో(రణం )

by Vijaya Kandala September 29, 2024
written by Vijaya Kandala

మన ఇళ్లల్లో   వేడుక ,పండుగ ,పర్వం, శుభకార్యం ఏదైనా  తోరణాలు కట్టడంతోనే మొదలవుతాయి . తోరణాలు పంది ళ్ళతో ఇంటికి కొత్త అందం వచ్చి చేరుతుంది . సంబరాలను వెంట తీసుకొని వచ్చేవే తోరణాలు.  అంతెందుకు  వీధిలో అలా నడిచి వెళ్తున్నప్పుడు  ,ఏ  గుమ్మానికో మామిడాకుల తోరణం కనిపిస్తే చాలు, వీరి ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతున్నట్టుంది అనుకుంటారు దారి ని పోయేవారు . అది తోరణ మహా త్యం. ఇందులో ఇంకొక విశేషం ఉంది .మన అలవాటులో తోరణం అంటే మామిడాకులదే.

అసలు తోరణాలు ఎందుకు ?వాటికి మామిడాకులే ఎందుకు? అని ఆలోచిస్తున్నారు కదూ ! నేను అలానే అనుకున్నా సుమండీ .  అనుకోవడంతో ఊరుకోలేదు .జవాబు కోసం ప్రయత్నించా. ఆ వివరాలు క్లుప్తంగా  మీకోసం .

ఒకప్పుడు తోరణాలు అంటే ముఖద్వారానికి మామిడాకులను ఓ పు రి కొ సతో బంధించడమే. ఇప్పుడు కాలం మారింది.  వస్తువులో , విధానాల్లో  ,వైవిధ్యం చోటు చేసుకున్నది. రంగురంగులతోరణాలు రాజ్యమేలుతున్నాయి .పండగల సీజన్ మొదలైంది గా యూట్యూబ్ లో వేలెట్టండి .ఇంకేముంది వందలాది ఉపాయాలు .వేలాది లైకులు . మూడు పువ్వులు ఆరు కాయలుగా విభిన్నతకు అర్థం చెప్పే  కంటెంట్లు  .

ప్రసిద్ధ ప్రాచీన దేవాలయాల గురించి ఓ మంచి మాట చెప్తుంటారు పెద్దలు .నిత్య కళ్యాణం పచ్చతోరణం అని అంటే ఆ .దేవాలయంలో సంవత్సరం పొడుగునా స్వామివారికి కళ్యాణం జరుగుతూనే ఉంటుందన్నమాట .ముహూర్తాలు సరైనవి దొరక్కపోయినా ,కుటుంబ పరమైన సమస్యలు ఎదురైనా ,చాలామంది పుణ్యక్షేత్రానికి వెళ్లి పెళ్లి చేస్తారు.  స్వామివారి కల్యాణం జరిగినందువలన అక్కడ విడిగా వధూవరుల  జాతకం ఆధారంగా ముహూర్తాలు పెట్టకున్న, పెట్టిన దానిలో ఏవైనా దోషాలు ఉన్నా, స్వామి అనుగ్రహంతో తొలగిపోతాయన్నమాట.

సరే ఇప్పుడు మనకు బాగా తెలిసిన మామిడి తోరణాల దగ్గరికి రండి .

జ్యోతిశ్శాస్త్రం  లో మామిడి ఆకులను అంగారక గ్రహానికి కారకంగా చెప్తారు.  అందుకే వేడుక ఏదైనా మావిడాకులని వాడుతారు .  చెట్లు ,మొక్కలను  పూజించడం మన సంస్కృతిలో ఒక  భాగం  .దీనికి గొప్ప ఉదాహరణ కార్తీకం లో ఉసిరి చెట్టును, క్షీరాబ్ది ద్వాదశి కి తులసి పూజను చేయడం ఇంకా మిగిలి ఉన్న సంప్రదాయం.

మామిడి చెట్టు, దాని  భాగాలు  అనేక విధాలుగా  మన సంస్కృతిలో  భాగం . ఒకప్పుడు తోట ఉంది అంటే చాలు మామిడి తోటనా అని మొదటి ప్రశ్న ,మామిడి చెట్లు ఎన్ని ఉన్నాయి ?అనేది రెండవ ప్రశ్నగా అడిగేవారు. మామిడి చెట్లు ఆర్థిక వనరులకు చిహ్నం ఒకప్పుడు . మామిడి చెట్టు ఆకులు, లేత చిగుళ్ళు ,పళ్ళు, కాయలు, బెరడు అన్ని ఆయుర్వేదంలో , గృహవైద్యంలో ఉపయోగకారులు .మామిడి ఆకులను తోరణాలుగా మాత్రమే కాక, కలశం లోను వాడుతా రు .అవి దొరక్కపోతేనే తమలపాకులను ఉపయోగిస్తారు .

మామిడాకుల తోరణాల వెనకున్న నమ్మకాలను గురించి కాస్త చెప్పుకుందాం.

మామిడాకులను తోరణాలుగా వేలాడదీయడం వల్ల, ఇంటికి చెడు దృష్టి నుండి రక్షణ, సానుకూల శక్తికి ఆహ్వానం అనేది ఓ ముఖ్యమైన నమ్మకం. ఈ తోరణాల వల్ల ఇంట్లోకి ధనలక్ష్మి తో పాటు సకల దేవతా పరివారం వస్తారని పండితులఉ  వాచ .

 ఈ ఆకుల్లోంచి విడుదలయ్యే ప్రాణవాయువు వాతావరణాన్ని స్వచ్ఛంగా ఉంచుతుంది . తోరణాలు ఎక్కువమంది గుమికుడినప్పుడు ,ఎదురయ్యే మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి  .ప్రధాన ద్వారం పైన కట్టినప్పుడు ఆ ఇంట్లోని  వాస్తు దోషం పోతుందని ఒక విశ్వాసం  . వెనకటి రోజుల్లో  గ్రామాల్లో బావిలోకి దిగి, శుభ్రం చేయవలసిన సమయంలో ,ఎక్కువ ఆకులు ఉన్న మామిడి కొమ్మను బావిలోకి  చుట్టూ కొంత సేపు తిప్పమని చెప్పే వారు . దాంతో బావిలోని విషవాయువులు తొలగిపోతాయట .ఇది నిరూపించబడింది కూడా .

మామిడి ఆకులలో ఒక ఆహ్లాదకరమైన సువాసన ఉంటుంది అందువలన తోరణాల పరిసరాలు సువాసన , తాజాదనంతో నిండి ఉంటాయి.

  మామిడి ,జువ్వి , రావి , మర్రి , ఉత్తరేణి ఈఐదు చెట్ల  ఆకులను పంచ పల్లవాలంటారు .వీటిని శుభకార్యాల్లో వాడుతారు .అయితే తోరణం లో నిలిచేది మాత్రం మావిడే . యజ్ఞయాగాదుల లో  మామిడి ఆకులను వాడి  ధ్వజారోహణం చేయడం సంప్రదాయం .ధ్వజారోహణం అంటే దేవతలకు ఆహ్వానంపంపడమే.   మావిడాకులు అంటే దేవతలకు ఇష్టమేనన్న మాట .

శివపార్వతుల కళ్యాణం మామిడి చెట్టు కిందనే జరిగిందని , అందుకే శుభకార్యాలలో మామిడి ఆకులను ఉపయోగిస్తారని పెద్దవారంటారు .

 ఇంకో ముఖ్య విషయం ఇక్కడ తప్పక చెప్పుకోవాలి . మన వైపు పెద్ద పండుగలు  ,ఉత్సవాలు ఎక్కువగా సంవత్సరంలోని రెండో భాగంలోనే వస్తాయి .దీనికి మామిడి తోరణానికి సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నారా ? మామిడి పూత సాధారణంగా శీతాకాలం చివరలో మొదలవుతుంది . వేసవిలో కాత మొదలవుతుంది. కత్తిరింపు మొక్క బలంగా పెరగడానికి సహాయపడుతుందని మీకందరికీ తెలుసు కదా! అయినా ఈ విషయం తెలుసుకోవడానికి వృక్షశాస్త్రజ్ఞుని వరకు వెళ్ళనక్కరలేదు . ఏ తోటమాలి అయినా చెప్తాడు .పండుగలప్పుడు మామిడి తోరణాలను కట్టడానికి ఇదొక మంచి కారణం .

ఈ కారణాలన్నింటినీ  విస్తృతంగా అధ్యయనం చేయకున్నా సంప్రదాయ పద్ధతుల ఆధారంగా తరతరాలుగా జనం ఆచరిస్తున్నారు . విశ్వసిస్తున్నారు కూడా.

తోరణాల గురించి ఇన్ని మాటలు చెప్పుకుని ఆగిపోతే అది అసంపూర్తి అవుతుంది  .తోరణం అనగానే మామిడి ఆకుల తర్వాత గుర్తొచ్చేవి కాకతీయ శిలా తోరణాలు . అందమైన ఈ తోరణాలు మన శిల్పుల నైపుణ్యానికి సజీవ సాక్ష్యాలు  .వీటిని తోరణ ద్వారాలు ,తోరణాస్తంభాలు, కీర్తితో రణాలు ,హంస ద్వారాలు ఇలా రకరకాలుగా చరిత్రలో పేర్కొన్నారు.   ప్రభుత్వం నిర్వహించే అన్ని ప్రధాన కార్యక్రమాల్లో దాదాపుగా కనిపించే నమూనా స్వాగత దారాలు ఇక్కడివే .

వరంగల్ కోటలో ఈ కీర్తి తోరణాలు నాలుగు ఉన్నాయి .  నాలుగూ  వేర్వేరు రాజుల కాలంలో నిర్మించబడినా  ఆ తేడాలను మన చూపులు పట్టుకోలేవు.  వీటిపై అధోముఖ పద్మాలు, హంసలు అందంగా  అమిరాయి  . కోటలోని అపార సంపదను , శత్రువులు దోచినా ఈ అమూల్య సంపద మనకు దక్కింది .చూసేవారికి రాచహోదాను ,  ఆత్మవిశ్వాసాన్ని నేటికీ అందిస్తున్నాయి . ఇవి  యుద్ధాల్లో సాధించిన  గెలుపును తెలిపే విజయ చిహ్నాలు అని చరిత్రకారుల వివరణ  .మన బోటి సామాన్యులకు తోరణం  అంటే నెగిటివ్ ఎనర్జీతో , చెడు దృష్టితో , చెడుగాలితో రణమే . పోరాటమే  .దాన్ని ఎదుర్కోవడానికి తోరణాలను కడదాము .  ఆ సువాసనలను  ,ప్రాణ శక్తిని మనసారా  జీవితాల్లోకి ఆహ్వానిద్దాం .

 ఇదండీ  తోరణాల కథ

 

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

సభ్యసమాజం- ఆమె

by Taniparti NarayanaRao September 29, 2024
written by Taniparti NarayanaRao

‘అక్కా! నీ రూప లావ

గరిమకు

నీలాకాశాన వెలిగే నిండు చంద్రుని

అందచందాలు సరిరావేమాత్రం!’

అక్క ఉదయాన్నే స్నానసంధ్యలు ముగించుకుని వరండాలో కూర్చుని ఏదో విషయమై దీర్ఘాలోచనలో మునిగి ఉన్నది. తన దినచర్య అక్కడ నుంచే ఆరంభమవుతుందని తెలిసివచ్చింది నాకు.

‘అక్కా! నీ ప్రశాంత గంభీర వదనం మాటున

అంతరంగ గర్భగృహంబున అణగారిన ఆవేదనలెన్నో!

తెలియరాని నా చిరుహృదయానికి

అర్థంకాని ఆందోళనఏలో!’

“అక్కా!” నా పిలుపుకు తేరుకుని నన్ను దగ్గరకు తీసుకున్నదామె. ఆప్యాయంగా నా తల నిమిరి “ఏమిటి చంద్రా!” అని నా కళ్లలోకి చూసింది. “ఏమిటి తమ్ముడూ!” అని మరోసారి అడిగింది. నా ముఖం, చూపు కిందకే దించి ఉన్నవి. చిన్నగా నవ్వి నన్ను తన సన్నిధి నుండి విడుదల చేసింది.

అక్క ఇంట్లో నా మొదటి ఉదయం అనుభవమది.

నాకప్పుడు ఎనిమిదేళ్ల ప్రాయం. నన్ను తీసుకుని మా అమ్మ వాళ్ల అక్క (తోబుట్టువు కాదు) ఊరికి వెళ్లింది. వాళ్లది చాలా పెద్ద ఇల్లు. రెండస్తుల మేడ. సున్నం, ఇటుకలు కలపతో నిర్మాణమైనది. మా చిన్న ఇంటితో పోల్చుకుంటే చాలా అద్భుతంగా తోచిందది. ఆ ఇంట్లో వారందరూ, అన్నలూ, వదినలూ చాలా పెద్దవారు. మొదట్లో కొంచెం బెరుకుగా ఉన్నా వారం రోజుల్లో నేనా ఇంట్లో ఒక భాగమయిపోయిన. చిన్నగా, నాజూకుగా, ముద్దుగా ఉండేవాణ్ణి. వారంతా నన్ను అపురూపంగా చూసుకునే వారు. వారి ప్రేమకు ముగ్ధుడనయ్యేవాణ్ణి. ఆ ఇంటి పరిసరాలు ఆనందదాయకంగా ఉండేవి. అటవీ ప్రాంతం, పెద్దపెద్ద వృక్షాలు, పొదలు, లతలు, వాటిమధ్య పొలాలు, చేలు ఎక్కడ ఉండేవో కనపడేవే కావు.

నా ఆనందానికి అవధులులేవు. అట్లా ఉండగా ఒకరోజు ఉదయం పదకొండు గంటలు. పెద్దమ్మ వాకిట్లో ఆగిన ఓ కచ్చడంలోంచి ఒక స్త్రీమూర్తి దిగి వచ్చి వరండా మెట్లెక్కింది. ఆశ్చర్యం! ఆమె ఒక మనిషిలా లేదు. దేవతా స్త్రీలాగా ఉన్నది. తెల్లని వస్త్రాలు. దేహమూ అదేరంగు, మెరుపులాంటి ముఖవర్చస్సు. పెద్దమ్మ ఎదురు పడగానే చిరునగవుతో నమస్కరించింది. అక్కడే నిల్చున్న నేను తదేకంగా తననే చూస్తున్నాను. నా వంక ప్రశ్నార్థకంగా చూసిందామె. ‘లక్ష్మి చిన్నాయి (చిన్నమ్మ) కొడుకు చంద్రసేన్’, ‘అక్క’ అంటూ తిరిగి నావంక చూసింది పెద్దమ్మ. నేను వంగి అక్కపాదాలు స్పృశించి నమస్కరించిన. ఎవరి పాదాలకైనా ప్రణమిల్లటం నా బాల్యంలో అదే ప్రథమం.

రెండు రోజుల తర్వాత అక్క తిరుగుప్రయాణం. వెళ్తూవెళ్తూ పెద్దమ్మకు చెప్పి వారంరోజులకోసం నన్ను తమ ఊరికి తీసుకెళ్లింది. అక్క ఇల్లు పెద్ద అందమైన భవంతి. భవంతినానుకొని పొడుగూతా ఉన్న అరుగు. ఆ అరుగుమీద కూర్చొని ఎదురుగా ఫర్లాంగు దూరాన గలాగలా పారుతున్న జలాలు, ఆ పరిసరాలను చూస్తుంటే ఆహ్లాదకరంగా సమయం గడిచిపోతుంది. అక్క ఊరు గోదావరికి దక్షిణాన, తీరానికి సమీపంలోనే ఉన్నది. ఇక్కడా కొంత దూరం వరకు అటవీక్షేత్రం వ్యాపించి ఉన్నది. పెద్దమ్మ ఊరు గోదావరి ఉత్తర తీరాన ఉండి, అక్కడి నుంచి విస్తరించిన దట్టమైన అటవీ ప్రాంతం దండకారణ్యంలో సంలీనమవుతున్నది. ఈ రెండు ఊళ్లమధ్య ఉన్న దూరం నాలుగు క్రోసులు (8మైళ్లు). మా ఊరు గోదావరి నదీ దక్షిణ తీరానికి 20 క్రోసుల దూరంలో ఉన్నది. నదీ జలాలు, అటవీ ప్రాంతాల పట్ల నాకున్న మక్కువవలన పెద్దమ్మ ఊరు, అక్క ఊరు రెండూ నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. వారంరోజులు అక్క దగ్గర ఎట్లా గడిచిపోయినయో తెలియలేదు. ఒకరోజు తనతోపాటు నదీతీరాన ఉన్న మామిడితోటకు వెళ్లినం. అక్క పాలేర్లు, పనివాళ్లతో మాట్లాడుతూ పనులు పురమాయిస్తుంటే నేను తోటంతా కలియతిరిగిన. ఒకనాడు వరి పొలాల వద్దకు, మరోనాడు ఇంకో చోటికి అక్కతోపాటు నేనూ వెళ్ళేవాణ్ణి. ఆ చిన్న కచ్చడంలో ప్రయాణం భలేసరదాగా ఉండేది. ఆ బండికి కట్టే ఎద్దులు వేరు. వాటిని ఇతర పనులకు వాడరు.

అక్క ఇంట్లో ఒక పెద్ద వయసు స్త్రీ ఉండేది. ఆమె గొల్లనో, గోండు స్త్రీయో! అందరూ ఆమెను ‘గొండమ్మా’ అని పిలిచే వారు. నేనూ అలాగే పిలిచేవాణ్ణి. రుచికరమైన వంటలు వండి పెట్టడంలో ఆమె దిట్ట. ఆమెకు నేనంటే చాలా ఇష్టం. ఆమె సృష్టించిన షడ్రుచులను ఆవారం- పదిరోజుల్లో ఎంతగా ఆస్వాదించానో! ప్రతిరోజూ మధ్యాహ్నం తాగడానికి తాజా మామిడికాయలతో షర్బత్ తయారు చేసి ఇచ్చేది. అప్పుడప్పుడు పాయసం వండి పెట్టేది. పెద్దమ్మ ఇంటికి పంపిస్తూ అక్క నన్ను దగ్గరకు తీసుకుని వీడ్కోలు చెప్పేటప్పుడు ఆమె కళ్లు సజలమవటం గమనించిన. గొండమ్మ ముఖంలోనూ అదే ఆర్ద్రహృదయం ప్రతిఫలించింది. “కవిత్వం రాస్తూ చదువును అశ్రద్ధ చేయకు చంద్రా!” హితవు పలికి అక్క నన్ను సాదరంగా పంపింది.

అక్కపట్ల నా మనస్సులో స్థిరపడ్డ ప్రేమాభిమానాల ప్రభావం వల్లనేమో ఆ తర్వాత వరుసగా నాలుగేండ్లు సెలవులు రాగానే అక్క ఊరిలో వాలిపోయేవాణ్ణి. నన్ను చూడగానే ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయేది. తప్పనిసరిగా రెండు రోజులు పెద్దమ్మ దగ్గరకూడా ఆగేవాణ్ణి. ఎప్పటివలెనే ఆ ఇంట్లో వారందరూ నన్ను ప్రేమతో ఆదరించేవారు. అక్కతో చనువు దినదిన ప్రవర్ధమానమవుతున్నది. అక్క ఉదయం ఎప్పుడులేస్తుంది, తెల్లవారక ముందే జరిగే ఆమె దినచర్య ఏమిటో గమనించాలని నాలో కుతూహలం చెలరేగింది. ఒకరోజు రాత్రంతా నిదురపోలేదు. స్నానం ముగించుకుని నాలుగున్నర గంటల సమయంలో అక్క ఒక గదిలోకి ప్రవేశించింది. ముందు రెండు దీపాలు వెలిగించింది. ప్రమిదల్లో కొంచెం నూనె వేసి వత్తులను ఎగదోసింది. కొన్ని పూలు ఎదురుగా ఉన్న విగ్రహాల ముందుంచి దండం పెట్టింది. ఒక చిన్న కర్రపీట మీద కూర్చుని ఒక పుస్తకం నుండి మనస్సులోనే ఏదో పఠిస్తూన్నది. అంతా నిశ్శబ్దంగా ఉన్నది. తలుపుచాటున నిలబడి నేనిదంతా గమనిస్తున్నాను. సుమారు అరగంట తర్వాత పుస్తకం మూసి పక్కనపెట్టి “లోపలికి రా చంద్రా!” అన్నదామె. నాకు చాలా భయమేసింది. లోపలికి వెళ్ళగానే ఒక పీట చూపించి కూర్చోమన్నది అక్క. ఆ తర్వాత ఇంకేమీ మాట్లాడకుండా కళ్లు మూసుకున్నది. దాదాపుగా గంట సమయం నిశ్చలంగా ఉండిపోయింది. ఆ దృశ్యం పుస్తకాల్లో నేను చదివిన ధ్యానముద్రలో ఉన్న ఋషులు, మునులు, తపస్వినులను తలపింపజేసింది. అప్పుడు ఆమె లేచి “వెళ్తాం పద చంద్రా!” అన్నది. నేను లేచి ఆమె పాదాలను స్పృశించి సాష్టాంగ నమస్కారం చేసి ఆమెను అనుసరించిన. అప్పటి నుండి నా మనస్సులో అక్కపట్ల ప్రేమాభిమానాలేగాక, ప్రగాఢమైన భక్తి భావమేర్పడింది.

ఎనిమిదవ క్లాసు నుండి పియుసి పరీక్షలయ్యేదాకా నేను అక్క ఊరికి వెళ్లలేకపోయిన కారణాలనేకం. సెలవుల్లో కూడా బిజీగా ఉండేవాణ్ణి. నాలుగేళ్లు తనను చూడకుండా గడిచిపోయినయా! అనే భావన స్ఫురించగానే మనస్సు చివుక్కుమన్నది. వెంటనే బయలుదేరి సరాసరి వాళ్ల ఊరికే చేరుకున్నా! కాని ఆమె అక్కడలేదు. నాలుగు క్రోసులు నడిచి పెద్దమ్మ ఊరికి వెళ్లిన. అక్క పాదాలకు ప్రణమిల్లి ఒక నిముషం అట్లాగే ఉండిపోయిన. “చంద్రా!” అంటూ నన్ను లేపి కళ్లు తుడిచి నా నుదుటిమీద ముద్దుపెట్టింది. ఆమె నయనాలూ సజలమయినవి. పెద్దమ్మ విస్తుపోయి చూస్తున్నది. ఆమె పాదాలకూ నమస్కరించి నిలబడ్డ. “కూర్చో చంద్రా!” అని ఓ కుర్చీమీద నన్ను కూర్చుండబెట్టి తానూ కూర్చున్నది. లాలనగా నా చేతిని నిమురుతూ చాలా సేపు పరధ్యానంగా ఉండిపోయింది. పెద్దమ్మ అప్పటికే లోపలికెళ్ళిపోయింది. అక్క పెట్టిన ఆ ముద్దు నా జీవితంలో ఓ మధురానుభూతి అయి, చిరస్థాయిగా నిలిచిపోయింది. పరిపూర్ణ ఆప్యాయతానురాగాలతో ఎవరైనా నాకు పెట్టిన మొదటి ముద్దు అదే. రెండు రోజుల తర్వాత అక్కా, నేనూ వాళ్ల ఊరికి వెళ్లినం. వారంరోజులు హాయిగా గడిచిపోయినవి.

ఒకసాయంకాలం. అక్క బాగా అలసిపోయి ఉన్నది. తొందరగా భోజనాలు ముగించుకున్నాం. అక్క విశ్రాంతి తీసుకుంటున్నది. గొండమ్మ ఆమె కాళ్లు ఒత్తుతున్నది. సంకోచిస్తూనే అక్క గది ఎదుట నిలబడి “అక్కా!” అని పిలిచిన. “రా చంద్రా!” అని తలగడ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోమన్నది. నా నిశ్శబ్దం గమనించి, “చంద్రా! ఏదో చెప్పాలనుకుంటున్నవు. ఫరవాలేదు చెప్పు” అన్నది. అప్పటికీ నేను నోరువిప్పలేదు. “గొండమ్మ ఉంటే ఫర్వాలేదు. నాకు ఆమె పరాయిది కాదు. నిస్సంకోచంగా చెప్పు” అని భరోసా ఇచ్చింది అక్క.

“అక్కా! నీకో కథ చెప్తా, వింటావా?” “కథనా?” “ఔను.”

“చదువుతున్నవా, కథలే రాస్తున్నవా?” “లేదక్కా! ఇది నిజమైన కథే!” “ఔనా? అయితే చెప్పు”.

“మా పొరుగూర్లో ఒక పెద్దమ్మ (అమ్మకు స్వంతక్క) ఉంటుంది. నాకు ఊహతెలిసినప్పటి నుండి ఆ ఊరికి తరచుగా వెళ్తున్న శీతాకాలపు సెలవుల్లో అయితే తప్పనిసరిగా పెద్దమ్మ ఇంటితో పాటు అక్కడ ఇంకో మూడు నాలుగిండ్లు ఉంటవి. ఊరికి కొంచెం దూరంగా. చుట్టూ పొలాలు, మొక్కజొన్న చేండ్లు, మిరపతోటలూ, వాటికి నీళ్లు పారించడానికి మోటలు కొడ్తూ రైతులు. ఆ పరిసరాలంటే నాకు బాగా ఇష్టం. అక్కడ నన్ను నేను మరచిపోతా!” అక్కడ ఇంకో విశేషమున్నది. అందుకే నేనెప్పుడూ అక్కడికి పోవడానికి ఇష్టపడేవాణ్ణి.”

అక్క ధ్యాసను పరిశీలించడానికి కొద్దిసేపు చెప్పటమాపిన.

“ఏమిటి చంద్రా అది?”

“అక్కడ ఉన్న ఒక అక్క వరుసకు అక్కే, వాళ్ళు పెద్దమ్మకు పాలివాళ్లే. నాకు తెలిసినప్పటి నుంచీ తను అక్కడే ఉన్నది. అక్కచాలా అందగత్తె. రూపురేఖలు, రంగు అన్నీ అచ్చంగా నువ్వే! ఎప్పుడూ తెల్లని మెరిసిపోయే దుస్తుల్లోనే ఉండేది. ఎందుకట్లా ఉండేదో తర్వాత తెలిసివచ్చింది నాకు. చిన్నతనంలో పెళ్లయింది. కొద్దికాలంలోనే భర్త చనిపోయినడు. అప్పటి నుండి అక్క తల్లిగారింటనే ఉంటూన్నది. పెద్దమ్మా, పెద్దనాన్న అన్నలు, వదినలూ అందరికీ ఆమె పట్ల గారాబమే. వాళ్లందరూ మంచివారు. మర్యాదస్తులు. వాళ్ల వ్యవసాయము కూడా పెద్దదే. పెద్ద ఇల్లు. దానికి చాలా పెద్దవాకిలి. మా పెద్దమ్మ ఇల్లు వాళ్లకు మరీ దగ్గరగా ఉంటుంది. నా మాట వినపడితే చాలు, అక్క పరుగెత్తుకుంటూ వచ్చి నన్ను వాళ్లింటికి తీసుకెళ్లి కూర్చోబెట్టేది. వెంటనే ఏదో ఒకటి తినడానికి తెచ్చేది. కాదు అనేటందుకు లేదు. తినవలసినదే. నేనంటే ఆ ఇంట్లో అందరికీ ఇష్టమే. ఇల్లంతా కలియతిరిగేవాణ్ణి.

“నేను నాలుగేండ్లు ఇక్కడికి రాలేదు కదా! కాని అక్కడికి ఆ ఊరికి మాత్రం వెళ్ళేవాణ్ణి. దగ్గరేకదా! చలికాలపు సెలవుల్లో సంక్రాంతి సందర్భంలో వెళ్ళేవాణ్ణి. ఈ సంవత్సరం ఎప్పటివలెనే జనవరి నెలలో వెళ్ళిన. అంతకుముందుటిసారి అక్కను చూసి ఒక సంవత్సరం గడిచిపోయింది. అందుకే వెంటనే ఆమెను చూద్దామని వాళ్ళింటికి పరుగెత్తిన. ఎక్కడా అక్కజాడ లేదు. ఎవరూ నాతో మాట్లాడలేదు. అక్క అల్లరితో ఎప్పుడూ సందడిగా ఉండే ఆ ఇల్లు మూగబోయింది. చిన్నబుచ్చుకుని పెద్దమ్మ ఇంటికి తిరిగివచ్చిన. తనూ ఏమీ చెప్పలేదు. నాలో బాధా, భయమూ, దుఃఖమూ భరించలేకుండా పోయినవి. అక్కడికి కొంచెం దూరంలో ఉండే ఒక అత్త ఇంటికి వెళ్లిన.

‘అది ఎక్కడికిపోయిందో ఎవరికీ సరిగా తెలువదు. కానీ, ఓ పుకారుపుట్టింది. కత్తులూ, చాకులూ, వంటింటి సామాన్లు ఊరూర తిరిగి అమ్ముకునే ఒక అబ్బాయితో వెళ్లిపోయిందని. ఆ తర్వాత ఆమె ఆచూకీ తెలియరాలేదు. ఊళ్లో అందరూ మీ పెద్దమ్మ కుటుంబాన్ని మాత్రం వెలివేసిండ్రు. ఒకప్పుడు మంచి పేరు, మర్యాదలు గల కుటుంబం’ అని ఆ అత్తనిట్టూర్చింది. నాకు ఏడ్చినంత పనయింది. కాని అత్తముందర కష్టంమీద నిభాయించుకున్న. అత్త చెప్పిందాన్ని బట్టి అక్క బాల వితంతువు, ఆమెకు సంసార సుఖమేమిటో తెలియదు. అత్త దగ్గర సెలవు తీసుకుని బరువెక్కిన హృదయంతో పెద్దమ్మ ఇంటికి తిరిగి వచ్చిన. ఇక అక్కడ ఉండాలనిపించలేదు. ఆ సాయంత్రమే మా వూరికి వెళ్ళిపోయిన. క్రమంగా దుఃఖం, బాధా తగ్గి నా హృదయంలో అక్కపట్ల గాఢమైన సానుభూతి చోటుచేసుకొన్నది. ఆమెపట్ల ఆదరభావం ఇంకా ఎక్కువయింది, క్లుప్తంగా ఇది ఆ కథ అక్కా!” అని కళ్లు మూసుకొన్న. నా హృదయం ఆవేదనతో నిండిపోయింది.

అక్క మృదువుగా నాకుడిచేతిని నిమురుతున్నది. “బాధపడకు చంద్రా!” “అక్కా! చిన్నక్క చేసినపని తప్పా?” అక్క సమాధానం చెప్పలేదు. “అక్కా! నువ్వు ఏదో ఒకటి చెప్పేదాకా నా మనస్సు కుదుటపడదు”. ఆమె దీర్ఘాలోచనలో పడిపోయింది. తర్వాత “ఒకరి జీవితానుభవాలు, వాళ్ల నిర్ణయాలు, వాళ్ళబతుకులమీద తీర్పులు చెప్పటానికి మనమెవరం?” అన్నది. ఆ సమాధానంతో నేను తృప్తిపడలేదు. అప్పుడు నేనన్నాను, “చిన్నక్క మీద నాకు ఏ ఆక్షేపణా లేదు, కాని ఈ లోకులు ఆమె కుటుంబం పట్ల ప్రవర్తించే తీరు సహింపరానిది. వారి పరిస్థితిని తలచుకుంటే బాధగా ఉంటుంది.”

“తమ్ముడూ! నువ్వు సున్నిత మనస్కుడవు. కానీ ఇలాంటి లోకంలోనే నువు జీవిస్తున్నానని గ్రహించు!” అక్క నుండి వచ్చిన ఈ సమాధానమూ, లేదా సందేశము నన్ను సంతృప్తిపరచలేదు.

ఆ రాత్రి చాలాసేపు నాకు నిద్రపట్టలేదు. చివరకు ‘చిన్నక్క నా ఆదర్శం. ఆమె ఈ యుగ స్త్రీ. జీవితాన్ని ప్రేమిస్తుంది. సాహసి, యథాలాపంగా ఓటమిని అంగీకరించదు. ఈ పెద్దక్క నా ఆరాధ్యదైవం. ఆమె జీవితాన్ని ఒక ద్రష్టగానే దర్శిస్తుంది. ఆమె పూర్వయుగాల స్త్రీ. ఉన్నదున్నట్లుగా జీవితాన్ని అంగీకరించడమే ఆమె నైజం. ఇద్దరూ ప్రేమైక జీవులే! ఇద్దరినీ నేను సమంగా ప్రేమిస్తాను’ అని నా మనస్సు తీర్మానించింది.

కాలగమనంలో 30 ఏళ్లు గతించిపోయినవి. ఒకరోజు ఇంట్లో ఫోన్ మోగింది. ఎవరిదో అపరిచిత గొంతు. ‘అక్క ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆమె నన్ను చూడాలని కోరుకుంటూన్నది. నా కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నది’ అని అతడు చేరవేసిన సమాచారం. ఇంత సుదీర్ఘకాలం అక్కను దర్శించుకోనందుకు మనస్సు అనంతమైన దుఃఖంలో మునిగిపోయింది. కారణాలేమైనా కావచ్చు. అవాంతరాలెన్నైనా ఎదురయి ఉండవచ్చు. ఇన్నేళ్లు అక్కను చూడకపోవటం క్షంతవ్యం కాదు అని నన్ను నేను నిందించుకున్నాను. ఏవో కొన్ని సెలవులు కలుపుకుని వారంరోజులకోసం బయలుదేరినం. నేనెంతగానో ప్రేమించిన అక్క అని విని ఉన్నారు కాబట్టి నా శ్రీమతి, ఇద్దరు పిల్లలు కూడా ఆమెను చూడాలనే కుతూహలంతో ఉన్నారు. ఆ ఏడే కొత్తగా కారు కొన్నాం. అందరమూ కలిసి ఒక ఉదయం బయల్దేరి సాయంకాలానికల్లా అక్క ఊరు చేరుకున్నాం. ఆమె ఇల్లు సమీపించేకొద్ది నాలో ఆందోళన అధికం కాసాగింది. వాకిట్లో ప్రవేశించి ఓ పక్కనున్న పెద్ద చేదబావి గచ్చుపళ్లెంలో ఉంచిన గంగాళంలోని నీళ్లతో కాళ్లు చేతులు కడుక్కుని లోపలికి ప్రవేశించినం        

అక్క తన గదిలో పడుకునే ఉన్నది. పడకచెంతనే ఉన్న కుర్చీలో కూర్చుని ఆమె కుడిచేతిని నా రెండు చేతుల్లో తీసుకుని ‘అక్కా!’ అని పిలిచిన. కళ్లుతెరిచి నన్ను చూడగానే, “వచ్చినవా చంద్రా! ఈ అక్కను చూడకుండా ముప్పయ్యేండ్లు ఎట్లా ఉండగలిగినవు? నన్ను పూర్తిగా మరచిపోయినవు!” అని వెంటనే తనకు ఎదురుగా కూర్చుని ఉన్న నా శ్రీమతి నుద్దేశించి, “అక్కా! అక్కా! అని నన్ను నోటినిండా పిలిచే నా తమ్ముని పిలుపు ముప్పయ్యేండ్లు మూగబోయింది. ఊహించగలవమ్మా!” అని ఆమె వంకచూసింది. ఆమె తనను సమీపించి, ‘వదినా!’ అని ఇంకా ముందుకు మాట్లాడలేకపోయింది. “నన్ను క్షమించక్కా!” నా కళ్లు వర్షించసాగినవి. “గడచిన దానికి బాధపడకు. ఇప్పుడొచ్చినవుగదా! అది చాలు”. ఆమె కళ్లు సజలమయినవి. ఇద్దరు పిల్లలను పిలిచి ముద్దుపెట్టుకొన్నది. అక్క శరీరం బాగా శుష్కించి చాలా నీరసంగా ఉన్నది. ముఖం క్షీణచంద్రుని తలపిస్తున్నది. గాంభీర్యం స్థానే ముఖంలో కరుణ, ప్రేమ స్పష్టంగా ప్రస్ఫుటమవుతున్నవి. అక్క ఇంట అయిదు రోజులున్నం. పెద్దమ్మ అప్పటికే కాలం చేసిందని తెలిసింది. ఆ ఊరికి వెళ్లటం విరమించుకున్నం. మా నలుగురి రాకతో అక్క ఇంట్లో సందడిగా ఉన్నది. మా రాకవల్ల కలిగిన ఆనందమో, ఇంట్లో నెలకొన్న కొత్తవాతావరణం వల్లనో అక్క ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతున్నది.

నాల్గవరోజు నుండి మంచంలో నుండి లేచి ఇంట్లో తిరుగాడుతున్నది. చిన్న కచ్చడంలో పిల్లలను తీసుకుని పొలాలు చూపించుమని ఒక పాలేరును ఆదేశించింది. దగ్గరలోనే ఉన్న గోదావరి నదీజలాలతో సయ్యాటలు, పొలాలు, తోటలు చూడటంతో వాళ్లు తమ సమయాన్ని చాలా ఉల్లాసంగా గడిపినరు.

రేపు ఉదయం మేము మా వూరికి బయలుదేరుతామనగా ఆ ముందురాత్రి భోజనాల తర్వాత అక్క తన గదిలో నన్నొక్కణ్ణి కూర్చోబెట్టుకొని చాలా సేపు మాట్లాడింది. చివరగా తను పడుకున్న మంచానికి మరీదగ్గరగా నన్ను కూర్చోబెట్టుకున్నది.

“తమ్ముడూ! చంద్రా! నీతో చెప్పాలనుకొంటున్న నా ఆంతరంగిక జీవితానికి సంబంధించిన అత్యంత గోప్యమైన విషయం ఒకటున్నది. అది ఇప్పటిదాకా నా మదిలోనే దాచిపెట్టుకున్న ఒక రహస్యం. ఎవరికీ తెలియని రహస్యం. ఎవరితోనూ పంచుకోవడానికి భయపడిన రహస్యం. సానుభూతితో దాన్ని జీర్ణించుకుని సాంత్వన చేకూర్చే ఆర్ద్రహృదయంగల వ్యక్తి నాకింతదాకా తటస్థపడలేదు. కాని ఆ రహస్యం, దాన్ని ఎప్పుడూ అంటిపెట్టుకుని నా మనస్సును నిరంతరం కలవరపరిచే ఓ భావన నా హృదయంమీద పెద్ద గుదిబండలాగా మారినవి. జీవితాంతం నేనా భారాన్ని మోయలేను. ఇప్పటికి దానికి పరిష్కారం దొరికిందని అనిపిస్తున్నది.

“నువ్వు నాకు అత్యంత విశ్వసనీయుడవు. నా మీద ఉన్న నీ ప్రేమాభిమానాలు నిర్మలమైనవి. స్వార్థరహితాలు. ఇంకో విషయం కూడా విను! స్త్రీల జీవితాలు, వారి ఆవేదనలు, ఆకాంక్షలను వారి హృదయాలలోనికి చొచ్చుకునిపోయి వాటిని ఆకళింపు చేసుకుని స్పందించే అర్ద్ర హృదయం నీది. అందుకే ఈ అక్క తన అంతరంగాన్ని ఇన్నాళ్ళూ క్షోభపెడుతున్న ఆ జీవిత రహస్యాన్ని నీ ముందర విప్పి తన హృదయాన్ని తేలికపరుచుకోవాలని నిశ్చయించుకున్నది. అందువల్లనే, ఇన్నేళ్లయినా నీమీద ఉన్న సడలని నా విశ్వాసంతోనే నిన్ను నా దగ్గరకు రప్పించిన!” అక్క కొంచెం సేపు మౌనంగా ఉండిపోయింది.

“ఏమిటక్కా అది? నిరంతరంగా నీ మనశ్శాంతిని భగ్నంచేసి నిన్ను వేధిస్తున్న సంఘటన ఏమిటక్కా! ఈ తమ్ముడు నీ విశ్వాసాన్ని ఎప్పటికీ వమ్ముచేయడు. నీ గుండెమీది భారం దిగిపోతుందనుకుంటే ఆ రహస్యమేమిటో చెప్పక్కా!” అన్నాను.
“ఆ గుప్త విషయం తెలిసి అక్క పట్ల ఇంతవరకున్న నీ అభిప్రాయాన్ని మార్చుకుంటావో, నీ భక్తి ప్రపత్తులు చెదిరిపోతాయో నాకు తెలియదు. కాని ఒక్కటిమాత్రం గట్టిగా నమ్ముతా! తమ్ముడు నాకెప్పుడూ దూరంకాడు. నా పట్ల తనకున్న ప్రేమ ఏమాత్రమూ అస్థిరమవదు.”

“అక్కా! నీ ఈ తమ్ముడు ఎప్పటికీ నువ్వు మొదటిసారిగా చూసిన ఆ ఎనిమిదేండ్ల ముద్దుల కుర్రవాడే. నా అక్కపట్ల హృదయంలో ఆనాడు ఏ భక్తి, ఆరాధనా భావాలు చోటుచేసుకున్నవో అవి చిరస్థాయిగా నిలిచి ఉంటవి. చెరగని నా అక్క మమతానురాగాలను నేనెప్పటికీ వదులుకోను.”

“ఇక అసలు విషయం విను చంద్రా! తన జీవితంలో ఏ పరిస్థితిని నీ చిన్నక్క ఎదుర్కొన్నదో, అచ్చంగా అదే పరిస్థితి నా జీవితంలోనూ తటస్థపడింది. దాని మూలంగా నా మనస్సులో కొంతకాలం పెద్ద సంఘర్షణే జరిగింది. నీ చిన్నక్క సంఘాన్ని ధిక్కరించింది. స్వతంత్రించి తన జీవిత గమ్యాన్ని తానే ఎన్నుకొన్నది. విజేతగా నిలిచింది. నువ్వు చెప్పినట్లుగా ఆమె గొప్ప సాహసి!

“ఇక ఈ అక్క! సమాజానికి తలవంచింది. దాని క్రూర దుర్నీతిని ఎదుర్కొనే సాహసం లోపించి ఓడిపోయింది. రాజీపడి జీవిస్తున్నది. ఇదీ నీ ఆరాధ్యదైవం నీ అక్క నిజమైన అస్తిత్వం!” అని ఆగిపోయింది. అక్క నయనాల నుండి ఉబికిన అశ్రువులు ఆమె చెక్కిళ్ల మీదుగా జారిపడుతున్నవి. నేను వెంటనే లేచి కన్నీళ్లు తుడిచి అక్క రెండు చేతులను నాచేతుల్లోకి తీసుకుని సున్నితంగా నిమురుతున్నా. అక్క నా నుదుటిని చుంబించి, “సదా సుఖసంతోషాలతో వర్ధిల్లు! తమ్ముడూ” అని ఆశీర్వదించింది.

తిరుగు ప్రయాణమంతా ఒకే ఒక భావన ఎడతెరిపి లేకుండా నా మనస్సును కలవరపరచసాగింది: ‘సభ్యసమాజం’- దాని దుష్టనీతి, పక్షపాతబుద్ధి! ఎందరక్కల జీవధారలను శోషించి అర్ధంతరంగానే శుష్కకుహరాలుగా మార్చి వేస్తున్నవో కదా!’

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us