మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కథలు

ఒకే తాను ముక్కలు

by Sheela Subhadra devi September 20, 2023
written by Sheela Subhadra devi

”టీచర్‌ టీచర్‌! ఇందాకటిసంది యాదగిరి క్లాసుల ఒర్రుతుండు టీచర్‌” అయిదో క్లాసు పిల్లలిద్దరు పరుగుపరుగున అరుంధతి దగ్గరికి వచ్చారు.

అప్పుడే అదే క్లాసునుండి బెల్‌ అయిందని స్టాఫ్‌ రూముకి వచ్చిన అరుంధతి గుండె దడ దడ లాడుతుండగా పరుగున మళ్ళీ ఆ క్లాసుకి వెళ్ళింది. టీచర్‌ రాగానే క్లాసంతా గప్‌ చిప్‌ అయిపోయారు. అరుంధతి క్లాసంతా కలయచూసింది. మామూలుగానే ఉంది. తనని పిల్చుకొచ్చిన పిల్లల్ని ”యాదగిరి ఎవరు?” అని అడిగింది అరుంధతి.

వాళ్లు చూపిన వైపు చూస్తే ఒక పిల్లాడు లేచి నిల్చుని ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు.

అంతలో ఆ పీరియడు టీచరు సావిత్రి గుమ్మం దగ్గర నిలబడి ”ఇంకా క్లాసులో పాఠం కాలేదా అరుంధతీ?” అంటూ వచ్చింది.

తానెందుకు పరుగున మళ్ళీ రావాల్సివచ్చిందో చెపుతూ ”యాదగిరి ఒర్రుతుండని పిల్లలు పిలుస్తే వచ్చాను” అని చెప్పి గుమ్మం బైటికి వచ్చి ‘ఒర్రటం అంటే?’ రహస్యంగా మెల్లగా అడిగింది అరుంధతి.

సావిత్రి నవ్వి ”అరవటం…” అంది.

”హమ్మయ్య, ఇంకేమిటో అనుకున్నాను” అరుంధతి కూడా నవ్వుతూ వెళ్ళిపోయింది.

వివాహం అయ్యాక హైదరాబాదులో అడుగుపెట్టిన అరుంధతి ఇంకా అక్కడి తెలుగు నుడికారానికి అలవాటుపడలేదు.

స్టాఫ్‌ రూముకి వచ్చి పుస్తకాలు దిద్దటానికి తీసి ఆలోచనలో పడింది.

అరుంధతికి అకస్మాత్తుగా చిన్నప్పటి స్కూల్లోని హిందీ టీచరు గుర్తుకొచ్చారు. మిగతా సబ్జెక్టుల మీదున్న శ్రద్ధ రెండో భాషగా ఉన్న హిందీ భాష మీద పెట్టటం లేదని విద్యార్థులని కోప్పడుతూ ఉండేవారు.

ఒకరోజు ఆమె కోపం తారాస్థాయికి చేరి ”మీరు పెద్దయ్యాకో, పెళ్ళయ్యాకో ఏ బొంబాయో, ఢిల్లీయో వెళ్తే అక్కడ భాష రాక యిబ్బంది పడతారు, కాస్త శ్రద్ధ పెట్టి నేర్చుకోండి” అని క్లాసులోని అందర్నీ తిట్టారు.

దానికి ఆడపిల్లలందరూ ‘అంతదూరం వెళ్ళే అవకాశం కానీ, అవసరం కానీ మాకురాదు’ అని చిన్నగా అనుకుంటూ నవ్వుకున్నారు.

అది గుర్తొచ్చిన అరుంధతి, స్టాఫ్‌ రూములోని టీచర్లతో చెపుతూ ”ఆవిడ అన్నట్లే నేనొచ్చి హైదరాబాదులో పడడమే కాకుండా, ఈ స్కూల్లో ఉద్యోగం వచ్చింది. అప్పుడు తధాస్తు దేవతలు ”తథాస్తు తథాస్తు’ అన్నట్లున్నారు” అంటూ నవ్వింది. అక్కడున్న టీచర్లు కూడా అరుంధతి మాటలకు పడీ పడి నవ్వారు.

ఉపాధ్యాయ శిక్షణ అనంతరం మొట్టమొదట చేరిన స్కూలు ఇది. అందులో ఎక్కువమంది ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా మైనారిటీ వర్గానికి చెందినవారు. అంతేకాక విద్యార్థులు చాలావరకూ శ్రామిక, కార్మిక వర్గానికి చెందినవారు. దాంతో అరుంధతికి భాష ప్రధాన సమస్య అయిపోయింది.

కొత్తగా చేరటంవలన అన్నీ ప్రాథమిక తరగతులు కేటాయించటం మూలాన క్లాసులో తాను చెప్తున్న పాఠం పిల్లలు అర్థం చేసుకోగలుగుతున్నారో లేదో అని బెంగ పట్టుకునేది.

అరుంధతితోబాటే ఉద్యోగంలో చేరిన సావిత్రి ఆమెకు కొంత సహాయకారిగా ఉంటూ ఉండేది.

ఒకరోజు అరుంధతి మూడో తరగతి క్లాసుకి వెళ్ళింది. క్లాసుకి క్రమం తప్పకుండా వచ్చే రాజు ఆ రోజు రాకపోవటం చూసి క్లాసులో పిల్లల్ని ప్రశ్నించింది ”రాజు రాలేదెందుకని”.

అంతలో మెల్లగా నడుచుకొంటూ, చొక్కా అంచుతో కళ్ళు తుడుచుకొంటూ వచ్చాడు రాజు.

”ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు?” అని గద్దించింది అరుంధతి.

రాజు తలదించుకొని ”మా నాయన పన్లో పోయిండని అమ్మ నన్ను ఇంట్లనే ఉండి చెల్లిని జర చూస్తుండమని, ఇస్కూలుకి ఎళ్లొద్దని అంది టీచర్‌. నేనే ఇస్కూలు పోతానని వచ్చేసిన” అన్నాడు మధ్యమధ్యలో వెక్కిళ్ళు పెడుతూనే.

”అయ్యో, ఎందుకు వచ్చావు. ఇంట్లో ఉండకపోయావా” కంగారుగా అంటూ ఏంచేయాలో తోచక పక్క క్లాసులోనే ఉన్న సావిత్రిని పిలిచింది ”సావిత్రీ! రాజు వాళ్ళ నాన్న పోయాడని, వాళ్ళమ్మ ఇంట్లో ఉండమంటే వచ్చేసానని చెపుతున్నాడు రాజు. ఏం చెయ్యాలి” అంది.

సావిత్రి కూడా వచ్చి రాజుని ప్రశ్నించింది ”ఏందిరా మీ నాన్నకేమయింది?” అని.

”ఏంకాలే టీచర్‌. మా నాయన పన్లోకి పోయిండు. మాయమ్మ ఏడకో పోవాల్నంట. ఇస్కూలు మాని చెల్లిని చూసుకోమనె. ఇస్కూలుకి పోతనంటే మాయమ్మ తిట్టింది” అన్నాడు రాజు.

సావిత్రి నవ్వుతూ ”ఇలా ప్రతీదానికీ కంగారు పడ్తావేంటి అరుంధతీ! రాజు నాన్న పనిచేయడానికి వెళ్ళాడట” అంది.

”అంతేనా! ఇంకా నేను ఇక్కడి యాసకు అలవాటుపడలేదు. అందుకే కంగారుపడ్డాను” అంటూ సిగ్గుపడింది అరుంధతి.

అప్పటినుండి విద్యార్థులు మాట్లాడుతున్నంతసేపూ ప్రతి పదాన్ని జాగ్రత్తగా గమనించసాగింది అరుంధతి.

పాఠం చెపుతున్నపుడుకూడా వాళ్ళని పదే పదే పాఠానికి చెందిన ప్రశ్నలు వేసి, వాళ్లు తన మాటల్ని అర్థం చేసుకొనేవరకూ ఆగి జవాబుల్ని వినేది.

వింటున్నకొద్దీ తెలుగులోని ఆ ప్రాంతీయ యాస సొబగు అరుంధతికి అర్థం కాసాగింది. అంతేకాదు తానుకూడా విద్యార్థులతో వాళ్ళ యాసలోనే మాట్లాడడానికి ప్రయత్నించేది. అంతేకాక విద్యార్థులతో మాట్లాడుతూనే హిందీ ఉర్దూ పదాలు కూడా మెల్లమెల్లగా నేర్చుకోవటం మొదలుపెట్టింది.

విద్యార్థులుకూడా తన ప్రాంత యాస పదాలు వారికి కొత్తగా అనిపించి పదే పదే అర్థంకాక ప్రశ్నించేవారు. మొదట్లో ఎంత స్పష్టంగా వివరించి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోకపోవటం చికాకై విసుక్కొనే అరుంధతి, రాను రాను స్వీయ అనుభవంతో తనను తాను మెరుగుపరచుకొంది.

వాళ్ళ ప్రాంతీయతను తాను మరోలా అర్థం చేసుకొన్నట్లే తన ప్రాంత యాసా వారికీ వింతగా తోస్తుందనేది అనుభవ పూర్వకంగా అర్థమైంది అరుంధతికి.

ఆ నెల జీతం అందుకుని తన సహ ఉపాధ్యాయినిలు ఫాతీమా, సావిత్రిలతో కలిసి షాపింగుకు వెళ్ళింది అరుంధతి.

కొత్తగా వెలసిన ఆ పెద్ద షాపు ఆశ్చర్యంగా అనిపించింది అరుంధతికి. అందులో తానులు తానులుగా ఉన్న వివిధ డిజైన్లను చూసి వాటిని చీరలుగా తీసుకుంటే ఎలా ఉంటుందని స్నేహితురాళ్ళు ముగ్గురూ అనుకున్నారు.

అది విని సేల్స్‌ గర్ల్‌ అవే తానులతో కుట్టిన డిజైనర్‌ డ్రస్సులను తీసి చూపించింది. దాంతో లంగా వోణీలు, చీరలు, చుడీదార్లు కూడా డిజైన్‌ చేసుకోవచ్చు అనే అంశం ఆ ముగ్గురికీ చాలా నచ్చింది.

వెంటనే సావిత్రి తనకోసం చీరకి సరిపడినంత కొలిపించి తీసుకుంది. అరుంధతి తమ ఊరులో ఉన్న చెల్లెలికి లంగా వోణీకోసం కత్తిరింపించి తన చెల్లెలు కూడా తనంత పొడుగు ఉంటుందని చెప్పి అక్కడే ఉన్న టైలరుకి కొలతలు ఇచ్చింది. ఆ రంగు డిజైను నచ్చిన ఫాతీమా తనకికూడా అదే తానునుండి పంజాబీ డ్రస్సుకి సరిపడా ఇవ్వమని కొని అదే టైలరుకి కుట్టించటానికి యిచ్చింది.

అందరం ఒక తాను నుండే విభిన్న దుస్తులుగా రూపొందించటానికై అనుకోకుండా తీసుకోవడం గమనించి ప్రాంతాలు, భాషలు, యాసలు వేరైనా అందరం ఒక తాను ముక్కలమే అనుకుంది అరుంధతి. ఈ ఏకతా సూత్రాన్ని విద్యార్థులకు నేర్పవలసిన వారమూ మేమే అని మనసారా తలంచుకొంది.

ఆ అనుభూతిని దాచుకోలేక స్నేహితురాళ్ళ ముందు బయటపెట్టింది అరుంధతి. ‘అవును నేనూ అదే అనుకున్నాను’ అని ఫాతీమా, సావిత్రీ అనేసరికి ఆత్మీయంగా ఒకరి చేతులు ఒకరు కలుపుకుని నిండుగా నవ్వుకున్నారు.

(తెలుగు విద్యార్థి సౌజన్యంతో)

September 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

కుక్క విశ్వాసం

by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, September 15, 2023
written by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,

           గోదావరి నది పొంగి  ప్రవహిస్తోంది.   ఆ నదిలో ఒక కుక్క ఒకటి కొట్టుకొని వచ్చింది.   దానికి ఈత వచ్చు.   ఆ ప్రవాహ వేగంలో అది కొట్టుకొని వచ్చి దిగువన ఉన్న ఒక గ్రామానికి చేరింది.   అది ఆ గ్రామంలోకి ప్రవేశించింది .  ఆ కుక్కను చూసి ఇతర కుక్కలన్నీ వెంబడిపడి మొరగడం ప్రారంభించాయి .  అయినా అది వాటిని లెక్క చేయలేదు. ఆ తర్వాత అది ఒక ఇంటిలోనికి ప్రవేశించింది .  ఆ ఇంటి యజమాని చాలా దయార్ద్ర హృదయుడు.   వెంటనే అతడు ఆ కుక్కకు ఆహారం పెట్టాడు.  అది తిన్న కుక్క ఆ యజమాని ఇంటి బయటనే ఉండసాగింది.

         ఒకసారి ఆ యజమాని తన కుటుంబంతో సహా ఒక ఊరుకు వెళ్లాడు .  ఆ కుక్కను ఇక్కడనే ఉంచిపోయాడు.   ఆ సమయంలో ఒక పెద్ద త్రాచుపాము వారి ఇంటిలోనికి దూరడానికి ప్రయత్నించింది.   ఇది గమనించిన   ఆ కుక్క  మొరుగుతూ ఆ త్రాచు పామును అడ్డుకుంది .  ఆ కుక్కకు భయపడిన   ఆ  త్రాచుపాము దూరంగా ఉండి ఆ ఇంటిలోనికి ఎలాగైనా ప్రవేశించాలని తాపత్రయపడింది .  కానీ ఆ కుక్క ముందు దాని ఆటలు సాగలేదు.  

         ఇంతలో ఆ  ఇంటి యజమాని  ఊరినుండి వచ్చాడు.   ఆ కుక్క ఎందుకు మొరుగుతున్నదోనని అతడు చూశాడు.  అక్కడ అతనికి ఒక విష సర్పం తన ఇంటిలోనికి ప్రవేశించడానికి  చేస్తున్న ప్రయత్నాన్ని  చూశాడు.   దానిని కుక్క అడ్డుకుంటున్న సంగతి కూడా గమనించాడు .  అది చూసి వెంటనే అతడు పాములు పట్టే వ్యక్తిని పిలిపించాడు.   అతడు ఆ పామును పట్టుకొని ఒక సీసాలో  బంధించాడు.  తర్వాత  ఆ యజమాని ఇచ్చిన డబ్బును తీసుకొని దాన్ని తీసుకుని వెళ్లి దూరంగా అడవిలో వదిలిపెట్టాడు.  

   మరొక్కసారి యజమాని, ఆయన భార్యా పిల్లలు అర్దరాత్రి నిద్రలో ఉన్నారు.  అప్పుడే కొందరు దొంగలు వారి ఇంట్లో ప్రవేశించి వారు  ఉన్న గది తలుపు  బయట గడియ పెట్టి వారి ఇంటిలోని డబ్బు, బంగారం దోచుకెళ్లారు. ఈ సమయంలో ఆ కుక్క ఎక్కడికో వెళ్లింది.  ఇంతలో ఆ యజమాని కి తెలివై బిగ్గరగా ” దొంగలు, దొంగలు”  అంటూ కేకలు వేశాడు.  ఆయన వేసిన ఆ కేకలకు ఆ వీధిలోని వారు మేల్కొని వారి ఇంటికి వచ్చి తలుపు గడియ తీశారు. అప్పటికే ఆ దొంగలు పారిపోయారు.  వారి బీరువా తలుపులు తెరచి ఉన్నాయి.  అప్పుడు యజమానికి తన కుక్క ఏమైందని జ్ఞాపకం వచ్చింది.  వెంటనే అతడు ఇరుగు పొరుగు వారితో “నా కుక్క కనిపించిందా !”అని అడిగాడు. వారు లేదని చెప్పారు.  వెంటనే ఆ యజమాని కుక్క కొరకై బయటకు వచ్చి చూశాడు. అప్పుడే ఎక్కడినుండి యో  వస్తున్న ఆ కుక్క నోటిలో ఒక డబ్బు, నగల మూట కనిపించింది.  అది తీసుకుని విప్పి చూశాడు. అది తన బంగారం, డబ్బులే.  ఆ యజమాని  జరిగినది ఊహించాడు.  ఇరుగు పొరుగు వారికి తన కుక్క ఆ దొంగల వెంటబడి  వారిని తరిమి తన బంగారం, నగదును పట్టుకుని తెచ్చిందని చెప్పి సంబరపడ్డాడు. ఇరుగు పొరుగు వారు ఆ కుక్క చేసిన పనికి ఎంతగానో  సంతోషించారు.   తర్వాత ఆ ఇంటి యజమాని తను  పెట్టిన ఆహారం తిని తన పట్ల తన కుటుంబం పట్ల విశ్వాసం చూపిన ఆ కుక్కను ప్రేమతో దాని తలపై నిమిరాడు. 

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నాదేహమే దేశం!

by సుదర్శనం వేణుశ్రీ. September 15, 2023
written by సుదర్శనం వేణుశ్రీ.

నాదేహ దేశ హృదయ కవాటాలు
మూసుక పోతున్నాయెందుకో
ఎంతతట్టినా మోడిన చెట్టు
చిగురించని హృదయ స్థితి
నిద్రలో నిజాలను జోకట్టాలన్న
మెల్కుంటునే మనసు చిద్రమై
పెదవులు కదపని స్థితి యేంటి
ఈదేహం నాదేనా?
నిశ్కర్షగా మాట్లాడితే ద్రోహులగొంతని
నాస్వదేహదేశము నిబంధన
సమస్తవయవాలను కదలనీయవు
ఈదేహాన్ని ముక్కలుముక్కలుగావిడగొట్టి
ఈదేహ బాగలను కాల్చి కూల్చాలనే
అసురసంధ్యా రక్కసులు పగలు
పగలే విజృంభిస్తు ఉన్మాదులై
రుద్రభుమిలో కలలను పండించతలచే
దృశ్యాలకు వాస్తవ హృదయాలు
కొలిమిలోని నిప్పులా ప్రజ్వరిల్లుతునే
ఏఉన్మాదవ్యవస్థలనైనా భస్మంచేస్తాయి.

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

వందేమాతరం

by mayuukha September 15, 2023
written by mayuukha
September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

బంగారు కల

by Chillara Bhavanidevi September 15, 2023
written by Chillara Bhavanidevi

ధారావాహికం – 9వ భాగం

శ్రీకృష్ణదేవరాయల ప్రభువు జన్మదినోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నది. యజ్ఞయాగాదులు, దానధర్మాలు ముగిశాయి.
ఐదుగురు సామంతరాజులు ప్రభువుకు కానుకలు సమర్పించారు. ప్రజలంతా ఇష్టమైన అందమైన కొత్తబట్టలు ధరించారు. సామంతులంతా తమ కిందివారికి రంగు రంగుల బట్టలు బహుకరించారు. ప్రతి రాజప్రముఖునికి ప్రత్యేక లాంఛనాలందాయి. రాజుగారికి సామంతులంతా విలువైన బట్టలు కానుకలు నగలు, ధనం అందజేశారు. ఆ ఒక్కరోజే రాజుగారికి పదిహేను లక్షల బంగారు పర్దావులు బహుకరించబడ్డాయి. ఒక్కొక్క పర్దావు విలువ మూడువందల అరవై రైస్‌లు. విజయనగర ప్రజలు నెలను పౌర్ణమి నుండి పౌర్ణమికి లెక్క వేసుకుంటున్నారు.
విజయనగర ప్రభువులు గత అనేక సంవత్సరాలుగా ఒక కోశాగారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ప్రభువు మరణం తర్వాత దానికి తాళం వేసి
ఉంచుతారు. అది ఎవరికీ కనపడకుండా తెరవకుండా ఉండేట్లు చూస్తారు. తర్వాత వచ్చిన రాజులు కూడా దానిని తెరవటం చేయరు. ఏ రాజుకైనా తప్పనిసరి అవసరం అయితే తప్ప ఆ కోశాగారాన్ని తెరిచే ప్రసక్తి లేదు. ప్రతిరాజు తన కోశాగారంలో కోటి పర్దావుల దాకా నిల్వచేస్తాడు. తన రాజ భవనం ఖర్చును మించి ఒక పర్దావు కూడా ఇందులోంచి తీయడానికి లేదు. ప్రతి రాజభవనంలో పన్నెండువేల స్త్రీలకు పైగా పోషించబడతారు. ప్రతి పర్దావు బంగారునాణెం మీద ఒకవైపు రెండుబొమ్మలు, రెండోవైపు ఆ రాజుపేరు ఉంటుంది.
జన్మదిన వేడుకలు పూర్తయ్యాక కృష్ణదేవరాయలు హంపీ వెళ్ళారు. ఈ నగరమంటే ఆయనకు చాలా ప్రీతి. రాజుకు నగరపౌరులు మహావైభవంగా స్వాగతం పలికారు. వీధుల్లో విజయతోరణ ద్వారాలు నిర్మించారు. ఈ ద్వారాల గుండా రాజు ప్రవేశించారు. వీధులన్నీ విలువైన వస్త్రాలతో వున్నాయి. రాజు రక్షక దళాలను సమీక్షించారు. కృష్ణరాయ ప్రభువు సంవత్సరానికోసారి చెల్లించే వేతనాన్ని అందరికీ పంచారు. పరివారాన్ని రాజాధికారులు తనిఖీచేసి వాళ్ళ పేర్లు, ముఖం, శారీరక గుర్తులు రాసుకున్నారు. దళసేనానులు కాపలాకి వెళ్ళటానికి వంతుల వివరాలు తెలియజేయబడ్డాయి.
శ్రీకృష్ణదేవరాయలు ప్రత్యేక ఉత్సవ సందర్భంగా ఆనాటి సాయంకాలం భువనవిజయంలో కొలువు తీరాడు. నగరం సర్వాలంకారాలతో శోభాయమానమై దివ్యమణి ప్రభలతో చూపరుల కళ్ళు మిరుమిట్లు గొల్పుతున్నది. ఈ రోజు రాయలవారి ముఖమండలం ఆనందాతిరేకంతో పూర్ణచంద్రకాంతిని ప్రతిఫలిస్తున్నది. ఒక ప్రత్యేకకారణంతో సిద్ధంచేయబడిన ఆ కొలువుకు శ్రీరంగ దేవరాయలు ఆహ్వానించబడ్డాడు. ఆయనతోబాటు వారి కుమారుడు రామరాయలు దుందుభి ధ్వానాలమధ్య సభలో ప్రవేశించాడు.
సభలో అందరూలేచి గౌరవ పురస్సరంగా నిలబడ్డారు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే శ్రీకృష్ణదేవరాయలు కూడా సింహాసనం నుంచి లేచి నిలబడ్డాడు. శ్రీరంగదేవరాయలు దిగ్భ్రాంతి చెందాడు. రాయలు మందహాసంతో శ్రీరంగదేవరాయలను చూశాడు. రాయలవారు సింహాసనము నుండి ఎందుకు లేచారో అతనికర్థం కాలేదు. తన ఆసనంమీద కూడా ఆ రోజు మరెవ్వరో కూర్చున్నారు. శ్రీరంగదేవరాయలు ఆలోచనాపరుడై నిశ్చలంగా అలాగే నిలుచున్నాడు. ఒక నిమిషం తర్వాత మళ్ళా భేరీనినాదం విన్పించింది. శ్రీకృష్ణదేవరాయలు ఆనంద మందహాసంతో శ్రీరంగదేవరాయలుకేసి చూస్తూ ముందుకు నడిచాడు. అతని దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని తన సింహాసనం పక్కనే ఉన్న ఉన్నతాసనాన్ని చూపాడు. దాని పక్కనే ఉచితాసనంపై రామరాయలను కూచోమని సైగచేశాడు. రాయలు తన సింహాసనాన్ని అధిష్టించగానే భేరీనినాదం ఆగిపోయింది. అంతటా నిశ్శబ్దం. రాయల ప్రవర్తన అందరికీ నేడు కొత్తగా కన్పిస్తున్నది.
శ్రీకృష్ణదేవరాయలు ఆ నిశ్శబ్ద వాతావరణంలో జలధర ధ్వాన సమాన గంభీర స్వరంతో ఇలా అన్నారు`
‘‘నేటినుంచి కందవోలు రాజ్యాధినేత శ్రీ శ్రీరంగదేవరాయలుగారు మాకు సామంతులు కారు. వారిని సర్వ స్వతంత్రులుగా ప్రకటిస్తున్నాం.’’
సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. శ్రీరంగదేవరాయలు సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాడు. రాయలవారి కృపకు కారణం అనూహ్యంగా ఉంది.
తిమ్మరుసు మహామంత్రి లేచారు. చిరునవ్వుతో సభనంతా పరికించాడు. అందరి మనస్సుల్లోని ప్రశ్నను అవగతం చేసుకున్నాడు. ధీర గంభీరంగా ఇలా అన్నాడు.
‘‘సభాసదులారా! ఈనాడు మరో ముఖ్యమైన అంశాన్ని తెలియజేస్తున్నాను.
శ్రీ మన్మహామండలేశ్వర శ్రీ కృష్ణదేవరాయల వంశానికి ఏనాటి నుండో ఆర్వీటివంశం వారు పరమాప్తులు, మిత్రులు. శ్రీ రాయలవారు విజయనగర రాజ్యాధినేతలయే సమయంలో దక్షిణ పూర్వ దిగ్విజయ యాత్రల సమయంలో ఎంతో తోడ్పడినవారు ఆర్వీటివారు. అందరిలో రాయలవారి ఆదరాభిమానాలు చూరగొన్నవారు శ్రీశ్రీశ్రీ శ్రీరంగదేవరాయలవారి తృతీయపుత్రుడు చిరంజీవి రామరాయలవారు. వీరు అన్ని దండయాత్రల్లో పాల్గొని అరివీర భయంకర శౌర్య ప్రతాపాలను ప్రదర్శించారు. అవక్ర పరాక్రమంతో ఉదయగిరి దుర్గంలో శత్రు మూకల్ని సంహరించారు. కోటను స్వాధీనం చేసుకొని రాయవారికి అందించారు. కందవోలును ముట్టడిరచిన అదిల్‌షాతో పోరాడి వారి అశేష సేనావారాన్ని నిశ్శేషం చేశారు. పరాక్రమశాలి, ధీమంతుడు అయిన రామరాయలవారు శ్రీకృష్ణదేవరాయల అభిమానం చూరగొన్న అదృష్టవంతులు. అందుకని అభినందనసూచకంగా శ్రీవారు ఈ యువరత్నానికి తమ పుత్రికారత్నమైన తిరుమాలాంబికను కన్యాదానం చేయటానికి నిశ్చయించారు. నేటికి ఎనిమిదోరోజు వైశాఖ శుద్ధ త్రయోదశి వివాహానికి అనుకూలమని దైవజ్ఞులు నిర్ణయించారు. ఈ సభ ఇవ్వాళ ముగిసింది. మరలా ఏకాదశి రోజున దర్శనం ఉంటుంది’’ అని విరమించారు తిమ్మరుసు మంత్రి.
సభలో ఒక్కసారిగా ఆనంద కోలాహలం మిన్నుముట్టింది. మంగళతూర్యార వాలు సందడిరచాయి. పటాహా, భేరి, ఢక్కా, కాహళ, దుందుభి ధ్వానాలతో సభాంతరాళం పిక్కటిల్లింది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
శ్రీకృష్ణదేవరాయలు, తిమ్మరుసుమంత్రి, రామలింగనాయకుడు సమావేశ మందిరంలో దీర్ఘ సమావేశం జరుపుతున్నారు. తిమ్మరుసు చాలా గంభీరంగా
ఉన్నారు.
‘‘విజయనగర రాజప్రతినిధిగా ఉన్న సేనాధిపతి పెమ్మసాని తిమ్మనాయకుడ్ని మధురై పాండ్యరాజును అణచటానికి పంపాము’’ రాయలు సాలోచనగా అన్నారు.
‘‘అక్కడినుంచి వచ్చిన వార్తల ప్రకారం తిమ్మనాయకుడు మధురై పాండ్య రాజును ఓడిరచాడు. కానీ రాజ్యకాంక్షతో కన్నూమిన్నూ గానక తిమ్మనాయకుడు మధురై రాజ్యానికి తనను స్వతంత్రరాజుగా ప్రకటించుకున్నాడు. అతనిని పట్టితెచ్చే వీరుడెవరని సభలో ప్రశ్నించినప్పుడు విశ్వనాథనాయకుడు ముందు కొచ్చాడు. అతడు తిమ్మనాయకుని కుమారుడవటం విశేషం’’ తిమ్మరుసు చెప్పారు.
రాయలు గంభీర వదనంతో వింటున్నారు.
‘‘అవును ప్రభూ! మనకందిన వార్త ప్రకారం విశ్వనాధ నాయకుని ప్రభుభక్తి ఎన్నదగింది. అతను సైన్యంతో మధురకెళ్ళి తండ్రిని ఓడిరచి, బంధించి విజయనగరానికి ఖైదుగా తెచ్చి అప్పగించాడు. విశ్వనాథనాయకుడు ఇపుడు మీ దర్శనానికి వేచివున్నాడు ప్రభూ!’’ రామలింగ నాయకుడు గంభీరంగా అన్నాడు.
‘‘తక్షణం అతనిని ఆహ్వానించండి’’ తిమ్మరుసు ఆనతిచ్చారు.
విశ్వనాథనాయకుడు వీరసింహంలా అడుగుపెట్టాడు. రాయలతనని ప్రశంసా పూర్వకంగా చూశారు.
‘‘విశ్వనాథ నాయక! నీ వీరత్వం ఉన్నతమైనది. పితృభక్తి కన్నా రాజభక్తి గొప్పదని నిరూపించావు. మధురై రాజ్యానికి నిన్ను రాజును చేస్తున్నాను. నేటినుండి నీవు మా సామంతరాజుగా మాకు అభిమానపాత్రుడయ్యావు.’’
‘‘ధన్యుడ్ని ప్రభూ!’’ విశ్వనాథనాయకుడు నిష్క్రమించాడు.
తిమ్మరుసు రాయలకేసి ప్రశంసాపూర్వకంగా చూశాడు. తాను తీర్చిదిద్దిన మహాప్రభువు రాజనీతిజ్ఞతను కళ్ళారా చూస్తున్న తిమ్మరుసు మనస్సు తృప్తిగా పులకరించింది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
ఆ రోజు వైశాఖ శుద్ధ ఏకాదశి.
చంద్రుని వెన్నెల కాంతులతో భూమ్యాకాశాలు స్వచ్ఛంగా వెలుగుతున్నాయి. విజయనగర పరిసర ప్రాంత ప్రకృతి అంతా జరగబోవు కల్యాణ మహోత్సవానందాన్ని అప్పుడే పొందుతున్నట్లు కన్పిస్తున్నది. ఆకాశ మార్గంలో వికాసరేఖల్లా విజయనగర ప్రాంతంలోని పర్వతపంక్తులు గంభీర రమ్యంగా దర్శనమిస్తున్నాయి. ఆ పర్వతశ్రేణులపై నాటినట్లుగా ఉన్న చెట్లు, ఆ వెనకు లేత గచ్చకాయరంగు ఆకాశం, ఆపైన పడమటికి వాలిపోయి మెల్లగా ప్రయాణం చేసే చంద్రుడు, అంతా ఒక అద్భుత చిత్రపటంలా కన్పిస్తోంది.
మగపెళ్ళివారు విజయనగరానికి మూడుకోసుల దూరంలో ఉన్నారు. రాత్రి రెండుజాములు దాటింది. ఆనందాతిరేకం వల్ల ఎవ్వరికీ నిద్రరావటం లేదు. సహజ సుందర ప్రకృతివల్ల… వాతావరణంలోని చల్లదనం వల్ల మెల్లగా నిద్రాదేవి ఒడిలో సేదతీరారు. కాలినడకన మెల్లమెల్లగా సైన్యం కదులుతున్నది. భద్రగజంపై అంబారీపైన రామరాయలు, అన్నివైపులా ఆశ్వారోహకులు మందగమనంతో నడుస్తుండగా విజయనగర ప్రకృతి దృశ్యాలు చూస్తున్నాడు. పరిచితమైన ప్రదేశాలే కానీ ఈరోజు వింత సొగసుతో కన్పిస్తున్నాయి. ఇదివరకు తెలియని నూతన సంచలనానికి మనసు లోనవుతోంది. తెలియరాని తీయనిబాధ కలుగుతుంది.
పెళ్ళిబృందం విజయనగరాన్ని సమీపించింది. రామరాయల తండ్రి శ్రీరంగదేవరాయ ఆజ్ఞతో దుందుభిధ్వానాలు భేరీ ఖీంకారాలు మోగాయి. మంగళ తూర్యారవాలు చెలరేగాయి. మేనాల్లో నిద్రిస్తున్నవారు తుళ్ళిపడి లేచారు. అందరి హృదయాలు ఒక్కసారి ఉప్పొంగాయి. ఠీవిగా సంబరపడ్డారు.
దూరాన రెండుకోసుల దూరంలో ఎత్తుగా దట్టమైన వెలుగు కన్పించింది. ఆ కాంతి వెనుకగా ఉన్నతంగా విజయనగర రాజసౌధోపరిభాగాలు కన్పిస్తున్నాయి. వాటికి తాపిన చిన్నమణులు నక్షత్రాల్లాగా, పెద్దవి చంద్రునిలా వెలుగుతున్నాయి. కోటకి కట్టిన మణిహారాలు నక్షత్ర మాలికల్లా, ద్వారాలకి ఇరుపక్కలా ఉంచిన పూర్ణమణికుంభాలు బాలసూర్యగోళాల్లా ప్రకాశిస్తున్నాయి. దీపాల కాంతులామణులపై బడి ప్రతిబింబించటం వల్ల విజయనగరమంతటా పున్నమి వెలుగుల్ని నింపుకుంది. నగరమంతా చిత్రవర్ణ దృశ్యంగా ఉంది.
ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఒక్కసారిగా పెక్కు నగారాధ్వనులు వెలువడ్డాయి. ఆ ధ్వనులతో బాటు వెలుగు దగ్గరయింది. పెళ్ళికొడుకు బృందం ఇంకొక కోసుదూరం ప్రయాణించింది. అటువైపునుంచి వధువు పక్షంవారు మరికొన్ని గజాలు కదిలారు. రెండు బృందాలు ఒకరికొకరు అంతదూరంలో ఉండగా నగారా ధ్వనులు ఆగిపోయాయి.
అద్భుతంగా అలంకరించబడిన ఒక పట్టపుటేనుగు మీద శ్రీకృష్ణదేవరాయలు ప్రత్యక్షమయ్యారు. వందిమాగధులు స్తోత్రం చేశారు.
‘‘రాజాధిరాజ, రాజపరమేశ్వర, మూరురాయరగండా! జయ జయహో!
అరివీర భయంకర దోర్దండా
సరస సాహితీ సమరాంగణ సార్వభౌమా! జయ జయహో!
మరోసారి దుందుభి ధ్వానాలు మారుమోగాయి.
వరుడు రామరాయలు ఉన్నతమైన ఏనుగుపై విరాజిల్లుతున్నాడు. కొంచెం దూరంలో అతని తండ్రి శ్రీరంగదేవరాయలు అంబారి మీద కూర్చొని ఉన్నాడు. ఎడమవైపు అతని సోదరులు, వెనుకగా రాజపరిచారం. దుందుభి ధ్వానాలు మరలా మారుమ్రోగాయి. వందిమాగధులు శ్రుతిపక్వంగా స్తోత్రం చేశారు.
‘‘శ్రీరంగదేవరాజసుత చిరంజీవి రామయ రాజా జయ జయహో!
సమస్త సద్గుణాస్తోమ భద్రా రామయ రాజా జయ జయహో!
భూసుత సాహస ధుర్యా రామయ రాజా జయ జయహో!’’
వరునివైపు వారి నగారాలు ఒక్క పర్యాయం మోగి ఆగాయి.
అటువైపునుంచి శ్రీకృష్ణదేవరాయలు ఇటువైపునుంచి శ్రీరంగదేవరాయలు భద్రగజారోహణ గావించారు. ఆ వెనుక రామరాయలు ఉభయవర్గాల రాజబంధువులు కిందికి దిగారు. వధువువైపు వాళ్ళు పరిపించిన రత్నకంబళ్ళపై వరుని పక్షమువాళ్ళు కూర్చున్నారు. ముత్తయిదువులు గంధాక్షతలు కురిపించారు. విలాసినీ జనులు పన్నీరు జల్లారు. ఇటువంటి ఉచిత మర్యాదలకు ఇరుపక్షాలవాళ్ళు ఆనందించారు.
ముహూర్తానికి సర్వం సిద్ధమైంది. వివాహమండపంలో వధూవరుల్ని ఒకచోట కూర్చోబెట్టి దిష్టి తీశారు. ఇద్దరికి మంగళస్నానాలు చేయించారు. మంత్రయుక్త ఆవాహనతో సకల శుభదేవతల పూజ జరిగింది. వరుడు వధూపక్షంవాళ్ళిచ్చినవి, వధువు వరునిపక్షంవాళ్ళిచ్చినవి పట్టువస్త్రాలు ధరించారు.
రాజాధిరాజ రాజపరమేశుడు శ్రీ శ్రీకృష్ణదేవరాయలు సమంత్రకంగా
కాళ్ళుకడిగి రామరాయలకు కన్యాదానం చేశారు. మంత్రోచ్ఛారణ కొనసాగింది. వధూవరూలచే వివాహ ప్రతిజ్ఞ జరిపించారు. మంగళ తూర్యారవాలు మిన్నంటగా రామరాయలు తిరుమలాంబిక మెడలో మూడుముళ్ళు వేసి సూత్రధారణ చేశాడు. బ్రాహ్మణోత్తములు వేదమంత్రాలతో ఆశీస్సులందించారు. సకల ప్రపంచం వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించింది. తలంబ్రాలు పోసుకోవడం పూర్తి అయింది. రామరాయలవంటి ధైర్య శౌర్యవంతుని భర్తగా పొందిన తిరుమలాంబిక ఉప్పొంగిపోయింది. వీరాధివీరుడు అల్లుడయ్యాడని రాయలు ఆనందించాడు. ఆదరించి ఎన్నో కానుకలు ఇచ్చాడు. సర్వసేనాధ్యక్ష పదవినిచ్చి గౌరవించాడు. అల్లునికి వివాహకానుకగా సిద్ధవటం, పొత్తపి, ఉదయగిరి దుర్గాలనిచ్చి సత్కరించారు రాయలు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
మంజరి, చంద్రప్పలు వ్యాసరాయల వారి ఆశ్రమానికి వెళ్ళారు. తమ వివాహముహూర్తం నిర్ణయించమని కోరారు. ఆయన వాళ్ళిద్దరికేసి సందిగ్ధంగా చూశాడు.
‘‘మీ ఇద్దరికీ వివాహయోగ్యంలేదు నాయనా. ఒకవేళ జరిగినా వియోగం తప్పదు.’’
‘‘ఎందుకని స్వామీ’’ చంద్రప్ప అడిగాడు.
‘‘లోగడ కూడా మీరిద్దరూ వివాహప్రయత్నం చేసినట్లు, అది భగ్నమైనట్లు మీ జాతకాలు చెప్తున్నాయి.’’
‘‘అంటే మేము ఒకరినొకరు కాకుండా వేరొకరిని చేసుకుంటామా’’ చంద్రప్ప మళ్ళీ అడిగాడు. వ్యాసరాయలు మౌనం వహించాడు.
మంజరి లోలోపల పరితాపం చెందుతున్నది. స్వామి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. ప్రతిసారీ ఏదో ఒక అవాంతరమెదురౌతున్నది. తిరుమలాంబిక రాకుమారి వివాహమయ్యాక మంజరికి తన వివాహం గురించి చింత పట్టుకుంది. ఆమె గతంలో మరో జ్యోతిష్కునికి తన జాతకం చూపించుకుంది. తాను చంద్రప్పను వివాహమాడితే అతనికి మృత్యువు సంభవిస్తుందని ఆ జ్యోతిష్కుడు చెప్పాడు. అప్పటినించి మంజరి క్షుభితురాలయింది. తనపట్ల చంద్రప్ప కనపరిచే అనురాగాన్ని కాదనలేదు. అలాగని చేతురాలా అతని మరణాన్ని కోరలేదు.
‘భగవంతుడా! ఏమిటీ విషమపరీక్ష? ఈ విషయాన్ని చంద్రాతో ఎలా చెప్పగలను’ అని లోలోపల వేదనపడుతున్నదామె. అతని బలవంతంమీదే వ్యాసరాయలవారిని కలవటం జరిగింది.
రాజగురువైన వ్యాసరాయలంటే కృష్ణరాయలకు అమిత గౌరవం. రాయలకు పదవీగండం ఉన్నప్పుడు కొద్దికాలం విజయనగర సింహాసన మధిష్టించిన జ్ఞాని ఆయన. అటువంటి వ్యాసరాయల మాట పొల్లుకాదు. తమ వివాహం జరగదు. వ్యాసరాయలవారికి నమస్కరించి ఇద్దరూ ఆశ్రమం బయటికి వచ్చారు.
మౌనంగా నడుస్తున్నాడు చంద్రప్ప. ఆమె చేతిని బిగించి పట్టుకున్నాడు.
‘‘మంజూ! నీవులేనిది నేను జీవించలేను’’ తమకంగా కౌగిలించుకున్నాడు. ఇద్దరి కళ్ళు నిండుకున్నాయి.
‘బుస్‌…’ మనే శబ్దం విని చటుక్కున ఆమెను వదిలేశాడు.
నాలుగుబారల నల్లత్రాచు పడగవిప్పి తీక్షణంగా వీళ్ళకేసి చూస్తున్నది. మంజరి కొయ్యబారిపోయింది. శరీరమంతా గజగజా వణికిపోతున్నది. ఇద్దరిలో ఎవరు కదిలినా పడగ విసరటానికి సిద్ధంగా ఉంది త్రాచు.
‘‘కదలకు’’ పెదవులు కూడా కదలకుండా అన్నాడు చంద్రప్ప.
ఇద్దరూ బొమ్మల్లా నిలబడిపోయారు.
కాసేపు విప్పిన పడగను అలాగే ఉంచి ఎలాంటి అలికిడి లేకపోవటంతో జరజరా పాక్కుంటూ పక్కనున్న పొదల్లోకి వెళ్ళిపోయింది త్రాచు.
మంజరికి దడ తగ్గలేదు. అది అపశకునంలా తోస్తున్నది. తనెంత నష్టజాతకురాలు! తల్లిని పోగొట్టుకుంది. ప్రేమించిన చంద్రప్ప కూడా తనకి దూరంకాక తప్పదు. వీరేంద్రుని అసభ్య ప్రవర్తన మరింత బాధిస్తోంది. అది ఎవ్వరికీ చెప్పుకునేది కాదు. అతడు రాజబంధువు. అతని కంటపడకుండా
ఉండగలగటమే తను చేయగలిగిన పని. అదికూడా చాలా కష్టతరంగానే
ఉంది.
తిమ్మరుసువారి కుమారుడు గోవిందరాయలు తనపట్ల చూపించే శ్రద్ధకు కారణం తనూహింపలేదు. చంద్రప్ప తనూ ఎన్ని వెన్నెలరాత్రులు విజయనగర శిల్పారామాల్లో విహరిస్తూ ఎన్నెన్ని కలలు కన్నారో! వివాహం అనేది జరిగినా జరక్కున్నా చంద్రప్ప తనూ మానసికంగా ఏనాడో భార్యాభర్తయ్యారు. మంత్రాలు, సూత్రాలు లేకుంటే మాత్రమేం! కానీ లోకం…
‘‘మంజూ!’’ చంద్రప్ప పిలుపుకి ఈ లోకంలోకి వచ్చింది.
‘‘ఏమాలోచిస్తున్నావు మంజూ! గురువుగారి మాటలకు బాధపడకు. జ్యోతిష్యంలో ఉండే ప్రతి దోషానికి నివారణ, శాంతి ఉంటుంది. అన్నీ మళ్ళీ చర్చించి చేద్దాం.’’
‘‘ఇక వెళ్దాం చంద్రా! దేవేరివారు నాకోసం ఎదురుచూస్తారు’’
‘‘అవునుగదూ! మరిచాను… తిమ్మరుసు మంత్రిగారు నిన్ను అన్నపూర్ణాదేవి మందిరంలో నియోగించారు కదా!’’
‘‘అవును చంద్రా! అన్నపూర్ణాదేవి చాలా గుణవంతురాలు. ఆ వీరేంద్రుడే ఆమె మనసును కలతపెడుతున్నాడు.’’
‘‘నువ్వు జాగ్రత్త. మనం త్వరలో ఒకింటివాళ్ళమవుతాం. ఎటువంటి భయాలు సందేహాలు పెట్టుకోకు’’ ఆమె చేతిని సున్నితంగా నొక్కి అశ్వారోహిణుడై వెళ్ళిపోయాడు చంద్రప్ప.
అతను వెళ్ళినవైపే చాలాసేపు చూస్తూండిపోయిందామె. తనవల్ల అతనికి గండం అనేమాట ఆమెను బాధిస్తోంది. తాను మరణించయినా అతనికి జీవితాన్నివ్వాలనుకునే హిందూ స్త్రీ ఆమె. దానికి పునాదిగా ఒక ఆలోచన మబ్బుతెరలా కదిలిందామె మనసులో.

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

మా పల్లె పిలుస్తుంది

by Narendra Sandineni September 15, 2023
written by Narendra Sandineni

మాదాడి నారాయణ రెడ్డి (మానారె)”మా పల్లె పిలుస్తుంది” కవిత పై విశ్లేషణా వ్యాసం. ప్రముఖ కవి, ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాల సేకరణ కర్త,పరిశోధకుడు,రిటైర్డ్ ప్రిన్సిపల్, ఎస్.అర్.అర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్, మాదాడి నారాయణ రెడ్డి (మానారె) కలం నుండి జాలువారిన “మా పల్లె పిలుస్తుంది” కవిత పై విశ్లేషణా వ్యాసం. కవిత ఏమిటి? అని ఆసక్తి తో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.


“మా పల్లె పిలుస్తుంది కిలకిలారావాలతో “అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది”
పల్లెటూరు అంటే మనిషి సంఘజీవి కనుక ఇతరులతో అవసరాలను అనుసరించి దగ్గరగా జీవించుటకు కొందరు ఒక చోట లేదా ఒక ప్రాంతమును కేంద్రముగా చేసుకొని వారి వారి నివాసాలను ఏర్పాటు చేసుకోగా ఏర్పడింది.పల్లె ఒక నివాస ప్రాంతం.పల్లెను కూడా గ్రామంగా వ్యవహరిస్తారు.గ్రామాల మధ్య వ్యాపార సంబంధమైన కార్యకలాపాలు నెరవేరేందుకు వాటికి కూడలిగా కొన్ని పట్టణాలు ఏర్పడతాయి.పల్లె వాతారణంలో మనిషి చుట్టూ ఆహ్లాదకరమైన స్థితి అలుముకుంటుంది.పల్లెలు ప్రకృతి సహజ సౌందర్యానికి పట్టుకొమ్మలు.పల్లెలో జనాలంతా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. వ్యవసాయ భూములకు అనుకూలంగా పల్లెను ఏర్పరచుకుంటారు.పల్లెలో వ్యవసాయమే ప్రధాన రంగంగా పేరు పొందింది.పల్లెలో కొనసాగే సాంప్రదాయాలు,ఆచారాలు ప్రకృతి సహజత్వాన్ని పెంచే విధంగా ఉంటాయి.పల్లెలో జనాలు కోడి కూతతోనే నిద్ర లేస్తారు.పల్లె అందంగా కనపడుతుంది.పచ్చని పొలాల నుండి సూర్య బింబం పొడుచుకు వస్తుంది.సూర్యకిరణాలు వేడి పెరిగే కొలది చెట్లు మనకు ఎంతో హాయినిస్తాయి. పల్లెలో ఉండే చెరువులు,చెరువుల చుట్టూ ఉండే గట్టు,చెరువు గట్టు పై ఉండే చెట్లు,చెట్ల చాటున సాగే దాగుడుమూతల ఆటలు అవి మనిషికి మరపురాని స్మృతులుగా ఉంటాయి.పల్లె అందాలు చెట్లు చేమలతో కూడి ఉంటుంది.పల్లెలో ఉండే ఇళ్ళు కూడా పూల మొక్కలతో కాయగూరల పాదులతో చక్కగా ఉంటాయి.పల్లెలో మనిషికి కావలసిన గాలి చాలా స్వచ్ఛమైనదై సహజంగా లభిస్తుంది.పల్లెలో చెట్లు విరివిగా ఉంటాయి.చెట్ల ద్వారా ఆక్సిజన్ లభిస్తుంది.భూమి,గాలి,నీరు,నిప్పు,ఎంత సహజంగా ఉంటే ప్రకృతి అంత ప్రశాంతంగా ఉంటుంది.భూమిపై కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోయే మనిషి ప్రకృతి పై చేసే మార్పులే మనిషికి మునుముందు దుర్భరంగా మారుతాయి.మనిషి పల్లె వాతావరణాన్ని సమతుల్యంగా కాపాడు కోవాలని పెద్దలు చెప్తారు.పంచభూతాలైన భూమి,గాలి,నీరు,నిప్పు వలన మనిషి మనుగడ ప్రశాంతంగా సాగుతుంది.స్వచ్ఛమైన గాలి మనసుపై మంచి ప్రభావం చూపుతుంది.భూమి నుండి లభించే ఆహార పదార్థాలు స్వచ్ఛంగా ఉంటే మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా జీవించగలడు.స్వచ్ఛమైన నీరు మానవ శరీర పోషణలో కీలకంగా ఉంటుంది.పల్లె గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది.సహజమైన ప్రకృతి పల్లెలో ఆహ్లాదకరంగా ఉంటుంది.పల్లెలో గ్రామ జీవితం శ్రమతో కూడుకొని ఉంటుంది.అయినప్పటికీ పల్లె జీవితం సంతృప్తికరం గా ఉంటుంది.పల్లెలో కోడి కూతతోనే నిద్ర లేస్తారు.సూర్యోదయానికి ముందు నిద్ర లేస్తే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు.పల్లెవాసులు ఆరోగ్య నియమాలు పాటిస్తారు.పల్లెలో అంతా అరమరికలు లేకుండా కలిసిమెలిసి ఉండడం వలన స్నేహితులు బంధువులు,బాంధవ్యాలు బలంగా అల్లుకుని ఉంటాయి.అందువల్ల పల్లెలో ఎక్కడ లేని ప్రశాంతత నెలకొని ఉంటుంది.

“జల కళలీనుతున్న తటాకాలతో
పల్లెలో ఉండే చెరువులు నీళ్లతో తళ తళలాడు తుంటాయి.తటాకం అంటే నీళ్లు ఉన్న పెద్ద కుంట.చెరువు మంచి నీటికి వ్యవసాయానికి ఉపయోగపడే సహజ వనరు అని చెప్పవచ్చును.చెరువు ద్వారా రైతుల పొలాలు సస్యశ్యామలమవుతాయి.పశువులకు తాగడానికి నీరు లభిస్తుంది.పల్లెలోని జనాలు చెరువులో ఈతలు కొడతారు. బెస్త,తెనుగు వాళ్ళు చేపలు పట్టి అమ్ముకొని జీవనం కొనసాగిస్తారు.చెరువులో సబ్బండ వర్ణాల ప్రజలు స్నానం చేస్తారు మరియు బట్టలు పిండుకుంటారు.చెరువు దగ్గర గల చెలిమెలో పల్లె జనాలు నీరు తాగుతారు.చెలిమెలో నుండి నీరు బిందెల ద్వారా త్రాగడానికి తీసుకుని పోతారు.చెలిమె నీరు తీయగా ఉంటుంది.చెలిమెలో నీరు ఎంత తోడినా అలా ఊరుతూనే ఉంటుంది.
“హరితహారం గా నిలిచిన పచ్చని చెట్లతో
పల్లెలు హరితహారం గా ఉండి పచ్చని చెట్లతో నిండి ఉంటాయి.ప్రకృతిని సంరక్షించుకోవడం,ప్రతి మనిషి బాధ్యత.వృక్షో రక్షతి రక్షితః అనగా చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది అని అర్థం.భూభాగంలో 33% పచ్చదనం ఉంటేనే వాతావరణం సమతుల్యత సాధ్యమవుతుంది. పెరుగుతున్న జనాభా,పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో అడవులు తరిగిపోతున్నాయి.దీనివల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతున్నది.మానవ జీవితం అల్లకల్లోలం అవుతున్నది.హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం వల్ల పచ్చదనం నెలకొంటుంది.అందుకే మా పల్లె హరితహారంతో కూడి పచ్చని చెట్లతో శోభాయమానంగా ఉంటుంది.
“సేంద్రియ ఎరువులతో పండిన పంటలతో
మా పల్లె సేంద్రియ ఎరువులతో పండిన పంటలతో ప్రకృతి సిద్ధమైన పర్యావరణ అనుకూలమైన జీవాధారిత వ్యవసాయంతో విరాజిల్లుతుంది.సేంద్రియ వ్యవసాయం,జీవుల వైవిధ్యాన్ని జీవుల వివిధ దశలను మరియు నేలలో గాలి, సూక్ష్మజీవుల పనితనాన్ని వృధ్ది పరుస్తుంది.సేంద్రియ వ్యవసాయం అనగా సహజసిద్ధ కార్బన్ కలిగి ఉన్న మొక్కల, జంతువుల వ్యర్థాలు మరియు ఇతర జీవ పదార్థాలతో పాటు జీవన ఎరువులను ఉపయోగించుకొని చేసే వ్యవసాయం. నేలలోని పోషకాలను పంటలకు సమగ్రంగా అందిస్తూ సుస్థిర వ్యవసాయ దిగుబడులను సాధిస్తూ నేల,నీరు, వాతావరణం,కాలుష్యం కాకుండా కాపాడుకునే పద్ధతే సేంద్రియ వ్యవసాయం.నేల సజీవంగా ఉండే విధంగా మా పల్లెలో పంటలను పండించడం జరుగుతుంది.
“పాలిచ్చే పాడి పశువుల మందలతో
వ్యవసాయంలో పశుసంపద ముఖ్యమైనట్టిది.పశుసంపద వ్యవసాయం పైన ఆధారపడిన రైతుల పంటలకు అవసరమైన ఎరువులు అందించి దిగుబడిని పెంచుటకు తోడ్పడుతుంది.అంతే కాకుండా మనకు కావాల్సిన పోషక ఆహారం పాలు,మాంసం మరియు గుడ్లు లభిస్తాయి.ఈ పశుసంపద వల్ల ఉపాధి సౌకర్యాలు సమకూరుతాయి. సంవత్సరం పొడుగునా ఆదాయం లభిస్తుంది.పశు ఉత్పాదక శక్తి,ఆ జాతి లక్షణాలు,బంజరు భూముల నుండి మరియు రైతుల పొలం నుండి లభించే పశుగ్రాసం పై ఆధారపడి ఉంటుంది.పశువుల వృద్ది రైతులు పాటించే యాజమాన్య పద్ధతుల మీద ఆధారపడి ఉంటుంది.మా పల్లెలో పాలిచ్చే పాడి పశువుల వల్ల వ్యవసాయదారులైన రైతులకు సరైన ఆదాయం ఉంటుంది.
“లోటు లేని రైతుల పచ్చని కాపురాలతో
పల్లెలో పంటలు పండించే రైతును వ్యవసాయదారుడు అని కూడా అంటారు.ఆహార పంటలు పండించడమే కాక తోటలు,పాడి పశువులు,చేపలు మరియురొయ్యల పెంపకం, చేపట్టిన వారిని కూడా రైతులు అంటారు.సాధారణంగా రైతులు తమ సొంత భూమిని సాగు చేయడమే కాక ఇతరుల భూమిని కూడా కౌలుకు తీసుకొని సాగు చేస్తుంటారు.రైతు వ్యవసాయంలో నిమగ్నమై ఉండే వ్యక్తి. రైతు ఆహారం లేదా ముడి పదార్థాల కోసం జీవాలను అనగా పశువులు,గొర్రెలు, పందులు మొదలైన వాటిని పెంచుతాడు.ధాన్యాలు,పండ్లు మరియు కూరగాయలు వంటి పంటలను పండిస్తాడు.రైతులు పంటలు పండించడానికి మరియు జంతువులను పెంచడానికి అనేక రకాల పద్ధతులను ఉపయోగిస్తారు.రైతులు సాంప్రదాయిక పద్ధతిలో భూమిని దున్నుతారు.రైతులు చేతితో నాటు వేస్తారు.రైతులు భూమిని కాపాడుతూ జీవ వైవిధ్యాన్ని సంరక్షిస్తారు.రైతులు ఆహారాన్ని ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు.రైతులు పంటలు పండించడానికి మరియు పశువులను పెంచడానికి కష్టపడి పని చేస్తారు.రైతులు భూమిని పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు.రైతులు భవిష్యత్ తరాల కోసం భూమిని సంరక్షిస్తారు.రైతులు మన సమాజానికి వెన్నెముక అని చెప్పవచ్చు.రైతులు మనం తినే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తారు.రైతుల వల్లనే మనం భూమి మీద జీవించగలుగుతున్నాం.రైతులు ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు అయినప్పటికి వారికి సరైన సహకారం లేదు.మా పల్లెలో రైతులు సుభిక్షంగా ఉన్నారు.
“మా పల్లె పిలుస్తుంది ఒక్కసారి రా రమ్మని
మా పల్లె అలా పిలవడం సరైనదే అనిపిస్తుంది.మా పల్లె జలాశయాలతో, నిండిన చెరువులతో మరియు పల్లెలో ఎటు చూసినా పచ్చదనంతో కూడుకున్న చెట్లతో మరియు సేంద్రియ ఎరువులు పశువుల పేడ ప్రకృతి సిద్ధమైన వాతావరణానికి అనుకూలమైన జీవాధారిత వ్యవసాయం ద్వారా పండిన పంటలతో, పాలిచ్చే పశు సంపద మందలతో రైతులు సుభిక్షంగా ఉన్నారు.మా పల్లెలో ఎలాంటి లోటు ఉండదు.కాబట్టి రైతు జీవితం ఎల్లప్పుడు పచ్చని కాపురాలతో కళకళలాడుతూ ఉంటుంది.అందుకే మా పల్లె ఒక్కసారి రా రమ్మని పిలవడం చాలా చక్కగా ఉంది.

“కడిగిన ముత్యంలా ఉన్న వీధులతో
మా పల్లెలో ఎవరి ఇంటి ముందు వారు ఊడ్చుకుంటారు.గ్రామ పంచాయతీ ఆఫీస్ వారు వచ్చి వీధులు ఊడుస్తారని ఎవరు ఎదురు చూడరు.పల్లె వాళ్ళు తమ పనులు తాము చేసుకుంటారు.తమ ఇండ్లను శుభ్రంగా ఉంచుకుంటారు.తమ ఇంటి ముందు మరియు వీధులను కూడా శుభ్రంగా చీపురుతో ఊడుస్తారు.కాబట్టి పల్లెలో వీధులన్నీ కడిగిన ముత్యంలా తళ తళ మెరుస్తూ ఉంటాయి అని చెప్పిన కవి నారాయణరెడ్డి (మానారె)భావం చక్కగా ఉంది.
“క్రిమిసంహారక మందులు సోకని కూరగాయలతో
సాంప్రదాయిక పద్ధతిలో కేవలం సహజ వనరులను ఉపయోగించి వ్యవసాయం చేయడాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు.సేంద్రియ వ్యవసాయంలో ఎలాంటి రసాయనిక ఎరువులను కాని పురుగు మందులను కాని వాడరు. రసాయనిక ఎరువులను అసలే ఉపయోగించరు.పంట భూముల్లో ప్రకృతి సేంద్రియ వ్యవసాయం చేస్తూ సేంద్రియ కర్బనాన్ని పెంచుకోవడం జరుగుతుంది.మా పల్లెలో క్రిమిసంహారక మందులు సోకని కూరగాయలు లభ్యం అవుతాయి అని చెప్పడం గొప్పగా ఉంది.
“కార్బైడ్ ఊసే లేని పండ్ల ఎగుమతులతో
పల్లెలో రైతులు పండ్ల తోటలు పెంచుతారు.మామిడి,నిమ్మ, అరటి మరియు రకరకాలైన పండ్లను పండిస్తారు.పల్లె రైతుల తోటల్లో పండ్లు సహజసిద్ధంగా పండుతాయి.మా పల్లెలో రైతులు కార్బైడ్ ద్వారా కృత్రిమంగా పండ్లను పండించే పద్ధతులను అవలంబించరు.కేవలం దళారులు మాత్రమే కార్బైడ్ ద్వారా పండ్లను పండునట్లు చేస్తారు.పల్లెలో రైతులు ఎలాంటి మోసాలకు తావు లేకుండా చెట్ల నుండి తెంపిన తాజా పండ్లనే అమ్ముతారు మరియు ఎగుమతి చేస్తారు.పల్లె రైతులు ప్రజల ఆరోగ్యాన్ని కోరేవారు అని అర్థమవుతుంది.
“రోగాలు దరికి రాని జనాలతో
పల్లెలో ఉన్న జనాలకు ఎట్లాంటి రోగాలు సోకవు.పల్లె జనాలు కోడికూతతోనే మేల్కొంటారు.పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు తమ వ్యవసాయ పనుల్లో మునిగి తేలుతారు.పల్లె జనులు సాయంత్రం కాగానే శుభ్రంగా స్నానం చేసి వేడి వేడి అన్నం తింటారు.పల్లె జనాలకు ఇతర విషయాల పట్ల ధ్యాస ఉండదు.పల్లె జనాలు నిత్యం శ్రమ చేస్తుంటారు. అలసిపోతే ఏ చెట్టు కింద అయినా సుఖంగా నిద్రపోతారు.పల్లె వాళ్లకు ఏ రోగాలు దరిచేరవు అంటే ఆశ్చర్యం కలగవచ్చు.కాని నిజంగా మా పల్లెలో అలాంటి మెరుగైన వాతావరణం ఉంటుంది.అందుకే వారిని ఏ రోగాలు దరికి చేరవు అనే వాస్తవాన్ని కవి నారాయణరెడ్డి(మానారె) తెలియజేశారు.
“కనుల పండువు చేస్తున్న వనాలతో
పల్లెలు ఎక్కడ చూసినా పచ్చదనంతో నిండి ఉంటాయి.ప్రకృతికి పర్యాయపదంలా మా పల్లె ఉంటుంది.పల్లె చెట్లు చేమలతో పాడి పంటలతో విలసిల్లుతూ కనుల పండువు చేస్తుంది.
“మా పల్లె పిలుస్తుంది ఒక్కసారి రా రమ్మని
పల్లె ఎందుకు పిలుస్తుంది అనిపించవచ్చు.మా పల్లె కడిగిన ముత్యంలా ఉన్న వీధులతో కళకళలాడుతూ ఉంటుంది.మా పల్లెలో ఎటు చూసినా కూరగాయల చెట్ల పాదులు ఉంటాయి.ఆ కూరగాయలు సేంద్రియ ఎరువులతో పండించబడతాయి.ఎలాంటి క్రిమిసంహారక మందులు ఉపయోగించబడవు.మా పల్లెలో పండించిన పండ్లు సహజ సిద్ధంగా చెట్ల మీదనే పండుతాయి.మా పల్లె వాసులు కార్బైడ్ లాంటి రసాయనిక మందులు ఉపయోగించి పండ్లను పండించరు.మా పల్లె వాసులు సహజసిద్ధంగా పండిన పండ్లను ఉపయోగిస్తారు.అటువంటి పండ్లనే ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు.మా పల్లె వాసులు నిరంతరం శ్రమిస్తారు. అందుకే వారి చెంతకు ఎలాంటి రోగాలు దరిచేరవు.మా పల్లెలోని జనాలను చూస్తే రోగాలు దూరంగా పారిపోతాయి.మా పల్లెలో ఎటు చూసినా పచ్చని చెట్లతో ప్రకృతి శోభాయ మానంగా కళకళలాడుతూ కనిపిస్తుంది.మా పల్లె ఎటు చూసినా పచ్చని పచ్చదనంతో కూడుకున్న చెట్లతో ఉద్యానవనాలను తలపిస్తుంది.అందుకే మా పల్లె పిలుస్తుంది రా రమ్మని అనడం చక్కగా ఉంది.

మాదాడి నారాయణ రెడ్డి

“మద్యాన్ని బహిష్కరించిన మా పల్లె
మద్యపానం అలవాటుగా మొదలై చివరికి వ్యసనంగా మారుతుంది.తాగుడుకు అలవాటై వ్యసనంగా మారి దానికి బానిసైన వ్యక్తి పతనమైపోతాడు.మద్యపానం అంటే సారాయి త్రాగు అలవాటు.మద్యపానం ఆరోగ్యానికి హానికరం.మా పల్లె వాసులకు ఎలాంటి సారాయి త్రాగే అలవాటు లేదు.మా పల్లె వాసులు ఎలాంటి మద్యపానం జోలికి పోరు.మా పల్లెలో మద్యపానాన్ని బహిష్కరించారు.మా పల్లెలో తాటి చెట్లు,ఈత చెట్ల ద్వారా సహజంగా లభించే కల్లును తాగుతారు.కల్లును ఎలాంటి కల్తీ చేయరు.మా పల్లెవాసులు మద్యం వల్ల ఆరోగ్యం పాడవుతుందని త్రాగుడుకు బానిసలు అయితే కుటుంబాలు నాశనమవుతాయని మద్యాన్ని బహిష్కరించారు.ఈ వాస్తవాన్ని కవినారాయణరెడ్డి(మానారె) తెలియజేస్తున్నారు.
“పొగ త్రాగడాన్ని నిషేధించిన మా పల్లె
ధూమపానం వల్ల పొగాకులోని నికోటిన్ నేరుగా మెదడుకు చేరుకొని నెమ్మదిగా రక్తపోటును పెంచుతుంది.పొగ త్రాగే అలవాటు కారణంగా మూత్రపిండాల పనితీరు మందగించడమే కాకుండా మూత్రాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు పొగ త్రాగిన వారి ఊపిరితిత్తులు కూడా చెడిపోతాయి.కాబట్టి పొగ త్రాగడం హానికరం అనే మాట ఎక్కడ చూసినా కనబడుతుంది.మా పల్లె లో బీడీ,చుట్ట,సిగరెట్,జర్ద, లాంటివి అమ్మరు.మా పల్లె వాసులు పొగ త్రాగడాన్ని నిషేధించారు అని చెప్పడం చక్కగా ఉంది.
“పిల్లలందరిని బడి ఒడిలో చేర్చిన మా పల్లె
బడి అనగా విద్యాలయం.ఇక్కడ పిల్లలకు విద్యను బోధిస్తారు.విద్యను అభ్యసించే వారిని విద్యార్థులు అంటారు.విద్యను బోధించే వారిని ఉపాధ్యాయులు అంటారు.మా పల్లెలో పిల్లలంతా బడికి వెళ్లి చదువుకుంటారు.మా పల్లెలో ఉపాధ్యాయులు పిల్లలకు చక్కగా పాఠాలు చెపుతారు.పిల్లలంతా బడి ఒడిలోకి చేరి పాఠాలు నేర్చు కుంటారు.పల్లెవాసుల పిల్లలు అంతా చక్కగా బడికి చేరి విద్యను అభ్యసించడం మా పల్లె చేసుకున్న అదృష్టంగా భావించవచ్చు.
“ఇంటింటికి మరుగుదొడ్లను నిర్మించిన మా పల్లె.
మరుగుదొడ్డి అంటే మల విసర్జనకు ఉపయోగించే గది.ఈ సౌకర్యం లేనివారు మలవిసర్జన బయట ప్రదేశాల్లో చేస్తారు. మరుగుదొడ్లు లేకపోవడం వలన నీరు,గాలి,కాలుష్యమై విరేచనాలు,జీర్ణాశయ వ్యాధులు పెరిగి లక్షల మంది ప్రజలు ప్రతి సంవత్సరం చనిపోతున్నారు.మా పల్లెలో ప్రతి ఇంట మరుగుదొడ్డిని నిర్మించుకున్నారు.పాత కాలం రోజుల్లో ఎక్కడపడితే అక్కడ బహిరంగంగా మలవిసర్జన చేసే వారు. నేడు చక్కగా మరుగు దొడ్డిని నిర్మించుకొని వాటిని వాడుతూ పర్యావరణాన్ని మరియు ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.
“ఆడపిల్లను తమ ఇంటి లక్ష్మిగా
“చదువుల సరస్వతిగా చేస్తున్న మా పల్లె.
ఆడపిల్లలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు.ఆడపిల్లలు సాధికారత కలిగి పూర్తి రక్షణతో జీవించాల్సి ఉంటుంది. ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో జీవిస్తూ నవ సమాజ స్థాపనలో తమ వంతు పాత్రను నిర్వర్తించేందుకు అనుకూలమైన వాతావరణం మా పల్లెలో కల్పించబడింది.మా పల్లెలో ఆడపిల్లలు అనే వివక్షత లేదు.ఒకప్పుడు ఆడపిల్లలకు చదువు ఎందుకు అనే భావన ఉండేది.ఇప్పుడు మా పల్లెలో ఆడపిల్ల పుడితే మహా లక్ష్మిగా చూసుకుంటున్నారు.ఆడపిల్లను చక్కగా చదివించి చదువుల సరస్వతిని చేస్తున్నారు.ఆడపిల్లలు చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు.
“శాంతి సౌఖ్యాలకు నెలవైన మా పల్లె
మనుషుల జీవితాల్లో క్షోభ,దుఃఖం లేని స్థితిని శాంతిగా భావించవచ్చు.ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ సుఖం ఉంటుంది.శాంతి ఎక్కడ ఉంటే అక్కడ స్వర్గం ఉంటుంది. కోపం,దుఃఖం, ఈర్ష్య, అసూయ వంటివి లేకుండడమే శాంతి.ప్రపంచంలో అందరు సుఖాన్ని కోరుకుంటారు.ఎవరు కష్టాలు కావాలని కోరుకోరు.చాలామంది తాము అనుభవిస్తున్నది నిజమైన సుఖమని అనుకుంటారు.నిజానికి శాంతి లేనిదే సుఖం లభించదు.లేనిపోని అనవసర ఆలోచనలు విషయ లంపటాలపై ఆసక్తి,ఇత్యాదులను త్యజిస్తే శాంతి లభిస్తుంది.శాంతి అనగా తగాదాలు,యుద్ధాలు లేకుండా మానవులందరూ సఖ్యతగా మెలగడం.మా పల్లెలో జనాలు శాంతితో ఉంటు పరస్పరం సహకారమందించుకుంటూ సంతోషంగా ఉంటున్నారు అనే వాస్తవాన్ని తెలియజేయడం చక్కగా ఉంది.
“పిలుస్తుంది ఒక్కసారి వచ్చి పొమ్మని
మా పల్లె అందరిని పిలుస్తుంది.ఒక్కసారి వచ్చిపొమ్మని స్వాగతం చెబుతుంది.మా పల్లెకు ఒక్క సారి వచ్చినట్లయితే మా పల్లెను చూసినట్లయితే ఇట్లాంటి పల్లెలు లోకంలో ఎక్కడైనా ఉన్నాయా అని ఆశ్చర్యం కలగక మానదు.ఇట్లాంటి పల్లెలు ఉన్నాయని తెలపడానికి నారాయణ రెడ్డి (మానారె) చక్కటి కవితను అందించారు. నారాయణ రెడ్డి (మానారె) మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
మాదాడి నారాయణ రెడ్డి (మానారె) మర్రిపల్లి గూడెం గ్రామం, హుజురాబాద్ తాలూకా,కరీంనగర్ జిల్లాలో తేది 24-07-1940 రోజున సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు.తల్లిదండ్రులు రంగమ్మ, గోపాల్ రెడ్డి.నారాయణరెడ్డి తండ్రి గోపాల్ రెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. నారాయణరెడ్డి తాత నరసింహారెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు.
నారాయణ రెడ్డి 1 వ తరగతి నుంచి 4 వ తరగతి వరకు 1947 నుంచి 1951 మార్చి వరకు ప్రభుత్వ పాఠశాల బుట్టారెడ్డిగూడెం నామాంతరం గల మర్రిపల్లిగూడెం గ్రామంలో చదివారు.నారాయణ రెడ్డి మిడిల్ స్కూల్ ఐదవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు 1951 నుండి 1954 మార్చి వరకు ప్రభుత్వ పాఠశాల కమలాపూర్ గ్రామం, హుజురాబాద్ తాలూకా, కరీంనగర్ జిల్లాలో చదివారు. నారాయణరెడ్డి 8 వ తరగతి నుండి 9 వ తరగతి వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరకాలలో 1954 జూన్ నుండి1956 మార్చి వరకు చదివారు. నారాయణరెడ్డి పదవ తరగతి 1956 జూన్ నుండి 1957 మార్చి వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మంథని గ్రామంలో చదివారు. నారాయణరెడ్డి హెచ్.ఎస్.సి. ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.నారాయణరెడ్డి పి.యు.సి. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల,సుబేదారి,వరంగల్ లో 1957- 1958 వరకు చదివారు.నారాయణ రెడ్డి పి.యు.సి. తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.నారాయణ రెడ్డి బి.ఏ. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల,సుబేదారి, వరంగల్ లో చదివారు.నారాయణ రెడ్డి బి.ఏ. ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.నారాయణ రెడ్డి ఎం.ఏ. తెలుగు ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాదులో 1961 నుండి 1963 వరకు చదివారు.నారాయణరెడ్డి ‘ఏ” హాస్టల్లో ఉండి చదువుకున్నారు.నారాయణరెడ్డి ఎం.ఏ. తెలుగు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.నారాయణ రెడ్డి ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరీంనగర్ లో ట్యూటర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. నారాయణ రెడ్డి వివిధ హోదాల్లో పనిచేస్తూ .31-07-1998 రోజున ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరీంనగర్ లో ప్రిన్సిపల్ గా పదవి విరమణ చేశారు.నారాయణ రెడ్డి వివాహం 1959 వేసవికాలంలో శకుంతలతో జరిగింది.నారాయణ రెడ్డి శకుంతల దంపతులకు నలుగురు సంతానం.ముగ్గురు కుమారులు,ఒక కుమార్తె.
1)ప్రథమ సంతానం: రాంగోపాల్ రెడ్డి, భార్య రజిత. .2)ద్వితీయ సంతానం: విజయ్ పాల్ రెడ్డి, భార్య రుక్మిణి.
3)తృతీయ సంతానం: శ్రీధర్ రెడ్డి భార్య సబిత.
4)చతుర్థ సంతానం:కుందూరి వనజాదేవి,భర్త రఘువీర్ రెడ్డి.
నారాయణ రెడ్డి భార్య శకుంతల తేదీ 01-01-1986 రోజున ప్రమాదవశాత్తు ఈ లోకాన్ని వీడిపోయారు.
నారాయణ రెడ్డి ఉద్యోగ విరమణ అనంతరం వివిధ సాహిత్య మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారు. నారాయణ రెడ్డి విస్తృతంగా పుస్తకాలు అధ్యయనం చేస్తుంటారు.పుస్తక పఠనం తో సేద తీరుతున్నారు.
మాదాడి నారాయణ రెడ్డి (మానారె) వెలువరించిన గ్రంధాలు.
1) స్పందన కవితల సంపుటి.ముదిగొండ ఈశ్వర చరణ్,ముదిగొండ వీరేశలింగం,మాదాడి నారాయణరెడ్డి (మానారె) ముగ్గురు కవులు కవితలు రాశారు.
2) శైవలిని కవితా సంకలనం.నారాయణ రెడ్డి కవితా సంకలనంనకు సంపాదకత్వం వహించారు.ఇది ఆదిలాబాద్ జిల్లా రచయితల సంఘం ద్వారా ప్రచురింపబడింది.
3) అంకమ రాజు కథ కోలాటం పాట నవంబర్, 2001లో నారాయణ రెడ్డి (మానారె) ప్రచురించారు.
4) అదిలాబాద్ జిల్లా జానపద గేయాలు,మార్చి 2007లో నారాయణ రెడ్డి (మానారె) ప్రచురించారు.
5) ఆదిలాబాద్ జిల్లా జానపద గేయ స్రవంతి, జనవరి 2009లో నారాయణ రెడ్డి (మానారె) ప్రచురించారు.
నారాయణ రెడ్డి రాసిన వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
నారాయణ రెడ్డి సాహిత్య రంగంలో విశేష కృషికి నిదర్శనంగా సెమినార్లు మరియు కాన్ఫరెన్స్ లలో పాల్గొన్నారు.
నారాయణ రెడ్డి ఆకాశవాణిలో కూడా పాల్గొని ప్రసంగించారు.
నారాయణ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు ఉపన్యాసకులుగా విశిష్ట సేవలు అందించినందుకు గాను ఉత్తమ ఉపాధ్యాయుడిగా 1994 సంవత్సరంలో సర్టిఫికెట్ ప్రధానం చేశారు.
24-01-1999 రోజున ఉత్తమ ఉపాధ్యాయునిగా డాక్టర్ జె. రమణయ్య మెరిట్ అవార్డు సర్టిఫికెట్ ను పొందారు.
ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు పుస్తకానికి డిసెంబర్ 2007 లో బొందుగులపాటి అహల్య సుందర్రావు స్మారక సాహితీ గౌతమి,కరీంనగర్ వారి పురస్కారాన్ని అందుకున్నారు.
మై గిఫ్ట్ పురస్కార్ 2008 మై గిఫ్ట్ యువత సంస్థ నర్సింగాపూర్ చందుర్తి మండలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారు నారాయణ రెడ్డి కి పురస్కారం అందించి సన్మానించడం జరిగింది.
తేది 19-10-2018 రోజున ఆదిలాబాద్ జిల్లా ఆకాశవాణి 32వ వార్షికోత్సవం సందర్భంగా నారాయణ రెడ్డిని ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలపై చేసిన పరిశోధనలకు గుర్తింపుగా ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రం వారు ఘనంగా సత్కరించినారు.

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

తాత మనవడు

by Dr. Dhuta Rama Koteshwara rao September 15, 2023
written by Dr. Dhuta Rama Koteshwara rao

మీ మనవడికి జరిగిన ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది, కానీ ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్పాలి, తన తలకి బలంగా దెబ్బ తగలడం వలన, ఏక్షణమైన తను అతిగా బాధపడితే ప్రమాదం వెన్నంటే ఉన్నట్లుగా మీరు భావించాలి, అతడు ఎప్పుడూ ఆనందంగా ఉండేలా చూసుకోవాలి, తను అడిగింది కాదనకూడదు, తనకు మతిమరుపు కూడా రావచ్చు, ఇంకొకటి తన తలలో రక్తం గడ్డ కట్టుకొని ఉన్నది, దానివలన మీరు  చెప్పింది వింటాడని నమ్మకం కూడా లేదు, ప్రేమతోనే తన పక్కనే ఉంటూ చూసుకోవాలి, నేను ఇచ్చిన ఈ టాబ్లెట్స్ క్రమం తప్పకుండా వాడాలి.

డాక్టర్ ఒకవేళ్ళ తను మీరు ఇచ్చిన టాబ్లెట్స్ వెయ్యడానికి ప్రయత్నం చేస్తే, తను వేసుకోకపోతే అప్పుడు ఎలా?

మీరు చెప్పింది నిజమే ఎందుకంటే తనకు ఏమీ జరగలేదు అని, తనకు ఎటువంటి సమస్య లేదని, మొండికేసి కూర్చుంటారడు, ఒక్కోసారి ఎదుటిమనిషి వేసుకుంటే వీళ్ళు కూడా వేసుకుంటారు, అలా గాని మీ మనవడు నువ్వు వేసుకుంటే నేను వేసుకుంటా అనికూడా అనగలడు!

అలా అంటే సమస్య లేదు డాక్టర్, నా మనవడు కోసం కచ్చితంగా నేను మాత్రలు వేసుకుంటాను, అందులో సందేహం లేదు.

ఐతే మాకు ఎటువంటి సమస్య లేదు, మీరు ఖచ్చితంగా మీ మనవడితో ఈ టాబ్లెట్స్ వేయించాలి, మీరు పనిలో పడి మరచిపోకూడదు, మీరు మరచిపోతే చాలా కష్టం.

నేను అసలు మరచిపోను డాక్టర్.

ఇతడితో ఒకమనిషి ఎప్పుడూ ఉండాలి, ఇతని తల్లిదండ్రులు ఉంటారా ప్రక్కన.

లేదు డాక్టర్, వాళ్ళు పనిలో పడి మరచిపోతే కష్టం, ఇద్దరు ఆఫీసుకి వెల్లుతారు, కనుక నేను నా మనవడికి తోడుగా ఉంటాను. ఇంకొక సందేహం ఒకవెళ్ళ కాలేజీకి వెల్లుతా అంటే అప్పుడు ఎలా డాక్టర్.

ఇప్పుడే అనకపోవచ్చు, ఒకవేళ్ళ  అంటే మాత్రం, మీ మనవడుని తొందరగా కొలుకుంటాడు అని మాత్రం చెప్పగలను.

డాక్టర్ గారికి దణ్ణం పెట్టి, మనవడుని తీసుకొని ఇంటికి బయలుదేరినాడు కోటయ్య.

అసలే వయసు మళ్ళిన వాడిని, ఒకపక్క తల్లిదండ్రులు కూడా దగ్గరలో లేరు, నాకు గుర్తుండటమే అంతంత మాత్రం, అలాంటిది ఇప్పుడు నా మనవడు ఇలా ఉంటే, నేను వాడికి సరైన సమయంలో ఈ టాబ్లెట్స్ ఎలా వెయ్యాలి, వాడిని ఆనందంగా ఎలా ఉంచాలి, తల అంతా ఆలోచనలతో పిచ్చేక్కిపోతుంది, చిన్నతనం నుండే కష్టాలు కన్నీళ్లు అలవాటు అయ్యినాయి కనుక, జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా, చుట్టూ జనం ఉన్నా సరే, ఒంటరిగా బ్రతికినా, ఏ రోజు కన్నీరు రాలేదు, తాత చనిపోయే క్షణాల్లోనే అత్తయ్య కూతురుతో తాత కోసం, నాన్న పెళ్లి చేయడం, అసలు పెళ్లంటే ఏమిటో తెలియని వయసులోనే పెళ్లి చేయడం, తాతయ్య కంటే ముందే అమ్మానాన్నలు మరణించడం, ఆ దిగులుతో తాత కూడా మరణించడం, నాయనమ్మ అన్నీ తానై చూసుకుంది, కొద్దిరోజులకు ఆమె కాలం చెయ్యడంతో, ఇద్దరమే జీవితంతో పోరాటం మొదలుపెట్టినాము, ఆ రోజు నుండి ఏ రోజు కూడా నాకు ఇది కావాలి అని అడగలేదు, నేను ఏది చెబితే అదే కరెక్ట్ అనేది, ఆవేశంగా మాట్లాడితే శాంతంగా సమాధానం చెప్పేది, కోపంలో కొట్టితే చిరునవ్వు నవ్వేది, అలిగితే బ్రతిమిలాడేది, ఎన్నో కష్టాలు ఓర్చుకొని జీవితాన్ని సరైన మార్గంలో నడిపించిన దేవత నా భార్య, కొడుకు పుట్టాడు, వాడి భవిష్యత్ కోసం పాకులాటలు, వాడి జీవితాన్ని సక్రమమైన మార్గంలో పెట్టేటందుకు ఎన్నో సమస్యలు, ఐనా వాడిని ఉన్నత చదువులు చదివించి, ఓ మంచి కుటుంబంలో అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేయించడం జరిగింది, తరువాత వీడు పుట్టాడు, వీడిని చూసిన తర్వాత నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది, జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని, నన్ను భర్తలా కంటే కన్న బిడ్డలా చూసుకున్న నా ఇంటి దేవత నన్ను వదిలివెళ్లిపోయిన తరువాత నేను ఒంటరిగా మిగిలిపోయాను, అప్పుడు నా బాధను తొలిగించింది నా మనవడు, వీడు నన్ను తాత అని పిలవడం కంటే ఎప్పుడూ బ్రో అంటూ పిలిచేవాడు, వాడు నన్ను బ్రో అంటూ, నాకు ప్యాంటు షర్ట్, తలకు రంగు వేసేవాడు, బ్రో అలా బయటకు వెల్లుదాం అనేవాడు, అలా నన్ను ఎప్పుడూ నవ్వించే నా చిట్టి తండ్రి, ఈ రోజు ఇలా ఉండటం ఎంతో బాధగా ఉంది, ఇంతలో సార్ ఇంటికి వచ్చాము అన్న మాటతో ఈ లోకంలోకి వచ్చాడు కోటయ్య, తన మనవడుని తీసుకొని లోపలికి వెళ్ళాడు.

వయసు రీత్యా మతిమరుపు రావడం సహజం, కనుక తన మనవడికి టాబ్లెట్స్ టైంకి వెయ్యాలి కనుక, బయటకు వెళ్లి ఎలక్ట్రిక్ షాపులో ఒక పరికరాన్ని తీసుకొచ్చాడు, దానికి ఒక సమయం కేటాయిస్తే, ఆ సమయానికి టాబ్లెట్ వేయాలి, టాబ్లెట్ వేయాలి అని చెప్పుతుంది, అప్పుడు టాబ్లెట్ వేయవచ్చు అని ఆ పరికరాన్ని తీసుకొచ్చి పెట్టాడు కోటయ్య, తన మనవడి పేరు రాము.

డాక్టర్ చెప్పినట్లుగానే రాము నువ్వు వేసుకుంటేనే నేను వేసుకుంటాను అని చెప్పడంతో కోటయ్య కూడా టాబ్లెట్స్ వేసుకోవడం చేస్తూ ఉన్నాడు, రాము ఏది చేయమంటే కోటయ్య అది చేస్తూ ఉండేవాడు, కొద్దిగా కోలుకున్న రాము బ్రో కాలేజీకి పోదామా అన్నాడు ఒకరోజు, సరే రెండు రోజుల్లో వెల్లుదాం అని చెప్పాడు. అదే రోజు డాక్టర్ ని కలిసి డాక్టర్ రాము నన్ను కాలేజీకి రమ్మంటున్నాడు ఎలా అని అడగడంతో ఆలోచనలో పడ్డాడు డాక్టర్ గారు.

కొద్దీ సేపటికి ఫోన్లో ఎవరితోనో మాట్లాడి, చూడండి కోటయ్యగారు నేను రాము వెళ్లే కాలేజీ యాజమాన్యంతో మాట్లాడినాను, మీరు కూడా కాలేజీకి వెళ్ళవచ్చు అన్నాడు.

డాక్టర్ నేను ఈ వయసులో కాలేజీకి వెళ్లడం ఏమిటి ఆశ్చర్యంతో అన్నాడు.

తప్పు ఏముంది, మీ మనవడికి తోడుగా వెళుతున్నారు అనుకోండి. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఒకవేళ్ళ తను ఒక్కడే కాలేజీకి వెళ్ళితే, మధ్యలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే అప్పుడు బాధపడేది ఎవరు ఒక్కసారి ఆలోచించండి?

మీరు చెప్పింది నిజమే కానీ, ఇంట్లో అంటే ఎదో అలా నెట్టుకొని వస్తున్నాను, ఇప్పుడు కాలేజీకి అంటేనే కొంచెం ఆలోచించవలసి వస్తుంది దిగులుగా అన్నాడు.

ఇక్కడ ఆలోచించవలసింది ఒక్కటే, నీ మనవడు కోసం నువ్వు ఏమి చెయ్యగలవో అవి చెయ్యండి, ఆలోచనతో మీరు ఆందోళన పడి, మీ మనవడ్ని ఆందోళనకు గురిచేయకండి. మీరు ఎంత సంతోషంగా ఉంటారో, మీ మనవడు అంతే సంతోషంగా ఉంటాడు మీరు కొంచెం ఆందోళన చెందినా, మీ ముఖంలో కొంచెం విచారణ కనిపించినా మీ మనవడు ఎంతో బాధ అనుభవించవలసి రావచ్చు. ఒక డాక్టర్ గా కాదు, సాటి మనిషిగా చెబుతున్నా, మీరు ఇప్పటివరకు చూపిన శ్రద్ధ వల్లనే తాను మాములు మనిషి అవ్వుతున్నాడు అర్ధం చేసుకో అన్నాడు.

క్షమించండి డాక్టర్ నా మనవడు కోసం నేను ప్రాణాలు అయినా ఇస్తాను, నేను వెల్లుతాను కాలేజీకి అన్నాడు.

హాయ్ బ్రో ఎక్కడికి వెళ్లావు, ఈ రోజు మనం షాపింగ్ చెయ్యాలి, అంతే కాకుండా స్మార్టుగా తయారు అవ్వాలి, రేపటి నుండి కాలేజీకి వెళ్ళాలి అన్నాడు రాము.

అలాగే రాము వెల్లుదాం అన్నాడు కోటయ్య.

షాపింగ్ చేశారు, హెయిర్ కటింగ్ చేయించుకున్నారు ఇద్దరు, హెయిర్ కి ఇద్దరు ఒకే విధంగా కలర్ వేయించుకున్నారు, మంచి మంచి డ్రెస్సులు తీసుకున్నారు, అలా హోటల్ లో భోజనం చేసి ఇంటికి సాయంత్రం వచ్చారు.

ఇద్దరు ప్యాంటు షర్ట్స్ వేసుకొని, బైక్ మీద కాలేజీకి వెళ్లినారు, ఇక రోజూ కాలేజ్, వారం వారం సినిమాలు, ఒక్కటే ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. ఎక్కడికి వెళ్లినా మై బ్రదర్ అని పరిచయం చేయడం మొదలుపెట్టాడు రాము, కోటయ్య కూడా మౌనంగా తలఊపేవాడు. కోటయ్య పేరుని రాకీ గా మార్చివేశాడు. రాము ఎప్పుడూ నవ్వుతూ ఉండటంతో, రాకీ కూడా అంతే నవ్వుతూ ఉండేవాడు, కాలేజీలో అల్లరి బాగా చేసేవాడు రాకీ, రాము కూడా సపోర్ట్ చేసేవాడు, ఒక్కోసారి వాళ్ళ ఇద్దరిని చూస్తుంటే కవలపిల్లలుగా ఉండేవారు, ఏ విషయానైన చాలా తేలికగా తీసుకునేవాడు రాకీ.

అలా రెండు సంవత్సరాలు గడిచిపోయినాయి..

ఒకరోజు రాము వాళ్ళ అమ్మానాన్నలు వచ్చారు, ఇంట్లో రాము లేడు, రాకీ ఒక్కడే ఉన్నాడు, రాకీ వాళ్ళను చూసి కొంచెం సంశయించినాడు, చూడు బాబు మా అబ్బాయి రాము ఎక్కడా అని ఆడిగినాడు,

రాము బయటకు వెళ్ళాడు అని చెప్పాడు..

ఇంతకీ నువ్వు ఎవరు? సందేహంతో అడిగింది రాము అమ్మ.

నేను రాము స్నేహితుడిని అని చెప్పినాడు రాకీ, తల పక్కకు తిప్పుకోని.

అనుమానంతో రాము తండ్రి వచ్చి రాకీ ముఖంలోకి చూశాడు, అంతే పట్టరాని కోపంతో ఊగిపోయాడు.

నాకు తెలుసు రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పులేదని, వాడికి ముందునుండే చెబుతున్నాను, ఈ ముసలోడిని ఇంట్లోకి రానివ్వవద్దు అని, ఫోన్ చేసి మాట్లాడిన ప్రతిసారి నా దగ్గరలేడు, నేను తాతను చూడక చాలారోజుల అయ్యింది అని చెప్పేవాడు, ఈయన గారిని ఏకంగా ఇంట్లోనే పెట్టాడు, ఐనా మనం అన్ని సార్లు వచ్చినా కనిపించలేదు అంటే, మనం వస్తున్నాము అని తెలుసుకొని ఆ సమయానికి ఎక్కడో ఉంచేవాడు అనుకుంటా! ఏమి బ్రతుకు మీది సిగ్గు శరం ఏమీ లేదా, మీ వయస్సు ఎక్కడ, వాడి వయస్సు ఎక్కడ, మీరు వాడి బట్టలు వేసుకొని, ఈ వయస్సులో తైతక్కలు అడుతున్నారా, మీరు వాడి స్నేహితుడు అని చెప్పుకొని తిరుగుతున్నారా, అసలు మిమ్మల్ని ఎలా తిట్టాలో కూడా అర్ధం కావడం లేదు అన్నాడు రాము తండ్రి.

అది కాదురా, రాముకి యాక్సిడెంట్ అయ్యితే, డాక్టర్ రాముకి ప్రమాదం అని చెబితే, వాడు ఏది చెబితే అది చేశానురా, నాకు ఇలా ఉండాలి ఏమీ లేదురా అన్నాడు కొడుకుతో కోటయ్య.

ఛీ నోరుముయ్యి, వాడికి యాక్సిడెంట్ జరిగింది అని ఎందుకు నాన్న అబద్దాలు మాట్లాడుతున్నావు, ఇప్పటి వరకు మిమ్మల్ని బయటకు పంపించి వెయ్యాలి అనే ఉండేది, నా కొడుకుకి యాక్సిడెంట్ అని చెప్పినప్పుడే నా దృష్టిలో మీరు చచ్చిపోయారు, ఐనా ఇంట్లో ఉన్న ఇద్దరం నువ్వు మాకు వద్దు, మా ఇంట్లో ఉండొద్దు, అని నెత్తి నోరు కొట్టుకొని చెబుతున్నా, కుక్కలా ఇంట్లో ఉండటానికి సిగ్గులేదు.

వస్తున్న కన్నీరు తూడ్చుకుంటూ, మాట తడబాటులో కూడా, నిజంగా వా..డి.. కి యాక్సిడెంట్ జరిగింది, అందుకే వాడిని కాపాడుకుంటూ ఉన్నానురా!

వాడిని చూసుకోవడానికి చిటికేస్తే వెయ్యి మంది క్యూలో ఉంటారు, ముసలివాడి సేవకావలసి వచ్చిందా, ఐనా నిన్న కాదు వాడిని అనాలి, అమ్మ పోయినప్పుడే నువ్వు పోతే పోయేది, ఎదో దేశంలో ముసలివాళ్ళని కాల్చి చంపుతారు అంట, నాకు అవకాశం రాలేదు కానీ నిన్ను కూడా కాల్చి చంపేవాడిని, ఆరోజు నువ్వు నా భార్య మీద చెయ్యివేసినప్పుడే!

నీ పెళ్ళాం మాట నమ్ముతున్నావు గాని, కన్న తండ్రి మాట నమ్మడం లేదా, కోడలు కూతురితో సమానంరా, అని కోపంతో చెయ్యొ ఎత్తాడు రాము తండ్రి పైన.

నా భర్త పైనే చెయ్యొ ఎత్తుతావా అంటూ కోపంతో చెంప మీద కొట్టి గట్టిగా క్రిందకు నెట్టింది, రాము తల్లి.

క్రిందపడగానే తలకి గట్టిగా దెబ్బ తగలడం, ఇంతలో హార్ట్ ఎటాక్ రావడంతో కొట్టుకుంటున్న కోటయ్యను పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయారు ఇద్దరు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన పనిమనిషి జరిగింది అంతా చూసి, వెంటనే రాముకి ఫోన్ చేసి చెప్పింది, రాము అంబులెన్స్ కి ఫోన్ చేసి, ఇంటికి వచ్చి తాతయ్యను తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళాడు.

కొద్దిసేపటికి ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్పాడు డాక్టర్ గారు.

హమ్మయ్య అనుకొంటూ ఉండగానే రాము తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చారు. రావడం రావడంతోనే ఆవేశంగా..

రాము ఏమి చేస్తున్నావు ఇక్కడ, వాడు చస్తే చావనియ్యాలసింది పోయి ఎందుకు తీసుకొచ్చావురా అన్నది కోపంతో రాము తల్లి.

చూడు మమ్మి నువ్వు మాట్లాడటానికి అసలు అనర్హురాలివి, అదీ తాతయ్య గురించి మాట్లాడే అదికారం కూడా నీకు లేదు, ఇంకొక్క మాట తాత గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు జాగ్రత్త!

ఎరా అమ్మని తిట్టే గొప్పోడివా అన్నాడు రాము తండ్రి.

కొద్దిసేపటికి రాము స్నేహితులు వచ్చారు.

ఏమైంది రాము ఏంటి ఇదంతా, రాకీ కి ఎదో జరిగింది అని తెలిసింది, అసలు రాకీ ఎవరు? మీ అమ్మానాన్నలతో ఈ గొడవలు ఏమిటి? నువ్వు అమ్మానాన్నలను తిట్టడం ఏమిటి? అసలు ఒక్కముక్క అర్ధం కావడం లేదు అసలు ఏమి జరిగింది అన్నారు స్నేహితులు.

నేను చెబుతాను అన్నాడు డాక్టర్.

రాము వాళ్ళ తాతయ్య మీరు ఇప్పుడు చూస్తున్న ఈ రాకీ. రాకీ అసలు పేరు కోటయ్య. కోటయ్య భార్య చనిపోయిన తరువాత, కోటయ్యను కొట్టడంతో తలలో రక్తం గట్టకట్టుకొనిపోయింది, అలా దెబ్బలతో ఉన్నవాడిని రోడ్డు మీద వదిలివేశారు రాము తల్లిదండ్రులు. ఇక అప్పటి నుండి ఆ ఇంట్లో ఉండకుండా దూరంగా కిరాయికి ఉంటూ ఉన్నారు, విషయం తెలిసి తాతయ్య కోసం ఎన్నో చోట్ల తిరిగినాడు, పదిహేనురోజులు తరువాత రోడ్డు మీద ఆడుకుంటూ కనిపించిన తాతయ్యను తీసుకొని మా ఆసుపత్రిలో జాయిన్ చేయించినాడు. అప్పుడే ట్రీట్మెంట్ చేయకపోవడంతో  సమస్య పెద్దది అయ్యింది కోటయ్యకు.
రెండు నెలల తరువాత మాములుగా అయ్యాడు కోటయ్య, తాతయ్యను తీసుకొని పాత ఇంట్లో ఉంటూ, తాతను అమ్మానాన్నలకు కనపడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు, అనుకోకుండా అమ్మానాన్నలు అమెరికా వెళ్లవసివచ్చింది, సుమారు ఆరునెలల అక్కడే ఉంటారు అని తెలుసుకున్నాడు, కోటయ్యకు జ్ఞాపకశక్తి లేకుండా పోతుంది, ఏదీ గుర్తు ఉండటం లేదు ఒక్క రాము తప్ప అన్నీ మరచిపోతున్నాడు. ఇదే విషయం నా దగ్గర ప్రస్తావించాడు రాము, అంతే కాకుండా టాబ్లెట్స్ కూడా వేసుకోవడం లేదు అని చెప్పడం, తలలో ఉన్న ఆ గడ్డ కట్టిన రక్తం వలన ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చు అని తెలియడంతో, ఇక క్రొత్త ట్రీట్మెంట్ చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నాను,  తాతయ్య నాకోసం ఏమైనా చేస్తాడు అని చెప్పడంతో, నాకు ఒక ఆలోచన వచ్చింది అదే రాముకి యాక్సిడెంట్ అయ్యింది అని మేము కోటయ్యకి చెప్పడం, అప్పటి నుండి రాము కోసం కోటయ్య టాబ్లెట్స్ వేసుకోవడం జరిగింది, ఇక్కడ విషయం ఏమిటంటే తాతయ్య కోసం రాము టాబ్లెట్స్ వేసుకోవడం, రాము తాతయ్యను కాలేజీకి తీసుకెళుతా అన్నాడు, సమస్యలు వస్తాయి అంటే నేను చేసుకుంటా అని చెప్పాడు.

అనుకున్నట్లుగానే రాము కాలేజీ యాజమాన్యంతో మాట్లాడినాడు, కోటయ్యే నాదగ్గరకు వచ్చేటట్లు చేశాడు, ఆరోజు నేను రాముతో మాట్లాడి విషయం నిర్దారణ చేసుకున్న తరువాతే, నేనే యాజమాన్యంతో మాట్లాడినాను అని చెప్పినాను, ఎక్కడ తాతయ్య దూరం అవ్వుతాడో అని అనుక్షణం తన పక్కనే ఉన్నాడు, ఈ వయసులో మనవడి కోసం తాత, తాత కోసం మనవడు, ఎంతో కష్టపడ్డారు. ఇలాంటి తాత మనవడిని ఎక్కడా చూడలేదు, మీకు నిజం చెప్పనా, తన తలలో గడ్డ కట్టిన రక్తం వల్ల, నేను ఆరునెలలు కంటే బ్రతకడు అని చెప్పాను, కానీ రెండుసంవత్సరాలుగా ఆ తాతను ఆనందంగా ఉంచి తన ఆయుస్సు పెంచాడు అని స్నేహితులకు వివరించాడు డాక్టర్.

స్నేహితులు రాముని గట్టిగా కౌగిలించుకున్నారు.

వెనుకనే కన్నీరు తుడుచుకుంటూ నిలబడ్డాడు కోటయ్య.

తాతయ్యను చూసి వెళ్లి గట్టిగా కౌగిలించుకున్నాడు రాము.

ఎందుకురా.. నాన్న నేనంటే అంత పిచ్చి అంటూ బోరున ఏడ్చాడు కోటయ్య.

తాతయ్య ఏడుస్తుంటే రాము కూడా బోరు బోరున ఏడ్చాడు.

అంతే అచేతనంగా అలా కుప్పకూలిపోయాడు కోటయ్య..

వెనువెంటనే స్పందించిన డాక్టర్, ఆపరీషన్ థియేటర్ కి తీసుకెళ్లారు, అందరూ రాముని ఓదార్చుతున్నారు.

కొన్ని గంటల తరువాత డాక్టర్ గారు బయటకు వచ్చారు, రాము ఇక తాతయ్యకి ఎటువంటి ప్రమాదం లేదు, ఆపరీషన్ సక్సెస్ అయ్యింది అన్నాడు, అంతే రాము డాక్టర్ గారి కాళ్లకు దణ్ణం పెట్టాడు, రాముని పైకి తీసుకొని కౌగిలించుకున్నాడు డాక్టర్. మీ తాతయ్య నీకోసమే బ్రతికినాడు అన్నాడు.

ఇరవై నాలుగు గంటల తరువాత.. తాతయ్యతో మాట్లాడినాడు రాము.

ఆసుపత్రిలో C C కెమెరాలో రికార్డు అయ్యిన వీడియోలు వైరల్ అయ్యినాయి, రాముని అందరూ మెచ్చుకున్నారు, రాము తల్లిదండ్రులు పనిచేసే కంపనిలో నుండి తీసివేశారు, కారణం వీడియోలు వైరల్ అయ్యినవి వారివే కావడం.

మరల రాము, మన కోటయ్య సారి సారి… రాకీ కలసి ఎంతో ఆనందంగా ఉన్నారు, త్వరలో రాముకి పెళ్లి చెయ్యాలి అని రాకీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు, ఈ విషయం తెలిసిన రాము రాకీ కి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు.

వీరిద్దరూ కాలేజీకి వెళ్లడం, సినిమాలకు వెళ్లడం సర్వసాధారణం అయ్యింది. కానీ రాకీ కి సిక్స్ ప్యాక్ తీసుకొని రావాలని రాము రాకీని జిమ్ కి తీసుకెళుతున్నాడు. రోజూ రాకీ చేత బరువులు మొయిస్తూ ఉన్నాడు, రాము కోరితే జిమ్ముకే కాదు, నరకానికైనా వస్తాడు రాకీ.

రాకీకి బైకు నేర్పించాడు, చదువు నేర్పించాడు, ఒక్కటా రెండా, ఎవ్వరూ గురించలేని విధంగా మార్చి చూపించాడు రాము.

జరుగుతున్న పరిణామాలు చూస్తూ, ఈ పోటీ ప్రపంచంలో పడి పరిగెడుతూ ఉన్న వాళ్ళు, ఒక్కసారి ఇంట్లో ఉన్న మీ ముసలి తల్లిదండ్రులను కూడా చూసుకోండి, మనం ఎన్నో వీడియోలు చూస్తున్నాము, కన్నతల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవడం కొడుకులుగా మన బాధ్యత అని గుర్తించాలి, ఇలాంటి కొడుకు కోడలిగా మీరు ఉండకూడదని నా ప్రార్ధన. అందరికీ రాములాంటి మనవడు దొరకడు కనుక పిల్లలే తల్లిదండ్రులు ప్రేమగా చూసుకోవాలి అని, చూసుకుంటారు అని ఆశిస్తున్నాను.

ఇది నా స్వీయ రచన.. అనువాదం అనుకరణ కాదు అని హామీ ఇస్తున్నాను.

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

వందేభారతం!

by Ramesh September 15, 2023
written by Ramesh

రెండే రెండు నదులు
కులం,మతం
దేశమంతటా ప్రవహిస్తున్నాయ్

మతం అహంకార దౌర్జన్యాలు
కులం వెర్రితలల దాష్టీకాలు
కులమతాల
అర్థంలేని పంతాలుపట్టింపులకు
మనుగడ అద్దం నిరసన తెలుపుతుంది
చిట్లిన పగుళ్లు అద్దం ముక్కల్లో చూడగలమా రేపటి భవిష్యత్తు
కోపతాపాల మనిషి
పగలు ప్రతీకారాలు
మృతదేహాం ముక్కలుముక్కలు
రక్తపాతం సృష్టిస్తు కనిపించని యుద్ధాలవుతున్నవి
ఆధునిక కులమత ఘర్షణల హత్యాభారతం ఇది!
ఏమిటో ఈ ఘోరం?
ఈ మృగత్వం?
ఎవ్వరి వారసత్వం ఈ రాక్షసత్వం?
చట్టాలు,న్యాయాలు కోర్టులు
కళ్లులేని న్యాయదేవత ముందు
బెయిల్లు మంజూరులు మతలబులు
శిక్షలు శతాబ్దాల పడిగాపులు
చర్చలు నింపాది తతంగాలు
వాతావరణం మారి బతుకు ఆవరణ అవుతున్నది
అంతలోనే నల్లని మబ్బులు కమ్ముతాయ్
పెనుతుఫానులు చెలరేగుతాయ్
రక్తపాతము ఉప్పొంగి పారుతుంది
కులమతాల కుమ్ములాటలో
దుఃఖం ఇక్కడ ఒడవని ముచ్చట
కన్నీరు ఉపనదిగా ఉద్భవిస్తుంది
మతం గతం కాదు
అసలు అర్థం కాబోదు
కులమెప్పుడూ ముసలమే
సుజలాం సుఫలాం
పాటలకే పరిమితం

ప్రవహించే కాలంతో పాటు
ఈ సంఘర్షణలు
కలకాలం వెంటాడే వేటాడే

పవిత్రమతగ్రంధాల సారం అరణ్య రోదన
ఐక్యత ఇక్కడ కాంతిసంవత్సరాలదూరం

ఈ అంతర్యుద్ధం ఆరని కాష్టం
దేశీయుల గుండెల్లో
అసంతృప్తజ్వాలలే నిరంతరం!

ఈ స్వేచ్ఛాలోకంలో
మంచీచెడ్డలు మరచి
ప్రేమ,సహనం విడిచి
చెలరేగుతున్న దుర్మార్గులు
ఈ దమనకాండల రక్తపుటేరులు
అతిపెద్ద నదిగా అవతరించే దిశగా
నా భారతదేశం అడుగులు వేస్తుంటే
సిగ్గువేస్తుంది నాకు
వందేభారతం
ఇప్పుడు రక్తంచిందే భారతం!
ఈ నెత్తుటి భారతం
ఇంకా ఎన్నాళ్లు?
ఈ రక్తపాత ఉపద్రవం ఉప్పెనై ముంచకముందే
దేశ మనుగడకోసం
కలసినడవాలి మనం

మంచిది కాదు ప్రజామౌనం
దేశప్రజలారా !
ఆలోచించండి పోయేదేముంది
మేల్కొనండి అంతా వచ్చేదేమరి
చైతన్యం అడుగుల సవ్వడి
ఆదర్శ ఆలోచనల ఝరి

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

అన్నపూర్ణ [ ఏకాంక రూపం]

by Oddiraju Seetharamachandra Rao September 15, 2023
written by Oddiraju Seetharamachandra Rao

రచన : ఒద్దిరాజు సీతారామచంద్రరావు, సరళీకృతం : రంగరాజు పద్మజ

ఒకటవ ప్రదేశం:- ఓరుగల్లు కోట వెలుపల.
ప్రవేశం :- (ఏకాంబరుడు)

ఏకాంబరుడు — (స్వగతం) నేను నిర్ణయించింది ఇంత వరకు జరగకుండా ఉండలేదు. మాలికఫూర్ దండయాత్రను ఈసారి ఎదుర్కోవడం కష్టంగా ఉంది. హిందువులకు గెలుపు ఈసారి తప్పక కలుగుతుందని సూచనగా కూడా కనబడడంలేదు. సమయానుకులంగా మెలగాలి. ఆబీదు ఖానుతో నేను కుదుర్చిన సంధి ప్రస్తుతానికి ఉపయోగకరమే!( ఆలోచించి) కాకపోతే తక్కిన నా లాంటి వారిలో ఒకడిని. ఇంట్లో కూచుని చక్కగా ఆలోచించడానికి కవకాశం లేదు.
[ ఇంటివైపు నడుస్తూ…..]

( రఘుపతి దారిలో కనపడ్డాడు)
రఘుపతి —ఏమిటి? ఏకాంబర స్వామీ? ఏదైనా ఆపద వచ్చిందా? అలా ఉన్నారు?
ఏకా :– అవును! అనేదే వచ్చింది. సభలో జరిగిన సూచనల ప్రకారం నడుచుకున్నా.
రఘు :– కాయా? పండా?
ఏకా:—పండే! కానీ.. ఇంకా…
రఘు:– నీ మనసు పండలేదా ?
ఏకా :– [ ఆలోచనతో… అర్ధమైనట్లు తల ఆడించాడు]
రఘు :– చేసిన ప్రమాణం ఏమైంది ?
ఏకా :— అయ్యేది దేశద్రోహమే ?
రఘు :— [ కొంచెమాలోచించి] మంచిది! జరిగిన విషయం.. చేసిన ప్రతిజ్ఞ… కావలసిన పని… రాబోయే ఫలితం… మొదలైనవి చక్కగ ఆలోచించుకో! నాకు తొందర పని ఉంది. నేను పోయివస్తా!
ఏకా:– ఏ మాత్రమైన ఆశయముంటే మనం ఇలా చేయవద్దు!
రఘు:– నేను పోయి వస్తా. నీకు పిచ్చి ఎక్కుతున్నది. హిందువులు తప్పక ఓడిపోతారు. [వెళ్ళిపోతాడు]
ఏకా:– ఏకో దేవః కేశవోవా, శివోవా [ వెళ్ళిపోయాడు]

రెండవ ప్రదేశం :–

(ఏకాంబరుని ఇంటి మేడ)

ప్రవేశం: అన్నపూర్ణ.

అన్నపూర్ణ [ దుఃఖంతో ] ఏ దేశం వారైనా తన దేశం అశాంతిలో ఉన్నప్పుడు ప్రాణాలర్పించైనా సరే సరిదిద్దుకుంటారు. అలా కాక ఆ విషయం గురించి ఆలోచించడమో- పనిచేయడమో చేయక ఆ దేశపు వారే తమ దేశాన్ని ముస్లింలనే మంటలలో పడవేస్తున్నప్పుడు ఇక కాపాడేదెవరు. ఆ దేవుడే దిక్కు!
మంచి తెలివైన ఆలోచనలు చేయగల బృహస్పతల వంటి మంత్రులు ఎత్తుగడలన్నిటినీ దేశ విప్లవ కారులైన నీచుడి సహాయంతో చక్రవర్తి సైన్యం నాశనమౌవుతోంది. [ ఏడుస్తూ ] కష్టం మీద కష్టం ! వస్తోంది. నేను చూసిన దాన్ని బట్టి చేసిన ఆలోచిస్తే కారణాలే లేన్నట్లు అనిపిస్తుందా? అనిపిస్తే నేనేమి చేయాలి? పతివ్రతగా ఉండడమా? దేశాభిమానం చూపడమా ! [ విచారించి] దుఃఖంతోనూ; స్త్రీల స్వభావ దృష్టితోనూ; ధైర్యంతోనూ; పురుషభావంతోనూ ” నేను స్త్రీనైనా కాలానికి తగినట్టు… ఈ సమయంలో , అనుకున్న పని చేయాలనుకోవడం వల్ల రానున్న చెడుపేరుకు శాంతంగా “తల వంచుకోవలసిందే!.
[ వెనుక వైపు తిరిగి చూస్తే ఏకాంబరుడు వస్తూ కనబడ్డాడు.]
ఏకా:—దగ్గరకు వచ్చాడు.
అన్న:– [ భర్త వైపుచూసి కళ్ళలో కమ్మిన నీరు లోపల లోపలనే దాచుకొని.]
ఏకా:– [సందేహంతో కూడుకొన్న కంఠంతో]
ప్రియా! ఎందుకో .. ఏమిటో ఆలోచిస్తున్నట్టనిపిస్తున్నది.
అన్నపూర్ణ:– [ స్వగతం] లోలోన[ పైకి ]
విచారించుటకు వేరే విషయమేముంది? ఓరుగల్లులోనే కాదు! ఆంధ్ర దేశం మొత్తం అట్టుడుకుతున్న విషయమే! మాలిక్ కఫూర్ ముట్టడి గురించి…..
ఏకా:- నీకు దాని వల్ల కలిగిన… కలిగే అపాయమేముంది?
అన్నపూర్ణ:– ఆత్మకు కలిగిన అపాయాలు అవయవాలకు మాత్రం కాదా?
ఏకా:– ఆత్మ- అవయవాలనే భావం స్వదేశీయుల మధ్య ఉంటే కదా?
అన్నపూర్ణ:— ఉండడం మంచిదా? ఉండకపోవడం మంచిదా!తలరాతలనుకోవాలా!
ఏకా:— తలరాత లెక్కడివి? సమయాన్నిబట్టి తలరాత మారుతుంది.
అన్నపూర్ణ:– తలరాత మారితే ప్రకృతి మారుతుందా?
ఏకా:— ఏమిటీ ? అలా అడుగుతున్నావ్? మారాల్సి వస్తే మారడమే! అంతకంటే గత్యంతరం ఉంటుందా?
అన్నపూర్ణ:– గతిలేకపోతే మారడం సరియైనదే కావచ్చు! కాని, ఏదైనా మార్గం ఉన్నప్పుడు మారడం ఎందుకు?
ఏకా:– మారడం చేతగాని వారికి స్వాతంత్య్రం ఎక్కడుంటుంది?
అన్నపూర్ణ:—- జాతి, లింగ భేదం లేక నీ బాటను నడవడం [ నిన్నసరించడం] సరియైనదేనా?
ఏకా:— ఔను!
అన్నపూర్ణ:— అయితే మీరు మిమ్మల్ని మార్చుకున్నారా?
ఏకా:— పూర్తిగా .
అన్నపూర్ణ:— ఐతే నేనో?
ఏకా:– నీ ఇష్టంగా నిన్ను మార్చుకో!
అన్నపూర్ణ:– [ లోలోన ] పెద్ద అడ్డుతొలగింది. [ పైకి ] మీ యాజ్ఞ నేను తలదాలుస్తాను.. ఇప్పటికి ఒక బెంగ తీరింది.
ఏకా:– ఇంకా నీకు రంధి ఎందుకు?
అన్నపూర్ణ:— ఏమీలేదు! మీరు చేస్తున్న పని గురించి..
ఏకా:– [ లోలోపల] స్త్రీలు చాలా తెలివైన వారు చక్కగా ఆలోచిస్తారు.. నేను చెప్పకుండానే నా తీరు కనిపెట్టినట్టున్నది. [ పైకి] నేనేం చేస్తున్నానో నీకు తెలుసా?
అన్నపూర్ణ:– నిద్రాహారాలు లేకుండా…
ఏకా :— అనుమానం ఎందుకు?ఏం అడగాలనుకుంటున్నావో అడుగు!
అన్నపూర్ణ:– ఇంటికిరాక… ఎక్కడెక్కడో ఎందుకు తిరుగుతున్నారని?
ఏకా:— ఊరిపై ఊరు పడినట్లున్నప్పుడు నిద్ర… ఆహారం… ఇల్లు… సంసారం…. ఇవన్నీ పట్టించుకుంటారా? ఎవరైనా?
అన్నపూర్ణ:— ఇవాళ యుద్ధానికి విశ్రాంతిస్తున్నట్లు
చాటించారు కదా?
ఏకా:– ఔను! ఐతే ?
అన్నపూర్ణ:– విశ్రాంతి ఇచ్చినప్పుడైనా ఇంటికి రావచ్చు కదా?
ఏకా:– కొంత మందిని కలువలసిన వారితో కలిసిరావడంతో.. ఆలోచనలు చేయాల్సి రావడానికి ఆగిపోవలసి వచ్చింది….
అన్నపూర్ణ:– ఆలోచనలన్నీ తురకల తోటేనా?
ఏకా:– [ తనలో] ఇది చమత్కారమా?
అన్నపూర్ణ:– తురకల తోటేనా?
ఏకా:– ఓ! అలా అనుకున్నావా?
అన్నపూర్ణ:— ఊరికే అనుకోవడమే కాదు ఊహ కూడా కాదు!
ఏకా:— ఎవరు చూసారు? ఎక్కడ చూసారు? నన్ను?
అన్నపూర్ణ:– ఎవరు చూస్తే ఏమిటి? ఆబీదు ఖానుతో మీకేం పని? ఆ పనేంటో నేను తెలుసుకోవచ్చా?
ఏకా:– [లోలోపల] స్త్రీలకు కర్ణ పిశాచాలుంటాయని మాత్రమే అనుకుంటారు! కానీ నేత్ర పిశాచాలు కూడా ఉంటాయని నేను బల్లగుద్ది చెప్పగలను! కానీ…… కేవలం దేశ క్షేమం కోసమే కావాల్సిన పని- చేస్తే కలిగే ఫలితం తేల్చుకోవాల్సిన విషయం. ఇప్పుడే చెప్పవద్దని దాచితే , బట్టబయలు చేస్తున్నది. ఇన్ని విషయాలు తెలుసుకున్నది ఆకొంచెం తెలుసుకోకుండా ఉంటుందా!
అన్నపూర్ణ:— ఆబీదుఖానుతో మీకేం పని ఉన్నదో చెప్తారా?
ఏకా:– నీకెందుకా? విషయం ?
అన్నపూర్ణ:– నా మనసు మార్చుకోవచ్చని నాకు మీరాజ్ఞ ఇచ్చింది మరచిపోకండి!
ఏకా:- మరువను!
అన్నపూర్ణ:– ఇంకా ఏమిటి?అందుకే అడుగుతున్నాను.
ఏకా:– [ అనుమానిస్తూ] అలా ఐతే నువ్వు తెలుసుకొన్నవో?లేక అనుకున్నవో? అది నిజమే? [ చెవి పైకెత్తి]
అదిగో ప్రియా! కిందనుండి ఎవరో పిలుస్తున్నారు. నేను వెళ్ళాలి [ వెళ్ళి పోయాడు]
అన్నపూర్ణ:- దేవుడా! నాకింత పరీక్ష ఎందుకు పెట్టావు? సరే! పరీక్ష పెట్టదలిస్తే , దేశం పరుల పాలయ్యే మహా కష్ట సమయంలోనా? అది కూడా భార్యాభర్తల విషయంలోనా? ఈశ్వరా! ఎంతటి దురవస్థ? నేను దేశభక్తైనా మానుకోవాలి! లేదా పతిభక్తైనా మానుకోవాలి! కదా? ఇదివరకు జరిగిన దండయాత్రలో దేశాన్ని రక్షించు కుంటామని మహిళలు చేసిన ప్రతిజ్ఞలలో నేనూ ప్రతిజ్ఞ చేసాను కదా? ఇప్పుడు నా భర్త నేను చేసిన ప్రతిజ్ఞను మార్చుకొమ్మని బలవంత పెడుతున్నారు. అలా చేస్తే దేశభక్తిని విడిచిపెట్టడమా? లేక పతిభక్తిని విడిచి పెట్టడమా అని ఆలోచిస్తూ…… [వెళ్లిపోతుంది]

౩వ ప్రదేశం — ఓరుగల్లు బయట యుద్ధభూమి.

ప్రవేశం– కాకతీయ సైన్యం– మాలిక్ కాఫూర్ సైన్యం యుద్ధం చేస్తూ…

యోధుడు:– నువ్వూ హిందువు! నేనూ హిందువునే! నువ్వు అడ్డు తొలగు ! నాకు శత్రువు మాలిక్కాఫూర్ . అతని తర్వాత అతని సేనాపతి ఆబీదుఖాను! అంతే కానీ నువ్వుకాదు!
ఏకాంబరుడు:– నేను తొలగిపోను! నీకే శక్తి ఉంటే నన్ను గెలిచి, నా స్నేహితుడు , నా ప్రభువుతో యుద్ధం చేయి!
యోధుడు:– నువ్వు ఈ ప్రతాపరుద్ర మహారాజు సేవకుడవు కదా! నీకు ఆభీద్ ఖాన్ మరియు మాలికపూర్ ప్రభువు ఎట్లా అయ్యారు! ఎప్పుడయ్యారు?
ఏకా:– వారికింద ఉద్యోగం చేయడం వల్ల!
యోధుడు:– కాకతీయుల కొలువు చేయడమంటే.. కాకతీయ ప్రభుత్వాన్ని మోసం చేయడమేనా?
ఏకా:- [ స్వగతం] ఇతడెవరు? ఓరుగల్లు సైన్యంలో నేను ఎన్నడూ చూడనే లేదు.
యోధుడు:– మాట్లాడడం లేదెందుకు జవాబు చెప్పు? ఒక మాట మాట్లాడు!
నీ దగ్గర నీ ప్రభువును వంచించే గుణంవుంటే…. ప్రాణాలు కాపాడుకోవాలంటే అలాగే మోసంచేస్తావా?
ఏకా:- నువ్వు నన్ను నిలదీసే అంత మొనగాడివా?
యోధుడు:– అలా అనడం లేదు!
జయాపజయాలు దైవాధీనం!. నేను తప్పక నిన్ను ఓడిస్తాననడంలేదు. కానీ దేశభక్తి ఆవేశంతో నిన్ను చంపడానికి కత్తి పట్టవలసి వచ్చింది. నీవు ధనాశతోనో.. కొత్త పరిచయాలవల్లనో నీ ప్రభువును… ఎవరి దయాదాక్షిణ్యాలతో నువ్విన్నాళ్లు పోషింపబడ్డావో… ఆ ప్రభువును మోసం చేస్తున్నావు! నేను- నువ్వు ఒక్కదేశానికి చెందిన వాళ్ళమే! ఒక చోటున కాపురం ఉన్న వాళ్ళమే! కాబట్టి ఉండవలసినంత సంబంధం ఉండడం వల్లనే నిన్ను ఇక్కడినుండి పొమ్మని అంటున్నాను.
నా శత్రువును, నా దేశ శత్రువును నాకు ఒప్పగించమని చెప్పాను! కానీ నీవు వినలేదు! ఏమాత్రం చెవిన పెట్టలేదు. నిన్ను గెలవాలంటే.. నువ్వే నాకు ఆజ్ఞనిచ్చి, ప్రోత్సహించావు. ఇక నేను దేశక్షేమం కోసం చేయాల్సిన పనికి ఆలస్యం చేయవద్దు. అయినా కూడా చెప్తున్నాను. సాధ్యమైనంత ఆలస్యం…
ఏకా:- నువ్వు… నువ్వు.. దేశ హితైషివా? అది ఎలాగో చూస్తాను. నీ దేశమెలా నీచే… నీ వంటి వారిచే… కాపాడబడుతుందో చూస్తాను ![ఇద్దరూ ఘోరంగా యుద్ధం చేస్తారు. ఇద్దరి కంఠాలకు, అవయవాలకు గాయాలౌతాయి.]
యోధుడు:– ఇగో తప్పించుకో! [ ఆబీదుకాను వైపు నడుస్తాడు]
ఏకా:– తన రక్షణ కొరకు పాటుబడేవాడు పంద. నా కొత్త ప్రభువు కొరకు నేను రక్షకుడను.
[ ఆబీదుఖానికి అడ్డంగా నిలిచి, అతనిని తన వైపునకు తీసుకొని]
యోధుడు:– అలా అయితే నీ ఖర్మ! ఇనుముతో అగ్ని…[ బల్లెంతో ఇద్దరూ పొడుచుకున్నారు. ఏకాంబరుడు, ఆబీదుఖాను కింద పడిపోయారు.]
యోధుడు:- [ బల్లేలను కింద పడవేసి, పరుగున పోయి ఏకాంబరుని తలను తొడపై పెట్టుకొని కూర్చుని] నాధా! ఎటువంటి రోజు వచ్చింది? [తేరిపార చూసి ] ఇక ఎక్కడి నాధుడు? చేతులారా చంపుకొన్న పిశాచికి ఈ లోకంలో నాథుడు ఎక్కడుంటాడు? దేవుడా! మా ఇద్దరి ప్రేమ సామ్రాజ్య దాంపత్యాన్ని చెడగొట్టటానికే నా భర్తకు దేశద్రోహ బుద్ధి కలిగించి, మా చరిత్ర… చారిత్రక ప్రపంచంలో శాశ్వతంగా ఉంచాలనుకొని నాకు నా భర్తకు వ్యతిరేకంగా ఆలోచించే బుద్ధినిచ్చావా? నా నాధా! నువ్వెందుకు దేశద్రోహుల కుతంత్రంలో చిక్కి, నాకిలాంటి వైధవ్యం నేనే తెచ్చుకునేలా చేసావు? నా ఆశయం మార్చుకొనేందుకు నాకెందుకు అనుమతినిచ్చావు? నిన్ను అనుసరింపమని నన్ను ఎందుకు చెప్పలేదు? ఇప్పటికైనా నిన్ను అనుసరించకుంటే నాకు గతి ఏమిటి? దేవుడా ! నిశ్చయంగా నేనే పతివ్రతనైతే దేశహితం కోసం ప్రాణం కంటే ఎక్కువైన నాభర్తని చేతులారా చంపుకొన్న పాపినని కోపగించుకోకుండా… ఎన్ని జన్మలలోనైనా ఈ మహామహునకే భార్యనయ్యేలా దీవించు తండ్రీ! ఏ జన్మలో నైనా ఈ మా ఇద్దరికీ గాఢమైన… నిశ్చలమైన దేశభక్తిని ఇవ్వు!
[ బాకుతో ఛాతీలో పొడుచుకొని భర్త శరీరం పై ఒరిగిపోయింది]

(సమాప్తం)

రంగరాజు పద్మ
September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

అర్చన

by mayuukha September 15, 2023
written by mayuukha
డాక్టర్ అనంత లక్ష్మి గారు రచించిన ‘ ఆర్జన‘ అనే కథ ను చక్కగా చదివి వినిపిస్తున్నారు విజయ కందాళ గారు , ఇదిగో తరుణి యూట్యూబ్ ఛానల్ లో వినండి! మరి ఇంత మంచి కథను మీకు తెలిసిన వాళ్లకు పంపించరూ? ఏముంది జస్ట్ తరుణి ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసి, ఓ లైక్ కొట్టి అలా షేర్ చేసెయ్యండి అంతే! మీ కామెంట్స్ పెట్టడం మరచిపోకండి . థాంక్యూ.
https://youtu.be/kDb8KZDgBwk?si=hvI0sKg5y6tK-KGx

తరుణి అంతర్జాల మహిళవారపత్రిక నుండి సేకరణ

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us