మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహికవిశ్లేషణా వ్యాసాలు.

by Narendra Sandineni July 31, 2025
written by Narendra Sandineni

మాదాడి నారాయణ రెడ్డి (మానారె) ఇదీ నీ బాట కవిత కవిత్వం ఓ విశ్లేషణా
ప్రముఖ కవి,రిటైర్డ్ ప్రిన్సిపల్,ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్,మాదాడి నారాయణ రెడ్డి (మానారె) కలంనుండి జాలువారిన ఇదీ నీ బాట కవిత పై విశ్లేషణా వ్యాసం.ఇదీ నీ బాట కవిత చదివాను.చాలా బాగుంది.నన్ను ఆలోచింప జేసింది.ఇదీ నీ బాట ఏమిటి?ఆంగ్లంలో This is the path అంటారు.తెలుగులో నీవు నడవవల్సిన దారి అని అర్థం.నారాయణ రెడ్డి (మానారె) తెలుగు భాషా ఉపన్యాసకులుగా మరియు ప్రిన్సిపల్ గా కళాశాలలో ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు. అట్లా వివిధ రకాల అనుభవాలతో సంఘంలో ఒక బాధ్యత గల వ్యక్తి ఎలా నడుచుకోవాలో ఇదీ నీ బాట కవిత ద్వారా మార్గ నిర్దేశం చేశారు. విద్యార్థులకు విద్యను అందించిన గురువుగా తన జీవితానుభవం నుండి రాసినట్లుగా తోస్తోంది. ఆనాటి గురువులకు విద్యాబోధన మరియు విద్యార్థులను మట్టిలో మాణిక్యాలుగా తీర్చిదిద్దడం తప్ప మరో వ్యాపకం ఉండేది కాదు.నారాయణరెడ్డి (మానారె)చిన్నతనంలో గురువుల వద్ద నేర్చుకొని గురువుగా ఎదిగిన తీరు పరిశీలించినట్లయితే ఇదీ నీ బాట కవితలో పంచుకున్న భావాలు హృదయం నుండి చీల్చుకు వచ్చినట్లుగా తోస్తోంది. నారాయణరెడ్డి (మానారె) డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా రిటైర్ అయిన తర్వాత కూడా ఆణిముత్యాల్లాంటి ప్రాచీన ఇతిహాసాలైన ఆదికావ్యం రామాయణం,మహాభారతం వంటి మరెన్నో పుస్తకాలను అధ్యయనం చేస్తున్నారు. ఇవ్వాళ మంచి చెప్పేవాళ్లు అరుదుగా ఉంటారు. నారాయణ రెడ్డి ఇప్పటికి మంచితనం తన గుండెల్లో నింపుకుని ఇదీ నీ బాట కవిత ద్వారా సందేశాత్మక బోధ చేస్తున్నారు.ఈ కవిత 1982 సంవత్సరంలో స్పందన కవితా సంపుటిలో వచ్చింది.ఇదీ నీ బాట కవిత రాసి 40 సంవత్సరాలు పూర్తి అయింది. అయినప్పటికి కవితలోని భావాలు సమాజంలో జరుగుతున్న వికృత ధోరణుల తీరుకు అద్దం పట్టినట్టుగా ఉంది.బోధ ఎవరు చేస్తారు?గురువులు బోధ చేస్తారు.నేను ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్,1985-1986 సంవత్సరంలో బికాం డిగ్రీ చదువుతున్నప్పుడు నారాయణ రెడ్డి సారు నాకు తెలుగును బోధించారు.నా గురువు రాసిన కవితను విశ్లేషించడం ఆనందంగా ఉంది.ఇదీ నీ బాట ప్రతి ఒక్కరు చదవాల్సిన కవిత.సమాజం ఎటు పోతుంది?ఈనాటి సమాజానికి ‌సరియైన దారి చూపడంలో ఇదీ నీ బాట కవిత ఉపకరిస్తుంది.
“లేలేత కొమ్మల్ని చిదుమకు/పూచిన పువ్వుల్ని నలుపకు/స్నిగ్ధ ముగ్ధ హృదయాలలో/చిచ్చు పెచ్చుగా రగిలించకు/అంటున్నారు.జీవుల మనుగడకు అవసరమైన ఆక్సిజన్ మరియు ఆహారం మొక్కల నుంచి లభిస్తుంది.మొక్కలతో చదువు నేర్చుకుంటున్న విద్యార్థులను పోల్చడం బాగుంది.మొక్కల ఎదుగుదలకు లేలేత కొమ్మలు కూడా అవసరం.అట్లాంటి ఎదుగుతున్న లేలేత కొమ్మల్ని గోరుతో చిదిమి వేయడం,చేతితో విరిచి వేయడం జరుగుతున్నది.మొక్కలకు ప్రాణం కొమ్మలు.కొమ్మలు ఉంటేనే ఆ మొక్క శాఖోప శాఖలుగా విస్తరించి మహావృక్షంగా ఎదుగుతుంది. ఎందరికో నీడనిస్తుంది.ఎన్నో పక్షులు గూడు కట్టుకుని ఉంటాయి.ఎందరో మనుషులు చెట్టు నీడన సేద తీరుతారు.లేలేత కొమ్మల్లా ఎదుగుతున్న పిల్లలను కాపాడుకోవాలి.ఆ పిల్లలు సన్మార్గంలో నడుచుకునేలా తీర్చిదిద్దాలి.పువ్వు సాధారణంగా ఆకుల చివరలలో అభివృద్ధి చెందుతుంది.ఆకులు పునరుత్పత్తి పనితీరును కలిగి ఉంటాయి.ఈ నిర్మాణాలన్నింటిని ఆంథోపిల్స్ అంటారు. పువ్వులను మనం పవిత్రంగా చూస్తాం.దేవుని వద్దకు మనం ఖాళీ చేతులతో వెళ్లకుండా పూలమాల తయారు చేసుకుని వెళతాం.దేవుని విగ్రహానికి పూలమాల వేస్తాం.దేవుని ఆశీస్సులు కావాలని కోరుతూ ప్రార్థనలు చేస్తాం.ప్రేమికులు తమ ప్రియురాలికి గులాబీ పువ్వులు అందించి తమ ప్రేమను వ్యక్తం చేస్తారు.పువ్వులను స్త్రీలు తమ కేశాల్లో కొప్పుల్లో అలంకరించు కుంటారు.పూలు పెట్టుకోవడం ద్వారా స్త్రీల అందం ఇంకా ఇనుమడిస్తుంది.పూచిన పువ్వులతో కూడిన చెట్టు ఎంతో అందంగా ఉంటుంది.పూలు కూడా ఉదయాన్నే పూస్తాయి.సాయంత్రానికి పూలు వాడిపోతాయి.రాలిపోయే పువ్వు అయినప్పటికి ఉన్నంత సేపు పరిమళాన్ని వెదజల్లుతుంది.పూల మీద వాలి తుమ్మెదలు,సీతాకోకచిలుకలు తేనెను త్రాగుతాయి.చిన్నచిన్న పక్షులు కూడా పూలలోని తేనెను ఆస్వాదిస్తాయి.పూచిన పువ్వులను నలపకు అంటే పూలలా సున్నితంగా ఉన్న హృదయాలు కల విద్యార్థులను పాడు చేయకుమని చెబుతున్నారు. పూలను చూసినట్లుగా పిల్లలను చూడాలి.పిల్లలు కూడా పూల లాగా మృదువుగా,స్వచ్ఛంగా ఉంటారు.పూరేకులాంటి పిల్లల హృదయాలు ఎప్పటికి తేటగా ఉంటాయి.పిల్లలు దేవుడు చల్లని వారే కల్లా కపటం ఎరుగని కరుణామయులే అని పిల్లలను కరుణామయుడైన దేవునితో సినీ గీతంలో పోల్చబడింది.దేవుని రాజ్యంలో ప్రవేశం పిల్లలకే ఉంది అని బైబిల్ లో వ్రాయబడి ఉంది.పిల్లల హృదయాలు సున్నితమైనవి.స్వచ్ఛమైనవి. పిల్లలను చూడగానే ముచ్చటేస్తుంది.అటువంటి అపురూపమైన పిల్లల హృదయాలలో వారి స్వచ్ఛమైన మనస్సులలో ద్వేషాగ్నిని రగుల్కొల్పి పెనుమంటగా జ్వలింపజేసి సమాజానికి ద్రోహం చేసే వారిగా పురికొల్పవద్దు.పిల్లలు ఇప్పుడిప్పడే మంచితనంతో మానవత్వంతో ఎదుగుతున్నారు. పిల్లల ఎదుగుదలకు ఆటంకం కలిగించవద్దు.పిల్లల సున్నితమైన స్పటికంలాంటి హృదయాలను మంచితనానికి మారుపేరుగా తీర్చిదిద్దాలి.పిల్లలు సన్మార్గంలో నడిచేలా ప్రేరణను అందించాలి.భగత్ సింగ్ చిన్నతనంలో స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో పాల్గొన్నారు.23 సంవత్సరాల వయసులో దేశం కొరకు ఉరి కొయ్యకు వేలాడారు. భగత్ సింగ్ దేశానికి స్వాతంత్రం సాధించాలనే లక్ష్యంతో,స్ఫూర్తితో దేశం కొరకు ప్రాణాలు అర్పించారు.భారత దేశ ప్రజల హృదయాల్లో మరువ రాని వీరుడిగా నిలిచిపోయాడు.ఆ మహనీయుని చరిత్ర ఎప్పటికీ కొత్తగా ఉంటుంది.ఈ దేశంలో పెరుగుతున్న బాలలు అందరు గొప్ప లక్ష్యం కలిగి ఉంటారు.అట్టి పిల్లల మనస్సులను కలుషితం చేయవద్దు అని కవి నారాయణరెడ్డి (మానారె) పిలుపునిస్తున్నారు.

“అమృతాంతరంగాలలో/హాలాహలం చిందించకు/
“పాలవెల్లి లాంటి పసి మనసులో/సంక్షోభపు సందడి కలిగించకు/అంటున్నారు.అంతరంగం అంటే మనస్సు యొక్క శక్తి.అట్టి అంతరంగంలోని శక్తి వల్ల మంచి చెడు స్పష్టంగా తెలుస్తుంది.అంతరంగం అనేది మనస్సులో జ్ఞాపకాల జ్ఞానాన్ని కలిగించే శక్తి. అంతరంగంలో నిలిచియున్న ఆత్మ ఎన్నటికి నాశనం కాదు.క్షీరసాగర మధనం : దుర్వాసముని శాపం కారణంగా సమస్త సంపదలు కోల్పోయినారు. దేవతలు దేవదానవ యుద్ధంలో రాక్షసులను గెలువలేక పోతున్నారు.ఆప్పుడు దేవతలు శ్రీమహావిష్ణువును శరణు వేడుతారు.దేవతలు అసురులతో సఖ్యంగా ఉండాలి.దేవతలు అసురులు కలిసి క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని సాధించమని సూచిస్తాడు.అప్పుడు దేవతలు, రాక్షసులు ఇద్దరు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా,సర్పమైన వాసుకిని తాడుగా చేసుకుని, పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెడతారు.ఈ క్షీరసాగర మధనంలో అనేక అపురూపమైన వస్తువులతో పాటు హాలాహలం కూడా ఉద్భవించింది.అట్టి హాలాహలం నుండి దేవ, రాక్షసులను మరియు ముల్లోకాలను కాపాడటానికి శివుడు హాలాహలంను మింగి తన కంఠంలోనే ఉంచుకున్నాడు.అందుకే శివునకు గరళకంఠుడు లేదా నీలకంఠుడు అనే పేరు వచ్చింది.హాలాహలం ప్రాణాలు తీసే విషం వంటిది.అమృతంతో కూడిన అంతరంగాలు కలిగిన లేలేత చిన్నారుల మనస్సులలో హాలాహలం లాంటి విష బీజాలు నాటకు.ఎదుగుతున్న చిన్నారుల మనస్సు అమృతతుల్యమైనది.పాలవెల్లి అంటే పాల సముద్రము అని అర్థమవుతుంది.పాల సముద్రంలా తేటగా ఉన్న ఆ చిన్నారులకు లోకంలోని కుటిలత్వం అంటే ఏమీ తెలియదు.చిన్నారులు సంఘ వ్యతిరేక శక్తులుగా మారకుండా చూడాలి.చిన్నారులు హింసా మార్గం వైపు అడుగులు వేయడం ప్రమాదకరమైనది.చిన్నారులను విధ్వంసకులు కాకుండా కాపాడుకోవాలి.జీవితంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చిన్నారులు సముద్రంలో ఏర్పడిన అలల తాకిడి శ్రుతి మించి తుఫానుగా మారి సునామీ లాంటి విపత్తులకు మూలం కావడం ‌ మనకు తెలుసు.జీవితంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చిన్నారులు అలజడులను సృష్టించడానికి ఆటంకవాదానికి లోనై సునామీ సృష్టించిన సముద్రమును పోలివుంటే సమాజానికి అపార నష్టం కలుగుతుంది.విపత్తుల వల్ల లేలేత చిన్నారుల జీవితం అధర్మ మార్గాన్ని అనుసరించి, అస్తవ్యస్తం,అల్లకల్లోలం కాకుండా కాపాడుకోవాలి అని కవి నారాయణ రెడ్డి (మానారె) బోధ చేస్తున్నారు.
“నెయ్యం తియ్యం కోరే వారికి/కత్తులతో పొత్తును గూర్చకు/కుత్తుక నెత్తురు దాహం కోరే/నినాదాల మత్తెక్కించకు/అంటున్నారు.నెయ్యం అంటే స్నేహం, రక్తసంబంధం కానిది.స్నేహంలో స్వార్థానికి స్థానం లేదు.నెయ్యం అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి హృదయంలోను,పరులందరు తన వారే అనే భావన.ఆంగ్లంలో నెయ్యం అంటే To be kind or loving అని అర్థమవుతుంది.స్నేహ వర్షాన్ని కురిపిస్తూ అందరి క్షేమాన్ని కోరే మంచి మనసు కల చిన్నారులకు విధ్వంసాన్ని కోరే వారితో,హింసను రేకెత్తిస్తూ కత్తులు వాడే సంఘ విద్రోహులతో పొత్తులు కూర్చవద్దని కవి నారాయణరెడ్డి కోరుతున్నారు.సాటి మనిషిని చంపి రాక్షసానందాన్ని పొందే వారిలో చిన్నారులు జమ కాకూడదు.హింసా మార్గంలో నడుస్తున్న వాళ్ళతో చిన్నారులు కలిసి ఉండడం తగదు.హింసా మార్గంలో నడిచే వాళ్ళు కత్తులతో కొట్లాడుతారు.అట్లాంటి వారి సావాసం వల్ల చిన్నారులు హింస వైపు సాగుతారు.సాటి మనిషిని చంపి నెత్తురుతో కోర్కెలు తీర్చుకోకు అంటున్నారు.నినాదం అంటే ఆంగ్లంలో Slogan or Motto.నినాదం అంటే ఉద్దేశంతో కూడిన పరిచయ వ్యాఖ్య.ఒక వ్యక్తి సంఘం,సంస్థ లేదా దేశం యొక్క సాధారణ లేదా విశేషమైన ఉద్దేశం.ఉద్యమాలు, మతపరమైన సంఘర్షణలు రాజకీయ పార్టీ వాళ్లు నినాదాల పేరిట ప్రభావితం చేస్తుంటారు.చిన్నారుల హృదయాలలో మతం సాకు చూపి కొందరు, ఉద్యమాల పేరిట కొందరు,రాజకీయ నాయకులు అధికారం పేరిట వాళ్ల స్వార్థం కోసమే చిన్నారులను పావులుగా వాడుకుంటున్నారు.నినాదాల మాయలో పడి చిన్నారులు చదువుకు దూరం అవుతారు. చిన్నారులు తప్పుడు మార్గంలోకి వెళ్ల వద్దు అని చెబుతున్నారు.చిన్నారుల జీవితాలను కలుషితం చేయవద్దని హితవు పలుకుతున్నారు.పిల్లలు నినాదాల మాయలో పడి చదువు అనే సంకల్పం నుండి దూరం అవుతున్నారు అని కవి నారాయణ రెడ్డి(మానారె) ఆవేదన చెందుతున్నారు.
“మానవతా వాదంతో/మారణ హోమం తలపెట్టకు/
జనోద్దరణ పేరు చెప్పి/జన నాశం చేపట్టకు/ అంటున్నారు.మానవతా వాదం నీతి తత్వములకు సంబంధించిన ఒక విశాలమైన మార్గం.మానవతా వాదం ప్రజలందరి హుందాతనాన్ని ప్రకటిస్తుంది. మానవతా వాదం ఒక తత్వంగానో,మతం గానో పరిగణిస్తే దానిలో ఉన్న సహజత్వం ఔన్నత్యం లోపిస్తాయి.మానవతా వాదం ఒక జీవన దృక్పథం.మానవతా వాదానికి స్వేచ్ఛ అవసరం. స్వేచ్ఛ మానవ వికాసానికి దోహదం చేస్తుంది. సత్యం కోసం,జ్ఞానం కోసం మానవులు చేసే పోరాటంలో ఉపకరించే అమోఘమైన సాధనం హేతువు.హేతువు ద్వారా మాత్రమే మానవుడు తన శక్తిని పరిమితులను సమాజాన్ని అర్థం చేసుకోగలుగుతాడు.మంచి,చెడుల్ని విశ్లేషించగలుగుతాడు.ఏ సమాజమైన అభివృద్ధి చెందడానికి నీతి ఉండాలి.నీతికి పునాది మానవ స్వభావంలోనే ఉంటుంది.మనిషి నీతికి కట్టుబడి ఉండాలి.మనిషి దైవానికి,ప్రభుత్వానికి,చట్టానికి నీతిగా ఉండే విషయంలో ఏ మాత్రం భయపడ కూడదు.మానవత్వం యొక్క ఉత్తమ లక్షణం సహనం.మనిషిలోని సహనం సామాజిక శాంతికి కారణమవుతుంది.మనిషిలోని అసహనం సమాజంలోని అల్లకల్లోలాలకు కారణమవుతుంది. శాంతియుత నైతిక జీవనం సంఘంలో ప్రభవించడానికి సహనం తప్పనిసరి అని చెప్పుకోవాలి.మానవతా వాదంలో ప్రేమకి ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది.మానవులు పరస్పర అవగాహన,సహానుభూతుల నుంచి ఉద్భవించేది ప్రేమ.ప్రేమ మనిషిలోని ఆటవిక ప్రవృత్తిని నాశనం చేస్తుంది.ప్రేమ స్వార్థాన్ని నిర్మూలించి మనిషిని మనిషిగా నిలబెడుతుంది.మానవతా వాదం ఐక్యతను ప్రసాదిస్తుంది.స్వేచ్ఛ, జ్ఞానం,నీతి కోసం హేతువు,ఐక్యత ఉండాలి.ఐక్యత సహనం వల్ల కలుగుతుంది. మానవులు దయతో వ్యవహరించడం వల్ల ఇతర మానవుల బాధలను తగ్గించడానికి అవకాశం ఉంటుంది.నీతిమంతులు, పరోపకార పరాయణులు,ధార్మికులు మానవత్వంతో తోటి వారి జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి సహాయం అందించడం జరుగుతుంది.మానవతా వాదం పేరిట కొందరు మారణ హోమం సృష్టిస్తున్నారు.మన దేశంలో నివసించే ప్రజలంతా వసుధైక కుటుంబంలా కలిసిమెలిసి ఉండాలి.అన్ని మతాలను ప్రేమించాలి.నీ మతం గొప్పది నా మతం గొప్పది అనే భేదాభిప్రాయాలతో ఒకరినొకరు చంపుకుంటున్నారు.ఈ దారుణ మారణ హోమంలో సామాన్యుల జీవితాలకు భద్రత లేకుండా పోతున్నది.హింస వైపు అడుగులు వేయడం వల్ల అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.ఈ దారుణ మారణ కాండను ఆపాలని కవి ప్రబోధిస్తున్నారు.జనోద్దరణ పేరు చెప్పి జననాశం చేపట్టకు.ఇవ్వాల జనాలను ఉద్ధరిస్తున్నామని చెబుతూ ప్రజల్లో నమ్మకం కలిగిస్తూ ప్రజలకు తాయిలాలు అందిస్తామని మోసం చేస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు.ప్రజల్లో విభేదాలు ఏర్పడి ప్రజలు ఏది తప్పో ఏది ఒప్పో తెలియకుండా ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇలాంటి జననాశనం జరగకూడదని కవి నారాయణరెడ్డి(మానారె) తమ కవితలోని భావాల ద్వారా వ్యక్తీకరిస్తున్నారు.
“మంచిని మనసా కోరే పెద్దల/అభివృద్ధి నిరోధకులుగా ఎంచకు/కసితో కల్లోలం పుట్టించే కపటుల/అభివృద్ధి మార్గ వారధులుగా భావించకు/
అంటున్నారు.మంచిని మనసారా ఆచరించమని కోరే పెద్దలు అరుదుగా ఉంటారు.అట్లాంటి పెద్దలు నడుస్తున్న బాటలోనే మనం సాగాలి.మంచి చెప్పే పెద్దలను,సమాజ అభ్యుదయాన్ని కాంక్షించే వాళ్లను గౌరవించాలి.అట్లాంటి వెలుగులు చూపించే వాళ్లను అభివృద్ధి నిరోధకులుగా భావించకు అని హితవు చెబుతున్నారు.కొందరు ఇవ్వాళ సమాజంలో కసితో కల్లోలం పుట్టించే కపటులు ఎక్కడ చూసినా మనకు అగుపిస్తారు.ఆ కపటుల మాయలో పడ కూడదు. కపటులు సమాజాన్ని అల్లకల్లోలం చేస్తూ వంచన మార్గంలో పయనిస్తున్నారు.అట్లాంటి కపటుల జోలికి వెళ్ళవద్దు అని చెబుతున్నారు.కవి నారాయణ రెడ్డి (మానారె) భావం చక్కగా ఉంది.
“పడి కట్టు మాటల ప్రవాహంలో పడకు/పండంటి జీవితాన్ని కుళ్ళి పోనీయకు/గతాన్ని స్మరించి ఆ గతాన్ని ఊహించి/వర్తమానం లో బంగారు బాట వేసుకో/అంటున్నారు.సమాజంలో కొందరు మాటల మాంత్రికులు ఉంటారు.అట్లాంటి మాటల మాంత్రికులు మాయ చేసి గొప్ప గొప్ప మాటలు చెబుతారు.అట్లాంటి కపట మాంత్రికుల వలలో చిక్క వద్దు.ఆ మాయావుల వల్ల చిన్నారుల పండంటి జీవితం పాడైపోతుంది. గతంలో ఏం జరిగింది? చిన్నారులకు తెలుసు.ఆ గతాన్ని ఊహించి వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి.నడుస్తున్న కాలం,వర్తమాన కాలం.వర్తమాన కాలంలో సరిగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి.బంగారు బాట వేసుకోవాలి.ఏది మంచి ఏది చెడు అనే విచక్షణతో మెదలాలి.చిన్నారుల మనస్సులో ఏం జరుగుతుంది? చిన్నారులు సరిగా ఆలోచిస్తే తెలుస్తుంది.అలాంటి మనస్సును పక్కదారి పట్టించే దుర్మార్గుల మాయ మాటలకు లొంగకుండా సరైన మార్గంలో పయనించాలి అని కవి నారాయణరెడ్డి (మానారె)సందేశాత్మక ప్రబోధం చేస్తున్నారు.ఇది అందరికి ఆచరణీయమైనది.ఇవాళ సమాజానికి అవసరమైన విషయాలను చెబుతూ చిన్నారుల జీవితాలు భావి తరాలకు మార్గదర్శకంగా నిలిచేలా చేస్తున్న ప్రయత్నంలో కవి సఫలమయ్యారు.ఇదీ నీ బాట ఈనాటి చిన్నారులకు, యువతకు,పెద్దలకు అందరికి ప్రేరణగా నిలుస్తుంది.కవి నారాయణరెడ్డి (మానారె) మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

July 31, 2025 8 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

పరిణత — పాళీ

by రంగరాజు పద్మజ July 31, 2025
written by రంగరాజు పద్మజ

చక్కటి నగిషీలు చెక్కిన అలమరలలో… అంతే చక్కని విలువైన పుస్తకాల నిలయంలో ఆమెను చూస్తే నిరాడంబరంగా కనిపిస్తున్న చదువుల తల్లిని పలకరించాం!

ఇంతలోనే మంచి పలకరింపుతో సుభద్రాదేవి గారి కూతురు మాకు మంచినీరు అందించిన వైనం మహాద్భుతం ఎందుకంటున్నానంటే…? అందంగా అలంకరించిన మట్టిపిడతలతో మంచి నీరు ఇచ్చారు… కాలుష్యాన్ని దూరంగా తరిమేయాలని బద్ధకంకణురాలైన పౌరురాలిగా తన వంతు కర్తవ్యాన్ని ప్లాస్టిక్ వాడకూడదనే నినాదాన్ని ఆచరణలో పెడుతున్నట్టుగా మాకనిపించింది.
కేవలం తమ రచనలలో అక్షరాలతో చెప్పడంకాదు! అక్షరాలా ఆచరించి చూపడం అభినందించతగిన విషయం.
అడుగడుగునా ఆ ఇంట్లో అందమైన పెయింటింగ్ చేసిన చిత్రాలు మన రచయిత్రి శీలా సుభద్ర గారి భర్త శీలా వీర్రాజు గారు స్వహస్తాలతో చిత్రించిన చిత్రాలతో అలంకరించిన ఆ ఇల్లు, ఓ చిత్ర ప్రదర్శన శాల వలె, ఓ గ్రంథాలయం వలె, ఆమె సాక్షాత్తూ సాహితీ మూర్తి వలె కనిపించి ఆనందం కలిగించింది మరెవరో కాదు! కథలు రాసే కథా రచయిత్రీ ; కవితలల్లే కవయిత్రి ; వ్యాస నిర్మాణ శీలి…. ఆమె పరిణత– పాళీ శీలా సుభద్రాదేవి గారు… ఈ రోజు మన తరుణి అతిథి!
వారిని పలుకరించి, వారి ద్వారానే మరెన్నో విషయాలు తెలుసుకుందాం!

రంగరాజు పద్మజ :– నమస్కారమండీ సుభద్రాదేవిగారూ!

శీలా సుభద్రాదేవి :— నమస్కారం పద్మజగారూ!

పద్మజ:– మీ నేపధ్యం తరుణి పాఠకులకు తెలుపుతారా?

సుభద్ర ;— ఆధునిక కథకు చిరునామా అయిన విజయనగరంలో 1949లో జన్మించాను. మానాన్నగారు కలెక్టర్ ఆఫీసులో పనిచేసేవారు. నాకు ఇద్దరు అక్కలు ,ఇద్దరు అన్నయ్యలు. మా పెద్దక్క పి.సరళాదేవి రచయిత్రి.పి.శ్రీదేవి, రంగనాయకమ్మ మొదలగువారి సమకాలీనురాలు. పెద్దన్నయ్య కొడవంటి లీలా మోహనరావు తొలిరోజుల్లో కథలూ, వ్యాసాలూ రాసేవాడు. నాకవితలు ఆంగ్లంలోకి అనువదించాడు. రెండో అన్నయ్య కొడవంటి కాశీపతిరావు వందకు పైగా కథలురాసాడు.
కాలేజీ రోజుల్లో శీలా వీర్రాజుగారి కథల్నీ, నవలనీ చదివి వుత్తరం రాయాలనిపించి KS దేవి పేరుతో, స్నేహితురాలి అడ్రస్ తో కొన్నినెలలు సాహిత్య చర్చలతో కలం స్నేహం నడిచాక ఓ సందర్భంలో నేను మేనమామ కూతురునని తెలిసి వివాహం చేసుకోడానికి ప్రపోజ్ చేయటంతో బహుభాషా పండితుడు రోణంకి అప్పలస్వామి గారి అధ్వర్యంలో సభా వివాహం జరిగింది.

పద్మజ :—- మీ విద్యా – ఉద్యోగ ప్రస్థానాలు వివరిస్తారా?

సుభద్రా దేవి : — విద్య – ఉద్యోగం – అభిరుచులు చెప్పాలంటే విజయనగరంలో మహారాజ మహిళా కళాశాలలో BSc డిగ్రీ చేసాను.
1971లో వివాహానంతరం హైదరాబాద్ వచ్చేయడం జరిగింది. పదేళ్ళ తరువాత MA(తెలుగు),BEd,మరో పదేళ్ళ తరువాత MSc(maths) పట్టాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అందుకున్నాను..
ఆర్టీసీ హైస్కూల్ లో గణితోపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యాయినిగా ఉద్యోగం చేసి పదవి విరమణ చేసాను..
చిన్నప్పటినుండి పత్రికలోని బాపూ చిత్రాలు చూసి ఇష్టంగా చిత్రాలు వేసేదాన్ని. విజయనగరం సంగీతం కళాశాలలో ఓ మూడేళ్ళు గాత్రం నేర్చుకున్నాను. కానీ నాకు లలితసంగీతమంటే మహా ఇష్టం. ఫేబ్రిక్ పెయింటింగ్స్, ఎంబ్రాయిడరీ వర్క్ ఒకప్పుడు ఇష్టంగా చేసేదాన్ని. సాహిత్యంలోకి వచ్చాక అవన్నీ వెనకబడ్డాయి.

పద్మజ :—- మీ రచనా వ్యాసంగం ఎప్పుడు ప్రారంభించారు?

సుభద్రాదేవి :—- హైస్కూల్ లో చదువుతున్నప్పుడు మా తెలుగు మాస్టారు రామకృష్ణమాచార్యులు గారు ఛందస్సు నేర్పించినప్పుడు విరివిగా పద్యాలు రాసాను. మా మాష్టారు స్కూల్ కోసం లిఖిత పత్రిక నడిపేవారు అందులో పద్యాలు, గేయాలూ రాసే దాన్ని. కాలేజీ మాగజైన్ లో రాసాను. కానీ అవన్నీ పెద్దగా చెప్పుకోను.
అయితే ప్రత్యేకంగా చెప్పుకునేది మాత్రం 1970లో పొలికేకలో ప్రచురితమైన నా మొదటి కథ” పరాజిత” తో సాహిత్య రంగంలోకి రచయిత్రిగా అడుగు పెట్టాను.

పద్మజ :—- మీ రచనలలోని దేవుడు బండ కథా నేపథ్యం చెప్పండి!

సుభద్రా దేవి :— 1987 లో విపుల మాసపత్రిక నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందిన కథ ‘ దేవుడు బండ’. రాతిరోళ్ళు తయారు చేసి అమ్మే వలసజీవుల జీవన విధ్వంసాన్ని తెలంగాణా మాండలికంలో రాసినకథ. ఇందులో చదువుకోవాలని తపనపడే పేదపిల్లాడి వేదనవుంది. యాంత్రిక యుగపరిణామంలో రోళ్ళకు బదులు యంత్రాలు వంటిళ్ళలోనికి వచ్చేస్తుంటే అమ్ముడుగాని రాళ్ళ బరువు మోస్తున్నవారి జీవన వ్యథ, పాడైపోయిన పొత్రాలు యాదృచ్ఛికంగా గ్రామదేవతగా రూపొందే వ్యంగ్యంతో ముగిసిన కథ. ఇది నాకు బాగా నచ్చిన కథలలో ఒకటి. నేను స్కూల్ కి వెళ్ళటానికి మలక్ పేట బస్టాప్ లో నిలబడినప్పుడు బస్టాప్ వెనుక కాపురం ఉన్న రోళ్ళు తయారుచేసే కుటుంబాల్ని పరిశీలించి రాసిన కథ ఇది. ఈ కథ కేంద్ర సాహిత్య అకాడమీ వారి సంకలనంలో చేర్చారు. నా మొదటి కథలసంపుటి దేవుడు బండ పేరుతో 1990లో వెలువడింది.

పద్మజ :—- రచయిత్రుల కథలపై వ్యాసాలు రాసారు కదా! దాని గురించి, అవి ఎందుకు రాయాల్సి వచ్చింది, వివరించండి.

సుభద్రా దేవి :— 2010లో వందేళ్ళ కథాప్రస్థానం సందర్భంగా తెలుగు రాష్ట్రంలోనే కాక బయటున్న తెలుగు కథకులందరితో ఎన్నో సమావేశాలూ, ఎన్నో ఇంటర్వ్యూలూ, వ్యాసాలూ, అభిప్రాయాలు వెలువడ్డాయి. మొదటి కథారచయిత్రిగా భండారు అచ్చమాంబను పేర్కొని, ఆపైన 1980 తర్వాత రాసిన రచయిత్రులనే అనేకమంది పేర్కొన్నారు.
వందేళ్ల కథకు వందనాలు’ పేరిట హెచ్ఎంటీవీ లో 2012 లో గొల్లపూడి మారుతీ రావు ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ధారావాహికంగా నిర్వహించారు. 118 మంది కథకుల కథలను పరిచయం చేసిన గొల్లపూడి మారుతీరావు కేవలం పన్నెండు మంది రచయిత్రుల కథలనే పరిచయానికి స్వీకరించటంకూడా గమనించాల్సిన విషయమే.
అవన్నీ గమనించిన తరువాత 1910కి-1980కి మధ్య ఒకరిద్దరు తప్ప కథారచయిత్రులు లేరా! అనే ఆశ్చర్యం కలిగింది. అరవయ్యో దశకంలో పత్రిక లన్నింటిలో ప్రభంజనం సృష్టించిన రచయిత్రులంతా ఏమయ్యారు? వారు నవల తప్ప చెప్పుకోదగిన కథలేమీ రాయలేదా? రాసినా విమర్శకులు, చాలామంది పేర్కొన్నట్లు, ప్రేమలూ-పెళ్ళిళ్ళూ, కుటుంబాలూ, అపార్థాలూ, కలహాలతో నిండి, వంటింటి సాహిత్యమేనా? – ఇలా అనేక సందేహాలు నన్ను చుట్టుముట్టాయి. ఆ సంఘర్షణ లోనే నా ముందుతరం 1950 నాటి 24 మంది రచయిత్రుల గురించి పరిశోధనాత్మక వ్యాసాలు రాసాను. పుస్తకంగా వెలువరించాను.

పద్మజ :—- ముద్ర సంపుటి వెలువరించారు కదా! ఏ సందర్భంలో ?

సుభద్రా దేవి :—- 2001 లో డా.పి.భార్గవీరావు గారూ, నేనూ కలిసి మొల్ల దగ్గర నుంచి ప్రారంభించి అప్పటివరకూ వున్న వంద మంది కవయిత్రుల కవితా సంకలనంగా ” ముద్ర”ను తీసుకువచ్చాము.

పద్మజ :— మీరు పొందిన పురస్కారాలు – ఆయా సందర్భాలు తరుణి పాఠకులకు చెప్పండి!

సుభద్రా దేవి :—- పురస్కారాలు:
తెలుగు విశ్వవిద్యాలయం నుండి 1997లో సృజనాత్మక సాహిత్యానికి *పట్టాభిరామిరెడ్డి ఎండోమెంట్ అవార్డ్
లేఖిని సాహిత్య సంస్థ నుండి వచ్చే కవిత్వానికి *కుసుమా రామారావు పురస్కారం.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి 1999లో *ఉత్తమ రచయిత్రి అవార్డు
కవిత స్మారక సాంస్కృతిక సంస్థ, కడప నుండి 2011లో ‘రెక్కలచూపు’ కథాసంపుటికి *గురజాడ అవార్డు
ఆవంత్స సోమసుందర్ గారి నుండి 2011లో దీర్ఘ కవిత్వానికి దేవులపల్లి రాజహంస *కృష్ణశాస్త్రి పురస్కారం.
2018లో ఉమ్మడిసెట్టి రాధేయ త్రిదశాబ్ది *ప్రతిభా పురస్కారం.
2018లో కవిత్వానికి అమృతలత *అపురూప పురస్కారం.
2018లో “నా ఆకాశం నాదే” కవితా సంపుటికి గంగిశెట్టి లక్ష్మినారాయణ గారి *మాతృపురస్కారం
2022లో సుశీలానారాయణరెడ్డి పురస్కారం.
2022లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి *మాతృ పురస్కారం.
,శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి పురస్కారం.
గుత్తికొండ రామరత్నం జీవన సాఫల్య పురస్కారం,
నీడల చెట్టు నవలకు విశాలాక్షి విశిష్ట పురస్కారం
మొదలైన పురస్కారాలు పొందాను.

పద్మజ :—- మీరు చిత్రకారిణి అని విన్నాను! ఆ చిత్రాలు ఏమైనా వున్నాయా? మా ప్రేక్షకులకు చూపించుదామా?

సుభద్ర దేవి :- నేను 1970లలో బాపూ బొమ్మలను చూసి కొన్ని చిత్రాలు వేసినవి.

పద్మజ :— ఇంటి బాధ్యత, ఉద్యోగ బాధ్యతలతో పాటూ రచనా వ్యాసంగం ఎలా సమన్వయం చేసుకున్నారు?

సుభద్రా దేవి :— వివాహానికి ముందే కథారచన ప్రారంభించినా, వివాహానంతరం ఉమ్మడి కుటుంబం,పిల్లలూ, రోగాలూ, రొష్టులుతో కొంత విరామం వచ్చి, మనసులోనే పదాలు అల్లుకొని సమయం దొరికినప్పుడు పేపరు మీద పెట్టే సౌలభ్యం వలన కవిత్వంలోకి వచ్చాను. తర్వాత ఉద్యోగం బాధ్యత కలిసింది. అందుకే పదకొండు కవితా సంపుటాలు ప్రచురించుకోగలిగాను కానీ మూడే కథల పుస్తకాలను ప్రచురించాను. పదవీవిరమణ అనంతరం విమర్శలో కూడా కృషిచేసి ఒక వ్యాస సంపుటి, రెండు మోనోగ్రాఫ్ లు రాసాను. మరో మూడు వ్యాస సంపుటాలను తీసుకు రావాల్సి వుంది.ఏపాటి సమయం దొరికినా సాహిత్యపఠనం ఆపలేదు,రాయటమూ ఆపలేదు. చిన్ననాటి నుండీ నా జీవితంలో ఎదుర్కొన్న అనేకానేక ఎదురుదెబ్బలూ, ఆటుపోట్లలో నేను ఇలా నిలదొక్కుకొని నిలబడగలిగానంటే సాహిత్యమే నా వూపిరి, సాహిత్యమే నాకు టానిక్.

పద్మజ :—-స్త్రీ వాద ఉద్యమం కవితలు రాయటానికి గల కారణాలు ఏమిటంటారు ?

సుభద్రా దేవి :—- చిన్నప్పటినుండి నేను చదివిన రావిశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు, రంగనాయకమ్మ మొదలైన వారి రచనలు సమాజంలోని జరిగే అనేకానేక విధ్వంసాల్ని, అణచివేతల్ని పరికించే దృక్పధాన్ని నాకు అలవడేలా చేసాయి. నిజానికి నేను కథలు రాసినా, కవితలు రాసినా స్త్రీ ప్రాధాన్య ఇతివృత్తాల్నీ, అంశాల్నే కాక సామాజికపరమైన ఇతర సమస్యలన్ని తీసుకుని రాయటానికే ప్రయత్నించాను. స్త్రీలపై ఆర్థిక సామాజిక సంక్షోభాలు ఏవిధమైన ఒత్తిడిని వివక్షల్నీ ప్రదర్శిస్తాయో ప్రధానంగా నా రచనలలో కన్పిస్తాయి.
ఒకవైపు స్త్రీగా జెండర్ వివక్షే కాకుండా సమాజంలో కుల పరమైన వెనకబాటు తనం కూడా బాధిస్తే రెండు పడగల నీడక్రింద స్త్రీ అస్తిత్వరాగాలాపనలే నా రచనలు.

పద్మజ ::— యుద్ధం ఒక గుండె కోత గురించి తెలియజేయండి!

సుభద్రా దేవి :—- 2001లో అమెరికాలో జంటటవర్లు కూల్చిన దుర్ఘటన అనంతరం, అమెరికా ఆఫ్ఘన్ యుద్ధ నేపథ్యంలో రాసిన 56 పేజీలు దీర్ఘకవిత ‘యుద్ధం ఒక గుండె కోత! రచయిత్రుల కలంనుండి వెలువడిన మొట్టమొదటి దీర్ఘ కవిత్వకావ్యంగా విమర్శకులు పేర్కొన్నారు. ప్రపంచమంతా కమ్ముకున్న యుద్ధ మేఘాలు, బాంబులు కురిపించటంతో కలచిన హృదయ వేదన, చిన్నిదేశాలపై అగ్రరాజ్య దురహంకారంపై ఆగ్రహం, జరుగుతున్న అనేకానేక సంఘటనల వెనక నలుగుతున్న స్త్రీల కనిపించని ఆర్తనాదాలు, ఏ యుద్ధమైనా మొట్టమొదట గాయం చేసేది తల్లి గర్భం పైనే అన్న అంతర్గత ఆలోచనలతో మాతృహృదయ ఆవేదనగా రాసినది ఈ కావ్యం. అప్పటికి కవులు కొందరు మాత్రమే దీర్ఘకవితలు రాసారు. అందులోనూ యుద్ధనేపథ్యంగా దీర్ఘకవిత్వం రాసిన వారూ లేరు. అప్పట్లోనే డా.పి భార్గవీరావు , డా. పి. జయలక్ష్మిగారలు కలసి “WAR, A Hearts’ Ravage” పేరిట ఆంగ్లంలోనూ,”యుద్ధ్ ఏక్ దిల్ కి వ్యథ” పేరిట నిర్మలానంద వాత్సాయన్ గారు హిందీ లోకి , రాజేశ్వరీ కోదండంగారు “ఉళ్ళక్ కుమురల్ ” పేరుతో తమిళంలోకి అనువదించారు.

పద్మజ :—- మీ రచనలపై పరిశోధనలు వచ్చాయా?

సుభద్రా దేవి : — ఇప్పటి వరకూ నా రచనలపై వివిధ విశ్వవిద్యాలయాల్లో మూడు MPhil పరిశోధనలూ,రెండు PHD పరిశోధనలూ జరిగాయి.

పద్మజ :—- మీ శ్రీవారు చిత్రకారులు కదా! మీ రచనా వ్యాసంగానికి వారి తోడ్పాటు ఎలా వుండేది?

పద్మజ :— మీకు నాభర్త శీలా వీర్రాజుగారు రచయిత కూడా అని తెలియదనుకుంటాను. ఇంటర్మీడియేట్ చదువుతోన్న రోజుల్లోనే 1956 లో మొదటి నవలతో మొదలుపెట్టి నాలుగు నవలలూ, తొమ్మిది కథలసంపుటాలు, ఎనిమిది కవితా సంపుటాలు, ఒక వ్యాస సంపుటి వీర్రాజుగారి సాహిత్య ఖాతాలో వున్నాయి. అందుచేత మొదటినుంచీ వారి ప్రోత్సాహం వుంది. నా పుస్తకాల ప్రచురణకు పూర్తి తోడ్పాటు వుంది.

పద్మజ :—- కాత్యాయనీ విద్మహే మీ పుస్తకానికి చక్కని పీఠిక రాసారు – ఆ సందర్భం ఎలా తారస పడింది?

సుభద్రా దేవి :— 2009 లో అప్పటి వరకూ వచ్చిన ఎనిమిది సంపుటాలను కలిపి “శీలా సుభద్రాదేవి కవిత్వం” పేరిట వీర్రాజుగారు నా అరవయ్యేళ్ళ జన్మదిన సందర్భంగా ప్రచురించారు. ఆ పుస్తకానికి కాత్యాయనీ విద్మహే చాలా వివరంగా సుమారు పదహారు పేజీల పీఠిక రాసారు.

పద్మజ :— రెక్కల చూపు. రెండవ కథా సంపుటి గురించి వివరించండి !

సుభద్రా దేవి :—- రెక్కల చూపు నా రెండవ కథలసంపుటి. ఇందులోని గోవుమాలచ్చిమి కథకి ఆంగ్లానువాదం కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన సంపుటిలో చేరింది.”మార్పు వెనుక మనిషి కథ ” తిరుపతి SV విశ్వవిద్యాలయం మొదటి సంవత్సరం డిగ్రీ తెలుగు సిలబస్ లో పాఠ్యాంశంగా చేర్చారు. చాలా కథలు సంకలనాలలో చేరాయి.

పద్మజ :– ఇస్కూలు కతలు పేరు ఆశ్చర్యంగా ఉంది! దీని నేపథ్యం చెప్పండి !

సుభద్రా దేవి :— ఇస్కూలు కతలు తెలుగు విద్యార్థి మాసపత్రికలో రెండున్నరేళ్ల ఏళ్ళ పాటూ ధారావాహికంగా ప్రచురితమయ్యాయి. తర్వాత అదే పేరుతో గ్రంథస్థం చేసాను. ఇందులోని కథ మహారాష్ట్ర ప్రభుత్వపాఠశాల తెలుగు ద్వితీయ భాషగా చదివే ఏడవ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా పదేళ్ళుగా చేర్చారు. ఇటీవల డా.గణేష్ రామ్ గారు హిందీలోకి అనువదించిన ఇస్కూలు కతలు పుస్తకం
గా వెలువడింది.

పద్మజ :—– కొన్ని సంకలనాలకు సంపాదకత్వం వహించారు కదా? ఆ వివరాలు ?

సుభద్రాదేవి :—. ముద్ర (వనితల కవితల సంకలనం – భార్గవీ రావుతో సంపాదకత్వం, 2001)

  1. వాళ్ళు పాడిన భూపాలరాగం (డా. పి. శ్రీదేవి కథలు, 2022)
  2. యాభై ఏళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు (2022)
  3. మధుకలశమ్ (డా.పి. శ్రీదేవి కవిత్వం(2023)
  4. నది ప్రయాణం (శీలానవీ స్మరణికలు)(2023)
  5. శీలావీ శిల్పరేఖలు (2024)
    7.ఒక చిత్రకారుడు -కొన్ని అవలోకనాలు ( 2025 శీలా వీర్రాజు చిత్రలేఖనంపై ప్రముఖులు రాసిన వ్యాసాలు)
    8.శీలాక్షరాలు కవితా సంకలనం (2025 శీలావీఫాంట్ తో కూర్చిన 250 మంది కవుల కవితలు)
    ఇవి ఇంతవరకూ నా సంపాదకత్వంలో వచ్చిన పుస్తకాలు.

రంగరాజు పద్మజ :- మీ సాహిత్య పయనం చూస్తే చాలా సంతోషమైందండీ !

పద్మజ :— తరుణి పత్రిక గురించి మీ అభిప్రాయం చెప్పండి !

సుభద్రా దేవి : —- ఒకప్పటి కన్నా ఇప్పుడు మహిళలు సంపాదకత్వంలో వస్తున్న పత్రికలు, అందులోనూ అంతర్జాల పత్రికలు ఎక్కువగానే వున్నాయి. అది సంతోషించదగిన విషయం. కొండపల్లి నీహారిణి ఒకేసారి రెండు పత్రికలు తీసుకుని రావటం ముదావహం.

పద్మజ :— పత్రిక పాఠకుల ఆదరణ పొందాలంటే ఇంకా ఏమి చేయాలో సూచనలు చేయండి!

సుభద్రా దేవి :—- ఇప్పుడు అంతర్జాల పత్రికలు ఎక్కువగానే వున్నాయి. వాటిలో వస్తున్న శీర్షికలు, కథనాలూ పరిశీలించాలి. వాటికన్నా విభిన్నమైన రీతిలో పత్రిక ఉండటానికి ఎటువంటి మార్పులు, చేర్పులూ వుండాలో ఏడాదికొక సారైనా సమీక్షించుకొని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వుండాలి.
సామాజిక జీవితాల పట్ల చక్కగా చలించే హృదయమున్న రచయిత్రి శీలా సుభద్రాదేవి గారి సాహిత్యం స్పష్టతతో పాటు ఎవరైతే బాధించబడే వర్గం ఉంటుందో వారి పట్ల దయాగుణం చూపిస్తూ… ఆ దయాగుణం అందరికీ .. ఉండాలంటూ… అక్షరీకరిస్తారు సుభద్రా దేవి గారు!

నిజమే కదా! సమాజం పట్ల బాధ్యత ఉన్న ఎవరికైనా ఆ గుణం ఉండాలి! అందుకే ఆ బాధా తప్తుల కోసం ఓదార్పు వంటి రచనలు చేసి, వారిలో ఆలోచనలు రేకెత్తించే భావాలతో నింపి, సాహతీ సేవ చేస్తున్న శీలా సుభద్రా దేవి గారు ఆ తాడిత- పీడిత ప్రజలకే కాదు! ఇలాంటి రచనలు చేయాలని ఆలోచన కలిగించి, రచయిత్రులకూ మార్గదర్శకురాలే! వారి నుండి మరిన్ని ఇటువంటి రచనలు కోరుతూ వారికి పత్రికాముఖంగా ధన్యవాదాలు అందిస్తూ సెలవు తీసుకుంటున్నది…

July 31, 2025 26 comments
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

అయితే మీరే..(భుజాలు తడుముకుంటున్నారుగా!)

by Sompaka Seetha July 31, 2025
written by Sompaka Seetha

మా ఫ్రెండ్స్‌లో మేమిద్దరమే ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించు కోలేకపోయాము. ముఖ్యంగా మరీ నేను అన్ని యోగ్యతలు ఉండి కూడా చిరుద్యోగిగా మిగిలిపోయా. ఎదుగు బొదుగూలేని జీతం తెచ్చుకుంటూ సమాజం చూపించే నికృష్టమైన చూపుల తాకిడికి చాలా మానసికమైన క్రుంగుబాటుకు లోనైన రోజులెన్నో. అవన్నీ గుర్తుకొచ్చి మనసంతా చేదుగా మారిపోయింది. మాలినివైపు చూశాను. ఒక మాత్ర, నిద్రకోసంగా వేసుకుంటానని చెప్పింది. బహుశా అందుకేనేమో నిద్రలోకి జారిపోయింది. నేనేమో గత జ్ఞాపకాల పుట్టకు చుట్టుకుపోయాను నా ప్రయత్నం లేకుండానే.

ప్రైవేట్‌ కళాశాలలంటే తెలవనిది ఏముంది? చాకిరీ ఎక్కువ, జీతాలు తక్కువ జీవితాంతం చేసినా. తరగతిలో విద్యార్థులు ఎక్కువ. వారం వారం పరీక్షలు. వాటిని మూల్యాంకనం చేయడం. అదనపు తరగతులు ఎక్కువ. సెలవులు తక్కువ. వెట్టిచాకిరీ లాగానే అన్పించేది ఒక్కోసారి. పుట్టింటి వేడుకలు, పెండ్లిండ్లకు కూడా ఓ అతిథిగా వెళ్ళినట్లుండేది. వేడుకకు ముందురోజు వెళ్లటం, వేడుక చూసుకోవటం, మళ్ళీ తెల్లారే వచ్చేయటం. ఇక ఇరుగు పొరుగు అమ్మలక్కల వింత మాటలు ‘ఆమెకేం హాయిగా పొద్దున్నే వెళ్లిపోతుంది. ఎప్పుడో పొద్దుగూకే సమయానికి వస్తుంది’ అన్నట్టుగా చాటుమాటు మాటలు ఒక్కోసారి చెవినపడి చాలా బాధ అన్పించేది. మావారు (కూడా) ఉద్యోగే ఆఫీసర్‌ స్థాయి. రోజూ వెళ్ళివస్తూండేవారు. ఇంటికి, మా కాలేజీకి మధ్య చాలా దూరం. పిల్లలిద్దరికీ, మా వారికి, నాకు క్యారేజీలు సర్దుకోవాలి. ఇంటిపనులు పూర్తి చేసుకుని ఇల్లు సర్దుకోవాలి. ఎంత సర్దుకుంటే మహిళలు ఎనిమిది గంటలకల్లా బైటపడగలరు. ఎంతటి మానసికమైన వత్తిడిని ఎదుర్కోవాలి ప్రతిరోజూ. ఇవ్వేమీ తెలవవు ఆ వాగుడ్లు వాగేవారికి. నేనేదో దర్జాగానే వెళ్తున్నట్లుంది చూసేవారికి. తలొంచుకుని నా దారిన పోతుంటే. ఎంత పొగరోననే చూపులు గుచ్చుకునేవి. పోనీ ఒకే వీధిలో ఉంటున్నాం గదాని పలకరిస్తే, ఏం మీకు ఈ రోజు సెలవు కాదా? అనే వెటకారపు మాటలు. ఎప్పుడైనా దొరకక దొరకక ఒక సెలవు రోజు దొరికి, ఏ షాపింగ్‌కో వెళ్తుంటే ‘మీరివాళ కాలేజీకి పోలేదా?’ అనే మాటలు ఇవే ఉంటాయి వెక్కిరింపుల మాటలు దొర్లుతాయి. ఇలాంటి మాటలు వింటుంటే చాలా ఎంబ్రాసింగ్‌గా, ఇరిటేటింగ్‌గా ఉండేవి.

ఇక బంధువర్గం నుంచి మాటలు మరోరకంగా బాణాలై చురుక్కుమని గుచ్చుకుంటాయి. ‘ఓ ఇంకా ప్రభుత్వ ఉద్యోగం రాలేదా నీకు? అయినా గవర్నమెంటు ఉప్పుతినే అదృష్టం ఉండాలి ఎవరికైనా?’ అంటూ మొహం మీదే సామెత చెప్పినట్లుగా చెపుతూ, వేళాకోళపు చూపులు, ఇంట్లోనేమో ఇంకా ప్రత్యేకంగా… ‘బోల్డంత మందికి ఉద్యోగాలొస్తున్నాయి. టిక్కుటిక్కుమంటూ నువ్వింకా అదే చేస్తున్నావు. సంవత్సరానికి బోడి రెండొందలు పెరుగుతుంది. మీరేమో గట్టిగా అడగరు మేనేజ్‌మెంట్‌ని, ఆ ఇచ్చేది కూడా పదో తారీఖు దాటిన తర్వాతనే అనే సణుగుళ్లు. ఇలాంటి మాటలు విని వినీ రాయిలాగా అయిపోయిన మనసు మౌనంగా కన్నీళ్లు కార్చేది.

అత్తగారు లేనేలేరు. ఆమె వంతుగా వినొచ్చే మాటల్ని కూడా మా ఆడబడుచులే మూటకట్టుకుని నానెత్తిమీద గ్రుమ్మరిస్తూ ఈసడిరపుగా పలికే మాటల్ని అటుంచితే భర్తనుంచే వినాల్సిరావటం ఆడవారికెవరికైనా బాధగానే ఉంటూ గుర్తొచ్చినప్పుడల్లా ములుకుల్లాగా గుచ్చుకుంటూ ఉంటాయి.

పట్టుదలగా నా మెతుకు నేనే సంపాదించుకోవాలనే ఆకాంక్షతో చిన్న

ఉద్యోగమైనా విడువకుండా సుమారుగా 35 ఏండ్ల పాటు వెట్టిచాకిరీనే చేశా. ఇన్నేళ్లు ఎట్లా చేశారాంటీ? అని తెలిసినవాళ్లు ఎవరైనా అడిగితే ఇంట్లో కూర్చుని ఏం చేస్తామమ్మా మనం నేర్చుకున్న చదువు వృధా పోకుండా నల్గురికీ పంచటమే నాకిష్టమని చెప్పేదాన్ని. దీనికి వెనుకవున్న అసలు ఉద్దేశ్యం మీకు తెలవటమే నాకు కావలసినది.

సెలవులు ఎక్కువగా లభించవుగదా ప్రైవేటు సంస్థల్లో పనిచేసేవారికి. మన దగ్గిర ముస్లిం పిల్లలు ఎక్కువ లేరని వారి పండుగలకు సెలవు లేకుండా చేయటం. పరీక్షా ఫలితాలు బాగా రావాలని ప్రైవేటు తరగతులతో రుద్దటం, కఠినంగా ఉన్న సబ్జెక్టుకు ఎక్స్‌ట్రా క్లాసులంటూ సమ్మర్‌లో కూడా మాకివ్వాల్సిన సెలవులను కుదిస్తూ మొత్తంమీద ఓ పదిరోజులివ్వటం గగనమైపోయేది. ఇక ఇలాంటి సందర్భంలో తీవ్రమైన వాగ్భాణాలు సంధింపబడేవి ఇంట్లో. ‘వాళ్ళిచ్చే ఇంతోటి జీతానికి సెలవురోజు కూడా కాలేజీకి పోవాలా? నువ్వే పోతున్నావా? ఇంకెవరైనా వస్తున్నారా లేదా? ఒకచో అనుమానపు చూపులు…

‘అదేంటండీ… అందరికీ సెలవులిచ్చారు గదా! ఐనా మీరు

వెళ్తున్నారెందుకంటూ…’ ఏదో నామీద లేనిపోని సానుభూతి ఒలకపోస్తూ చేసే కొందరి ఇచ్చకాల మాటలు… ఇంట్లో గొడ్డు చాకిరీ చేస్తున్నా… అందరి చేతా మాటలు శూలాలై గ్రుచ్చుకుంటున్నా, క్లాసుకు వెళ్లగానే, బోధనలో పడగానే మనసు దూదిపింజలా తేలిపోయేది. అసలు పనిచేస్తున్న కాలేజీలోకి అడుగు పెట్టగానే ఓ ఓ పవిత్రభావన నన్ను అలుముకునేది. ఇదంతా ఆ సరస్వతీ మాత అందించిన దీవెనలా భావిస్తుంటాను ఇప్పటికీ. కానీ ఒక్కోసారి మనసు మరీ బాధపడేదెందుకంటే పదో తారీఖు వచ్చేసింది. ఇంకా జీతమడిగి తీసుకోరా, అడగటం కూడా చేతకాదా? అనే పదునైన ప్రశ్నలు ప్రతినెలా వినాల్సి రావటం. అసలు చదువుకోకుండా ఉంటే ఎంత బాగుండేది? ఒకవేళ చదువుకున్నా ఏ పదో తరగతి తోటో ఆపేస్తే ఎంత బాగుండేది! నేను కళాశాల నుండి స్టడీ అవర్‌ గానీ లేదా అదనపు క్లాసుగానీ ముగించుకుని వచ్చే సమయానికి సూర్యాస్తమయం దాటిపోయేది. సూర్యోదయానికి ముందే అంట్ల గిన్నెలతో కుస్తీలు, వంటింట్లో తలమునకలయ్యే పనులు… నాలుగున్నర ఐదింటికి ఠంచనుగా లేస్తేనే అట్లాట్లా టైము సరిపోయేది. ఒంట్లో నలతగా ఉండి ఏరోజైనా లేవటం ఆలస్యమైపోతే ఇక ఆరోజు చెప్పనే అక్కర్లేదు. ఈ ఇబ్బందులతోటి పోల్చుకుంటే ఇంట్లో హౌజ్‌ వైఫ్స్‌గా ఉంటారే వాళ్లపని చాలా బెస్ట్‌ అన్పిస్తుంది. పైగా భర్త జీతాన్ని తాము అందుకుంటూ ఇంట్లో వాళ్లందరి మీదా పెత్తనం చెలాయించటం, ఇంట్లో అన్నింటికి వాళ్ళ మాటే చెల్లుబాటులోకి తెచ్చుకోవటం ఇవన్నీ గమనిస్తుంటే… నాలాంటి చిరు ఉద్యోగినులందరికీ మిగిలేది ఏంటయ్యా అంటే ఏతావాతా చీవాట్లు, ఈసడిరపులు, పని ఒత్తిడిలో నలిగిపోవటం మినహా ఏం మిగిలిందనీ అనిపిస్తుంది నాకు. కానీ ఓపిక ఉన్నంతవరకు చిన్నదైనా సరే జాబ్‌ చేస్తూ స్వాభిమానంతో బ్రతకటమే ఎంతో మేలుగదా! ఆలోచిస్తూ… ఆలోచిస్తూ… గతాన్ని నెమరు వేసుకుంటూ నేను కూడా ఎప్పుడు నిద్రలోకి జారిపోయానో తెలవదు.

మెలకువ వచ్చి చూస్తే తెల్లారి ఏడన్నరయింది గోడమీద ఉన్న గడియాం చూసేసరికి. నా చెయ్యి మాలినిని చుట్టుకుని ఉంది. పంక్షన్‌లో అలసిపోవటం మూలానో, ఆలోచనలకు నిద్రకు బ్రేకు వేయటమో… మొత్తానికి ఏమైందో తెలియదు గాని, తర్వాత గాఢ నిద్రే నన్ను వరించినట్లుగా అర్థమైంది. మనసు చాలా తేలికయినట్లన్పించింది.

***

ఆలోచనలను, బాధలను దులుపుకున్న మనసులు రాత్రిని కూడా దులుపుకున్నాయి. కప్పుకున్న దుప్పట్లను మడత పెట్టి, వాటి స్థానాల్లో సర్దేసి, బ్రెష్‌, స్నానం పూర్తిచేసుకుని, దేవుని దగ్గర దీపం పెట్టుకుని, టిఫిన్లు పని పూర్తిచేసుకుని ఇద్దరూ తయారవటం మొదలుపెట్టాము. ఎందుకంటే ఈరోజు ఆమని వాళ్ళింటికి వస్తామని తనకు మాటిచ్చాం. నిన్నంతా ఫంక్షన్‌కి వచ్చిన గెస్టులను రిసీవ్‌ చేసుకోవటం, భోజనాలకు తీసుకువెళ్ళటం, మళ్ళీ వాళ్లని సాగనపంటం. మధ్యమధ్యలో ‘మీరు కూడా రావాలి ఫోటోకి’ అని కోరే బంధువులతో, వచ్చిన ఫ్రెండ్స్‌తో స్టేజీ మీదకి ఫోటో దిగటానికి వెళ్ళాల్సి రావటం… ఇన్ని పనుల మధ్య సతమతమవుతూ కూడా కుదిరినప్పుడల్లా మా దగ్గరకు వచ్చి బాగా అయినవారిని మాకు పరిచయం చేయటం లాంటి పనులతో ఆమని హడావుడి పడుతోంది. మా పిల్లల చిన్నప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు మేమంతా కలిసి ప్రైవేట్‌ కాలేజీలో పని చేశామని వారికి చెప్పటంతో ‘ఆ… ముప్ఫై, ముప్ఫై ఐదేండ్ల స్నేహమా మీది?’ అని వాళ్ళు ఆశ్చర్యపోవటం చూస్తుంటే చెప్పద్దూ… మాకు ఒకింత గర్వంగా

ఉండేది. అది ఆమని వాళ్ళ మనవడి బర్త్‌డే ఫంక్షను, పెండ్లిండ్లు, ఎంగేజ్‌మెంట్లు వాటితో పోల్చి చూస్తే ఇది చిన్నదే గదా!

అందుకే వాళ్ళు ‘ఈ ఫంక్షన్‌కి అంత దూరం నుండి వచ్చారా’ అని ఆశ్చర్యంగా అడుగుతుంటే మా మధ్య పాదుకొని ఉన్న స్నేహ మాధుర్యం నా మనసునిండా సుధలు చిమ్మించేది. ఇదీ అని చెప్పలేని, ఎంత చెప్పినా తనివితీరని, ఎప్పటికీ మాసిపోని మా స్నేహబంధమిది అని వాళ్ళకు ఏం తెలుస్తుంది? అనుకున్నా నా మనసులో.

మొహమాటాన్కి వచ్చేవాళ్లు కొందరు, పరిచయాన్ని పురస్కరించుకుని రాకపోతే ఫీలవుతారని వచ్చేవాళ్లు కొంతమంది, మనింటికి వచ్చారుగదా, మనం కూడా వెళ్ళాలి, బాగోదని కొందరు, దాన్ని బాధ్యతగా భావించి కొందరు, పనిచేసివున్న ఆఫీసు కాబట్టి మొక్కుబడి కోసం వచ్చేవారు ఇంకొందరు, ఒకే అపార్టుమెంటులో ఉండేవాళ్ళము తెల్లారి లేస్తే ఒకరి మొఖాలొకరు చూసుకోవాలి… ఇది తప్పనిసరి అని భావించి అటెండయ్యేవారు కొంతమంది… వాళ్లకూ, మనకూ అంతగా మాటల్లేక పోయినా పిలిచారు కాబట్టి వెళ్ళొద్దాం. వెళ్ళకపోతే మనింటికి మళ్ళీ పిల్చినా వాళ్లు రారు అని మొక్కుబడిగా వచ్చేవాళ్ళు… ఇలా హాలంతా నిండిపోయి మొత్తానికి సందడి సందడిగా, కోలాహలంగా ఉంటే, తిండి కోసమే వచ్చామన్నట్టుగా ఆబగా ప్లేటునిండా వడ్డించుకుని, ఆపై తినలేక వృధాగా పారేసే వేస్టురాయుళ్లు.. ఇందరి మధ్యన వెలుగుతున్న స్నేహ బంధం గొప్పదనం వాళ్ళకి ఎలా చెబితే అర్థమవుతుంది చెప్పండి.

అందర్నీ గమనిస్తూ భోజనం చేస్తున్న మమ్మల్ని ‘‘ఆ కర్రీ వేయించుకోండి చాలా బాగుంది. ఇదిగో ఈ కర్రీ రోటీలోకి బావుంటుదని మా పిల్లలు స్పెషల్‌గా చేయించారని, తానే స్వయంగా తెచ్చి వడ్డించటంతో నేనే వారించా ఆమనిని.

‘‘మేమేమన్నా కొత్త చుట్టాలమా? ఏంటి చెప్పు. మాకు కావాల్సింది మేము పెట్టించుకుంటాంలే! అని చెప్తూ అతిథులను చూసుకో ఆమనీ’’ అని ఒకింత గట్టిగా చెప్పటంతో అయిష్టంగానే కదలటం తప్పింది కాదు తనకు. ఆ కబుర్లూ, ఈ  కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించి, తలా ఓ కప్పు ఐస్‌క్రీము తినే పనిలో పడ్డాం. మాకు తెలిసిన వారిని పలకరిస్తూ, వారి యోగక్షేమాలు కనుక్కంటూ మధ్యమధ్యలో మా మా హ్యాండ్‌ బ్యాగ్‌ల మీద ఓ కన్నేసి ఉంచుతున్నాం. తప్పదుగదామరి! జనం తొక్కిడిలో వున్నప్పుడు మన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేగదా!

అతిథుల తాకిడి క్రమక్రమంగా తగ్గుతోంది. నిండుగా ఉన్న ఆ హాలు పలచబడుతూ, పొందికగా వేయబడ్డ కుర్చీలు అయిష్టంగా ఉన్న వ్యక్తులు ప్రక్క ప్రక్కనే ఉన్నా ఎలా పెడమొఖంగా ఉంటారో అట్లా ఉన్నాయి. బఫే మూలంగా అక్కడక్కడా వాటర్‌ తాగిన గ్లాసులు, ఫంక్షన్‌ మధ్యలో సర్వ్‌చేసిన కూలింగ్‌ డ్రిరక్‌ బాటిల్సు అక్కడక్కడా చెల్లాచెదురుగా పడివున్నాయి. ఇంట్లో ఏదన్నా అభిప్రాయ బేధాలు లేదా గొడవలు జరిగినపుడు కుటుంబంలో ఏదో కష్టపడిపోయినట్లు. ‘ఇక మేం వెళ్లొస్తామండీ!’ అంటూ ఆమని దంపతులకు చెప్పి వెళ్తున్నారు వచ్చిన అతిథులు.

ఎక్కడి వాళ్లక్కడ స్తబ్దుగా ఉన్నట్లుగా తోచసాగాయి వాటిని చూస్తుంటే. సందడి సద్దుమణిగింది. మేం కూడా ఆమని దంపతులకు వెళ్లొస్తామని చెప్పి బైల్దేరాం అక్కడి నుండి.

మాలిని, నేనూ ఆటోలో వెళ్తున్నామన్న మాటేగానీ కందిరీగల్లా ఆలోచనలు ముసురుకోసాగాయి నా మనసులో.

‘‘ఆమని ప్రొద్దున్న కాల్‌ చేసింది నాకు. చూసుకోలేదు. ఇటురావటానికి తయారయ్యే ధ్యాసలోపడి’’ అంది నవ్వుతూ మాలిని నాతో.

వింటున్నట్లుగా తనని చూసి తలపంకించాను నేను.

‘‘ఈ పూట భోజనానికి రావాలి తప్పకుండా’’ అని మెజేస్‌ పెట్టింది. నేను ఫోన్‌ చూసుకోలేదని’’ అంది మాలిని మళ్ళీ.

మళ్ళీ ‘ఊ’ అన్నాను తల ఊపుతూ.

ఫంక్షన్‌ కొచ్చిన కొంతమంది అట్నుంచి అటే వెళ్లినా దగ్గిర బంధువులు కొందరైనా ఇంటికొచ్చి బస చేస్తారుగదా! వద్దంటే వినదు.

అసలు తననోసారి కలిసి కాసేపుండి ఆ బర్త్‌డే బుడ్డోడ్ని మరోసారి ఎత్తుకొని మురవాలని నా ఆశ. మాలినిది కూడా అదే ఆశ. ఆ ఆలోచనతోటే ఉన్న మాకు భోజనానికి ఇక్కడికే రావాలన్న ప్రేమ పూర్వక ఆదేశంలాంటిది అందటంతో తప్పించుకోలేకపోయాము మేమిద్దరం. మాలిని మనసులోని భావాలు కూడా ఇవే సాగుతున్నట్లుగా అర్థమవుతున్నాయి తన ముఖ కవళికలను చూస్తుంటే.

‘‘అవునబ్బా మైథిలి… రామారావు అన్నయ్యగారు చాలా మారిపోయారు. మునుపటిలాగా కాదు. నిప్పులోంచి పుటం పెట్టి బైటికి తీసిన వ్యక్తిలాగా స్వచ్ఛమైన వ్యక్తిత్వంతో మెరిసిపోతుంటారు’’ నిండైన మనసుతో తొణికిసలాడుతుంటారు’’ అంది నాతో.

‘‘అవును భార్యభర్తలిద్దరూ చాలా హెల్పింగ్‌ నేచర్‌ ఉన్న సహృదయాలు అంటూ గతంలోని ఒక సంఘటనను ఇలా పంచుకుంది మైథిలి మాలినితో.

మా పెద్ద మనవరాలు పుట్టినపుడు హాస్పిటల్‌లో…

మా పెద్దమ్మాయి కిరణ్మయిని కాన్పు కోసం హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడు మా ఇంటి చుట్టూతా ఉన్న ఆడపడుచులూ, మా తోటికోడలు అందరూ వచ్చారు రావటానికైతే. దానికి తొలిచూలు. నాకూ క్రొత్త. ఏదో భయంతో కూడిన హడావుడి. కాలూ చెయ్యి ఆడట్లేదు నాకు కంగారులో. ఉమ్మనీరు పడిపోవటంతో కాన్పు కష్టమయ్యేట్లుందని డాక్టరమ్మ సిజేరియన్‌ చెయ్యాలని చెప్పి మావారితో సంతకం తీసుకున్నారు. సర్జరీకి కావలసిన ఫార్మలిటీస్‌ ఏవో ఉంటాయి గదా! చకచకా ఆ పనులు పూర్తవుతున్నాయి ఒక ప్రక్కనుంచి. రెండోవైపు పిల్లని ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లారు నర్సులు. నాకేమో ఇంకా భయం పెరిగిపోతోంది మనసులో. ఎట్లా బైట పడుతుందో ఏమోనని ఆదుర్దా మావారి మొహంలో స్పష్టంగా కన్పడుతోంది. ఎప్పుడూ ధైర్యం చెదరని వ్యక్తి ఆయన గంభీర వదనంలో కూడా కంగారు స్పష్టంగా కనబడుతోంది. ఏమి చెయ్యడము. ఏం చెయ్యాలో తోచని పరిస్థితి. అప్పుడు మా చిన్నపాప హరిణి అక్కడే ఉంది. ముందుగా ఈ  విషయం వెంటనే ఆమనికి ఫోన్‌ చేసిందట తను. కబురందిన వెంటనే ఆఘమేఘాలమీద వచ్చి వాలారు ఆమని దంపతులు. ఇక్కడొక విషయం చెప్పాలి. తను ఒక్కతే వస్తే చాలు నాకు సాయం చేయటాన్కి. కానీ తనతోపాటుగా వాళ్ళ వారు రామారావు అన్నయ్యగారు కూడా వచ్చి చాలా సేపటి వరకూ అక్కడే ఉండిపోయారు మాతోపాటుగా. మా బంధుగణం వాళ్ళల్లోవాళ్ళు ఛలోక్తులు వేసుకుంటూ టైంపాస్‌ చేస్తున్నారుగానీ, ఒకళ్లైనా వచ్చి ‘భయపడకు మైథిలీ, ఏం కాదు కిరణ్మయికి. తేలికగానే బయటపడుతుంది అని ఒక్కరు కూడా నాకు ధైర్యం చెప్పటం కాదుగదా, కట్టకట్టుకున్నట్టుగా అందరూ ఓ ఫ్యాన్‌ కింది చేరిపోయారు. నేను, మావారు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాము, థియేటర్‌ బయట తలుపులకు దగ్గరగా నిలబడి. నర్సులు బైటకి వచ్చి కొబ్బరినూనె, ఇంకా పాత క్లాతులు ఇట్లా ఏవేవో అడుగుతుంటే మా చిన్నపాపే అందిస్తోంది వాళ్లకు. నా ప్రక్కనే నిలబడి ఆమని నా చెయ్యి పట్టుకుని ‘ఏంకాదండీ… కంగారు పడకండి’ అంటూ ఉపశమనపు మాటలు చెబుతోంది. తన మాటలకు కాస్త ఊరట లభించింది నాకు. కొంచెం తెప్పరిల్లాను. ఈలోపులో థియేటర్‌లో నుండి అప్పుడే పుట్టిన చంటిపాప ఏడుపు కేర్‌కేర్‌ మని (పెద్దగా) వినపడటంతో అందరి మొహాల్లో నవ్వులు విరబూశాయి. ఈలోగా ఒక నర్సు తలుపు కొద్దిగా తెరిచి, ‘మీకు మనవరాలు పుట్టింది. తల్లీ, బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నార’ని చెప్పటంతో, ఇంతవరకూ పడ్డ ఆ కంగారూ, ఆదుర్దా ఎటు ఎగిరిపోయాయో తెలియదు. నా మనసు ఆనంద తరంగమైంది. మావారి మొహంలో సంతోషం ఎగిసిపడుతోంది.

ఇంతలో పాపను హాస్పిటల్‌ డ్రస్సప్‌తో చలిగాలి తగలకుండా భద్రంగా చుట్టి నాకు తెచ్చివ్వబోతుంటే, చటుక్కుమని ఆమని తన రెండు చేతులను చాచి పదిలంగా అందుకుంది. నాకేమీ అర్థం కాలేదు.

‘‘రండి మైథిలీ… మనమిప్పుడు పీడియాట్రిషన్‌ దగ్గరకు వెళ్ళి వ్యాక్సిన్‌ వేయించాలి బేబీకి’’ అంటూ అన్నయ్యగార్ని ఆటో తెమ్మని పురమాయించింది.

మావారు, మా చిన్నపాప కిరణ్మయిని చూసుకుంటానికి అక్కడే ఉన్నారు. బంధువుల కబుర్లు కొనసాగుతూనే ఉన్నాయి. హరిణీ అక్కను జాగ్రత్తగా చూసుకోమని చెబుతూ, మావారి నుండి నేను కొంత డబ్బు అడిగి తీసుకుని, ‘జాగ్రత్తగా చూసుకోండి కిరణ్మయిని’ అని చెబుతూ, ఆమనితోబాటుగా నేనూ నెమ్మదిగా మెట్లుదిగి, అన్నయ్యగారు రెడీగా తెప్పించి ఉంచిన ఆటోలో జాగ్రత్తగా ఎక్కి, పిల్లల హాస్పిటల్‌కు చేరుకుని, పాపాయికి వ్యాక్సిన్‌ వేయించుకుని తిరిగి హాస్పిటల్‌కు నేను, ఆమని చేరుకున్నాము. రిసెప్షన్లో రూం నెంబరు కనుక్కుని రూమ్‌లోకొచ్చాము. మత్తు

ఉంటుందిగా కొద్దిపాటి మూలుగుతో మంచం మీద పడుకో పెట్టబడి ఉంది కిరణ్మయి. మావారు మెడిసిన్స్‌ తీసుకోవటాన్కి క్రింద గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న మెడికల్‌ షాపుకు వెళ్ళినట్లుగా చెప్పింది హరిణి. ఎంతో పదిలంగా ప్రేమతో పాపాయిని కిరణ్మయి ప్రక్కన జాగ్రత్తగా పడుకోబెట్టి, అంతే జాగ్రత్తగా బెడ్‌షీట్‌ను కప్పింది ఆమని, చలిగాలి తగలకుండా. మనసులో ఏ మారుమూలో దాగివున్న కంగారు, భయం క్రమేపీ తగ్గసాగాయి నాలో. ఆమని లేకపోతే నేను పాపాయిని వ్యాక్సిన్‌కి తీసుకెళ్లటం, తీసుకురావటం ఖచ్చితంగా చేయలేననిపించింది. తను ఉండబట్టి సరిపోయింది. అప్పుడే పుట్టిన బేబీస్‌ను ఎలా ఎత్తుకోవాలో తెలవదు నాకు. ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా ఆమని రెండు చేతులూ పట్టుకుని `

‘‘థ్యాంక్స్‌ ఆమనీ’’ అన్నా నిండైన మనసుతో, ఆనంద భాష్పాలు నిండిన కండ్లతో. గద్గదమైన కంఠం నుండి ఎక్కువ మాటలు వెలువడలేదు నాకు.

‘‘ఇవేం మాటలు. ఇలాంటి మాటలుండకూడదు ఫ్రెండ్స్‌ మధ్యలో’’ అంటూ నా వీపు నిమిరి, ఎనలేని ధైర్యాన్నిచ్చిన ఆపన్న ధైర్య హస్తం ఆమనిది.

బంధుగణం అనబడే మావాళ్లు నెమ్మది, నెమ్మదిగా ఒక్కొక్కరు మెచ్చుకోళ్ళుగా అభినందనలు చెబుతూ వాళ్ళ ఇండ్లకు వెళ్ళిపోవటానికి తిరుగు ముఖం పడుతున్న సమయంలో, మావారు పెద్ద మందుల పెట్టెతో వచ్చారు రూంలోకి. ఆ వెనుకే వచ్చిన నర్సు ఇంజక్షన్‌ని లోడ్‌ చేసుకుంటూ, ‘పాపాయికి మధ్య మధ్యలో దూదితో డిస్ట్రిల్‌ వాటర్‌ని చప్పరించేటట్లు చేయండి’ అంటూ కొంచెం దూదిని, డిస్ట్రిల్‌ వాటర్‌ బాటిల్‌ను నాకు ఇవ్వబోతే, ‘మీరాగండి’ అంటూ తనే అందుకుంది ఆమని.

ఆ వెళ్తున్న వాళ్లను చూస్తూ ఎవరన్నా ఇక్కడుండండి మైథిలికి తోడుగా అని మావారు అనబోతండగా, అది వినిపించుకునే స్థితిలో లేని వాళ్ళ కదలికలు ‘వెళ్ళొస్తాం మైథిలీ’ అని తిరుగుటపా కట్టారు. చేసేదిలేక వాళ్ళ వాళ్ళు కదా! పైగా మాతోపాటు వచ్చారాయె! బాగోదని క్రిందిదాకా వెళ్ళి వాళ్లు వెళ్ళిన తర్వాత పైకి రూంకి వచ్చారు మళ్ళీ మావారు.

‘‘మీకు తోడుగా నేనుంటాను ఈ నైట్‌కి ఇక్కడ. ఇద్దరం కల్సి తల్లి పిల్లల్ని చూసుకుందాం’’ అంది ఆమని నాతో.

ఎంతో భరోసానిచ్చిన తన మాటలను, తోడుండి తెల్లవార్లూ కిరణ్మయినీ, పాపాయినీ చూసుకున్న తీరుని నేను ఈ జన్మలో మర్చిపోలేను.

‘‘ఓయ్‌, మైథిలీ!’’ అని గట్టిగా మాలిని నా భుజాన్ని కుదపటంతో నేను గతంలోంచి వాస్తవంలోకి వచ్చిపడ్డాను. ఆటోనేమో ఆమని వాళ్ళ అపార్ట్‌మెంటు ముందుకొచ్చి ఆగింది.

డబ్బులిచ్చి ఆటోవాణ్ణి పంపేసి, ఇద్దరమూ లోపలికెళ్ళి లిఫ్ట్‌ సాయంతో పైకి చేరుకుని సరాసరి ఆమని వాళ్ళ పోర్షన్‌ ముందు ఆగాము.

ఇంకా కొంతమంది బంధువులున్నారు. చిన్నపిల్లలు బొమ్మలతో ఒకరిద్దరు పిల్లలు కార్టూన్‌ నెట్‌వర్క్‌ చూస్తూ ఒకింత హడావుడిగా ఉంది, మెస్‌ డోర్‌ లోంచి చూస్తుంటే. కాలింగ్‌ బెల్‌ నొక్కింది మాలిని. వెంటనే మా కోసమే ఎదురు చూస్తోందేమో… బెల్‌ మ్రోగిన వెంటనే సంతోషంగా వచ్చి మెస్‌ డోర్‌ తీసింది ఆమని నవ్వుతూ. తన వెనకే అన్నయ్యగారు కనపడ్డారు. ఇద్దర్నీ విష్‌ చేసి అక్కడున్న సోఫాలో కూర్చున్నాము. వాటర్‌ కావాలా? కాఫీగానీ, టీ గానీ తాగుతారా అని అడిగింది మమ్మల్ని.

‘‘అయ్యబాబోయ్‌! కాఫీ, టీలు ఏమీ వద్దు. అన్నీ అయ్యాయి. ఇప్పుడేం వద్దు. కాసేపయ్యాక భోజనాలు చేసేద్దాం’’ అన్నా ఆమనితో. సరేనని తనుకూడా తలవూపుతూ మాతోపాటు కూర్చుంది కాసేపు. ఎంత కేటరింగ్‌ అయినా, ఫంక్షన్‌ జరిగిందంటే ఆ ఇంట్లో అదేనండీ ఫంక్షన్‌ హాలయినా చేసిన వారికి అలసట అన్ని వస్తువులు సర్దుకునేవరకు హడావుడి మామూలే. దీనికేమాత్రం విరుద్ధంగా లేదు ఆ ఇల్లు.

‘‘ఇప్పుడీ భోజనాలు, గీజనాలూ పెట్టుకోకపోతే ఏమైంది ఆమనీ’’ అన్నా.

‘‘ఆ… ఇక్కడున్న మేమంతా ఏదో ఒక సందర్భంలో కలుస్తూనే ఉంటాం. నువ్వు మాత్రం రాలేకపోతున్నావుగా. ఇప్పుడొచ్చావు ఎలాగో! మళ్ళీ ఎన్నాళ్లకో’’ అంది కొంచె నిష్ఠూరం నిండిన స్వరంతో.

‘‘ఆ… ఇక అలాంటిదేమీ లేదోయ్‌! కనీసం రెండు నెలలకొకసారయినా వస్తుంటాను’’ అన్నాను నమ్మకంగా. కొంచెం అనారోగ్యం బారినుండి కోలుకున్నాననే ధైర్యం వచ్చింది కాబట్టి.

‘‘అవును… ఇకనుండీ తప్పకుండా వస్తుంది మనల్ని కలవటాన్కి’’ అని నా అభిప్రాయాన్ని సమర్థించింది మాలిని.

నైటీ మీద ఉంది ఆమని. పాపం ఇంతసేపూ వంటపనిలో ఉందిగదా. ఇప్పుడే డ్రస్‌ ఛేంజ్‌ చేసుకుని వస్తా, మాట్లాడుతుండండి’’ అంటూ లోపలికి వెళ్ళింది.

మేమొచ్చిన అలికిడిని తెలుసుకున్నట్లుంది. నిన్నటి వేడుకకు కర్త, కర్మ, క్రియలుగా వెలిగిన జంట బర్తడే బాబుతో హాల్లోకి వచ్చారు. అసలు వాళ్లమ్మ చంకలో ఉండట్లేదు వాడు. కిందకి దిగి పరుగెత్తాలని వాడి ఆలోచన. ఇక లాభం లేదనుకుని తల్లి బాబుని కిందకి దింపింది. అసలు నిన్నే బాబు ఫంక్షన్‌ హాల్లో పరుగులు పెడుతుంటే ఎక్కడ పడిపోతాడో ఆ కార్పెట్లూ, కుర్చీలూ తగిలి, అనే భయంతో వెనుకెనుకే తిరిగారు బాబు తాతైన రామారావుగారు. ముందు వచ్చిన చెవులు కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అంటారు ఇదేగదూ అంటే చంద్రిక పగలబడి నవ్వింది. ఆ నవ్వుతో శృతి కలిపారు హాసిని, పద్మిని, మాలినులు. ‘అంతేగదా’ అంటూ.

అలా కిందికి దింపిందో లేదో తల్లి… బాబు హాలంతా తిరుగుతూ నన్నెవరూ చూడట్లేదులే అని గమనించినప్పుడల్లా పరుగులు తీస్తున్నాడు.

సంవత్సరమన్నా వెళ్లిందో లేదో ఆ బుడతడు అలా వేగంగా నడుస్తూ ఎవరికీ అందకుండా పరుగెత్తాలనే ఆ చిన్ని బుర్ర ఆలోచనకు నాకెంతో ముద్దొచ్చి, అమాంతం దగ్గిరగా వెళ్లి ఎత్తుకున్నాను. నవ్వు మొహం బాబుది. ఎవర్ని చూసినా కిలకిలా నవ్వుతాడు. బాబు మొహాన్ని మరింత అందంగా మారుస్తోంది వాడి చలాకీదనం.

అన్నయ్యగార్కి ఫోటోలు తియ్యమని సైగ చేశాం. వెంటనే దాదాపు ఓ ఐదారు ఫొటోలు ఫాస్ట్‌గా క్లిక్‌ చేశారు. బాబుని వాళ్లమ్మ కిచ్చాను. ఇంతలోకి లోపలనుంచి వచ్చిన ఆమని డైనింగ్‌ టేబుల్‌ మీద భోజనాలు సిద్ధం చేస్తూ, రమ్మని పిలవటంతో సింక్‌ దగ్గిరకు వెళ్లి చేతులు కడుక్కుని మాలిని, నేను డైనింగ్‌ డేబుల్‌ దగ్గరకు చేరుకున్నాము. ‘నువ్వు కూడా మాతోపాటు కూర్చో ఆమనీ’ అని పిలవటంతో తనూ మాతో చేరింది టేబుల్‌ దగ్గరకు. అన్నయ్యగారు కూడా వచ్చి కూర్చున్నారు భోజనానికి. పప్పు, చిక్కుడుకాయ కూర, పచ్చడి, సాంబారు, వడియాలు, ఒక ఆకుకూర… అన్నీ మా నల్గురికీ అందుబాటులో ఉండేవిధంగా అమర్చింది ఆమని.

* * *

మేము వడ్డించుకుందామనే లోపులోనే అన్నయ్యగారు కొన్ని పదార్థాలు, అమని కొన్ని పదార్థాలు మా ప్లేట్లలో వడ్డించి, వాళ్ళు వడ్డించే పదార్థాలకి నో చెప్పే అవకాశం లేకుండా చేశారు మొత్తానికి ఇద్దరూ కలిసి. సరదాగా కబుర్లాడుకుంటూ భోజనం ముగించాము. రామారావు అన్నయ్యగారు జోక్స్‌ కట్‌ చేస్తూ, తనకు ఉద్యోగం వచ్చిన కొత్తలో జరిగిన కొన్ని సంఘటనలు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుకున్నాం. మా టీచింగ్‌ పీరియడ్లో చూడటమే ఆయనని. సరదాగా మాట్లాడ్తారు రామారావు అన్నయ్య అని మాలిని చెబ్తుండగా, చాలాసార్లు వినివున్నాను గానీ, ఇంత క్లోజ్‌గా, సరదాగా స్వంత అన్నయ్యలాగా మాట్లాడటం చూస్తుంటే ఆ అభిమానానికి నా కండ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి. అది వారికంట కనపడకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నించాను నేను.

మాలిని వాళ్ళ కొడుకు, కోడలు ఉండేది, ఆమని వాళ్ళు ఉండేదీ అదే ఊరు. కానీ నేనే చాలా సంవత్సరాల తర్వాత కలిసి, చూస్తున్నందువల్లనో ఏమో… నిన్నటికి నిన్న పద్మిని దంపతులు, చంద్రిక వాళ్లింటో, వారు చూపించిన అభిమానం, మాలిని వాళ్ళ కొడుకు, కోడలు నన్ను రిసీవ్‌ చేసకుని అక్కున చేర్చుకున్న తీరు… ముఖ్యంగా మా అందరి పిల్లలు (ఒక్క హాసినికి మినహాయించి) మా కాలేజీలోనే, అంటే మేము పని చేసిన కాలేజీ విద్యార్థులవ్వటం వల్ల అప్పట్లో మేడమ్‌ అని సంభోదించినా, అప్పుడప్పుడు ఫోన్లలో పలకరింపు ద్వారా ఆంటీగా మారిపోయా. ఈరోజు అది నన్నెంతో సంతోషానికి అంతకు మించిన సంతృప్తిని మూటకట్టించింది. ఇలాంటి స్నేహితులుంటే చాలుగదా! వీరి ముందు సొంత చుట్టాలైనా బలాదూరే నన్పించింది. ఇదేమాట మాలినితో అంటే ‘‘అంతేనబ్బా’’ అంది తను కూడా.

ఓ గంట కూర్చున్నాక, బస్టాండుకు బయల్దేరాను నేను, అందరి దగ్గరా సెలవు తీసుకుంటూ. మాలిని, ఆమని ఇద్దరూ బస్టాండుకు వచ్చి, బస్‌ వచ్చేవరకు నిరీక్షించి, రాగానే నన్ను బస్సెక్కించి జాగ్రత్త అని చెప్పి, బైబై చెబుతూ, ఆటోలో వాళ్ళిద్దరూ వారి వారి ఇండ్లకు వెనుతిరిగారు.

***

ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ. మా జీవితాలు పరచిన ఎర్ర తివాచీలు అసలే కావు. ఇంటా, బయటా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ముఖ్యంగా కుటుంబ విషయాల్లో ఎన్నో ఢక్కా మొక్కీలు తిని పడిలేస్తూ, లేస్తూ పడుతూ… ఇదిగో ఈనాటికి అన్ని బాధ్యతలూ తీరిపోయాయి కాబట్టి నిన్నటి పుట్టినరోజు వేడుకని అంత ఆనందమయం చేసుకోగలిగాము.

టిక్కెట్‌ అన్న కండక్టర్‌ పిలుపుతో మనీ పర్సు తెరచి సరిపడా డబ్బులిచ్చి టికెట్‌ తీసుకొని, పర్సులో పెట్టి విండోకి దగ్గిరగా జరిగి కూర్చున్నాను.

వాతావరణం ఎంతో ఆహ్లాదంగా అనిపించసాగింది. కిటికీలోంచి చల్లని గాలి మొహానికి తాకి, నా ఆహ్లాదానుభూతిని అది రెట్టింపు చేసింది.

ఆమని అందమైన పేరు. కానీ పేరుకీ, జీవితానికీ ఎటువంటి లంకె కుదరదు ఒక్కోసారి. కాలం కుదిపే కుదుపులకు అతీతులం కాదెవరమూ. వాటిని తట్టుకుని నిలబడేదే గదా జీవితమంటే.

ఒకరకంగా చెప్పాలంటే మా ఫ్రెండ్సందరి పేర్లూ చాలా సౌందర్యవంత మైనవే. అలా సాగిపోవాలనే ఆశతోటి మా తల్లిదండ్రులు చిన్నతనంలో పెట్టినవే. కానీ మానవుడు తలచేదొకటి, జీవితంలో జరిగేది వేరొకటి. అందరమూ ఈ కాలచక్ర భ్రమణంలో ఎదురయ్యే కష్టాలతో ఈడ్వబడుతూ అప్పుడప్పుడూ అతిథుల్లా పలకరించే సంతోషాలను బూస్టింగ్‌లా భావిస్తూ గెలుస్తూ ఓడిపోతూ, కొన్నాళ్ళు ఓడిపోతూ, గెలుస్తామనే ఆశతో కొన్నేళ్ళు… గెలుపు, ఓటముల కలయికే జీవితమనే యదార్థాన్ని జీర్ణం చేసుకుంటూ కాలంతో నడిచిన వసంతాలు కొన్ని.

ఏంటో ఈమధ్య బాగా వేదాంతం పుట్టుకొస్తోంది నాలో. ఇది వయసుతో పాటు ఆపాదింపబడినదా లేక జీవిత వాస్తవాల నుండి ఎగజిమ్మిన లావాలా చిలకరింపా? ఏదో మొత్తానికి వాటన్నింటినీ తట్టుకుంటూ, ఒకరకంగా చెప్పాలంటే మొండిగా అధిగమిస్తూ… ఇవాళ ఇలా నిలబడిగలిగాం మేమంతా. ఇంటింటికో చరిత్ర అన్నట్లుగా ఒక్కో కుటుంబానిది ఒక్కోగాథ. ఒక్కొక్కసారి జీవితంలో తెలుపు, నలుపుల మలుపులు. ఈనాటికీ చదరంగంలాంటి జీవిత పాఠాల, గుణపాఠాల గడులను నేర్పు అనే ఓర్మితో, ఒంటపట్టిన పాఠాలను నెమరువేస్తూ బంధాలను నిలుపుకుంటూ, గుణపాఠాల బడిలో ఇంకా నిత్య విద్యార్థులుగానే వెలుగుతూ అవసరమైన అంశాలను సేవ్‌ చేసుకుంటూ మనోవ్యాధికి గురిచేసి కుంగుబాటుని రానివ్వగల సంఘటనలను మొదడు నుండి డిలీట్‌ చేసుకుంటూ… అప్పుడప్పుడూ ఇదిగో ఇలా ఈ స్నేహ పరిమళాలను రీఛార్జ్‌ చేసుకుంటూ బ్రతుకు బ్యాటరీని వెలిగించుకుంటున్నాం.

మధ్యలో ఏదో ఊరొచ్చింది. పల్లీలు అమ్మేవాడి కేకలు చెవిలో ఘొల్లు మంటుంటే, ఆలోచనలతో ఓ కునుకు తీసిన నాకు గబుక్కున మెలకువ వచ్చింది.

మనసు మాయలమారి పుట్ట అంటారు చాలామంది. మనకు కోరికలను చుట్టేసి మనచుట్టూ మాయలనే పుట్టలాగా చుట్టగల నేర్పరి. కానీ నేను అనుభవాల పుట్ట, అల్లరి పుట్ట, జ్ఞాపకాల మాళిగ అని కూడా అంటాను, ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా.

మనం ఖాళీగా ఉన్నామని పసిగడితే చాలు ఒక్కో జ్ఞాపకాన్ని గాని, ఒక్కో సంఘటననుగాని మనమీదకు అస్త్రంగా సంధించి చోద్యం చూస్తూ మన మానసిక బలాబలాలను లెక్కగట్టే ఓ గొప్ప యంత్రమే మన మనసు.

వ్యసనాలు కొక్కేనికి తగిలించే చొక్కాలు కావు. అవి మనుష్యుల్ని రాపాడిరచి, చీడపురుగులై వ్యక్తిత్వాలను నిలువెల్లా కూల్చేస్తాయి. ముందు సరదాగానే మొదలవుతాయి. తర్వాత అలవాట్లుగా మారి కూర్చుంటాయి. వాటికి బానిసలుగా మారిన వారితో అనుక్షణం దాసోహం చేయించుకుంటాయి. చిత్తు చిత్తు చేస్తాయి జీవితాలను. ఒక్కరితోపోదు ఈ పీడ. చెట్టు వేళ్లను పెకిలిస్తే, ఇక చెట్టుకున్న కొమ్మలేం పచ్చగా ఉంటాయి? పూలేం పూస్తాయి? కాయలేం కాస్తాయి? చివరికి అంతా నాశనమే. వ్యసనాల బారినపడిన కుటుంబాలదీ అదే పరిస్థితి. మేల్కొంటే జీవితం మధ్య పేజీలో ఉన్నా ఆనందమే అంతటా. జీవితం వంద పేజీల పుస్తకమైతే మా జంటలన్నీ సెంటర్‌ పేజీని క్రాస్‌ చేసిన చదువరులమే!

ఆమధ్య పురా స్నేహితురాలు కలిసింది. తనపేరు సువర్ణ. ఇంచుమించు నా వయసే. మనసు మాణిక్యం. పేరుకు తగ్గట్టే పసిడి వర్ణం, గులాబీ వర్ణం రెండూ కలిపితే ఏర్పడే మేనిఛాయ తనది. పెద్ద పెద్ద కండ్లు. తీర్చినట్లుండే కనుబొమ్మలు. ఇంద్రధనువులా వంపు తిరిగి నల్లగా ఉంటాయి. వంకీల జుత్తు. పోనీ వేసుకుంటుంది. చేతినిండా మట్టిగాజులు. మాటలో సౌమ్యం. నడతలో నమ్రత. చీరకట్టులోనైనా, డ్రెస్‌లోనైనా తిరిగి చూడాలనిపించే అందమైన, ఆకర్షణీయమైన రూపం. నవ్వినపుడు తళుక్కుమనే పలువరుసని చూస్తే దానిమ్మ గింజలు కూడా అలుగుతాయేమో నన్పిస్తుంది. మా ఇద్దరిదీ ఒకేవూరు. వారి శ్రీవారిది, మా శ్రీవారిదీ ఒకటే డిపార్టుమెంటు అవ్వటం మూలంగా తరచుగా అనేకంటే దాదాపు అన్ని పెండ్లిళ్లల్లో, వేడుకల శుభసమయాల్లో కలుస్తుంటాం. అలా పరిచయం కాబడ్డ మేము క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అయిపోవటానికి ఎన్నో రోజులు పట్టలేదు.

తరచుగా కలిసినపుడు, అదే చాలా ఏండ్ల నాటి సుపరిచయమై కష్టసుఖాలను మనసు విప్పి చెప్పుకునే స్థాయికి ఎదిగేట్టు చేసింది. అలాగే సంత రోజుల్లో కూడా కూరగాయలు కొనుక్కోవటానికి వెళ్లినపుడు లేదా ఏదైనా షాపింగ్‌ సమయాల్లో కలిసేవాళ్ళం, సరదాగా ఉండేవాళ్లం.

అప్పుడప్పుడు ఫోన్లలో పలకరింపులు, ఛాటింగ్‌లు ఉండనే ఉంటాయి. ఒకసారి కలిసినపుడు… ఎప్పుడూ కలివిడిగా, సందడిగా తిరిగే తను ముక్తసరిగా మొహంలో ఏదో చెప్పనలవికాని బాధ గూడు కట్టుకున్నట్లు కనిపిస్తే, నేనే అడిగాను ‘ఏంటి సువర్ణా ఇలా ఉన్నావు? మొహంలో హుషారు కనబడట్లేదేంటి? పిల్లలకేమన్నా ఒంట్లో బాగోలేదని కబురొచ్చిందా?’ అన్నా. ‘ఊహూ…’ అంటూ తల అడ్డంగా ఊపింది కాదన్నట్లుగా.

‘మరి మీ వారికి ఏమైనా అనారోగ్యమా’? అని అడిగా.

దానికీ కాదని మళ్లీ తల అడ్డంగా ఊపింది. ఈసారి తన కండ్లలో సన్నని నీటిపొరను చూశాను. ఎందుకో నా మనసు కలుక్కుమంది. ఆనోటా, ఈనోటా వాళ్లింటాయన గురించి విన్నాను. తర్వాత ఒకరిద్దరి ద్వారా తెలిసినది ‘నిజమే… సువర్ణ వాళ్ళాయన చాలా అనుమానం మనిషి’ అని. నాకెందుకో బాగా డౌట్‌ వచ్చింది. ఆ హాల్లో సత్యనారాయణ వ్రతం జరుగుతోంది. బాగా పరిచయస్తులవ్వటంతో మేము అంటే నేను, సువర్ణ ముందుగానే వెళ్ళాము. ఆలస్యంగా వెళితే బాగోదని. ఈ వ్రతం, పెట్టుబడులు అవ్వీ ఇవ్వీ అయ్యేటప్పటికి కనీసం గంటన్నర పైచిలుకే పట్టేట్లుంది. ఇక లాభం లేదు. తన మనసెందుకో బాగా బాధపడుతోందని అర్థమైంది. కనుక్కోవాలనుకున్నాను. అది గృహప్రవేశ ఫంక్షను. అంతకుముదే అవతలి రూంలో గణపతి హోమం చేశారు. ఇవతలి రూంలో వ్రతం పెట్టుకున్నారు. దీపారాధన వెలిగించబడి ఉన్నది గదా స్వామి వారి మంటపం ముందు ఫ్యాన్లు బంద్‌ చేసేశారు. నిజంగా ఆ హోమపు పొగ ఇవతలికి కూడా బాగా వస్తోంది. ఈ వంకతో తనని ‘కాసేపు అటు బైట కూర్చుందాం రా… పొగ తగ్గాక లోపలికి వద్దాంలే’ అంటే, సరేనని తల ఊపింది.

గట్టిగా అడిగితే చాలు ఆ కన్నీటి కుండలైన ఆ కండ్ల నుండి ధారగా మారటానికి సిద్ధంగా ఉన్నాయి కన్నీళ్ళు. నెమ్మదిగా తన భుజం చుట్టూ లాలనగా నా రెండు చేతులను చుడుతూ ‘ఏమైంది?’ అని అడిగా. ఇక నీవు చెప్పకపోతే ఊరుకోనన్నట్లుగా చూశాను. చెప్పకపోతే వదిలేలా లేదనుకుంది కాబోలు, అటూ ఇటూ తటపటాయిస్తూ చూసింది నాల్గువైపులా భీత హరిణిలా.

గృహ యజమాని, భార్య, వారి పిల్లలు వ్రతం చేసుకుంటున్నారు బుద్ధిగా దగ్గిర బంధువులని పిలవబడే వాళ్ళు వారి చుట్టూ జంపఖానాల మీద కొందరు మోకాళ్లనొప్పి, నడుము నొప్పి బాధితులు కుర్చీలలో కూర్చుని శ్రద్ధగా స్వామివారి కథను వింటన్నారు. మగవాళ్ళు బైట వరండాలో కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు.

‘మనవేపు ఎవరూ చూడట్లేదుగాని, ఏంటమ్మాయి ఈరోజు చాలా మూడీగా ఉన్నావు’ అని నిలేశా. ఏ ఇంటిలోనైనా ఉత్తరం సందు వదులుతారు గదా. అలానే ఉంది ఆ ఇంటికి కూడా. అక్కడే సేఫ్‌ అని నే అటుదారి తీశా, కుర్చీ తీసుకుని, నాతోపాటే తానూ తన కుర్చీ తెచ్చుకుంది అక్కడికి.

గతంలో చిన్ని చిన్ని విషయాలు చెప్పి బాధ పడేదికానీ, దానిని మించిన బాధ పడ్తోందీరోజు అన్పించింది తన వాలకం చూస్తుంటే. కండ్లనిండా ధారగా కురుస్తున్న కన్నీటిని కర్చీఫ్‌తో అద్దుకుంటూ, సన్న గొంతుకతో, కేవలం నాకు మాత్రమే వినపడేటట్లుగా లో గొంతుకతో చెప్పటం ప్రారంభించింది. మా కష్టసుఖాలేవి కలబోసుకున్నా అవి మా కడుపులోనే ఉంటాయి. ఒకరిమీద మరొకరికి అలాంటి నమ్మకం ఉంది మాకు ఇప్పటికీ, ఎప్పటికీ. అది మాకు బాగా తెలుసు.

‘‘నేను రోజూ యోగా క్లాస్‌కి తెల్లవారురaామునే వెళ్తాను కదా!’’ అంది దుఃఖాన్ని తమాయించుకుని.

‘‘అవునూ’’ అన్నాను. తను, నేనూ యోగా క్లాసులో కూడా తను ముందు వెళితే, నా మ్యాట్‌ను ప్రక్కనే వేసి ఉంచేది. అలాగే ఒకవేళ నేను ముందుగా వెళ్ళినపుడు నా ప్రక్కనే తనకు మ్యాట్‌ వేసి ఉంచేదాన్ని. దాదాపు రెండేళ్లు యోగా క్లాస్‌ మేట్స్‌మి కూడా. తర్వాత నాకు కొంచెం అనారోగ్యంగా ఉండటంతో ఒక సంవత్సరం అయిపోతుంది వెళ్ళక. ఇంట్లోనే ప్రాణాయామం చేస్తాను. రోజూ సాయంత్రాలు యాభై నిముషాలు తగ్గకుండా నడుస్తాను. నా జ్ఞాపకాలకు బ్రేక్‌ వేస్తూ తనను ‘తర్వాతేం జరిగింది?’ అన్నా కండ్లతోటే.

యోగా సెషన్‌లో చివరిరోజు వార్షికోత్సవం లాగా చేస్తారు. బాగా అనుభవజ్ఞులైన యోగా టీచర్‌ జిల్లా కన్వీనర్‌గా పిలువబడే యోగా గురువు ఒకరిద్దరు హాజరవుతారు. యోగాపట్ల మీమీ స్పందన తెల్పండి అని అందరితో మాట్లాడిస్తారు. అందరితో అదే హాలులో ఆటలాడిస్తారు. మెమొరీ పవర్‌ పెంచేవీ, ఐక్యతను వృద్ధి చేసేలాంటి వాటితోటి. మధ్యలో ఆధ్యాత్మిక విషయాలను మన మనసులలో పదిలం చేసుకునే దిశగా భగవంతుని మీద ఉండే కీర్తనలు, పాటల కేసట్లను పెట్టి మనల్ని కండ్లు మూసుకోమని సూచనలిస్తూ భజనలు చేయిస్తారు. నిజంగా ఎంతో పారవశ్యంతో కూడిన ఆధ్యాత్మికానందాన్ని పోగు చేసుకుంటాం ఈ కార్యక్రమం ద్వారా. ఆరోజు ఫలహారం అందరికీ అక్కడే సమకూర్చబడుతుంది. మనల్నే పండ్లు తెమ్మంటారు. కొంతమంది ఆరోజు డ్రైఫ్రూట్స్‌ లాంటివి కూడా తెస్తారు. ఆ హాలే క్యాంటీన్‌. మనమే కుక్స్‌. మనం తెచ్చినవే వెరైటీ టిఫిన్స్‌. మధ్యలో ఒక గంట స్వల్ప విరామం కేటాయిస్తారు. అక్కడ నీనా అనే తేడాగానీ ఉచ్ఛ, నీచ, ఆడ, మగ బేధాలేవీ ఉండవు. ఉండేదల్లా అంతా ఒకే కుటుంబమనే సద్భావన మాత్రమే. అందరూ తెచ్చిన పండ్లన్నీ ముక్కలుగా కోసి, ఎంతమంది ఉంటే అంతమందికి ప్లేట్లలో పంచుతారు. వండిన ఆహార పదార్థాలు టిఫిన్‌కు నిషిద్ధం ఆరోజు. ఒకరోజు ముందే ఈ విషయాన్ని సూచిస్తూ మీతోపాటుగా ఇంకో ఇద్దరికి సరిపడా పండ్లు తెమ్మని చెబుతారు. కోసిన ఆ పండ్ల ముక్కలన్నీ కలిపితే బోల్డవుతాయి. అందరి కడుపునిండగా ఇంకా కొన్ని పదార్థాలు మిగిలిపోతే ఇంటికొచ్చేటప్పుడు ఎవరికి కావాలంటే వారిని తినమంటారు. ఎవరైనా కొబ్బరినీళ్ళు తెచ్చినా, ఫ్రూట్స్‌ సలాడ్స్‌ లాంటివి తెచ్చినా, వాటినీ గ్లాసుల్లో పోసిస్తారు అందరికీ. ఇలా బ్రేక్‌గా ఇచ్చిన గంట సమయం సరదా సరదా కబుర్లతో ఇట్లే గడిచిపోతుంది. టాయిలెట్స్‌కి వెళ్లొచ్చేవారు వెళ్లొస్తారు. అందరం అక్కయ్య, అన్నా, తమ్ముడు, చెల్లి లాంటి ఆప్యాయతా పూర్వక పిలుపులే. ట్రైనర్స్‌ని గురువుగారని సంబోధిస్తాం. వాలంటీర్లను చిన్న గురువుగారంటాం నవ్వుతూ. ఎక్కడా ఎలాంటి అమర్యాద పూర్వక వాతావరణాన్కిగానీ తావుండదు. యోగా హాల్‌ అంటే పవిత్ర దేవాలయం. మధ్య మధ్యలో గురూజీల ప్రసంగాలు ఉంటాయి. వాటి తర్వాత మరికొన్ని యోగాసనాలు, తర్వాత మళ్లీ ఏవైనా రెండు ఆటలు, మళ్లీ స్పీచ్‌, స్పందనలు ` ఇలా ఒకదాని తర్వాత మరో అంశం నిర్వహింపబడుతూ ఎక్కడా బోర్‌ అనేదానికి తావులేకుండా ఆరోజు మరపురాని రోజుగా మలుస్తారు యోగా గురువులు.

ఉదయం ఐదు గంటలకు ప్రారంభమైన యోగా ఈ చివరిరోజు మాత్రం దాదాపు ఇదంతా పూర్తయ్యేసరికి పదకొండున్నర, పన్నెండు అలా అయిపోతుంది. చెప్పలేదు కదూ! సాధకులందరూ గురూజీని దుశ్శాలువాతో సన్మానించి మెడలో పూలదండను సమర్పిస్తారు. కొంతమంది వారి వారి శ్రద్ధాసక్తుల మేరకు నూతన వస్త్రాలు కూడా సమర్పించటం కద్దు. కానీ ఈ వస్త్ర సమర్పణ అనేది అనివార్యం కాదు. మరి నాకేం గురుదక్షిణ ఇస్తారు? మీరంతా అని గురువుగారు అడిగిన ప్రశ్నకు సాధకులంతా తమకు తోచిన రీతిలో సమాధానమిస్తుంటే ఆయన నవ్వుతూ ఇవన్నీ ఏమీ వద్దు! మీరు నేర్చుకున్న ఈ యోగావిద్యను మీ వంతుగా మరో ఇద్దరికి పరిచయం చేయండి. ఒకవేళ కుదరక రోజూ క్లాసుకు హాజరవ్వకలేకపోయినా మీరు ఈ నేర్చుకున్న క్రియలను అభ్యాసం చెయ్యండి. సంపూర్ణ ఆరోగ్యంతో

ఉండండని దీవిస్తారు. ఎంతోమంది బాబాల పేరుతో, స్వామీజీల పేరుతో ఫలాపేక్షతోటే నడుస్తున్న నేటి సమాజంలో ఎటువంటి స్వలాభాన్ని ఆశించకుండా మరో ఇద్దరికి మీ వంతుగా నేర్పండని కోరటమే గురుదక్షిణ అని చెప్పిన సంస్కారవంతమైన ఈ యోగా గురుపరంపర యొక్క విలువలను ఆచరించి, తరించటమే తప్ప ఏమిచ్చి కొనుక్కోగలం. ఈ యోగ కుటుంబం నేర్పిన నిస్వార్థ పూరితమైన కుటుంబిక సంస్కారాలను ఎన్ని లక్షలు పెట్టినా కొనగలమా?

‘గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన’ అన్న రీతిగా కొంతమంది యోగా చేసేవారిని చులకనగా చూస్తూ, పొద్దున్నే వెళ్తున్నారంటే ఏదో కూడని పనికే

వెళ్తున్నారనే కాలం. ఇలాంటి పచ్చకామెర్ల రోగులను ఏ వైద్యుడు బాగుచేయగలడు? ఏ గురువులు సంస్కారాలనందివ్వగలరు? ఏ ఉపాధ్యాయుడు సత్ప్రవర్తన గురించి బుర్రకెక్కేట్టు పాఠాలు బోధించగలడు? పుట్టుకతో వచ్చిన బుద్ధి పిడకలతో పోవాల్సిందే. సరిగా ఇలాంటి కోవలోకే వచ్చే ఓ ఆణిముత్యం సువర్ణ వాళ్ల పతిదేవుడని తెలిసింది తను వెళ్లబోసుకున్న విషయాలు ద్వారా.

‘‘అతగాడి మనస్తత్వమిదేనని తెలుసుగదా మొదట్నుంచి? నువ్వెందుకు అతిగా బాధపడుతున్నావ్‌?’’ అన్నా.

‘‘అదికాదు మైథిలీ… యోగాసనాలు అన్నీ అయిపోయిన తర్వాత శవాసనం వేయమంటారు గదా, నాదసలే వంకీల జుట్టు, లేచినపుడు కొద్దిగా జుట్టు చెదురుతుంది గదా! పోనీకి పెట్టిన క్లిప్పు తీసేస్తా, శవాసనం వేసినపుడు. అందుకు అనుమానపు చూపులు వెళ్ళగానే. ఒక్కోరోజు మరీ గుర్రుగా ఉంటాడని చెప్పింది’’ వాపోతూ.

‘‘ఏం చెబితే అర్థమవుతుంది అతనికి? ఎలా చెబితే అర్థమవుతుందో? నాకేం అర్థం కావట్లేదు. ఒక్కోసారి బాగా ఏడుపొచ్చేస్తుంటుంది’’ అని చెబుతుంటే నాకు చాలా బాధ అన్పించింది సువర్ణను చూడగానే.

‘‘మొన్న వారం రోజుల క్రితం యోగా సెషన్‌ పూర్తయింది మైథిలీ. ఎప్పటిలాగే వార్షికోత్సవంలాగా చేస్తారు గదా ముగింపు పండుగంటూ. నీకు తెల్సు గదా..’’ అంది. ‘‘అవును’’ అన్నాను.

నేనైతే నాకున్న ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల మానివేశానుగానీ, సువర్ణ మానకుండా వెళుతూనే ఉంది యోగా క్లాసులకు.

ఇలాగా మాకీరోజు సెషన్‌ చివరి రోజు. లేటవుతుంది. మధ్యాహ్నం పన్నెండయి పోతుందని చెప్పిందట భర్తతో. సరేనని అన్నాడట. వాళ్ళకు జావ తాగే అలవాటు, టిఫిన్‌ తినగానే. తనొక్కడే గదాని వదిలెయ్యలేదు మైథిలీ. ఇడ్లీ వేసి హాట్‌ ప్యాక్‌లో సర్దా. పల్లీ చట్నీ కూడా చేశా తినలేరని. పక్కనే కొరప్పొడి డబ్బా

ఉండనే ఉంటుంది ఎప్పుడూ. జావచేసి ఫ్లాస్కులో పోశా. అన్నీ ఎదురుగా డైనింగ్‌ టేబుల్‌ మీద సర్ది పెట్టానని చెబితే సరేనన్నారు.

వాళ్ళకు పెరడు పెద్దది. పూలమొక్కలవీ బాగా ఉంటాయి. రోజూ ఊడుపు ఎక్కువే. అయినా ఏనాడు విసుగు కనిపించదు తన మొహంలో ఎప్పుడైనా అటుగా వెళ్లినపుడు వాళ్లింటికి వెళ్లటం అలవాటే నాకు. ఏ సమయంలో చూసినా చాలా

శుభ్రంగా ఉంటుంది వాకిలి గాని, పెరడుగానీ. ఇలా ఎలా సాధ్యమని అడిగితే, రెండుపూటలా శుభ్రంగా ఊడుస్తానని చెప్తే, నాకెంతో ముచ్చటేసేది. అట్లా అన్ని పనులూ చేసి, తనను ఉదయం తినటాన్కి, తాగటాన్కి కావలసినవి సిద్ధం ఏసి చెప్పి వచ్చినా ఆరోజు ‘‘ఏంటే ఇంత ఆలస్యమయింది? ఆ జుట్టంతా రేగిపోయి

ఉందేంటి? ఎక్కడ పడుకుని వచ్చావు ముండా’’ అని బూతులు తిడుతూ గొంతును పిసకబోయాడట. తన మెడచుట్టూ బిగుసుకుంటూన్న వాడి రెండు చేతులనూ ఎట్లాగో బలవంతంగా విడదీసుకుని నేను గదిలోకి పోయి చాలాసేపటిదాకా తలుపులేసుకున్నా భయంతోటి’’ అని సువర్ణ చెప్తుంటే తనగుండె వేగంగా ఎగిరిపడటాన్ని గమనించా. మొహమంతా బాధతోటి వివర్ణమైపోయింది.

‘‘ఇంతకుముందు అనుమానంగా చూసేవాడు, కోపంతో టీకప్పు విసిరేసేవాడు, టీ బోగోలేదంటూ. కూరలు ఎంత రుచిగా వండినా కుదరలేదు, నీ ధ్యాస ఎక్కడ ఏడుస్తోందని చాలా చులకన చేసి మాట్లాడేవాడట. అప్పుడు పిల్లలుండేవారట. ఎందుకు డాడీ అనవసరంగా మమ్మీని తిడుతున్నారని పిల్లలు గట్టిగా నిలదీస్తే, తన గదిలోకి పోయి ఆరోజంతా అలకపాన్పు ఎక్కేవాడట. ఎన్నిసార్లు పిలిచినా భోజనానికి రాకపోతే, చివరికి తనే ఉసూరనిపించి భోజనం ప్లేట్లో పెట్టి, గదిలో టీపాయ్‌ మీద పెట్టి వచ్చేదట. సువర్ణ మంచినీళ్లు, పెరుగు, రసంతో సహా. మళ్ళీ మధ్యలో తనెళ్లి కనబడితే ఎక్కడ మధ్యలో అహంతో చెయ్యి కడిగేసుకుంటాడోననే జాలితో. ఇదిగో ఇదే వీక్‌పాయింట్‌ ఆడాళ్లందరిదీ. మన తప్పులేకుండా తిట్లుపడటం, ప్రతి చిన్నదానికి సాకులు పెట్టి హేళనగా మాట్లాడే మాటల్ని భరించటం. మన కుటుంబాలే ఇలా ఏడ్చాయా? లోకంలో ఉన్న కొంపలన్నీ ఇట్లాగే తగలడ్డాయా? లేదా మన కొంపల్లోనే ఇలా ఉంటాయా అన్పిస్తుంటుంది ఒక్కోసారి ఇలాంటివన్నీ వింటుంటే.

మళ్ళీ సువర్ణ ఏమనేదో తెలుసా ‘‘మైథిలీ… ప్లేటు మొత్తం ఖాళీ చేసేశాడు, ఒక్క చుక్క కూడా విడవకుండా పెరుగు మొత్తం తాగేసేవాడట. దొంగపిల్లి నాకినట్లుగా వుండేదట ఆ ఖాళీ అయిన పెరుగు కప్పును చూస్తుంటే అని చెప్పి నవ్వేది తర్వాత. అది దొంగపిల్లి కాదు, బలిసిన పెద్ద గండుపిల్లి. జంగు పిల్లి’’ అని నేను తిట్టుకునేదాన్ని మనసులో.

‘‘ఆకలైతే వాడే తింటాడులే అని ఈసారి నేనేం పట్టించుకోలేదు. ఈరోజు నా ధర్మంగా నేను అన్నం, కూరా వండి పెట్టాను టేబుల్‌ మీద. నన్ను నేను సమాదాయించుకుంటూ చెయ్యని తప్పుకు నేనెందుకు కడుపు మాడ్చుకోవాలని ఓ రెండు ముద్దలు పెట్టుకుని తిని చెయ్యి కడుక్కున్నాను. ఈసారి నాకు తినమని కూడా అడగాలనిపించలేదు. నా దారిననే వెళ్ళి పిల్లల రూమ్‌లో పడుకున్నాను. తర్వాత రెండు రోజులదాకా నాకు చాలా డిప్రెషన్‌లాగా అనిపించింది’’ అంటూ ఎంతో బాధతో చెబుతుంటే నా ప్రాణం విలవిలలాడిపోయింది తన బాధాపూరితమైన మాటలు వింటుంటే.

‘‘మరి ఆ రెండు రోజులూ ఏం చేశాడు మీ ఆయన? తిండి తిన్నాడా? లేదా’’ అని అడిగా… ఒకింత బాధతో మిళితమయిన కోపంతో’’

‘‘ఆ… ఎందుకు తినలా! శుభ్రంగా మెక్కాడు. నంగనాచిలా ఆ మరుసటిరోజే చికిన్‌ తెచ్చి, నాకు కనబడేటట్లు టేబుల్‌ మీద పెట్టాడు. వండు అన్నట్టు. నా బాధను, కోపాన్ని తమాయించుకుని వండి పెట్టాను. శుభ్రంగా తిన్నాడు సిగ్గులేకుండా’’ అన్నది. తన మనసు ఎంత వేదనకు గురయితే ఈ మాట వచ్చిందోనని అనుకున్నా.

‘‘మరి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నావా? మానేశావా యోగాకి వెళ్ళటం? మీ ఇంటి దగ్గర ఉన్న విమలా, రత్నమ్మ గార్లతో కలిసేగా వెళ్ళేది, వచ్చేదీ’’ అన్నా.

‘‘అవును, అయినా వాడికి అనుమానం పొరలు కమ్మి, కండ్లు కనబడని గుడ్డోడవుతాడు. అదే మావాడి స్పెషాలిటీ’’ అంది విరక్తిగా.

‘‘ఆ… ఎందుకులే పెంటగోల అని మానేశాను. యోగాకు వెళ్లట్లేదంది. ఇట్లా బాధపెట్టి బెదిరించి, మాన్పించాలనేగా వాడి ప్లానంతా. వాడనుకున్నది సాధించుకున్నాడు. చివరికి నన్ను నాల్గు గోడలకి బందీ చేసి’’ అన్నది మళ్ళీ కోపంగా.

ఇదివరకు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కొంతలో కొంతవరకు నయం. ఆలోచించేవాడు మాట వదలాలంటే. ఇప్పుడు వాళ్ళిద్దరూ బెంగుళూరులో

ఉంటన్నారుగా ఉద్యోగాల్లో. ఇక వీడు మరీ పేట్రేగిపోతున్నాడు. ఒక్కోసారి ఏం వాగుతున్నాడో కూడా తెలవట్లేదు. ఆనోటికి హద్దూపద్దూ ఉండట్లేదని వాపోయింది సువర్ణ.

అందంగా పుట్టడం సువర్ణ చేసుకున్న పాపమా? అందంగా ఉన్న తమ కూతుర్ని, ఉద్యోగస్తుడూ… లక్షణంగా పెండ్లాన్ని చూసుకుంటాడని నమ్మి ఇతగాడికిచ్చి కట్టబెట్టిన తల్లిదండ్రులదా?

మగడు ఏదన్నా పడుండాలి. వాడికి కోపమొస్తే భరించాల్సిందేనమ్మా అంటూ సాగదీసే సదరు అత్తగారి టెంపరితనమా?

నిజంగానే ‘కాకి ముక్కుకు దొండపండు’ అనే సామెతకు నూటికి రెండొందల శాతం కరెక్టు సువర్ణ భర్తగారి విషయంలో. నాకు ఆ పేరెత్తి ఇదీ అని చెప్పాలన్నా కంపరమెత్తుతుంది ఇప్పటికి కూడా.

ఇలా చాలా విషయాలు తెలుస్తుంటాయి అప్పుడప్పుడు తన ద్వారా. అందుకే నాకు సువర్ణ భర్త అంటే ఏవగింపు. తను కూడా ఇంతకు మునుపు ఎంత బాధలో ఉన్నా మా ఆయన, మావారు అని సంబోధించేది నాతో మాట్లాడేటప్పుడు. ఎంత బాధ సలుపుతుంటే, మనసులో ఎంత విరక్తి పుడితే వాడు, వీడు అని తిడ్తుంది భర్తను. నాకు తప్పులేదనిపించింది. మరి తక్కువ పనులు చేశాడావాడు అని పిలవబడుతున్న సదరు సువర్ణ గారి మొగుడుగారు.

నువ్వు తెల్లగానే ఉంటావు గదా, నీకెందుకు క్రీములు, పౌడర్లు అని సాధించేవాడట. కొత్త బట్టలు కట్టుకుంటే ఓర్చుకోలేడట. మంచిగా తల దువ్వి జడ వేసుకున్నా అనుమానమేనట… ఎవరన్నా ఇంటికి అతిథులు వస్తే, అందులో

వాళ్ళు పురుష పుంగవులైతే తనను మంచినీళ్ళు కూడా తేనీయడట. ఒకసారి అలాగే టీ పెట్టి పట్టుకెళితే, నానా బూతులూ తిట్టాడట వాళ్ళు వెళ్ళిన తర్వాత. ఇక అప్పట్నుంచి అతగాడికే టీ కప్పులు ట్రేలో పెట్టి అందిస్తే తీసుకెళ్లి వాళ్లకిస్తాడట. దొడ్లో అంట్లు తోముతుంటుంటే రోజూ కుర్చీ వేసుకుని కూర్చొని, ఆ సమయానికి పేపరో, పుస్తకమో చదువుకుంటున్నట్లు నటిస్తాడట. మొదట్లో అర్థమయ్యేది కాదట సువర్ణకు. దొడ్డివైపు తలుపులు వేసేవుంటాయట. తియ్యరట ఎప్పుడూ. అయినా వాడికి అనుమానమేనట. ఒకసారి పౌడర్లో సున్నం కలిపాడట. మామూలుగా రోజూ రాసుకున్నట్లు రాసుకుంటే, మొహమంతా పొక్కిపోయి ఎలర్జీ వచ్చి, ఆసుపత్రికి వెళితే ఆ పౌడరును చూసి అందులో సున్నం కలిసిందని చెప్పారట డాక్లర్లు. మళ్ళీ ఇంకోసారి స్ప్రే బాటిల్లో హ్యాండ్‌ వాష్‌ లాంటిది కలిపాడట. ఇదీ వాడి నిర్వాకమేనని తెలిసి వాళ్ళ పెద్దబ్బాయికి చూపిస్తే ‘నిజమే మమ్మీ ఇందులో హ్యాండ్‌ వాష్‌ కలిపాడు అని తండ్రిని ఛీత్కరించుకున్నాడట.’ వాళ్ళ డాడీ వెలగబెట్టే నిర్వాకాలన్నీ తెలుసు పిల్లలకు. వాళ్ళేం చిన్నవాళ్ళు కాదుగా! అందుకే ఏదన్నా శుభకార్యానికి వెళ్ళాలంటే ఆ… డాడీ ఎందుకు మమ్మీ? మనమే వెళ్లొద్దాం అంటారట. తండ్రి అంటే అతను చేసే పనుల వల్ల ఎంత విలువ తగ్గిపోతోంది తండ్రిగా తనకు అని ఒక్కోసారి చెప్పి నిట్టూరుస్తూంటుంది సువర్ణ.

‘ఇన్ని చేస్తున్నా, మావారంటే నాకు చాలా ఇష్టం మైథిలీ’ అంటుంది నాతో ఒక్కోసారి.

‘‘కానీ నా ప్రేమను గుర్తించడు. ఎప్పుడు సందు దొరుకుతుందా అని ఎదురుచూస్తుంటాడు సూటీ పోటీ మాటలు వదలటానికి’’ అన్నది మళ్ళీ.

నమ్మకం లేనిచోట ప్రేమ ఉండదంటారు నిజమే. భార్యమీద, ఆమె నడత మీద అస్సలు ఏమాత్రం నమ్మకం లేదు. అందుకే అంత ఆవేదన సువర్ణకు.

సశేషం

July 31, 2025 27 comments
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

జీవన మాధుర్యం

by Laxmi Madan July 31, 2025
written by Laxmi Madan

5 వ భాగం

అపర్ణ తెలిసి తెలియని వయసులో ఆకర్షణకు లోనవుతుంది.కానీ మళ్ళీ చదువు పట్ల ధ్యాస పెంచుకుని పదవ తరగతిలో మంచి మార్కులు సంపాదించుకుంటుంది.

పదవ తరగతిలో సైన్స్ సారు చెప్పేది ఎప్పుడు గుర్తొచ్చేది అపర్ణకు.

” కష్టపడి చదవండి. కాలేజీ మెట్లను ఎక్కే అదృష్టం ఇందులో ఎంత మందికి ఉందో” అని ఎప్పుడూ అంటుండేవారు. కాలేజీకి వెళ్లాలని ప్రతి ఒక్కరికి ఆశగా ఉంటుంది. జీవితంలో చదువు అనేది ప్రాముఖ్యమైన విషయం దానికోసం విద్యార్థి దశలోనే కష్టపడాలి.

“నిజంగా కాలేజీ మెట్లు ఎక్కడం ఒక కలనే” అని అనుకునేది అపర్ణ.

స్కూల్లో ఫేర్వెల్ పార్టీ పెట్టారు. అప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలుసుకున్నారు. కానీ “ఇలా ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు” అనేది ఊహకందని విషయం. ఇన్ని రోజులు కలిసి ఉన్న అందరూ విడిపోతారని అంతగా తెలియని వయసు. ఆటపాటలతో గడిచిన బాల్యం. అందులో స్కూల్ జీవితం అద్భుతం. అంత మధురమైన జీవితం మళ్ళీ ఎవరికీ దొరకదు.

ఆ సంవత్సరం పదవ తరగతి వాళ్ళు స్కూల్ నుండి వెళ్లిపోతారని, అందరికీ ప్రత్యేకమైన బహుమతులు ఇచ్చారు స్కూల్ టీచర్స్.

ఆ తర్వాత ఎవరు ఎక్కడ జాయిన్ అయ్యారో ఎవరికి తెలియలేదు.

“కాలేజీకి వెళ్తున్నాను “అంటే ఎందుకో భయంగా అనిపించింది. ఎందుకంటే ఉన్న ఊరును వదిలి వేరే ఊరిలో చదువుకోవాలి. ఇంట్లో వాళ్ళందరినీ వదిలి వెళ్లాలంటే బాధగా అనిపించింది .కానీ తండ్రికి పిల్లలను చదివించాలని చాలా ఇష్టం. అందులో అపర్ణకి కూడా చదువుకోవాలని ఎంతో ఇష్టం. కాబట్టి అన్నీ భరించుకొని వెళ్లాల్సిందేనని అనుకుంది.

కాలేజీకి వెళ్లి చదువుకోవడానికి అప్పట్లో ఇంతగా వసతి గృహాలు లేవు. తండ్రి దక్షిణామూర్తి గారు చెప్పారు ..

“కొన్ని రోజులు మన బంధువుల ఇంట్లో ఉండమని”

అసలే మొహమాటస్తురాలైన అపర్ణకి, బంధువుల ఇంట్లో ఉండడం అసలే ఇష్టం లేదు.ఇంట్లో నాయనమ్మ, అమ్మ గారాబం, తండ్రి ఆత్మీయత, సోదరుల అనుబంధం ఇవన్నీ వదిలి ఉండడానికి మనసొప్పలేదు.

కానీ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోక తప్పదు.

అన్నతో పాటు బయలుదేరింది అపర్ణ. తన సర్దుకోవాల్సిన బట్టలన్నీ ఒక పెట్టెలో పెట్టుకుంది.అన్నతో పాటుగా బస్సులో కూర్చున్నది. కళ్ళ వెంబడి ధారపాతంగా నీళ్లు కారిపోతున్నాయి.

బంధువుల ఇంట్లో వదిలిపెట్టి అన్నయ్య వెళ్ళిపోయాడు. అతనికి కూడా కాలేజీ ఉంది!

మాటిమాటికి ఏడుపు వస్తూనే ఉంది. చాటుగా వెళ్లి కళ్ళు తుడుచుకుంటూ, మళ్ళీ లోపలికి వస్తుంది.ఆ బంధువులతో అంత చనువు కూడా లేదు అపర్ణకు.

తెల్లవారి పక్కనే ఉండే ఒక అమ్మాయి తో కాలేజీకి బయలుదేరింది.

స్కూల్లో అయితే ఎంతో సంతోషంగా ఉండేది. ఉన్న ఊరు, అందులో చాలా ఏళ్లు చదువుకోవడం వల్ల అందరూ పరిచయమే. కానీ కాలేజీలో అందరూ కొత్త .ఒక్కరైనా తెలిసిన వాళ్ళు కనిపించలేదు.

వెళ్లి మెల్లగా లేడీస్ రూమ్ లో కూర్చుంది. వేరే ఆడపిల్లలు అందరూ వచ్చి కూర్చున్నారు. కానీ ఎవరి గ్రూపులు వాళ్లకు ఉన్నాయి. అపర్ణను ఎవరూ పలకరించలేరు.

మెల్లిగా తన క్లాస్ రూమ్ నెంబర్ తెలుసుకొని వెళ్లి కూర్చుంది. మొదటి పీరియడు తెలుగు .

భయంగా కూర్చున్న అపర్ణను చూసి తెలుగు మాస్టారు గమనించాడు. అందులో ఆడపిల్లలు ఎవరూ రాలేదు.

సార్ అన్నాడు..

” కాలేజీకి విద్యార్థి పిల్లిలా వస్తాడు. తర్వాత పులిలా మారిపోతాడు” అని అన్నాడు తెలుగు మాస్టారు.

“అది తన గురించే నేమో” అనుకుంది అపర్ణ.

ఇంతలో ఒక అమ్మాయి సుడిగాలిలా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమాత్రం భయం లేకుండా ఉంది.

వచ్చి తన పక్కనే కూర్చుంది.

యక్ష ప్రశ్నలు వేసింది ఆ అమ్మాయి.

” ఏ ఊరు నుండి వచ్చావు”

” నీ పేరేంటి” ఇలా అడుగుతూనే ఉంది. కాకపోతే ఆమె రావడం వల్ల అపర్ణకి కొంచెం ధైర్యంగా అనిపించింది.

సెకండ్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి ఇద్దరమ్మాయిలే ఉన్నారు. తర్వాత పీరియడ్లో మరో 6 మంది ఆడపిల్లలు వచ్చారు.

వాళ్ళందరూ మామూలుగానే మాట్లాడారు.కానీ స్నేహం చేయాలి అనే భావన ఎవరికి ఉన్నట్టు లేదు. కాలేజీకి వచ్చామా! క్లాసులు విన్నామా! వెళ్ళిపోయామా! ఇలాగే ఉండేవాళ్ళు.

కొన్ని రోజుల తర్వాత ఇద్దరు అమ్మాయిలు ఫ్రెండ్స్ అయ్యారు.

కాలేజీ వాతావరణం ఇప్పుడు కొంచెం కొంచెంగా నచ్చుతుంది అపర్ణకి. కానీ అబ్బాయిల కామెంట్స్ వింటే మాత్రం చిరాకు వేసేది. తన ఊర్లో చెప్పినట్లు జవాబు చెప్పడానికి కొంచెం జంకుతు ఉండేది.

పదవ తరగతి వరకు బొద్దుగా ఉండే అపర్ణ, సన్నబడి అందంగా కనిపించ సాగింది. లంగా వోణీల్లో చక్కగా ఒదిగిపోయింది.

బంధువులతో కూడా చనువుగా మెలగసాగింది. ఒక్కసారిగా కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లయింది.

ఇంట్లో లాగా అందరితో దబాయింపుగా మాట్లాడటం మానేసి, చక్కగా పలకరించడం నేర్చుకుంది. ఇంట్లో వాళ్లకు చిన్న చిన్న పనులు సహాయం చేసేది.

వాళ్లు కూడా అపర్ణను బాగా మెచ్చుకునే వాళ్ళు”చక్కగా అర్థం చేసుకుంటావు నువ్వు అందరినీ “అని అనేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలతో ఆటలాడుకుంటూ, వాళ్ళకు అవసరమైనవి చూస్తూ, కొత్త పరిచయాలను పెంచుకుంటూ, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేది నేర్చుకున్నది అపర్ణ

జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ వెళుతుంటేనే మనకంటూ ఒక లక్ష్యం ఏర్పడుతుంది. ఆ లక్ష్యం నెరవేరాలంటే, సమస్యలను ఎదుర్కోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా శ్రమ పడాలి.

ఇంటర్ అయిపోతుంది కాలేజీకి దగ్గరలో అపర్ణ తండ్రి ఒక ఇల్లు తీసుకున్నాడు. మూడు గదుల ఇల్లు మాత్రమే.

అనుకోకుండా ఊరికి వచ్చిన అపర్ణకి ,తండ్రి సర్ప్రైజ్ గా ఈ విషయం చెప్పాడు. తనకి ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యిందని, అందుకే ఒక ఇల్లు తీసుకున్నానని, అక్కడే ఉండొచ్చని చెప్పారు. ఆమె ఆనందానికి అవధులు లేవు.

“మరి అమ్మ వస్తుందా!” అని అడిగింది.

” అమ్మ వస్తే ఇక్కడ ఇల్లు వ్యవసాయం పనులు, నాయనమ్మను ఎవరు చూసుకుంటారు! అందుకనే అప్పుడప్పుడు అమ్మ వచ్చి వెళ్తుంది. నీకెందుకు భయం. నేను వంట చేసి పెడతాను. నువ్వు కాలేజీకి వెళ్లి చదువుకో” అని చెప్పాడు తండ్రి.

సంతోషంగా మళ్ళీ కాలేజీ కి వెళ్ళింది అపర్ణ.

తనకున్న సామాను తీసుకొని రిక్షాలో కొత్త ఇంటికి వచ్చేసింది.

ఆ ఇల్లు కాలేజీకి చాలా దగ్గర. స్నేహితుల ఇండ్లు కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి.

ఉదయం తండ్రి వంట చేసి పెట్టి, ఆఫీసుకు వెళ్లిపోయేవారు. అపర్ణ కాలేజ్ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఉండేది. షిఫ్ట్ సిస్టం ఉండేది ఆ కాలేజీలో. ఇంటర్ వాళ్లు ఉదయం సెషన్లో, డిగ్రీ వాళ్ళు ఆఫ్టర్నూన్ సెషన్ లో కాలేజీకి వెళ్లేవాళ్లు..

అపర్ణ ఇంట్లోనే భోజనం చేసి, కాలేజీకి వెళ్ళేది. కొత్త ఇంటి చుట్టుపక్కల చాలా ఫ్యామిలీస్ ఉండేవి. అందరూ ఎంతో పరిచయమయ్యారు. అపర్ణను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు. ఈ జీవితం బాగా నచ్చింది.

చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ “అక్క అక్క” అంటూ ఇంటికి వచ్చేవాళ్ళు.

అపర్ణ తండ్రి దక్షిణామూర్తికి వారానికి రెండు రోజుల సెలవు ఉండేది. శని ఆదివారం అపర్ణ తండ్రి ఊరికి వెళ్ళిపోయేవాడు. ఇంటి నిర్వహణ చాలా కష్టం కదా!

పక్కన ఇంట్లో ఒక బామ్మ, తాతయ్య ఉండేవాళ్లు. అపర్ణ నాన్నగారు లేని సమయంలో వాళ్ళింట్లో పడుకునేది.కానీ కొన్ని రోజులు అయిన తర్వాత అదే లైన్ లో ఒక స్నేహితురాలు ఉండేది. ఆ అమ్మాయి జూనియర్ అయినా కూడా ఎంతో సన్నిహితంగా ఉండేది. ఆ అమ్మాయి చదువుకోవడానికి అపర్ణ దగ్గరికి వచ్చి అక్కడే పడుకునేది తోడుగా.ఇంకా ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ, కాసేపు చదువుకుంటూ ఉండేవాళ్లు.

ఇక అప్పుడు మొదలైంది మరో సమస్య.

కాలేజీకి వెళ్లే అబ్బాయిల ఇళ్లన్నీ ఇంచుమించు ఆ వరుసలోనే ఉండేవి. వీలైనంతవరకు బయటకు రాకుండా లోపలే ఉండేది అపర్ణ.

ఏదో ఒక రకంగా వాళ్లతో ఇబ్బందులు పడుతూనే ఉంది.

ఒకరోజు అపర్ణ అపర్ణ, స్నేహితురాలు వందన రాత్రి తొమ్మిది గంటల సమయంలో చదువుకుంటూ కూర్చున్నారు. ముందటి గదికి కిటికీ రోడ్డు వైపు ఉండేది. ఆ కిటికీ తీసుకుంటే చక్కని గాలి వెలుతురు వచ్చేది.

అలా వీళ్ళిద్దరూ చదువుకుంటూ కూర్చున్నారు. ఇంటి దగ్గరలో ఉన్న ఒక అబ్బాయి. అతను కూడా అపర్ణ చదివే కాలేజీలోనే చదువుతున్నాడు. కావాలని ఇంటి ముందు నుండి నాలుగు ఐదు సార్లు వెళ్లేవాడు. ఎన్నోసార్లు గమనించిన అపర్ణకు ఏమని వార్నింగ్ ఇవ్వాలో అర్థం కాలేదు.

ఎక్కువగా తండ్రి లేని శని,ఆదివారంలో ఇలాంటి ఇబ్బంది జరిగేది.

ఒకరోజు ఉదయం ఎప్పటిలాగే వందన వెళ్లిపోయిన తర్వాత కాలేజీకి రెడీ కావడానికి తలుపులు మూసి, బయట గది కిటికీలు మూయడానికి ముందు రూమ్ లోకి వచ్చింది అపర్ణ.

కిటికీలో మడతలు పెట్టిన తెల్ల పేపర్ కనిపించింది.

ఆ పేపర్ ఏంటా అని తెరిచి చూసింది.

ముత్యాల లాంటి అక్షరాలతో ప్రేమను కురిపిస్తూ రాసిన లేఖ.

కాసేపు కంగారుగా అనిపించినా, తనను తాను స్థిమితం చేసుకుని, కాలేజీకి వెళ్ళిపోయింది.

రాత్రికి ఇంటికి వచ్చిన వందనకి ఆ ఉత్తరం చూపించింది.

” అయ్యో ఎవరు రాశారు అక్కా! నాకు భయమేస్తుంది” అని అన్నది వందన.

” నాకు లేని భయం నీకెందుకు! ఇలాంటి వాటికి భయపడితే మనం బ్రతకలేము. అంతగా ఆలోచించకు” అని చెప్పి చదువుకోవడానికి పుస్తకం తెరిచింది.

వందన కూడా వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండేది. ఆమెకు కూడా అపర్ణ అంటే చాలా ఇష్టం. వందన వచ్చేటప్పుడు ఏదో ఒక స్నాక్ చేసి పంపించేది.

ఇలా వరుసగా రోజు ఒక తెల్ల కాగితం మడతపెట్టి కిటికీలో కనిపించేది.

పేరు రాసే ధైర్యం ఉండదు కాబట్టి పేరు ఉండేది కాదు.
కానీ కొంతవరకు ఊహించగలిగింది అపర్ణ.

ఒకరోజు రాత్రి చదువుకుంటూ కూర్చున్నారు అపర్ణ , వందన.

ఆ సమయంలో తెరిచి ఉన్న కిటికీలో నుండి నాలుగు చాక్లెట్లు ఎవరో విసిరినట్లుగా పడ్డాయి.

చాక్లెట్లను తీసుకొని చూసిన అపర్ణకి ,ఇది ఎవరో కావాలని విసిరారు అని అర్థం అయింది. చాలా కోపం వచ్చేసింది. ఆ చాక్లెట్స్ పట్టుకొని టక్కున లేచి నిలబడింది. వందన వెంటనే అపర్ణ చేయి పట్టుకొని “వద్దక్క, ఆ అబ్బాయి వాళ్లే వేసి ఉంటారు. మళ్ళీ గొడవవుతుంది. ఊరుకో” అని చెప్పింది.

” ఏంటి ఇలా కిటికీలో నుండి చాక్లెట్స్ పడితే ఊరుకోవాలా? అలా ఊరుకుంటే వాళ్లకి మనం అలుసైపోతాము. రోజు ఇదే పని చేస్తారు. అది మనకు అవసరమా” అని చెప్పి తలుపుతీసింది.

అనుకుంటున్నట్లుగానే ఈమె వెంటపడే అబ్బాయి రూమ్ లో ఉండే మరొక జూనియర్ పిల్లవాడు, పరిగెత్తుతూ కనిపించాడు.

పరిగెత్తి ఆ అబ్బాయి లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాడు. అందులో అందరూ అబ్బాయిలే ఉంటారని ఆమెకు తెలుసు. అది కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే అబ్బాయిలు. అపర్ణకు భయం వేయలేదు. వెళ్లి ఆవేశంగా తలుపు కొట్టింది. ఊహించని ఆ అబ్బాయిలు తలుపు తెరిచారు. ఒక్కసారిగా అపర్ణను చూసి భయపడిపోయారు.

“ఏంటి! ఏమైందండీ ఇలా వచ్చారు?” అని అడిగాడు అందరికన్నా పెద్దగా ఉన్న అబ్బాయి. నిజానికి ఆ అబ్బాయి పని ఇది.

” ఈ చాక్లెట్స్ కిటికీలో నుండి మా ఇంట్లోకి ఎవరు విసిరారు”? అని చాలా కూల్ గా అడిగింది అపర్ణ.

” ఆ అది వీడు వద్దని చెప్పినా కూడా మీకు ఇస్తానని కిటికీలోనుంచి వేశాడు” అని చెప్పాడు ఆ పెద్దగా ఉన్న అబ్బాయి.

నిజానికి ఆ ఇంటర్ చదివే అబ్బాయికి అంత సీన్ లేదు. వేయించింది ఈ అబ్బాయి అనే విషయం అర్థం అయిపోతూనే ఉంది.

” అమ్మాయిల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది? ఇంత రాత్రి సమయంలో మేము చదువుకుంటున్నాము. మీరు ఇలా చాక్లెట్లు లోపలికి విసిరితే ఏమని అర్థం చేసుకోవాలి? కనీస సంస్కారం లేకుండా ఇలా చేస్తారా” అని గట్టిగా అరిచింది.

ఆ అబ్బాయిలంతా భయపడుతూ నిల్చున్నారు. ఎప్పుడైనా అమ్మాయి స్ట్రాంగ్ గా ఎదుర్కొంటే అబ్బాయిలు పదిమంది ఉన్నా సరే భయపడి పోతారు. పిరికితనంగా ఉంటేనే ఇంకా వెనకాల పడి వేధిస్తారు.

ఇంతలో ఆ ఇంటి ఓనర్స్ బయటకు వచ్చారు.

అపర్ణ అంటే ఆ ఇంటి ఓనర్స్ కి కూడా చాలా ఇష్టం.” చూడటానికి చక్కగా ఉంటుంది. అందరితో పలకరిస్తూ మాట్లాడుతుంది. చక్కగా చదువుకుంటుంది” అని ఎంతో ఇష్టపడతారు. ఆ స్ట్రీట్ లో చిన్న పిల్లలకు ఏమైనా తెలియని ఉంటే కూర్చోబెట్టుకొని చెప్తుంది. ఇలా అన్నీ మంచి లక్షణాలు ఉన్న అపర్ణను ఎవరు మాత్రం ఇష్టపడరు.

“ఏం జరిగింది అపర్ణ” అని అడిగింది ఇంటి ఓనర్.

జరిగినది అంతా చెప్పింది అపర్ణ.

వెంటనే ఆ ఓనర్ అబ్బాయిలను చాలా తిట్టేసింది. మీరు ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే, నేను ఇల్లు ఖాళీ చేయించేస్తాను. అమ్మాయిలను ఏడిపించడం మంచి పని అనుకుంటున్నారా? ఇందుకేనా మీరు వేరే ఊరు నుండి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నది? ఇంకొకసారి ఇలా జరిగితే నేను ఊరుకోను” అని గట్టిగా బెదిరించింది.

ఆ తర్వాత అపర్ణ ఇంటికి వచ్చేసింది. వందన అయితే భయపడిపోతూనే ఉంది. ఇంటికి వచ్చిన అపర్ణను చూసి “అక్క ఏమైంది!” అని అడిగింది.

జరిగిన విషయం అంతా చెప్పింది అపర్ణ. వందన ఎంతో సంతోష పడిపోయింది.
” అక్క నీకు చాలా ధైర్యం. నేను కూడా నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి. భయపడి పోతే నిజంగానే భయపెడతారు” అని అపర్ణ చేయి పట్టుకొని అన్నది వందన.

అలా ఆ వీధిలో ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. అందరూ అపర్ణను అభినందించారు. జరిగిన వెంటనే వెళ్లి అడగడం మంచి పని అయింది. లేకపోతే మేము చేయలేదని వాళ్ళు బుకాయించేవాళ్లు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ జోలికి ఇంకా రారు అని అన్నారు.

అపర్ణ చాలా ధైర్యంగా ఉండటం నేర్చుకుంది. ఎవరైనా ఒక కామెంట్ చేయాలంటే కూడా ఆలోచించేవాళ్ళు.

అపర్ణ చదువు పూర్తి చేసుకుని వచ్చింది. తరువాత ఇంట్లో సంబంధాలు చూడటం, అపర్ణని వాళ్లు నచ్చడం, ఆమె కూడా ఆ అబ్బాయిని నచ్చడం జరిగిపోయింది. దక్షిణామూర్తి గారి ఆనందానికి అవధులు లేవు.

కానీ అపర్ణకు పీజీ చేయాలనే కోరిక మనసులో చాలా ఉంది. దానికి పెళ్ళికొడుకు తరపు వాళ్ళు ఒప్పుకున్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా అపర్ణ ఎంతైనా చదువుకోవచ్చు ఉద్యోగం కూడా చేసుకోవచ్చు అనే హామీ ఇచ్చారు. అందువల్ల అపర్ణ సంతోషంగా ఒప్పుకుంది.

అపర్ణ పెళ్లి నచ్చిన వరుడితో జరిగిపోయింది.

ఆలోచనల నుండి తేరుకున్న అపర్ణకి, సుధ లేచి కూర్చోవడం చూసింది.

” ఇంకా పడుకోలేదా? ఏం ఆలోచిస్తున్నావ్”? అని అడిగింది సుధ.

” ఏం లేదత్తా! నీ పెళ్లి జ్ఞాపకాలు, నీ పెళ్లి అయిన తర్వాత నా చదువు తర్వాత నా పెళ్లి ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చున్నాను” అని చెప్పింది అపర్ణ నవ్వుతూ.

ప్రొద్దున్నే లేపు .వసంత వాళ్ళ ఇంటికి పోవాలి. పోనీ నువ్వు కూడా వస్తావా నాకు తోడుగా?” అని అడిగింది అపర్ణ.

“సరే వస్తాలే! ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం” అన్నది సుధ

సంతోషంతో సుధ మీద చేయి వేసి పడుకుంది అపర్ణ

సశేషం

July 31, 2025 32 comments
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఒక రెండు చిట్టెలుకలు

by ఒద్దిరాజు మురళీధరంరావు July 31, 2025
written by ఒద్దిరాజు మురళీధరంరావు

ఒక రెండు చిట్టెలుకలు వంట సామాను గదిలోకి పోయి, ఒక గూటిలో మీగడ తునక దొరికించుకున్నవి. మనం దీన్ని పంచుకుందాం అని దాని గురించి మాట్లాడుకున్నవి. “నేను పెద్దదాన్ని కాబట్టి నాకు ఎక్కువ భాగం కావాలి” అన్నది పెద్దది.
” ఓహో ! అదేం కుదరదు” అని అన్నది చిన్నది. “నాకే ఎక్కువ భాగం కావాలి. ఎందుకంటే నేను తిని నీ అంత ఎదగాది ” అని .
ఇలా అనుకుంటూ కాసేపు అవి వాదులాడుకొని మరుసటి రోజు నిశ్చయించుకుందామని పక్కకు పెట్టేసాయి .
మరుసటి రోజు ఉదయం కలిసి పెద్దది చిన్నదానితో “నువ్వు అన్నదే కరెక్ట్. నీవు అనుకున్నట్టే మీగడ తునకను పంచుకుందాం”అని .
అట్లా అనగానే” ఓహో అట్లా కాదు” అని అంది చిన్నది.” ఓ నువ్వన్నదే కరెక్టు” అని పెద్దది. “ఓ నువ్వు అన్నదే కరెక్ట్ “అని చిన్నది ఇలా వాదలాడుకొని చివరకు మర్నాడు తిందాం లే అని ఆ రాత్రి దాన్ని పక్కకు పెట్టి పడుకున్నాయి.
మరుసటి రోజు వంట సామాను గదిలో మళ్ళీ కలిశాయి. ఈసారి రెండు ఒకేసారి” నాకు తెలుసు” అని అన్నవి. ఈ మీగడ తునకను సమానంగా మన మధ్య పంచుకుందాం అని అనుకున్నాయి. కానీ రెండూ కూడా మీగడ తునకను చూసే వరకు అది పాచిపోయింది. పెద్ద ఎలుక అన్నది “మనం దాని గురించి అంతగా విచారించకపోనుంటిమి, దాచిపెడితే పాచిపోయింది!”.

July 31, 2025 36 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

రమణార్తి ‘హరే శ్రీనివాసా!’

by chittiprolu Subbarao July 31, 2025
written by chittiprolu Subbarao


నిజాయితీపరుడైన ఐ.ఏ.ఎస్. అధికారిగా ప్రజల హృదయరథాల్లో తెలుగునేల నాలుగు చెరగులా ఊరేగిన పేరు కె.వి. రమణాచారి. రసాయనశాస్త్రంలో ఎమ్మెస్సీ చదివి,  ఐ.ఏ.ఎస్. అధికారిగా తలమునకలయ్యే పని భారాలున్నా తన మృదుగంభీర వచస్సుతో సాహిత్యాభిమానుల మనసుల్ని తేలికపరిచే కారంచేడు వెంకట రమణాచారి గారు తన అభిరుచి మేరకు తెలుగులో ఎమ్. ఏ. పూర్తి చేసి, 57 వసంతాల వయస్సులో పిహెచ్.డి. కూడా చేసిన నిరంతర విద్యార్థి.
 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల సాంస్కృతిక సలహాదారుడిగా, దేవాదాయ శాఖ కమిషనర్‌గా, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డ్ కమిషనర్ గా, కడప జిల్లా కలెక్టర్ గా ఎన్నో బాధ్యతలు నిర్వహించారు రమణాచారి గారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (టీటీడీ ఈఓ)గా చేసిన సేవలే ఆయన మనుసుకు నచ్చిన సేవలని భావించవచ్చు.
 
2012లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన రమణాచారి గారు ఏవో శుభఘడియల్లో తన పాదాలకు ఏదో పసరు పూసుకున్నట్లున్నారు.  కాలపు వినువీధిలో వెనుదిరిగి 2007-2009 సంవత్సరాలకు పయనించారు. ఆనాడు టీటీడీ ఈఓ గా నిర్వహించిన విద్యుక్తధర్మాలను సంతృప్తికరంగా పునఃదర్శించుకున్నారు. పాత జ్ఞాపకాలను అక్షరాల్లోకి ఒదిగించి, 2024-25 లో ‘స్వాతి’ మాసపత్రికలో వ్యాసాలుగా వెలువరించారు. ఆ అనుభవాల దొంతరనే ఇప్పుడు ఏప్రిల్ 2025లో ఎమెస్కో ద్వారా  ‘హరే శ్రీనివాసా!’ పుస్తకంగా ప్రకటించారు.
 
22 ప్రకరణలుగా విస్తరించిన ఈ పుస్తకంలో ప్రధానంగా రెండు అంతర్లీన సూత్రాలు కనిపిస్తాయి. మొదటిది ఏడుకొండల స్వామి దర్శనాన్ని ప్రజాస్వామీకరించడం – అంటే దేవుణ్ణి ప్రజల వద్దకే తీసుకుపోవడం. తాను ఏది చేసినా, చేయగలిగినా అదంతా దైవానుగ్రహమేనని విశ్వసిస్తూ ‘హరే శ్రీనివాసా’ అని అడుగడుగునా తలచుకోవడం రెండవ అంతఃసూత్రం.
 
దైవ ప్రజాస్వామీకరణ అన్నప్పుడు అలనాడు ఇండియన్ సివిల్ సర్వీసెస్ చదివి, స్వాతంత్య్ర సమరయోధుడిగా, చివరకు పరమయోగిగా మారిన అరబిందో ఘోష్ వాక్యం ఒకటి గుర్తుకొస్తుంది:
 
“I want to invoke … direct manifestation of the Divine in our entire being and daily life.” (… మన అంతరంగమంతటా, దైనందిన జీవితమంతటా దైవం ప్రత్యక్షంగా ఆవిష్కారం కావాలని దీక్ష వహిస్తాను.) – అరబిందో
 
దైవచైతన్యం ఈ నేల మీదనే అవతరిస్తుందని అరబిందో విశ్వసిస్తే, కలియుగదైవం సప్తగిరుల మీద అందకుండా ఆగిపోకూడదనీ, సామాన్యప్రజల చెంతకు చేరాలనీ భగీరథ ప్రయత్నం చేసినవారు రమణాచారి గారు. భగీరథ ప్రయత్నమని ఎందుకు అనవలసి వచ్చిందంటే, ఎంత ఐ.ఏ.ఎస్. ఆఫీసరైనా, ఆయన కూడా తన సంకల్పాలకు దేవస్థానం ధర్మకర్తల అనుమతులనూ, ప్రభుత్వనేతల ఆశీస్సులనూ పొందగలగాలి.
 
దేవస్థానం సంప్రదాయాల ప్రకారం శ్రీవైష్ణవులు మాత్రమే గర్భగుడి లోకి ప్రవేశించగలరు. తిరుమల తిరుపతి దేవస్థానం 75 సంవత్సరాల (1933-2008) చరిత్రలో గర్భగుడి లోకి ప్రవేశించిన తొలి కార్యనిర్వహణాధికారి రమణాచారి గారు. ఆయన శ్రీవైష్ణవుడు. నియమనిష్ఠలతో అర్చకత్వమూ నేర్చుకున్న వారు. తన అదృష్టం సరే! మరి సామాన్యుల మాటేమిటి?
 
“స్వామీ! నీ భక్తుల కోసం నువ్వే భక్తుల దగ్గరకు పోలేవా?” – ఇదీ రమణార్తి!
 
ఆయన సంకల్పం వలన ‘భజగోవిందం’ ద్వారా స్వామి గ్రామాలకు వేంచేశారు. ‘దళితగోవిందం’ ద్వారా వాడవాడలకూ చేరుకున్నారు. ఇది దైవ ప్రజాస్వామీకరణ కాక మరేమిటి?
 
తిరుమలేశుడు సాక్షిగా జరిగే వివాహాలు కలకాలం నిలుస్తాయనే నమ్మికతో ప్రారంభమైనది ‘కళ్యాణమస్తు’. అందుకయ్యే ఆర్థికవ్యయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానమే భరిస్తుంది. ఈ ప్రకరణలో ఒక ఆసక్తికరమైన ఉదంతం కనిపిస్తుంది. బావామరదళ్ళే అయినా కట్నం అడ్డుపడి వివాహం క్లిష్టమైపోయి రమణాచారి గారిని ఆశ్రయిస్తారు రాజేష్, వసంతలు!  రమణాచారి గారు ప్రేమికుల పెద్దలతో మాట్లాడడం ద్వారా కళ్యాణం జరిగిపోతుంది!
 
అత్యంత మహత్వపూర్ణంగా జరిగిన కార్యక్రమం ‘చతుర్యుగ బంధ భక్తిచైతన్య యాత్ర’. కలియుగ దైవసన్నిధి నుండి కృతయుగపు నరసింహ స్థానం సింహాచలానికీ, త్రేతాయుగపు శ్రీరాముడి క్షేత్రం భద్రాచలానికీ, ద్వాపరయుగపు శ్రీకృష్ణుడి ఆలయం మొవ్వకూ సాగిన మూడురథాల యాత్ర, నాలుగు యుగాల అనుసంధానయాత్ర ఈ  ఈ చైతన్యయాత్ర. ఈ యాత్రను సాకారం చేయడానికి రమణాచారి గారు పడ్డ కష్టాలు చదివితీరవలసిందే.
 
నిత్యజీవితంలో ఒక భాగమైపోయిన ‘శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్’ కూడా రమణాచారి గారి సంకల్పసిద్ధే. అందుకు అవసరమైన కేంద్రప్రభుత్వ అనుమతులూ, ఆర్థిక వనరులూ, నిర్వహణా నైపుణ్యాలూ – ఆలోచన సులభమే గానీ ఆచరణలో ఎన్ని అవరోధాల్ని అధిగమించాలి!
 
పిల్లల కోసం పెద్దల కోసం ఆధ్యాత్మిక విషయ ప్రధానమైన ‘పుస్తక ప్రసాదం’, ఆర్థిక స్థోమత లేని ఆడపిల్లలకు పాఠ్యపుస్తకాలు అందించే ‘శ్రీ పద్మావతీ అమ్మవారి పుస్తక ప్రసాదం’ వంటివి ప్రజల వద్దకే దైవం వేంచేసే ఇతర కార్యక్రమాలు!
 
కాకతాళీయంగా బయటపడ్డ 32,000 అన్నమయ్య కీర్తనలు! 1978 లో పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు ప్రారంభించిన ‘అన్నమాచార్య ప్రాజెక్టు’!  లల్లాయి పదాలంటూ మొదట తృణీకరించి, పిదప పశ్చాత్తాపపడి,  చివరకు అన్నమయ్య కీర్తనలను స్వయంగా స్వరపరచిన మహా సంగీత విద్వాంసులు నేదునూరి కృష్ణమూర్తి గారి వృత్తాంతం! అన్నమయ్య 600వ జయంతి ఉత్సవ సందర్భంగా 2008లో తాళ్ళపాక గ్రామంలో 108 అడుగుల విగ్రహావిష్కరణ!  1,116 మంది సంగీత కళాకారులతో సప్తగిరి సంకీర్తన! హైదరాబాద్ లో అన్నమయ్య అధ్యయన కేంద్రం ఏర్పాటు! అన్నమయ్య వారసులకు నెలసరి జీవనభృతి!  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో లక్షగళార్చన! … … … సాయంసంధ్యను అచ్చతెలుగులో ‘దివ్వెలెత్తు పొద్దు’ అని పిలిచిన అన్నమయ్యను తలచుకుంటూ, కొలుచుకుంటూ చాలావరకు తీరిన రమణార్తి రెండు ప్రకరణల్లో విస్తరించి కనిపిస్తుంది.!
 
చిత్రకారుడు శివకుమార్ చిన్నిలేఖ కలిగించిన గొప్ప ఆలోచన టీటీడీ అమృతోత్సవం! 2008లో టీటీడీ కి 75 సంవత్సరాలు నిండినట్లు ఉన్నతాధికారులెవరూ గుర్తించరు. శివకుమార్ తన లేఖ ద్వారా రమణాచారి గారి దృష్టికి తీసుకువస్తారు. చివరకు అమృతోత్సవం రాష్ట్రపతి చేత ప్రారంభమవుతుంది. అలిపిరిలో అమృతోత్సవ స్థూపావిష్కరణ జరుగుతుంది. ‘అక్షరామృతం’ సంచిక వెలువడుతుంది.  ఉద్యోగులకు ‘స్వామివారి బంగారు డాలర్’ బహుమతులు లభిస్తాయి.  ఇంత బృహత్కార్యం రూపుదాలుస్తుండగా ఉద్యోగుల మధ్య ‘రూల్ అఫ్ రిజర్వేషన్’ చిచ్చు రగులుతుంది! రమణాచారి గారి సహృదయతతో చల్లని మాటలతో దావానలం శాంతిస్తుంది! ఇదంతా మరొక ప్రకరణ!
 
“హరే శ్రీనివాసా!” అని వేడుకోగానే “సరే వెంకట రమణా” అంటూ ఎన్నో అభ్యర్థనలను అనుగ్రహించిన అంతటి శ్రీనివాసుడు కూడా దయచూపని సందర్భాలున్నాయి. అందులో ఒకటి ‘దివ్యభారతి’ –  తిరుమల కొండ మీద రద్దీని తగ్గించే దిశగా అలిపిరి టోల్ గేట్ వద్ద 12 వరుసల రహదారిని నిర్మించడం లాంటి ప్రయత్నాలు. మరొకటి ‘ఆనందనిలయం అనంత స్వర్ణమయం’ – గర్భగుడి గోడల మీద లోపలా వెలుపలా  బంగారు పూత పూయడం. ‘మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది’ అనే నానుడికి కూడా ఉదాహరణలు కావాలి కదా!
 
“టీటీడీ ఈఓ కన్నా పెద్ద పోస్టులోకి పంపిస్తున్నాను రమణా!” ముఖ్యమంత్రి పలుకులు. మరింత ఉన్నతమైన పదవిని చేపట్టే అవకాశం  ఎలా విచారహేతువౌతుందో  ‘ప్రాప్తం’ ప్రకరణలో చూస్తాం.
 
ఇక చివరిదైన ‘వేంకటాద్రి దిగి వేంకటాద్రి ఎక్కి’ ప్రకరణ చదువుతూ చదువుతూ మన హృదయాలు ఉద్విగ్నమవుతాయి. నయనాలు అశ్రుసరస్సులవుతాయి. అసలు ఈ ప్రకరణ శీర్షికే అత్యంత భావుకతతో పరిపుష్టమైనది  – దిగినది వేంకటేశ్వరుడి కొండ, ఎక్కినది హైదరాబాద్ వెళ్ళే వేంకటాద్రి రైలు!
 
రైలెక్కడానికి ముందు ఆయనను కలవడానికి, కరచాలనం చేయడానికి, దూరం నుండైనా కడసారి వీడ్కోలు పలకడానికి వచ్చిన అశేషజనసమూహాన్ని చూసిన రమణాచారి గారు కన్నీళ్ళ పర్యంతమవుతారు. వనవాసానికి వెళ్ళే రాముణ్ణి సాగనంపిన అయోధ్య ప్రజల కన్నీటి కాలువలు గుర్తొచ్చాయేమో నగరవాసానికి వెళ్తూ తిరుపతివాసుల కళ్ళను చూసిన రమణాచారి గారికి – వనవాసకాండకు సంబంధించిన ఒక శ్లోకాన్ని ఉదహరిస్తారు ఈ అశ్రుమయమైన ఘట్టంలో! “శంఖమా! పోయివత్తునా!  … చక్రమా! పోయివత్తునా!” అనే అన్నమయ్య పల్లవినీ ఉటంకించి తన కవితాత్మను మరోసారి చాటుకుంటారు. ‘ఉన్నకాలం’ నుండి ‘సన్నకాలం’ లోకి జారిపోయిన స్వామివారి సేవాసౌభాగ్య దినాలను నెమరువేసుకుంటూ తట్టుకోలేక విలవిలలాడుతారు.
 
2007 ఏప్రిల్ 22 నుండి  2009 జూన్ 19 వరకూ ఏడు కొండల మీద  సాగిన తన జీవనప్రస్థానాన్ని రమణాచారి గారు మరచిపోలేరు. చదివితే మనమూ మరచిపోలేం.
 
“స్వామే భక్తుల దగ్గరకు ఎందుకు వెళ్ళకూడదు?” టీటీడీ ఈఓ కాకమునుపే రమణాచారి గారు వేసుకున్న ‘వెర్రిప్రశ్న’తో మొదటి ప్రకరణ చదువరులకు కుతూహలం కలిగిస్తే, వివిధ అంశాల్లో తన ఆలోచనలను ఎలా ఆచరణ సాధ్యం చేసుకున్నారో తదుపరి ప్రకరణల్లో వర్ణిస్తారు రమణాచారి గారు. మనసా వాచా కర్మణా కొలిచిన శ్రీనివాసుడికీ, సహోద్యోగులకూ, ఆత్మీయులకూ వీడ్కోలు పలకడమే చివరి ప్రకరణ.
 
రెండు నెలల్లోనే మూడు ముద్రణల్లో వెలువడిన ఈ రచన పాఠకుల అశేషమైన ఆదరణకు నిదర్శనం! రమణాచారి గారి ఆధ్యాత్మిక సేవలను ప్రత్యక్షంగానూ, వ్యక్తిత్వాన్ని పరోక్షంగానూ ప్రతిబింబించే ఈ పుస్తకం హస్తభూషణమే కాదు, హృదయపోషకం కూడా!
 
(‘హరే శ్రీనివాసా’ రచయిత డా. కె.వి. రమణాచారి, ప్రచురణకర్త ఎమెస్కో, పుటలు 192, వెల రూ. 150.)

July 31, 2025 33 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆదిలోనే హంస పాదు

by Dr. Vasundhara July 30, 2025
written by Dr. Vasundhara

ఆంధ్రులొచ్చిఅగ్గిపెట్టిరి
ఆంగ్లేయులొచ్చి ఇంగ్లీషు రుద్దిరి

ఓ తెలుగు బిడ్డ! తెరువు కళ్ళు…
కలుగుతున్నది జాతికి కాంతి లోపం

ఆదిలోనేహంసపాదు
అచ్చ తెలుగును ఆంధ్రులు మింగిరి

పర భాషా గాలి దోషం
తెలుగుకు తీరని శాపం
అచ్చ తెలుగులో పల్లె గొంతులో పలికినవెన్నో…
ఎన్నెన్నో కమ్మని పాటలు
ఏమాయెను ? ఎటుపోయెను?

పొరుగింటి పుల్లగూర
మన ఇంటి అమృతాన్ని అవతలకి నెట్టేస్తున్నది ….
భాషామతల్లికిది ఎంత బాధ ! ఆవేదన అర్థం చేసుకోలేని
అమ్మ బాధను తీర్చలేని పిల్లలెందుకు పుడమి మీద?

పరుల నుండి దేశమాతను పోరాటశక్తి తో కాపాడినట్లు
కమ్మనైన అమ్మ భాషను పర భాషాహస్తాల నుండి
తప్పించని బిడ్డ లెందుకు ?

రండి ముందుకు
పదండి దండుగా
పట్టు విడవక
గట్టి ప్రయత్నం
చేద్దాం రండి

తెలుగే లేని దేశానికి రాజ్యాలు రాజధానులు రాజులు అవసరమా ఆలోచించండని నిగ్గదీద్దాం ….

కేజీ నుండి పీజీ వరకు పెట్టండి తెలుగును విషయం గా
మా పిల్లలు తెలుగోళ్ళు మేమంతా తెలుగోళ్ళం
మాభాష తెలుగు
మా యాస తెలుగు
మా నివాసమే తెలుగు
మా ఊసులన్నీ మా బాసలన్నీ తెలుగులోనే సాగాలిక
మా ఇళ్ళన్నీ మా బళ్ళన్నీ
తెలుగు వెలుగుతో నిండాలంటూ
పైనున్న వాళ్లకు అందిద్దాం మన సందేశం
తెలుగు దేశపు ఊపిరి భాష
ఊపేద్దాం దేశాన్ని మన కవితలతో…
మన పాటలతో ….
పలు సందేశాలతో !
పదండి…పదండి. …
ముందుకు మును ముందుకు
మంచి రోజులు మంచి ప్రభుత్వాలు మన ముందున్నాయి
వినిపిద్దాం మన సందేశం సాధిద్దాం
సంతోష వార్త

July 30, 2025 44 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కంచికి చేరని కథ

by Padmasri Chennojwala July 30, 2025
written by Padmasri Chennojwala

చారిత్రక నవలాచక్రవర్తి , చారిత్రక నవలాసమ్రాట్, అభినవ పాల్కుర్కి బిరుదులు పొందిన డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారి కలం లోంచి వెలువడి ఆగస్టు – సెప్టెంబర్,1977 వ. సంవత్సరములో  విజయబాపినీడు వారి ‘ విజయ ‘ పత్రికలో అనుబంధ నవలగా ప్రచురించబడిన ‘ఆవాహన ‘ అనే చారిత్రక నవలకు నేను వ్రాసిన విమర్శనాత్మక వ్యాసం.

ముదిగొండ శివప్రసాద్ గారి ఆవాహన నవల తల్లి ఐతే, ఆ తల్లి గర్భంలోంచి పురుడు పోసుకున్న శిశువే నా ఈ రచన.

  ఇంత అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ రచించిన శివప్రసాద్ గారికి ముందుగా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వారే గనుక ఈ రచన చేయకపోయి ఉంటే, ఈ చారిత్రక కథ ప్రపంచానికి ఎప్పటికీ తెలిసి ఉండేది కాదు.

ఈ నవలపై నేను వ్యాసం వ్రాయడానికి గల కారణాలు తెలియాలంటే, నా జీవితంలో విచిత్రంగా జరిగిన కొన్ని విషయాలను నేను మీతో పంచుకోవాల్సి ఉంటుంది.

నాకు దాదాపు 8 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు మా ఇంట్లో అందరూ ఈ నవలను చాలా ఆసక్తిగా చదివేవారు. ఇంతకంటే ఆసక్తికరమైన మరో విషయమే మిటంటే, ఇది చదివే సమయంలో మా అక్క (అందరిలో పెద్ద) కు మొదటిసారిగా ప్రసవం జరిగిన రోజులవి.ఇంట్లో పసిబిడ్డ ఉన్నప్పుడు ఆ కుటుంబంలోని వారు, ముఖ్యంగా ఆమె(బాలింత) తల్లి ఎంతగా పనుల ఒత్తిడిలో ఉంటారో నేను ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదనుకుంటాను. పసిబిడ్డను ఒళ్ళో పెట్టుకుని మా అక్క, ఊపిరి సలుపని పనుల్లో ఉండి కూడా ఏ కాస్త సమయం చిక్కినా మా అమ్మ, ఇంటికి వచ్చీ రావడంతోనే మా నాన్న ఇలా అందరూ ఆసక్తిగా చదివేవారు.చదవడమేగాకుండా దాని గురించి చర్చిస్తూ ఉండేవారు. ఆడుకోవడానికి పక్కింటికీ, ఎదురింటికీ వెళ్లినా,అక్కడ కూడా ఇవే చర్చలు సాగుతూ ఉండేవి. వాళ్ళ చర్చల్లో ఎక్కువగా కామసాని, ఆవాహన, నర్తకి , శిల్పి వంటి పదాలు దొర్లుతూ ఉండేవి. ఆ మాటలు అర్థం చేసుకునే వయసు గానీ, కథను గురించి ఆలోచించే శక్తి గానీ నాకు లేకపోయినప్పటికీ, ఎందుకో రెప్ప వెయ్యకుండా వాళ్ళనే చూస్తూ, వాళ్ళ మాటలు వింటూ ఉండేదాన్ని.

అంతమందిని కదిలించిన ఆ కథ ఏమై ఉంటుందా!? అన్న ఆలోచన  నా వయసు తో పాటే పెరుగ సాగింది. కాస్త సమయం గడిచాక ఆలోచిస్తే నాకు అర్థమైన విషయ మేమిటంటే, స్థానికత వాళ్ల ఆసక్తికి ఒక బలమైన కారణమని. మేమ ప్పుడు వరంగల్ జిల్లాలోని ములుగు లో నివాసం ఉండే వాళ్ళం.

పుస్తక పఠనం అనేది నాకు ఒక అభిరుచిగా మారడం, క్రమక్రమంగా కాస్తో,కూస్తో కలాన్ని కదిలించే శక్తి నాకు దైవదత్తంగా అబ్బడంవల్ల ఎందుకో నాకు ఈ కథను తప్పనిసరిగా చదవాలి, విషయమేమిటో తెలుసుకోవాలి, వీలైతే దానిపై వ్యాసం వ్రాయాలి అన్న కోరిక క్షణక్షణానికీ పెరుగసాగింది. విషయం తెలుసుకున్న మావారు పలు పుస్తక విక్రయదారులను సంప్రదించి 30-08-2022 నాడు పుస్తకాన్ని తెచ్చి నా చేతిలో పెట్టడం, నేను అదే క్షణంలో మొదలుపెట్టి ఏకబిగిన పూర్తి చేయడం, కథలో లీనమై కళ్ళారా  దర్శించిన అనుభూతికిలోనై వర్తమానానికి రావడం జరిగింది. నవల చదివాకగానీ నాకు అర్థం కాలేదు, అది వరంగల్లోని వేయి స్తంభాల గుడికి సంబంధించిన కథ అని.అప్పటి వరకు నేను అది రామప్ప గుడికి సంబంధించినద నుకున్నాను. ఇక చదవడం పూర్తయ్యాక నా మదిలో మెదిలిన భావాలను వ్యక్తపరచాలంటే బహుశా నా రచనాపటిమ సరిపోదేమో అనిపించింది. ఆసక్తీ, ఆశ్చర్యం, ఉద్విగ్నత అన్నీ మిళితమైన అనిర్వచనీయమైన భావన. గతానికీ,వర్తమానానికీ; ఆనందానికీ,విషాదానికీ నడుమ అంతు చిక్కని  అవ్యక్తానుభూతి.

మనం ఎన్నో ప్రేమ కథల్ని చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. అందులో కొన్ని ఫలించి ఆనందాల హరివిల్లులైతే మరికొన్ని ఎండమావులకు ప్రతీకలుగా మిగిలిపోతాయి. మనిషి యొక్క ఆత్మ దేహత్యాగం చేసిన మరుక్షణం అందులో ఒదగబడిన ఈ ప్రేమ అనే సుగంధ కుసుమం కూడా పంచభూతాల్లో కలిసిపోతుంది. అది సర్వసాధారణం, కానీ ఇక్కడ వైవిధ్యభరితమైన, గుండెల్ని మెలిబెట్టే అంశమే నా చేత ఈ వ్యాసం వ్రాయించింది.

 కాకతీయ సామ్రాజ్య ఆస్థాన శిల్పి   భళ్లాల సోమేశ్వరునికీ, ఆస్థాన నర్తకి కామసానికీ నడుమ విరిసిన ప్రణయ కథ.

వరంగల్ జిల్లా పాల్కుర్కి గ్రామంలో జన్మించిన సోమేశ్వరుడు శైశవ దశలో ఉండగానే తల్లిదండ్రులు కాలం చేయడంతో మల్యాల గుండయ్య, కుప్పమ్మ దంపతుల బిడ్డగా పెరిగి పెద్దవాడవుతాడు. ఆస్థాన నర్తకి చామకాంబ కూతురైన కామసాని తల్లి వద్ద నాట్యాన్ని అభ్యసించి, తన నాట్యకౌశలంతో సామ్రాజ్య విస్తరణ గావించినందుకుగాను ప్రభువుల మన్ననలందుకొని ఆస్థాన నర్తకి పదవినలంకరిస్తుంది.

ఐతే ఫలించని ఈ ప్రేమ కథకు కారణాలేమిటి ? వేయి స్తంభాల గుడికీ,ఈ కథకూ మధ్య ఉన్న సంబంధమేమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే, ‘ఆవాహన’ అనే ఈ నవలా వారధిపై 12వ శతాబ్దంలోకి మన ప్రయాణం సాగాల్సిందే.

కళాశాల అధ్యాపకుడైన రామచంద్రరావు, బ్యాంకు ఉద్యోగై న మాధవరావు ఇద్దరూ మంచి స్నేహితులు. ఉద్యోగరీత్యా వరంగల్ బదిలీ ఐన మాధవ్ అంతకుముందే వరంగల్లో నివాసముంటున్న  రామచంద్రకు తాము వరంగల్ వస్తున్నామనీ, తమకొక మంచి ఇల్లు అద్దెకు చూసి పెట్టమనీ ఉత్తరం వ్రాయడంతో కథ మొదలవుతుంది.

భార్యను, కూతుర్ని వెంటబెట్టుకొని మాధవ్ కాజీపేట రైల్వే స్టేషన్ లో రైలు దిగడం, రామచంద్ర దంపతులు ఆతిథ్య మివ్వడం మామూలే అయినప్పటికీ, రెండు జంటలూ మొదటి కలయికలోనే స్థానిక దర్శనీయ స్థలాలపై పోటాపోటీగా చర్చించుకోవడం, ఎప్పుడెప్పుడు చూడాలా ?! అని అందరికందరూ  ఉబలాటపడటం, అప్పటికప్పుడు పట్టిక రూపొందించుకోవడం కాస్త నవ్వు తెప్పిస్తుంది.

ఐతే కథనెక్కువగా సాగదీయకుండా, పని వేళలు ముగిసి బ్యాంకు నుండి ఇంటికి వెళుతూ మార్గమధ్యంలో వేయి స్తంభాలగుడి చూడాలన్న ఉత్సు కతతో మాధవ్ లోపలికి అడుగుపెట్టడంతో, గజ్జెకట్టిన కట్టిన కాలికీ,ఉలి పట్టిన చేతికీ నడుమ విరిసిన ప్రణయానికి తెరతీశారు రచయిత.

ఆలయంలోని అణువణువూ నిశితంగా పరిశీలిస్తూ వెళుతున్న మాధవ్ కు పుష్కరిణి, దాని పక్కనే శిలాశాసనం, అక్కడి నుండి పడమరకు మళ్లగా ఉత్తర దిశగా ముఖం పెట్టి ఉన్న నంది కనిపిస్తాయి. నందిపై చెక్కి ఉన్న శిల్ప సౌందర్యానికి ముగ్ధుడవుతూ ఎదురుగా ఉన్న శివాలయంలోకి అడుగుపెట్టి, ఆలయ నిర్మాణాన్నీ , ఆలయ స్తంభాల మీద చెక్కబడి ఉన్న డిజైన్లనూ,సన్నటి లతలనూ గమనిస్తూ,పరమేశ్వరుని దర్శించుకొని ఇవతలికి వచ్చి నందీశ్వరుని వెనుక ఉన్న మరో ఆలయంలోకి అడుగు పెడతాడు.

కొంత భాగం శిథిలమై, మరికొంత అసంపూర్ణంగా ఉన్న ఆ కట్టడాన్ని చూసి , “ఏ కారణం చేతనో కాకతీయులు ఈ మంటపాన్ని పూర్తి చేసినట్లు లేదు, ఆ రోజుల్లోనే ” అని తనలో తాను అనుకుంటూ ఇంకాస్త ముందుకెళతాడు.

వైశాఖ పూర్ణిమనాటి ఆ వెన్నెల మంటపంలోని శిలలు, శిల్పాలు, లతలపై కురుస్తూ ఆ పర్యాటకుని లోని కళాతృష్ణను రెట్టింపు చేస్తోంది.నెమ్మదిగా మరో అడుగు ముందుకేసిన అతనికి ఒక నర్తకి బొమ్మ కనిపిస్తుంది. ఎందుకో ఆ బొమ్మను చూడగానే అతని శరీరం  గగుర్పొడిచి, కాళ్ళు అంగుళం కూడా కదలకుండా, కళ్ళనుండి నీరు కారిపోతూ ఉంటే, ఆ శిల్పాన్నీ,దానిలోని రామణీయక సజీవ చిత్రణను చూస్తూ, ముగ్ధుడై  ఆ బొమ్మ ముందు తానూ ఒక రాతి బొమ్మలా చలనం లేకుండా నిలబడిపోతాడు. అలా ఎంతసేపు నిలబడ్డాడో? ఎందుకు నిలబడ్డాడో తెలియదు (శిల్ప శాస్త్రానికి సంబంధించిన ఏ విధమైన పరిజ్ఞానంలేని, ఉలి మలుపుల్లో ఇమిడిన రసాత్మకతపై ఏ విధమైన అవగాహనలేని వ్యక్తి నీళ్లు నిండిన కళ్ళతో, తన్మయత్వంతో చూస్తూ, దాని ముందు స్థాణువులా నిలబడి పోవడానికిగల కారణమేమై ఉంటుందన్న ఆలోచన పాఠకుల మదిలో మెదులుతుంది). ఇతను మాత్రమే కాకుండా, ఈ కథను చదివే పాఠకులందరిలోనూ ఇదే గగుర్పాటు కలగడానికి కారణం కంచికి చేరని ఈ కథేనా?! లేక రచనా  వైదుష్యమా?! అనే ప్రశ్నకు సమాధానాన్ని ఎవరికి వారే శోధించాలి.

ఆ పారవశ్యంలో అతను ఇంకెంతసేపు ఉండిపోయేవాడో గానీ,” ఏమిటి చూస్తున్నావు?” అనే పలకరింపుతో ఉలిక్కిపడి వెనుదిరిగిన అతనికి, కాళ్లు చాపుకొని,మోకాళ్ళపై రెండు చేతులు ఆనించుకొని, రాశిపోసిన సౌందర్యంతో వెలిగిపోతూ స్వర్గలోకం నుండి దిగివచ్చిన అప్సరకాంతలా కిలకిల నవ్వుల జవరాలు శిథిల మంటపంలో ఓ వారగా కూర్చుని దర్శనమిచ్చింది.

“మీరు ఎవరు ?”అని యాంత్రికంగా అతనడిగిన ప్రశ్నకు “నేను మీ అమ్మగారి సేవకురాలిని” అని వ్యంగ్యంగా సమాధానమి వ్వడం, ఆజ్ఞాపించినట్లున్న కంఠస్వరంతో “కూర్చో” అంటూ ఏకవచన సంబోధన చేయడం, “సోమూ!” అంటూ తనను ఆత్మీయంగా, చనువుగా సంబోధించడం, అప్పుడే కిలకిలా నవ్వుతూ, మరుసటి క్షణంలోనే వలవలా ఏడుస్తూ, తానెన్నడూ  చూడని ఆ స్త్రీ , తానెప్పటి నుండో పరిచయం ఉన్న వ్యక్తి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే, ఆమె మాటలను అర్థం చేసుకోలేకా ,ఆమె భావోద్వేగాలను అంచనా వేయలేకా , తికమకపడుతూ ఏం మాట్లాడితే ఎక్కడ తననొదిలి వెళ్ళిపోతుందేమోననే భయంతో ఆమె కోపాన్ని, వ్యంగ్యాన్ని, బాధను, దుఃఖాన్ని, ఆమెలోని అనుకూల – ప్రతికూల భావాలకు  సానుకూలంగా స్పందిస్తూ, సుతిమెత్తగా సమాధానాలిస్తూ ఉండగానే, ఆమె ఏడుస్తూ శిల్పాల చాటుకు వెళ్లి కనుమరుగ వుతుంది. ఎంత వెతికినా ఏ విధమైన ప్రయోజనం లేకపోవడంతో, మౌనంగా ఇంటిదారి పట్టి,మరుసటి రోజు సాయంకాలం మళ్లీ అదే చోటుకి వచ్చి ఆమె జాడ కోసం వేచి చూస్తూ ఉంటాడు.

జాబిలి కిరణాల జల్లుల్లో తడుస్తున్నది అతని శరీరం మాత్రమే. నిన్న జరిగిన సంఘటన నిజమా?! కలా?! అన్న సందిగ్ధంలో మనసు అల్లకల్లోలమవుతోంది. మూడోనాటి వరకు సాగిన ప్రయత్నం వృధా ప్రయాసే  కావడంతో నిస్పృహకు లోనైన అతని అంతరంగంలో రామచంద్రను చూడగానే కొత్త ఆశ చిగురిస్తుంది. ఆదివారంనాటి ఆ విహారయాత్రలో రెండు కుటుంబాలు కోట చుట్టూ హుషారుగా కలియదిరుగుతూ ఉంటే,గుండెలో రేగుతున్న అలజడి అతడిని మాత్రం ఓ పట్టాన నిలువనియ్యడం లేదు. ఒక్కొక్క రాతినీ తాకుతుంటే , అంతుపట్టని అలజడేదో తరంగాలై అతని నాడీ మండలానికి అజ్ఞాత సందేశాలు అందిస్తూనే ఉంది.

ఇక ఏమాత్రం తమాయించుకునే శక్తిలేని మాధవ్, తనకెదురైన అనుభవాన్ని పూసగుచ్చినట్లుగా రామచంద్రకు తెలుపడం, తిరుగు ప్రయాణంలో భద్రకాళి అమ్మవారి గుడిలో మాధవ్ స్పృహ కోల్పోవడంతో సాలోచనలో పడిన రామచంద్ర ఒకనాడు ఒంటరిగా ఆలయానికి వెళ్లి, ఆ పరిసరాల న్నిటినీ జాగ్రత్తగా గమనించి, అక్కడ కనిపించిన భక్తులను మాటల్లోకి దింపి ఏదైనా సమాచారాన్ని రాబట్టాలని ప్రయత్నించి, ఏ విధమైన ప్రయోజనంలేక ఇంటికి తిరిగివచ్చి, ఆమె మాధవ్ తో పలికిన పలుకులను మననం చేసుకుంటూ తన స్టడీ రూమ్ లోనికి వెళ్లి, వరంగల్ కు సంబంధించిన చరిత్ర పుస్తకాలను శోధిస్తూ ఉంటాడు.

స్నేహానికి ప్రాణమిచ్చే రామచంద్ర చరిత్ర పరిశోధకుడు కావడం యాదృచ్ఛికమే అయినా, అదే బలమైన కారణమై ఈ కథను ప్రపంచానికి అందించింది.

తనువు, మనసు అదుపు తప్పిన మాధవ్ కు ఎప్పటికప్పుడు కొత్త శక్తి నందిస్తూ ,ఆమె నోటి నుండి వెలువడిన (చిన్నమ్మ, పెద్దమ్మ, మల్యాల గుండయ్య, త్రిసరాలు, తాటంకాలు) మాటలను ఎప్పటికప్పుడు మాధవ్ నుండి తెలుసుకుంటూ, వాటిని గ్రంథాలయంలో రూఢి పరుచుకుంటూ, శిధిల మంటపం లో భూస్థాపితమైన ప్రణయ ప్రబంధాన్ని వెలికి తీసి, జాతికి అందించిన సాహసి, ప్రేమ పిపాసి(రామచంద్ర).

మొత్తం 10 పున్నములు ఆమె ప్రత్యక్షమవగా, చతుర్దశి నాటి సాయంత్రం అలికిడి ప్రారంభమై, పౌర్ణమి నాడు కనిపిస్తుందంటూ రెండవ కలయికలోనే చెప్పగలిగిన అతని (రామచంద్ర) తెలివితేటలు, గ్రహణశక్తి పాఠకులను ఆశ్చర్యంలో ముంచేస్తాయి.భార్యాబిడ్డలతో మొదటిసారి కాజీపేటలో రైలు దిగిన మాధవ్ తో ” మా చెల్లెలికేం సమస్యలేరా ? నేను లేనా శ్రీకృష్ణుడి లాంటి అన్నయ్యను, ఏదైనా కష్టం వస్తే చక్రం అడ్డువేయనూ ” అనీ,
నీవేం భయపడకమ్మా ! ఊళ్ళో నల్లాలు బందైతే నీకోసం హుస్సేన్ సాగర్ నుంచి తెప్పిస్తాం” అనీ
మంచితనం, మాటకారితనం కలగలిసిన పరిహాసంతో అన్న మాటలే అయినప్పటికీ, మానసికంగా, శారీరకంగా కృంగిపోయిన భర్తను చూసి ఆ ఇల్లాలు(మాధవ్ భార్య) పడే వేదనకు శ్రీకృష్ణుడిలా చక్రం అడ్డువేసి వారి అనురాగ బంధాన్ని పువ్వుల్లో పెట్టి వారికప్పగించిన రామచంద్ర ఈ కథకు గుండెకాయ వంటివాడు. ఊళ్లో నా అన్న వారెవరూలేని ఆ ఇల్లాలికి అన్నీ తానై బాసటగా నిలిచిన కాత్యాయిని (రామచంద్ర భార్య) మహిళాలోకానికి ఆదర్శ ప్రాయురాలు. రామచంద్ర కు అన్ని విధాలుగా సహాయ సహకారాలందించిన ఆనందరావు గారు ఆవాహన అనే ఈ క్రతువులో శ్రీగంధం వంటి వారు.
కోయిల గానాలు, వీణానాదాలు, సెలయేటి గలగలలు, వలిమిన్న జల్లుల అందాలన్నీ కలబోసిన వెన్నెల బొమ్మ ప్రతి పున్నమి రేయిలో అతడిని కరుణిస్తూనే ఉంది. కళ్లెదుట సాక్షాత్కరిస్తూనే ఉంది.

మూడవ కలయికైన ఆషాఢ పున్నమినాటి రాత్రి  ఆమె మాటలను బట్టి ఆమె పేరు కామసాని అనీ, అతని పేరు సోమేశ్వరుడనీ, కాకతీయ సామ్రాజ్య మల్లెపందిరిపై వాలిన ఈ ప్రేమపక్షులు సామ్రాజ్యకాంక్ష అనే శ రాఘాతానికి నేలరాలిన జంట గువ్వలనే విషయం పాఠకులకు అర్థమవుతుంది.
తమ పూర్వీకుల నిర్మాణకాంక్ష ఐ న సహస్రమంటపం శిల్ప రూపంలో సజీవంగా ఉండాలన్న సంకల్పంతో రుయ్యమ్మ (తన తల్లి, కాకతీయ సామ్రాజ్ఞి ఐన రుద్రమదేవి పేరుమీద ఆజ్ఞాపత్రం రూపొందించి) గోళకీ మఠ నిర్మాణానికై సోమేశ్వరుని మందడ పంపించేస్తుంది.

సోమేశ్వరుని అమరశిల్పిగా మలచాలనీ,కాకతీయ శిల్పం చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోవాలనీ, కామసానీ సోమేశ్వరులు వివాహ చట్రంలో ఇమిడితే, వారిరువురి నడుమ ఏర్పడే బంధం అతనిలోని కళాభిని వేషానికి ప్రతిబంధకంగా మారుతుందనీ,అందుకే అతడిని మందడ పంపించడం అనివార్యమైందనేది ఆమె వాదన.

పుత్ర సంతానం లేని గణపతి దేవులవారు తమ కుమార్తె అయిన రుద్రమదేవిని తమ రాజకీయ వారసురాలిగా ప్రకటించడం, వారి నిర్ణయానుసారం ఆమె పురుష వేషాన్ని ధరించి అత్యంత సమర్థవంతంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండటాన్ని కళ్లారా చూస్తూ ఉండి కూడా, రుయ్యమ్మ వివాహం వీరిద్దరిలోని కళను దూరం చేస్తుందని ఆలోచించడంలో ఏ విధమైన బలం లేదు. ఇకపోతే రుద్రమదేవిగారికి కూడా పుత్ర సంతానం లేదు. వారి కుమార్తెలైన ముమ్మడమ్మగానీ, రుయ్యమ్మగానీ వారి తదనంతరం ఏ క్షణంలోనైనా పాలనా బాధ్యతలు చేబూనడానికి సర్వసన్నద్ధులై ఉండాలి, కానీ ఈ ఇద్దరు సోదరీమణుల్లో ఏ ఒక్కరు కూడా అవివాహితులుగా మిగిలిపోలేదు సరికదా, చక్కని గృహస్థ జీవితంలో ఇమిడిపోయారు.రాజ్యపాలనకు ప్రతిబంధకంకాని వివాహం కళా సాధనకు ఎందుకు ఈమెకు కారణంగా కనిపించిందన్న ఆలోచనకు సమాధానం దొరకడం లేదు.

తనకు అస్వస్థతగా ఉందన్న విషయం తెలుసుకున్న రుయ్యమ్మ పరామర్శ అనే మిషతో ఒకనాటి సాయంత్రం తమ ఇంటికి వచ్చి, తనకు(కామసానికి) తీరని అన్యాయం చేశానన్న మాట నిజమేననీ(పేజీ-116), ఒక జంటను తీరని బాధకు గురి చేశానని తనకు తెలుసనీ (పేజీ-118), ఒక స్త్రీ  మరొక స్త్రీని  కోరకూడనిదే – అయినా కోరుతున్నాను (పేజీ-119) అని అన్నదనీ, ఐనప్పటికీ తామిద్దరూ విడిపోవడానికి, తాను(రుయ్యమ్మ) పూర్తి కారకురాలిని కాననీ,అందులో తన పాత్ర కొంత వరకే పరిమితమై ఉందనీ మిగిలినదంతా దివ్య సంకల్పాలలో భాగమనీ, ఐతే అదంతా తన కోసం కాదనీ,కాకతీయ సామ్రాజ్య క్షేమం కోసం, సోమేశ్వరుని అమరత్వం కోసం ఈ త్యాగం చేయక తప్పదని (పేజీ- 119)తనతో అన్నదని అతనితో చెబుతుంది. దివ్య సంకల్పాల సంగతి దేవుడెరుగు,దివ్య సంకల్పాలలో భాగమే అయితే తాము విడిపోవడం కూడా యాదృచ్ఛికంగా జరగాలేతప్ప ఏ రాజకుమార్తె  పనిగట్టుకుని చక్రం తిప్పాల్సిన అవసరం లేదు. త్యాగం అనేది పగిలిన గుండెలోంచి ఎగిసిపడే విస్ఫోటనం, తట్టుకోలేని బాధలు, తీరని వేదనల నుండి పెల్లుబికే కఠిన శిలాద్రవం. అక్కడ తడికి ఆనవాలుగానీ, చెమ్మకు చోటుగానీ ఉండదు. అది బద్దలైన అగ్నిపర్వతం లోంచి వెలువడే లావా, భూమి(గుండె) పొరల్ని చీల్చుకొచ్చే మాగ్మా. ఏ వ్యక్తి అయినా తనకు తానుగా తీసుకోవాల్సిన నిర్ణయమే తప్ప, సంతలో దొరికే రెడీమేడ్ వస్తువు కాదు. ఎవ్వరిని అడగడానికైనా, ఎవ్వరికి ఇవ్వడానికైనా. తెర వెనుక సూత్రధారై,తెరమీద పా త్రధారై,చేదు గుళికలకు చక్కెర పూతలద్దినట్లు, మాటలతో మంచు తెరలు కట్టి, ఆమె ఎంత శాంతంగా చెప్పినప్పటికీ, తన గుండెల్లో కుంపటి రాజు కుంటున్నట్టుగానే ఉందనీ చెప్పిన తీరు”పేదల కోపం పెదవికి చేటన్నట్లు……….  ప్రకటించారు (పేజీ – 115) అనే మాట ద్వారా పాఠకులకు స్పష్టమవుతుంది.

“నాకు మిగిలింది అదే రాజకుమారి గారూ!” (పేజీ- 114)అనీ,”నన్ను చూడటం కోసం ఏ రాజకుమార్తె రానవసరం లేదు”(పేజీ – 115) అనీ,”ఒక రాజకుకుమార్తెగా కాక ఒక స్త్రీగా ఆలోచించు” (పేజీ-116) అని అనడం వంటివి ఆమె అనుభవించే వేదనను తెలుపడమే గాక, ఆమెలోని ముక్కు సూటితనం, నిక్కచ్చిత్వం, తన సమస్యను ఎదుర్కోవడానికి ఎంత ఘాటుగా నైనా (కోపం, ఆవేశం, దుఃఖం, వ్యంగ్యం, ధిక్కారం అన్నీ కలగలిసిన ప్రవర్తన) స్పందించే  మనస్తత్వాన్ని వీరిద్దరి నడుమ జరిగిన ఆనాటి వాగ్వాదం పాఠకులకు అద్దంలో చూపెడుతుంది.

వెంజావళి రవిక, హూని పట్టు చీరలో ముస్తాబై వచ్చిన కొత్త పెళ్ళికూతురు సాటి ఆడపిల్లతో ప్రేమను త్యాగం చేయమనీ, పెళ్లిని విరమించుకోమనీ శాసిస్తోంది.  ఆమె  ఔన్నత్యానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను, ఆమెలోని రాజనీతికి సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను.

రుయ్యమ్మ చేసిన ధర్మోపన్యాసం(పేజీ -122) ఎంత గొప్పదైనా,ఆదర్శప్రాయమైనదైనా మానసికంగా తాను ఆ స్థాయికి ఎదగలేదనీ,తన స్థానంలో ఆమె ఉంటే ఇలాగే ఆలోచించి ఉండేదా? అనీ అతనితో అంటుంది. కాంచీపురంపై కాకతీయ బావుటా నెగరేసిన అసాధారణ ప్రతిభాశాలి ఐన కామసాని ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో ఏ విధమైన ఆశ్చర్యం లేదు.

కాకతీయ సామ్రాజ్యపు మకుటం లేని మహారాణిగా రుయమ్మనూ, రాజకీయ దురంధరనిగా అన్నయా మాత్యుల వారిని చరిత్రలో సుస్థిర పరచాలని మరెవరైనా పథకం రచించి, అమలు పరిస్తే అప్పుడు గానీ అర్థమయ్యేది కాదు రుయ్యమ్మకు తన ఆదర్శ స్వప్నం సంగతి అన్న ఉక్రోషం ఆమె మాటల్లో ధ్వనిస్తుంది. సామ్రాజ్య క్షేమం కోసం సాంసారిక జీవితంలో పాక్షిక త్యాగాన్ని తాను కూడా చేయగలననీ, కానీ నృత్యానికి అంకితమైన ఒక దేవదాసి లాగా(పేజీ-124), జీవితాంతం ఒక బౌద్ధ సన్యాసినిగా జీవించేందుకు తన మనసు సిద్ధంగా లేదనీ

సోమేశ్వరునితో చెప్పి బాధపడుతుంది (పేజీ – 122).

ఇద్దరూ కాకతీయ సామ్రాజ్య కళాకారులే అయినప్పటికీ, శిథిల మంటపంలోని వారి మొదటి కలయికలో  “నేను మీ అమ్మగారి సేవకురాలిని”(పేజీ- 13)అని ఆమె జీవాత్మ మాధవ్ తో వ్యంగ్యంగా అంటుంది.

కాంచీపుర విజయానంతరం వీరిద్దరికీ ఏకాంతం దొరకనివ్వకూడదని తన రాజకుమార్తె స్థాయిని కూడా పక్కనపెట్టి నిరంతరం శిల్పాల వద్ద కూర్చుని సోమేశ్వరునితో శాస్త్రం గురించి చర్చలు జరపడం, గోళకీమఠ నిర్మాణానికై అతడిని మందడ పంపించేయడం, ప్రతాపరుద్రుని నామకరణ మహోత్సవానికి అతడిని రానివ్వకపోవడం వంటి విషయాలతో పథకం ప్రకారమే రుయ్యమ్మ తామిద్దరినీ విడదీస్తుందని తెలిసి కూడా, సామ్రాజ్య విస్తరణలో ప్రజల్ని, కళాకారుల్ని భాగస్వామ్యం చేయా లే తప్ప, సామ్రాజ్య కాంక్షకు వాళ్లను సమిధలుగా మార్చకూడదన్న విషయాన్ని ఒక రాజ్యాధినేతగా, ఒక మాతృమూర్తిగా రుద్రమదేవి రుయ్యమ్మకు హితవును బోధించకుండా మౌనంగా ఉండటమే ఆమె గొంతులోని వ్యంగ్యానికి కారణమన్న విషయం పాఠకులకు స్పష్టంగా అర్థమ వుతుంది.

వారి అసమాన శౌర్య ప్రతాపాలు, పరిపాలనా దక్షతలతో ప్రపంచ దృష్టిని ఏకశిలా నగరం వైపు ఆకర్షించి, చరిత్రలో కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని సువర్ణాక్షరాలతో లిఖించిన ఒక ధీరవనిత పేగు తెంచుకు పుట్టిన కుమార్తెను విమర్శించే స్థాయి నాకు లేకపోయినా, బద్దలైన ప్రేమభాండమే నా ఈ స్పందనకు కారణమని పాఠకులకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఈ స్పందన నాకు మాత్రమే పరిమితమైంది కాదనీ, నా  వంటి ఎంతో మందిలో ఇవే ఆలోచనలు రేకెత్తాయనడానికి ఈ నవల (ఆవాహన) ప్రచురితమైన తొలినాళ్లలో ఇంటింటా జరిగిన చర్చలే బలమైన నిదర్శనాలు.

కేవలం కళ అజరామరం కావాలనీ, కళాకారులైన కామసానీ, సోమేశ్వరులను కళాతపస్వులుగా మలిచి, అమరత్వం ప్రసాదించాలని రుయ్యమ్మ రాజకీయంగా ఇలా పావులు కదిపి ఉండవచ్చా?, ఆదర్శాలనేవి మనకు మాత్రమే పరిమితమైనవనీ, మరొకరిపై బలవంతంగా వేసేవీ, శాసించేవి ఆదర్శాలనిపించుకోవనే సూక్ష్మాన్ని ఆమె గ్రహించగలిగి ఉంటే బహుశా కథ ఈ మలుపు తిరిగి ఉండకపోవచ్చు? ఈ హఠాత్పరిణామాన్ని (ఒకరి కోసం ఒకరు అమరులవడం) ఆమె ఊహించకపోయి ఉండవచ్చా?, ఊహించని ఆ మలుపు ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురిచేసి ఉండవచ్చా?,అంతులేని పశ్చాత్తాపంతో ఆమె హృదయం కలత చెంది ఉండవచ్చా ? కామసాని చాళుక్య పరంపరకు చెందిన వ్యక్తి అయి ఉంటుందా

?, గుండయ్య,కుప్పమ్మల బిడ్డగా పెరిగిన సోమేశ్వరుడు వారికి సమీప బంధువై ఉంటాడా?లీనమై చదివిన పాఠకుల్లో తోడిన కొద్దీ ఊటలై ఊరే ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే ఏ చరిత్రకారుడో కంకణం కట్టుకోవాలే తప్ప, నావంటి సామాన్యులకు సాధ్యపడే విషయం కాదు.

కార్తీక సోమవారం నాటి ప్రదోషకాలంలో స్వయంభూ దేవాలయం నుండి బయటకు వచ్చి, వెనుక ఉన్న కొత్త నిర్మాణాన్ని చూడాలనిపించి వెళ్లిన కామసాని, పద్మకార శిల్పం మీద తలానించి, ఆకాశం వంక చూస్తూ, ధ్యాన నిమగ్నుడై మునిపుంగవుని ప్రతీకగా ఉన్న సోమేశ్వరుని మొదటిసారిగా చూస్తుంది.

శ్రీవన్నియ చీర, వాయు మేఘపు రవిక ధరించి, ముంగర, కమ్మలు భవిరెల అలంకరణలో రత్నదీప కాంతుల నడుమ మెరిసిపోయే కళాభినేత్రి అతనికి తపోభంగం కలిగించ లేకపోయినా, అతని అందమైన ముఖం,కలలుగనే ఆ కళ్ళు మొదటి చూపులోనే ఆమెలో అతని యెడ అనురక్తిని కలిగిస్తాయి. ఆరోజు వారిరువురి నడుమ జరిగిన సంభాషణ,  అతనితో ఆమె ప్రవర్తన ఆమెపై గడుసైన సొగసరి అనే భావనను పాఠకుల్లో కలిగిస్తుంది.

     శ్రీవన్నియ చీర, వాయు మేఘపు రవిక ధరించి ఉన్నానని(అప్పటి రోజులను గురించి) శిథిల మంటపంలో కామసాని మాధవ్ తో రెండు, మూడుసార్లు చెబుతుంది. అది ఆమెకు బాగా నచ్చిన వస్త్ర విశేషమై (ఆ రంగుల కలయిక) ఉండవచ్చు. ఆమె నర్తకి కావడం వల్ల సహజంగానే అలంకరణపై ఆసక్తీ,పట్టు ఉంటుంది.

    సోమేశ్వరుని నోటి వెంట ‘గిరిజ ‘ అన్న పేరు విన్నప్పుడు ఆమెలో స్త్రీ సహజమైన ఈర్ష్యను, మాహూరయ్యతో జరిపిన సంభాషణలో చిలిపిదనంతో కూడిన పరిణతిని పాఠకులు గమనిస్తారు. కాంచీపుర యాత్ర గురించి చెబుతూ అతను కూడా వస్తున్నాడని తెలిసి ఆనందంతో ఎగిరి గంతేస్తుందేతప్ప పులిబోనులో తలదూర్చబోతున్నాననే భయం ఏమాత్రం కనిపించకపోవడం ఆ ప్రేమ ఎంత ఘాటైనదో చెప్పకనే చెబుతుంది.

శ్రీదేవి చొక్కనాధుల ముసుగులో కాంచీపురంవైపు సాగింది వారి రాజకీయ యాత్ర మాత్రమే. ఆ ముసుగు మాటున దాగిన కామసానీ సోమేశ్వరులకు మాత్రం అది ప్రేమయాత్ర. దారి పొడవునా పలు క్షేత్రాలు దర్శిస్తూ , నదీ స్నానాలు చేస్తూ అదొక ప్రేమయాత్రగా వెళతారేతప్ప అత్యంత సాహసోపేతమైన ప్రయాణమనీ,ఏ కాస్త ఏమరుపాటుగా ఉన్నా ఎదురయ్యే పరిణామాలను గురించిన ఆదుర్దా గానీ మచ్చుకు కూడా కనిపించక పోవడం మనసున్న వారిని కలిచి వెయ్యకుండా ఉండగలదంటారా?

కాంచీపురంలో తాను నెరప బోయే గూఢచర్యం గురించి సోమేశ్వరునికి వివరిస్తూ,

” అభినయం దాని ముసుగు. విజయ గండనికీ,శ్రీధర స్వామికీ మధ్య విభేదాలు కల్పించడం అంకురార్పణ.

విజయ గండ పతనం ఫలప్రాప్తి – ఇదీ నా కార్యక్రమం ” అని చెప్పడం,

“నా కళ్ళూ, కాళ్ళూ నీ చేతులతో కలిసి కాంచీపురాన్ని పతనం చేశాయి”  అనీ,

“శాస్త్రం – శస్త్రం ఒకే చోట దర్శనమిచ్చింది ఆ రాత్రి” అని చెప్పిన తీరు సింధువును బిందువులో ఇమిడ్చగలిగే, బ్రహ్మాండాన్ని పరమాణువులో బంధించగలిగే ఆమెలోని ప్రతిభాపాటవాలను అంచనా వేయడానికి ఇంతకన్నా బలమైన పదాలుంటాయా?

(కళ అనేది కేవలం హృదయాన్ని రంజింపజేసేది మాత్రమే కాదనీ, సామ్రాజ్య విస్తరణలోను కీలకమైన పాత్ర పోషిస్తుందన్న కొత్త విషయాన్ని మొదటిసారిగా తెలుసుకున్నానన్న విషయాన్ని పాఠకులతో పంచుకోవాలనిపించి….)

రుయ్యమ్మ,అన్నయల పెళ్లి జరిగిన కళ్యాణ మంటపం (ఈ మంటపాన్ని సోమేశ్వరుడే చెక్కుతాడు) లోనే తమ పెళ్లి కూడా జరగాలని ఉందని సోమేశ్వరునితో అనడం, అదే పెళ్లిలో విశ్వంభర శివాచార్యుల వారికి నమస్కరించి “మమ్మల్ని ఆశీర్వదించండి స్వామీ” అనడం పద్మాక్షమ్మ కొండపై నుండి నీళ్లు నిండిన కళ్ళతో నిస్సహాయంగా మెట్లు దిగి వెళ్ళిపోవడం వంటి విషయాలు తడి ఉన్న గుండెల్ని  వడి వెట్టకుండా ఉండగలవంటారా?

  కూతురి స్థానంలో ఆస్థాన నర్త కిగా తిరిగి తనను నియమించదలచినట్లు  రాజప్రాసాదం నుండి వచ్చిన శ్రీముఖాన్ని చామకాంబ సున్నితంగా తిరస్కరిస్తుంది. కళ్ళ ముందే కృంగికృషించి పోతున్న కూతురిని చూస్తూ ఆ తల్లి మనసు ఎలా అంగీకరించగలుగుతుంది?

 “ఆస్థాన నర్తకి ప్రథమాభినయమా” అన్న సోమేశ్వరుని మాటలకు ఆమె ఇచ్చిన సమాధానం, తనను పరామర్శించడానికి వచ్చిన రుయ్యమ్మతో జరిపిన వాగ్వాదం,

 “నీ ముందు నాకీ  సామ్రాజ్యమెంత ?” అని సోమేశ్వరునితో అనడం వంటివన్నీ అతని ప్రేమ కంటే విలువైనదేదీ  ఆమెకీ ప్రపంచంలో లేదనే విషయం తేటతెల్లమవుతుంది.

తామిద్దరినీ రుయ్యమ్మే  విడదీసిందన్న విషయం రుయ్యమ్మ నోటి వెంటే విన్న కామసాని

‘ నాకీ ఆస్థాన నర్తకి పదవీ వద్దు. ఈ సామ్రాజ్యమూ వద్దు’ అనుకుని అక్కడ అరక్షణం కూడా నిలబడకుండా గిర్రున వెనక్కి తిరిగి రావడం, అంతఃపురం నుండి పరిచారికలతో కబురు మీద కబురంపినా, “రుద్రమగారి తర్వాత ఇతనే రాజవుతాడా? ఈ ప్రతాపరుద్రునితోనే ఈ సామ్రాజ్యం ఏమైనా అయిపోతుందా? నా నృత్య ప్రదర్శన లేకపోతే?” అంటూ పరిచారికలను తరిమేయడం,  రాజాజ్ఞని కూడా ధిక్కరించిన వైఖరి ప్రేమ పట్ల ఆమెకున్న నిబద్ధతను, అది గెలిపించుకోవడానికి సర్వశక్తులొడ్డి  పోరాడిన తీరును తెలుపుతుంది.

కామసాని అతడినెంత గాఢంగా ప్రేమిస్తుందో, అతను కూడా అంతే గాఢంగా, నిజాయితీగా ఆమెను ప్రేమిస్తాడు. కాంచీపుర యాత్రలో భాగంగా సువర్ణముఖి నదిలో స్నానం చేస్తూ, ” కొంగులు ముడి వేసుకొని చేద్దామా ?” అనడం, తిరుగు ప్రయాణంలో “బాలాజీ దర్శనంతో మన వైవాహిక జీవితం ప్రారంభమవుతుంది” అనడం వంటి మరికొన్ని మాటలను బట్టి ఆ విషయం పాఠకులకు స్పష్టంగా అర్థమవుతుంది.

మనఃస్ఫూర్తిగా ప్రేమిస్తాడేగానీ దానిని పండించుకునే ధైర్యం, స్థైర్యం (ఆమెలో నూటికి నూరుపాళ్ళు ఉంటే) ఇతనిలో మచ్చుకు కూడా కనిపించవు. అవే గనుక ఉండి ఉంటే ఈ కథ విషాదాంతం అయి ఉండేదే కాదు. ఆమెతో మాట మాత్రంగానైనా చెప్పకుండా మందడ వెళ్లిపోవడం, తిరిగి ఏకశిలకు వచ్చాక కూడా ఆమెకు ఏ విధమైన సమాచారం ఆమెకు అందించకపోవడం, వారి ఆఖరి కలయికైన పద్మాక్షమ్మ కొండపైన ఆమె ఎన్ని రకాలుగా నచ్చజెప్పడానికి ప్రయత్నించినా(బీద పలుకులు పలుకుతాడేతప్ప) ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకపోవడం ఇతనిలోని పలాయన వాదానికి నిదర్శనాలు.
కామసానికి ప్రతీకగా యశోదర విగ్రహాన్ని వేయి స్తంభాల గుడిలో చెక్కుతానని అంటాడు. వీరశైవం అధికార మతంగా ఉన్న రాజ్యంలో బౌద్ధ మతపరమైన శిల్పం చెక్కడ మేమిటన్న ఆమె మాటలకు మానవత మతానికి అతీతమైందనీ, అది అన్ని చోట్లా వ్యాపించి ఉంటుందనీ, సర్వసంగ పరిత్యాగి ఐన బుద్ధుడు ఏ విధమైన ప్రతిఫలాన్ని ఆశించకపోయినప్పటికీ , తాను చేసిన త్యాగానికి లక్ష రెట్ల కీర్తిప్రతిష్టల్ని పొంది, లోకానికి ఆదర్శ పురుషుడైనాడనీ, కానీ యశోదర మానసిక సంఘర్షణను ప్రపంచం గుర్తించలేదనీ, అందుకే ఆమెపై తనకున్న అపారమైన గౌరవానికి సూచనగా చెక్కుతానని అంటాడు.
సిద్ధార్థుడు యశోదరను వదిలి వెళ్ళిన విధంగానే తాను కూడా కామసానిని వదిలి వెళుతున్నానని అతని అంతరంగ భావన అయి ఉండవచ్చు. తనలోని కళా నైపుణ్యం శిల్ప రూపంలో కొన్ని యుగాల పాటు నిలిచి ఉంటుందనీ, కానీ కామసాని ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన కొద్ది కాలానికి ఆమెలోని మానసిక సంఘర్షణను, ఆమె అందెల రవళులను ప్రపంచం మరిచిపోతుందని కూడా అతడి భావన అయి ఉండవచ్చు.

పైకి యశోదరను ఉదాహరణగా చూపిస్తూ, మాట్లాడుతున్నాడే గానీ అతను చెప్పేదంతా తన గురించేనని క్షణంలో పసిగట్టిన కామసాని అదే మాట అతనితో అంటుంది కూడా. ఆమె ఎన్ని రకాలుగా నచ్చజెప్పాలని ప్రయత్నించినా, అతను ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకపోవడంతో, నీళ్లు నిండిన కళ్ళతో నిస్సహాయంగా కొండ దిగి వెళ్ళిపోతుంది.

శిల్పం కోసం ప్రేమను త్యాగం చేస్తానన్నవాడు మరి ఆ శిల్పానికైనా న్యాయం చేశాడా అంటే అదీ లేదు. గోళకీ మఠ నిర్మాణానికై వెళ్ళినప్పటికీ, శిల్పం పై దృష్టి నిలపలేకపోతున్నాడనీ, ఇటు తాను రోగిష్టినయ్యాననీ, ఇద్దరినీ కళాతపస్వులుగా చేయాలన్న రుయ్యమ్మ ఆదర్శ స్వప్నం ఫలించలేదనీ,తన తల్లి ఐ న చామకాంబ తనతో చెప్పిందనీ, అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న తాను ఆ విషయం తెలిసి పూర్తిగా కుదేలయ్యాననీ, ఆ తదుపరి సంఘటనలు కలలో జరిగినట్లుగా జ్ఞాపకం ఉన్నాయనీ, ఎందుకో శివాచార్యులవారు వచ్చినట్లు,తనను అభిమంత్రిస్తున్నట్లు ఏదో లీలాగా స్ఫురించిందనీ,ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అతడిని చూస్తున్నాననీ చెబుతుంది.

మొత్తం 10 పున్నములుగా జరిగిన ఈ కథలో (శిథిల మంటపంలో) ఇక్కడి వరకే ఆమె మాధవ్ తో చెబుతుంది.

మాధవ్ మానసిక, శారీరక పరిస్థితి పూర్తిగా దిగజారడంతో ఆయుర్వేద వైద్యులైన వేణుగోపాలాచార్యులవారి సలహా మేరకు వరంగల్ వాస్తవ్యులైన మహామంత్రవేత్త, ఉపాసకులైన ముదిగొండ జ్వాలాపతి లింగశాస్త్రి గారిని కలిసి శిథిల మంటపంలో మొదటి నుండి మాధవ్ కె దురవుతున్న అనుభవాలను, అతని ప్రస్తుత పరిస్థితిని వివరించి ఎలాగైనా అతడినీ, అతడి కుటుంబాన్నీ ఈ కష్టం నుండి గట్టెక్కించమని ప్రాధేయపడతాడు రామచంద్ర.

తన ఆధ్యాత్మిక శక్తి అంత దృఢమైనది కాదనీ, ఇదివరకెన్నడూ ఈ రకమైన సమస్యలను పరిష్కరించిన అనుభవం తనకు లేదనీ మొదట అన్నప్పటికీ, చివరకు అంగీకరిస్తారు జ్వాలాపతిగారు.

రామచంద్ర చెబుతున్న విషయాలన్నిటిని కళ్ళు మూసుకొని పారవశ్యంతో విన్న ఆ మహనీయుడు ఊహాలోకం నుండి వాస్తవానికి వచ్చి, ఈ మాధవరావే ఆనాటి భళ్ళాల సోమేశ్వరుడనీ, కామసాని అతడి ప్రేయసి అనీ, శిథిల మంటపంలో ప్రతి పౌర్ణమికి అతడికి కనిపించి, మాట్లాడుతూ న్నది ఆమె జీవాత్మ అనీ చెబుతాడు.

మరుసటి రోజైన త్రయోదశీ,సోమవారం మాస శివరాత్రి నాడు అఖండం వెలిగించి పూజ ప్రారంభిస్తాననీ, ధ్యానంలో తనకేవైనా కొత్త ఊహలు రావచ్చనీ, ఎల్లుండి వచ్చి కనిపించమని చెప్పి పంపిస్తారు.

వారి మాట ప్రకారం మరుసటి రోజు వెళ్లిన రామచంద్రకు నవ్వుతూ ఎదురొచ్చిన జ్వాలాపతి గారు తమకు ధ్యానంలోస్ఫురించిన విషయాలను రామచంద్రకు చెబుతూ….

మందడ నిర్మాణం పూర్తి చేసి, ఏకశిలకు వచ్చిన సోమేశ్వరుడు మనసు అల్లకల్లోలమవుతుండగా సహస్రమంటపాన్ని చెక్కుతూ ఉంటే, ఒకనాడు చామకాంబ వచ్చి కామసాని ఆఖరి ఘడియల్లో ఉందని తెలుపడంతో వెళ్లి చూస్తాడు. పరిస్థితి ఇలా చేయి దాటి పోతుందని ఊహించని అతను కన్నీరుమున్నీరుగా విలపిస్తూ,మహామంత్రవేత్త, రాజ గురువైన విశ్వంభర శివాచార్యుల వారినాశ్రయించి, తన గుండెలోని వేదనను, ఆమె కళ్ళలోని ఆవేదనను తన ఉలి మలుపుల్లో బిగించి, ఆమెకు ప్రతీకగా తాను చెక్కిన శిల్పం శిథిల మంటపంలో యశోదర విగ్రహమై ఉందనీ, తిరుపతిలో బాలాత్రిపుర సుందరి సమక్షంలో మానసికంగా తమకు వివాహం జరిగిందనీ,ఆమె ఆత్మను అందులో ఆవాహన చేయమని ప్రాధేయపడతాడు.

“స్వామీ! కామసాని నన్ను అమరుణ్ణి చేయడం కోసం తన్ను తాను సర్వసమర్పణ చేసుకున్నది. ఆమెను మీరు అమరస్త్రీగా మార్చండి. నా శిల్పంలో ఆమె ప్రాణ ప్రతిష్ట చేయండి” అని అర్థిస్తాడు.

(జ్వాలాపతిగారు రామచంద్రకు తెలిపిన ఈ విషయంపై నా స్పందనను పాఠకులతో పంచుకోవాలనిపించి……

కామసాని – సోమేశ్వరులకు సంబంధించిన ఈ కథను నేను ఈ ఒక్క పుస్తకంలోనే చదివాను. ‘క్రీడాభిరామం’ అనే నవలలో కూడా కామసాని ప్రస్తావన ఉందన్న విషయం ఎక్కడో విన్నాను గానీ,ఆ పుస్తకాన్ని మాత్రం నేను చదవలేదు.

అతని ఉన్నతిని అతనికంటే ఎక్కువగా ఆమె కోరుకుందే తప్ప, తన ప్రేమను త్యాగం చేయడానికి గానీ,అతడితో బంధాన్ని వదులుకోవడానికి గానీ ఆమె ఎప్పుడు కూడా సిద్ధపడలేదు. నవల మొదటి నుండి చివరి వరకు ఎక్కడ కూడా ఈ విషయం పాఠకులకు కనిపించదు, స్ఫురించదు.మరి సోమేశ్వరుడు శివాచార్యుల వారితో  ‘ అమరుణ్ణి ‘ అనే పదం ఎందుకు వాడారో నాకు ఎంత ఆలోచించినా బోధపడలేదు).

మొదట అంగీకరించని శివాచార్యులవారు ఒకనాటి పూర్ణిమనాడు భద్రకాళి అమ్మవారికి పూజలు నిర్వహించి, శాస్త్రోక్తంగా ఆమె జీవాత్మను యశోదర విగ్రహంలో ఆవాహన చేశారనీ, ప్రతిష్ట కాలంలో దుఃఖిస్తూ ఉన్న సోమేశ్వరుడు పూజాదికాలు సక్రమంగా నిర్వహించ లేకపోయాడనీ, ఆ కారణంగా ఆకర్షణ సమయంలో పూజలోనో, మంత్రంలోనో ఏదో లోపం జరిగిందనీ,ఫలితంగా ఆ శిల్పం ఎవరు పిలిస్తే వారికి పలకడం లేదనీ, ప్రతి పౌర్ణమినాటి చంద్రోదయ కాలంలో కేవలం 15 నిమిషాలపాటు సోమేశ్వరునితో మాట్లాడుతుందనీ, ఆ పదిహేను నిమిషాల కాలమే జీవప్రతిష్ట జరిపిన ముహూర్తమై ఉండవచ్చనీ, ఎనిమిది వందల సంవత్సరాలుగా ఇదేవిధంగా బయటకు వస్తూ, అతని కోసం ఎదురుచూస్తూనే ఉండి ఉండవచ్చనీ ,ఇంత కాలానికిగానీ ఆమె నిరీక్షణ ఫలించ లేదనీ, ఆనాటి సోమేశ్వర రూపానికీ ,ఈ మాధవరావు రూపానికీ సంపూర్ణ సాన్నిహిత్యం ఉండటమే ఆమె అతడిని గుర్తుపట్టడానికి కారణమై ఉండవచ్చనీ,అతనే సోమేశ్వరుడ వ్వడంవల్ల అతడికి మాత్రమే కనిపిస్తూ, అతనితోనే మాట్లాడుతూ ఉందనీ, ఆమె భౌతికంగా మరణించిన అనంతరం కళాభినివేషాన్ని పూర్తిగా కోల్పోయిన సోమేశ్వరుడు ” దేవీ! దేవీ!” అంటూ కామసాని నామస్మరణలో పిచ్చివాడై, నిరంతరం సహస్ర స్తంభ  మంటపంలో తిరుగుతూ, తనువు చాలించి ఉంటాడనీ కామసాని సశేషంగా మిగిల్చిన కథను తన ఉపాసనా బలంతో సంపూర్ణం గావించారు . 

ఆ తర్వాత మాధవ్ నూ,అతని కుటుంబాన్ని కాపాడమంటూ అర్థించిన స్నేహశీలి (రామచంద్ర) ఆవేదనకు స్పందించి శాస్త్రోక్తంగా ఆమె జీవాత్మకు విముక్తిని ప్రసాదిస్తారు జ్వాలాపతి గారు.

( ఇక్కడ నా మనసులో మెదిలిన మరో విషయాన్ని కూడా పాఠకులతో  పంచుకోవాలనిపించి…..

ఎంత గొప్ప శిల్పి ఐనప్పటికీ, అతి సామాన్య మానవుడైన సోమేశ్వరుడు ఆమె తనను వదిలి వెళుతుందనే ఊహను తట్టుకునే శక్తిలేకా,ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలను అంచనా వేయగలిగే పరిజ్ఞానంలేకా ఆవాహన చేయమని అభ్యర్థించి ఉండవచ్చు. కానీ మహా మంత్రవేత్త, తపఃసంపన్నులైన శివాచార్యులవారు ఎలా అంగీకరించగలిగారు? అన్న ప్రశ్న మాత్రం నాలో తలెత్తింది. మరుసటి క్షణంలోనే సాధుసత్పురుషుల ఆలోచనల వెనుక ఏదో అర్థం, వారు వాటిని అమలుపరిచే విధానాల వెనుక మరేదో పరమార్ధం దాగుంటుందని మళ్లీ ఆ (నా) మనసే నాకు హితవును బోధించింది.

రాబోయే కాలంలో ఈ కథ ప్రపంచానికి తెలియాల్సిన అవసరముందని వారు భావించి ఉండవచ్చనీ, అందుకే శిల్పంలో ఆవాహన చేసి ఉండవచ్చనీ నాకనిపించింది.

నవల చదవక ముందు అది చదవాలనీ,దానికిపై వ్యాసం వ్రాయాలని మాత్రమే ఉండేది, కానీ ఎప్పుడైతే నేనా నవల చదివానో,ఆ క్షణం నుండే నాలో ఆ శిల్పాన్ని చూడాలన్న కోరిక  పెరుగసాగింది. వ్యాసం వ్రాయాలన్న ప్రయత్నం మధ్యలోనే ఆగిపోవడం, ఎంత ప్రయత్నించినా ముందుకు సాగకపోవడంతో, ఇక ఉండబట్ట లేక 02/07/ 2024 నాడు నేను, మావారు వరంగల్ కు బయలుదేరాం. నేను శిల్పశాస్త్రం, పురాతత్వశాస్త్రం, చరిత్ర వంటి వాటిలో ఏమాత్రం పరిజ్ఞానం ఉన్న వ్యక్తిని కాకపోయినప్పటికీ, ఆ శిల్పం చూసి రావాలనుకోవడానికి కారణం, ప్రత్యక్షంగా చూసి వ్రాస్తే నా రచన ఒకింత బలాన్ని పుంజుకుంటుందనీ, మరికాస్త జీవం పోసుకుని కొంతమందినైనా కదిలించగలుగుతుందేమోనన్న చిన్న ఆశ. ప్రయాణం చేస్తున్నంతసేపు ఏదో తెలియని ఆనందం. ఆలయ ప్రాంగణంలో అడుగు పెడుతున్నప్పుడు నా గుండె వేగంగా కొట్టుకోవడం స్పష్టంగా గమనించాను.

విశాలమైన ఆవరణలో అడుగుపెట్టగానే 3 శివలింగాలు, వాటికి కాస్త దూరంలో పుష్కరిణి, పద్మాకారంలో ఉన్న వేదిక, దానిపై ఆలయ నిర్మాణం (ఈ ఆలయ నిర్మాణమే నాకు వినూత్నంగా కనిపించింది. ఇటువంటి నిర్మాణశైలి నేను ఇది వరకెక్కడా చూడలేదు. బహుశా ఉండి ఉండవచ్చు, కానీ పర్యాటక ప్రదేశాలను చూడటంలో నేను అంత చురుకుగా ఎప్పుడూ లేను, అందుకే నాకలా అనిపించి ఉండవచ్చు) మరోవైపు హనుమంతుడు, నాగదేవతల ప్రతిష్ట కనిపించింది. గుడిలోనికి వెళ్లి స్వామిని దర్శించుకుని, కాకతీయ సామ్రాజ్యపు ఆలోచనలు తలలో చక్రభ్రమణం చేస్తూ ఉంటే,  గోడలను చేతులతో స్పృశిస్తూ, ఆ విషాదగాథను నెమరేసుకుంటూ, అడుగులో అడుగేసుకుంటూ, నందీశ్వరుని చెంతకు చేరుకొని, ఆవాహన నవలను చేతిలో పట్టుకొని,గుండె దడదడలాడుతూ ఉండగా, నెమ్మదిగా శిథిలమంటపం లోనికి అడుగు పెట్టాను.

800 సంవత్సరాల విషాదాన్ని మోసిన ఆ విగ్రహాన్ని చూడాలన్న తపన నన్ను రోమాంచితం చేస్తూ ఉంది. అంగుళం కూడా వదలకుండా మంటపమంతా కలియజూస్తూ, మధ్య మధ్యలో  పుస్తకాన్ని తిరగేస్తూ, ఒక్కొక్క సంఘటనను సరిచూసుకుంటూ, ఒక్కొక్క అడుగే వేస్తూ, అప్పుడప్పుడు దాని గురించి మా వారితో చర్చిస్తూ, అవసరమైన చోట అతని సలహాలు తీసుకుంటూ, అంగుళం అంగుళం గాలించాను.

ఆ మంటప నిర్మాణమే నాకు సరికొత్తగా అనిపించింది. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఏ విధమైన పరిజ్ఞానం లేకపోయినప్పటికీ, ఎందుకో చాలా విచిత్రంగా అనిపించింది. నవలలో పద్మాకార శిల్పాలు అనే మాట కామసాని నోటి వెంట చాలాసార్లు వస్తుంది. ఈ పద్మాకార శిల్పాలు ఏమిటనే విషయంపై చాలా జాగ్రత్తగా గమనించాను. ప్రధాన ఆలయంలో, శిథిలమంటపంలో  రెండు చోట్లా నాకు పద్మకార చెక్కడాలు కనిపించాయి. ప్రధాన ఆలయంలో కప్పు పైభాగంలో అన్ని పద్మాకారంలో చెక్కిన చక్రాలు కనిపించాయి (బహుశా అవి ఇవే అయి ఉండవచ్చు అనుకున్నాను). శిథిలమంటపంలో 4 వరుసల్లో వరుసకు 6 చొప్పున మొత్తం 24 స్తంభాలు కనిపించాయి. ప్రధాన మంటపానికి నాలుగు వైపులా 4 ఉపమంటపాలు కనిపించాయి. ప్రతి ఉపమంటపానికి నాలుగు వైపులా 11 చొప్పున మొత్తం 44 చిన్న,చిన్న స్తంభాలు కనిపించాయి. కానీ ఎంత వెతికినా నాకు యశోదర శిల్పం జాడ కనిపించలేదు. అప్పుడు నాలో కలిగిన ఆలోచనలనుగానీ,నా గుండెలో రేగిన అలజడినిగానీ కాగితంపై పెట్టాలంటే, నా రచనా శక్తి సరిపోదేమో అనిపించింది. కామసాని మాధవ్ తో మాట్లాడుతూ శిల్పాల చాటుకు  వెళుతుందనీ ,అలా వెళుతూ, వెళుతూ అదృశ్యమవుతుందనీ ఉ టంకించారు. యశోదర శిల్పం మాత్రమే కాదు, ఆ మంటపంలో నాకు ఏ ఒక్క శిల్పమూ కనిపించలేదు. రాతి స్తంభాలపై సన్నటి లతలు, చిన్న, చిన్న దేవతా రూపాలు కనిపించిన మాట వాస్తవమేగానీ, స్తంభాలపైగానీ, స్తంభాల చెంతగానీ నాకు ఎటువంటి విగ్రహాల జాడ కనిపించలేదు. అక్కడ ఉన్నవాళ్లను కొందరిని గైడ్స్ గురించి అడిగితే, గైడ్స్ ఉదయం పూట మాత్రమే అందుబాటులో ఉంటారని చెప్పారు.నలుగురైదుగురు భక్తులను అడిగినప్పటికీ , ఏ విధమైన సమాచారం లభించలేదు. ఆలయ అర్చకులను సంప్రదించమని ఒకరిద్దరు సలహా ఇచ్చారుగానీ నాకెందుకో సమాచారం దొరుకుతుందన్న నమ్మకం కలుగక మౌనంగా ఉండిపోయాను. చివరి ప్రయత్నం గా గోడకు చేరగిలబడి  సెల్ ఫోన్ చూసుకుంటున్న ఒక యువకుడి దగ్గరకు వెళ్లి,విషయం తెలియజేశాను. నా చేతిలో ఉన్న నవలను చూపించి కాస్త వివరించమని అభ్యర్థించాను. దానికతడు తాను చరిత్ర తెలిసిన వ్యక్తిని గానని , ఈ గుడికి సంబంధించిన విషయాలు కూడా తనకేమీ తెలియవని, కాకపోతే ఇక్కడ తానొక డాన్సర్ విగ్రహాన్ని చూశానని, దాన్ని (ఆ శిల్పాన్ని) పగులగొట్టి అటువైపుగా పడేశారని మంటపానికి కుడివైపున చేతితో చూపిస్తూ , వెళ్లి చూడమని సలహా ఇచ్చాడు. ఆ మాత్రం సమాచారమిచ్చిన ఆ యువకుడికి కృతజ్ఞతలు తెలిపి, నవలను చేతిలో పట్టుకొని పరుగు లాంటి నడకతో ఇద్దరం ఆశగా వెళ్ళాం. అక్కడ పగిలిపోయిన శిలా ప్రతిమలు కుప్పగా పడవేసి ఉన్నాయి. అందులో ఆత్రుతగా వెతుకుతూనే, అక్కడ ఉద్యోగ నిర్వహణలో ఉన్న సఫాయి కార్మికులను అడిగితే ఆ విషయాలేవీ తమకు తెలియవని చెప్పారు. కాకపోతే వారిలో ఒక తను నా చేతిలోని నవల ముఖచిత్రాన్ని చూసి , దాన్ని చేతిలోకి తీసుకొని ఇవి రామప్ప దేవాలయంపై చెక్కిన రాగిణి, నాగిని విగ్రహాలనీ, మేమడిగే సమాచారం అక్కడ దొరుకుతుందనీ, చెప్పడంతో ఇక అంతకంటే ఎక్కువ అతనిని అడగడం వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదని మౌనం వహించి, మళ్లీ వెదకడం మొదలు పెట్టగా, అందులో ఒక స్త్రీ విగ్రహం నా కంట పడనే పడింది.

దాన్ని నాకున్న అతి స్వల్ప పరిజ్ఞానంతో నఖశిఖ పర్యంతం పరీక్షించాను. ఇది నర్తకి శిల్పమే అయి ఉంటుందా ? అని కళ్లింతలు  చేసుకుని చూశాను. అత్యంత బాధాకరమైన విషయమేమంటే ఆ శిల్పం రెండు ముక్కలుగా పగిలి, మోకాళ్ళ కింది నుండి వేరు చేయబడి ఉంది. కాళ్లకు   నర్తకీమణులు  ధరించే  అందెలు ఉన్నాయా ?లేదా? అని గమనించాను. అందెలు ధరించిన నాజూకైన కాళ్లతో అది ఆ శిల్పమేనన్న నిర్ణయానికి వచ్చాను. కింది భాగానికి సరిపోలే మరో శిల్ప శకలానికై మళ్లీ వెదుకులాట ప్రారంభించాను. చక్కని అవయవ సౌష్టవంతో నృత్య భంగిమలో ఉన్న మరో శకలం కనిపించింది. ఇంకా బాధాకరమైన విషయమేమిటంటే తలభాగం మొండెం నుండి వేరైతే పడలేదుగానీ, ఒక వర్తులాకార ఫలకంపై చెక్కిన ముఖ భాగం (తల భాగానికి చెందిన వర్తులాకార ఫలకమేదైతే ఉందో అది మొండానికి అతుక్కునే ఉంది కానీ దానిపై చెక్కిన ముఖభాగం లేదు. పాఠకులకు విషయం స్పష్టంగా అర్థమవ్వాలన్న ఉద్దేశంతో ఇంత  వివరంగా వ్రాస్తున్నాను) మాత్రం కనిపించలేదు.

ఆ శిల్పం లోని ముద్రనూ, నిలుచున్న భంగిమనూ (ఇంటికి వచ్చాక కాస్త నాట్యశాస్త్రంతో పరిచయం ఉన్న వారిని అన్ని వివరిస్తూ అడిగితే అది ‘ కపిథ’ ముద్ర అని చెప్పడంతో నా ప్రయత్నం మరింత బలపడిందనిపించింది) జాగ్రత్తగా గమనించాను. మోకాళ్ళపై వరకు  ధరింపజేసిన ఆ వస్త్రాలను(ఆ మరుసటి రోజు గూగుల్లో నర్తకీమణులు  ధరించే వస్త్రాలు అని వెదికితే దానిని ‘ చల్లడం ‘ లేదా  ‘చల్లాడం  ‘ అని అంటారని తెలిసింది), ఆభరణాలను జాగ్రత్తగా పరిశీలించాను. ఆ రెండు భాగాలు ఆ శిల్పానికి సంబంధించినవే అయి ఉండవచ్చని నా మనసు చెబుతూనే ఉంది. ఆ  శిల్ప శకలాలను చూడగానే నా గుండె విలవిల్లాడిపోయింది. కామసాని కాళ్ళను ఎవరైనా నరికితే సోమేశ్వరుడు ఎంతగా విలవిల్లాడుతాడో నా మనసు కూడా అంతగా  విలవిల్లాడింది. చేతిలోని  కామసాని – సోమేశ్వరుల ప్రణయ కావ్యం (ఆవాహన నవల) పుటలన్నీ తెగిపోయి గాల్లో ఎగురుతూ వేయి స్తంభాల గుడి నిండా చెల్లాచెదురై పడిపోతున్నట్టు, వాటిని పట్టుకోవడానికి నేను ఆలయమంతా పరుగులు తీస్తున్నట్టు ఏవేవో భావ చిత్రాలు.

మనసు అల్లకల్లోలమవుతుండగా భారంగా పుష్కరిణి వైపు  అడుగులు వేసిన నాకు దాన్నిండా తాబేళ్లు  కనిపించాయి. తాబేలు జీవితకాలం సుదీర్ఘమైంది కదా , వీరి ప్రణయానికివి ప్రత్యక్ష సాక్షులై ఉంటాయన్న నా ఆలోచన నాకే నవ్వు తెప్పించింది. ఆ శిల్ప శకలాలను చూసి మొదలు నరికిన చెట్టులా చతికిలబడిన నన్ను చూసి మావారు  “పర్వతాలే కాలగర్భంలో కలిసిపోగా లేనిది ఒక శిల్పం కోసం అంతగా బాధపడటం అవసరమా ? ” అన్నారు. వారన్నది నిజమే, నేను కాదనడం లేదు, కానీ అది మామూలు శిల్పమా?! కొన్ని శతాబ్దాల గుండె బరువును మోసిన శిల్పం. కొన్ని శతాబ్దాల నిరీక్షణకు వేదికైన శిల్పం. పగిలిన గుండెను తనలో పొదువుకున్న శిల్పం. పగిలిన మరో గుండె కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటే మౌనసాక్షిగా మిగిలిన శిల్పం. స్పందించే విధానంలో గుండె గుండెకూ తేడా ఉంటుంది. పైగా అది నా పసితనంలో (అప్పటి) నాలో నాటుకున్న విత్తనం. మొక్కై, మానై ,శాఖోపశాఖలుగా  నా హృదయక్షేత్రంలో విస్తరించిన వటవృక్షం. దాన్ని నేనెలా తేలిగా తీసుకోగలను ? అది నాకెలా సాధ్యం? అంత తేలిగ్గా తీసుకొని ఉంటే నాలోంచి ఈ రచన వెలువడేది కాదు సరికదా, ఒక్క అక్షరం కూడా నా కలం లోంచి వచ్చి ఉండేదే కాదు. మనసు స్పందించిన చోటే భావాల ఊట. ఎద కరిగిన చోటే కన్నీటి పాట. నెమ్మదిగా అక్కడి నుండి బయటకు వచ్చి భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకొని నా రచనను నిర్విఘ్నంగా కొనసాగించే శక్తిని ప్రసాదించమని ప్రార్థించి వెనక్కి మళ్ళాం.

తిరుగు ప్రయాణంలో పగిలిపోయిన ఆ శిలామూర్తి ఎంత వద్దనుకున్నా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఉలితో పగిలిన శిలలా అయింది నా మనసు. ఆ పగుళ్లలోంచి కామసానీ, సోమేశ్వరుల ప్రణయ కథ ఒక్కొక్క అంకం నా మనోఫలకంపై కదలాడుతూ ఉంది. సన్నటి నీటి తెర నా కళ్ళలో చిప్పిలుతూనే ఉంది.

ఎన్ని ప్రేమ కథలు విఫలం కావు? మరీ ఇంతగా స్పందించడం అవసరమా? అన్న ఆలోచన కొందరిలో తలెత్తవచ్చు, అంత ఉన్నత స్థాయిలోని వ్యక్తులను చూసి అంతగా బాధ పడటం ఏమిటి ? అన్న ఆలోచన కూడా మరి కొందరిలో రావచ్చు. ఇక్కడ స్థాయి, సుఖాంతం, విషాదాంతం అని కాదు.నా బాధకు నాకు 3 కారణాలు కనిపించాయి 1. జాలి 2. జాలి 3. జాలి  800 సంవత్సరాలు ఆ జీవాత్మ అనుభవించిన గుండెల్ని పీల్చి పిప్పి చేసే దుర్భరమైన వేదన. నా వంటి ఎంతోమందిని కదిలించిన యాతన. అక్షరాల వెంట పరుగులు తీస్తూ ఉన్నప్పుడు మా నాన్న కళ్ళలోని తడి, మా అమ్మ కళ్ళ నుండి జలజలా రాలిన కన్నీళ్లు నాకిప్పటికీ గుర్తే.తడి ఉన్న ప్రతి గుండెను ఈ కథ కన్నీరు పెట్టించింది. దానికి నా కళ్ళతో నేను చూసిన ఎంతోమంది నాకు సాక్ష్యం. దానికి నేను ప్రత్యేకమూ కాదు, మినహాయింపూ కాదు.

ప్రేమ కథలు కొన్ని సుఖాంతమౌ వుతాయి, కొన్ని విషాదాంత మౌతాయి. కానీ మనిషి బ్రతికి ఉన్నంతవరకే ఆ మనుషులను అవి స్పందింపజేస్తాయి. ఒక్కసారి ఆత్మ దేహాన్ని వదిలిపెడితే గనుక అవి (ఆ భావాలు) పంచభూతాల్లో కలిసిపోతాయి. కానీ ఈ కథ వాటన్నిటికీ అతీతమైనది.

ఒక ఆత్మను శిలలో నిక్షిప్తం చేయడం, ఆ దేహం నిస్తేజమై, కట్టె కాలిపోవడం, ఆత్మ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడటం, ఆ ఎదురుచూపు ఎంతకూ ఫలించక, ఆ మనసు నలిగిపోవడం, అటు ఆత్మకు మోక్షంలేకా,ఇటు ఎదురుచూపుకు అంతంలేకా త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడిన ఆ యాతనే నా ఈ స్పందనకు కారణం.

నా దృష్టిలో అది శిథిల మంటపం  కాదు. కామసానీ, సోమేశ్వరుల ప్రేమసామ్రాజ్యం. మోహానికీ, ప్రేమకూ  హస్తిమశకాంతరం ఉంది. భూమికీ,ఆకాశానికీ మధ్య ఉన్నంత భేదం ఉంది. అది మోహమే ఐతే నా గుండె లోతుల్లోంచి ఈ భావాల వెల్లువ ఉప్పొంగే కాదు. ఆది కాంక్షే ఐతే నా కలం లోంచి ఒక్క సిరాచుక్క కూడా అక్షర రూపు దాల్చి ఉండేదే కాదు. అది రెండు మధుధారలతో నిండిన అమృతభాండం. రెండు హృదయాల నిర్మల ప్రేమను ఆవాహన చేసిన ప్రణయకలశం. సోమేశ్వరుడు మాధవ్ గా పునర్జన్మ నెత్తి వచ్చినట్లుగానే, కామసానీ, సోమేశ్వరులు పునర్జన్మనెత్తాలి. ఆమె కాలి మువ్వల ఘల్లుఘల్లుల్లో  ఆలయ ప్రాంగణం (వేయి స్తంభాల గుడి) సందడించాలి. వారిద్దరూ జంట పావురాలై జావళీలు పాడాలి. మూడు పువ్వులు ఆరు కాయలుగా పిల్లాపాపలతో వర్ధిల్లాలి. వారి నవ్వులన్నీ పువ్వులై ఆ రుద్రేశ్వరునికి పుష్పయాగం చేయాలి.

ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు

పుత్రపౌత్రాభివృద్దిరస్తు

సమస్త సన్మంగళాని భవంతు

            స్వస్తి

(విజ్ఞప్తి:   ఆ శిల్ప శకలాలు యశోదర విగ్రహానికి సంబంధించినవే అని నేను ఇప్పుడు కూడా అనటం లేదు, బహుశా అయి ఉండవచ్చు అని మాత్రమే అంటున్నాను. విషయ పరిజ్ఞానం లేనప్పుడు  నొక్కి చెప్పడం సరైనది కాదని నాకు తెలుసు.  ఒకవేళ ఆ శిల్పానివే అయితే, మన చారిత్రక సంపదైన, కాకతీయుల కళావైభవ చిహ్నమైన ఆ శిల్పాన్ని ఏ కాస్త అవకాశం ఉన్నా, పునర్నిర్మించి, యథాస్థానంలో ప్రతిష్టించి,ముందు తరాలకు అపురూపమైన కానుకగా అందించాలని నేను అన్ని రంగాల ప్రముఖులకు పేరుపేరునా చేతులు జోడించి విన్నవించుకుంటున్నాను).

July 30, 2025 41 comments
1 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

కథాపంచకం

by Dr. Lakshmanacharyulu M July 30, 2025
written by Dr. Lakshmanacharyulu M

1. పోనీ ! పోనీ !

కోల్‌ కతా ఓ మహానగరం. పెద్ద సంఖ్యలో.. చాలా పెద్ద సంఖ్యలో జనం అక్కడ నివసిస్తూ ఉంటారు. అలాగే అక్కడికి వచ్చిపోయే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. లక్షల మంది బస్సులు, స్టీమర్ల, హ్రంలు, ట్రైయిన్లు, ఇలా ఏ వాహనం దొరికితే దానిలో, ఆఫీసులకి, ఇతర పనులకి వెళ్తూ – వస్తూ ఉంటారు. రవాణా సాధనాలన్నీ ఎప్పుడూ క్రిక్కిరిసిపోయి ఉంటాయి.

రామం, సుధీర్‌, జేమ్స్‌, అయూబ్‌ – నలుగురూ వేర్వేరు ఆఫీసుల్లో పనులు చేస్తూ, రోజూ ప్రొద్దున్నే వెళ్ళడం, తిరిగి ఇళ్ళకు రావడం చేస్తూ ఉంటారు. పరస్పరం పరిచయాలైతే లేవు, కాని ఇవ్వాళైతే నలుగురూ ఒకే బస్సులో ప్రయాణం చేస్తున్నారు.

బస్సు ప్రయాణీకుల్తో కిటకిటలాడుతోంది. సూదిమొనంత ఖాళీ కూడా లేదు. రామం, సుధీర్‌, అయితే ఎలాగో అలా త్రోసుకుంటూ లోపలికి వెళ్ళ గలిగారు. జేమ్స్‌ కొంచెం కష్టపడితే ఇక లోపలికి వచ్చేస్తాడు కాని పాపం ! అయూబ్‌ బస్సు ద్వారం దగ్గరే కడ్డీ పట్టుకుని వ్రేలాడుతూ ఉన్నాడు.

ఇంతలో బస్సు కదిలింది. రోడ్డు మీద జనం బస్సుల్లో జనం. ప్రజల మానసిక థ కూడా దిగజారి పోయింది. ఎవరూ ఎవర్ని లెక్క చేయరు. ఎవరి స్వార్థం వారిదే. ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు రామం.

అంతే ! ధడేలన్న శబ్దం. ఏదో పడిపోయినట్టయింది. ఎవరిదో భయం నిండిన ‘కేక’ హృదయ విదారకంగా వినబడింది. బహుశా అయూబ్‌ పడిపోయినట్టున్నాడు. అలా క్రింద రోడ్డు మీద పడిపోయిన అయూబ్‌ మీది నుండి – వెనకాలే వచ్చిన ఒక వాహనం, వేగం నియంత్రణ కోల్పోయినందున, వెళ్ళిపోయింది. అయినా….

రామం, సుధీర్‌, జేమ్స్‌ మాట్లాడుకుంటున్న మాటలు స్పష్టంగా వినబడుతున్నాయ్‌…

అరే ! భయ్యా ! మా ఆఫీసుకు లేటయి పోతోంది.

పద, పద !! పోనీ ! పోనీ !! బస్సు పోనీ !!

2. మీ గొప్ప కోసమని…

ఒకప్పుడు గురు శిష్యులిద్దరూ ఒక ఊర్లో ఉండేవారు. ఇద్దరూ ప్రతిరోజూ జ్ఞాన సంబంధమైన  చర్చ జరుపుతూ ఉండేవారు.

ఒకరోజున గురువుగారు శిష్యుణ్ణి పిలిచి – ”ఇవాళ నేను ఓ గంటసేపు నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతా.. నువ్వు జాగ్రత్తగా విని విశ్లేషిస్తూ, నేనేం చెప్పానో సరిగ్గా చెప్పాలి” అని అన్నాడు.

ఓ గంటసేపు గురువుగారు తన గురించి చెప్పాక, విశ్లేషించమని కోరగా, ”అయ్యా ! మీరు ఎక్కువగా మీ గురించే మీరు పొగుడుకున్నారు. ఆత్మస్తుతి ఎక్కువైంది. మీకు ”నేను” అనేది ఎంత ఇష్టమని తేలిందంటే, సుమారుగా ప్రతి వాక్యంలోనూ దాన్ని ఉపయోగించారు. ఇక ఇతరుల్ని చాలాసేపు నిందించారు, విమర్శించారు. మీకు మీలోని మంచితనం మాత్రమే కనిపించగా, ఇతరుల్లోని లోటుపాట్లు, తప్పులు మాత్రం మీకు కనిపించాయి”.

”మీ వ్యక్తిగత జీవితం గురించి విన్నాక ”మీరు మీ కీర్తి కోసం, మీ గొప్పత కోసం ఇతరుల్ని విమర్శకు గురిచేస్తూ, వారిలో ఏవో తప్పులు వెదుకుతూ ఉంటారని నాకు అర్థమైంది” అని అన్నాడా శిష్య పరమాణువు.

3. స్వర్ణ యుగం

భూమ్మీద ఒక్కో మతానికి చెందిన ఒక్కో వ్యక్తి మిగిలాడు. పరస్పరం పోట్లాడుకున్న దాని ఫలితంగా ఇలా జరిగింది. ఇప్పుడు వారి కళ్ళల్లో ఈర్ష ్యకి బదులు భయం చోటు చేసుకుంది. తమలో తాము పోట్లాడుకుని, పోట్లాడుకుని మనుషుల ఎత్తు బాగా తగ్గిపోగా, చుట్టూ ఉన్న జంతువుల ఎత్తు బాగా పెరిగిపోయింది. ఆ పశువులన్నీ మనుషుల్ని చుట్టుముట్టాయి.

”ఇక మనం బ్రతికి బట్ట కట్టలేం. ఈ జంతువులు మనల్ని తినేస్తాయి” అని అన్నాడో మనిషి.

మరొకడు కొంచెం తెలివిగలవాడు ”అసలు ఇన్ని శతాబ్దాలుగా మనిషి ఎలా తప్పించుకున్నాడో గదా అని ఆలోచిస్తే, మనుషుల్లోని ఐకమత్యమే దీనికి కారణమని తెలుస్తుంది. కానీ… మతం పేర, కలహాలు ప్రారంభం అయినప్పట్నించే మనిషి పరిస్థితి ఇలా అయిపోయింది” అని అన్నాడు.

”సరే ! మనం ఇప్పుడేం చేద్దాం?” అన్నాడు మూడోవాడు.

”రండి! మళ్ళీ అందరం ఏకమౌదాం. ఐకమత్యమే బలం. అప్పుడు బహుశా మనమే మళ్ళీ గెలుస్తాం” అన్నాడు నాలుగోవాడు.

పశువులు చాలా తెలివి గలవి. మనుష్యులంతా ఒకటైతే మనం వారిముందు నిలబడలేం. ఓడిపోతాం అని అనుకుని మనుష్యుల చుట్టూ ఉన్న కట్టడిని తొలగించి వారికి స్వేచ్ఛనిచ్చాయి.

అంతే ! భూమ్మీద కేవలం మానవతా మతం మాత్రమే నిలబడింది. నవనిర్మాణం, మానవ ప్రగతికి సంబంధించిన స్వర్ణయుగం మరల తిరిగొచ్చింది.

4. సంతాప సభ

స్కూల్లో ఒక విచిత్రమైన ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. పిల్లలంతా లైన్‌లలో నిలబడి మౌనంగా ఉన్నారు. ఇంతలో ఓ కారు హారన్‌ శబ్దం వారి నిశ్శబ్దానికి భంగం కలిగించింది.

గోపీ ఇవాళ మళ్ళీ ఆలస్యంగా వచ్చాడు. రాగానే కారు దిగి భయం భయంగా వెళ్ళి లైన్లో నిలబడ్డాడు. మెల్లగా తన ప్రక్క ఉన్న బాలుని అడిగాడు.

”ఏమైంది?”

”కనబట్టంలా? సంతాప సభ నడుస్తోంది” అని గుసగుసలాడాడు బాలు.

”ఎవరు పోయార్రా?”

”మన రామయ్య మాస్టారు నిన్న రాత్రే కాలం చేసారట”. సంతాప సభ ముగిసింది. ”ఇవాళ స్కూల్‌ మూసేస్తున్నాం” అని ప్రకటించారు హెడ్మాస్టర్‌ గారు.

గోపీకి పట్టలేనంత ఆనందం కలిగింది. బాలు భుజం మీద చెయ్యేసి నవ్వుతూ – ”భలే ! స్కూల్‌ బంద్‌ ! సరేగాని మెట్రోలో క్రొత్త సినిమా విడుదలైందిరా ! పోదామా !

బాలు నిశ్చేష్టుడై అలా చూస్తూ ఉండిపోయాడు.

5. పలాయనం

డాక్టర్‌ సారథి తీరిక అస్సలులేని మనిషి. ఇవాళెందుకో బాగా అలసిపోయాడు. రేయింబవళ్ళూ రోగులు, పరీక్షలు, చికిత్స… ఇదే గొడవ. అసలైతే ఎప్పుడూ నవ్వుతూ త్రుళ్ళుతూ ఉంటాడు. మంచిగానే రోగులతో ప్రవర్తిస్తాడు. ఇవాళ… విసిగిపోయాడో ఏమో, ఎటైనా దూరంగా, వెళ్ళి ఏకాంతంగా ఉండాలని అనుకున్నాడు.

అప్పుడే ఆయనకి తన మిత్రుడు సుందరం గుర్తుకొచ్చాడు. స్కూల్‌ రోజుల నుండి ఫ్రెండ్‌. ఎన్నిసార్లు ఇంటికి రమ్మని ఆహ్వానించినా సారథి వెళ్ళలేక పోయాడు. ఇవాళ ఎలాగైనా సరే, వెళ్ళి ఓ 2-3 గంటలు ఆయనతో గడపాలని భావించాడు. కాదు… గట్టిగా అనుకున్నాడు. సారథి ఓ పది నిముషాల తర్వాత సుందరం గారింటి ముందు నిలబడి, కాలింగ్‌ బెల్‌ నొక్కాడు. మొహంలో ఆనందం. ఇక్కడ తననెవరూ… ఏ రోగీ… వచ్చి విసిగించదు” అని అనుకున్నాడు.

ఇంతలో తలుపు తెరుచుకుంది. శ్రీమతి సుందరం డాక్టర్‌ సారథిని చూసి, గుర్తుపట్టి నమస్కరించింది.

అరె ! మీరు రావడం చాలా మంచిదైంది. మీ స్నేహితుడి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. నిన్నట్నించి బాగా జ్వరం ఉంది. రండి.. రండి…” అన్నదావిడ.

July 30, 2025 37 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సాంప్రదాయక చిత్రకళా పునరుద్ధరణ:

by Anand gadapa Dr. Nirmala July 30, 2025
written by Anand gadapa Dr. Nirmala


 
డాక్టర్ కొండపల్లి శేషగిరి రావు శతాబ్ది అవలోకనం

 
డాక్టర్ కొండపల్లి శేషగిరి రావు గారు బహుముఖ ప్రతిభాశాలియైన చిత్రకారులు. జనవరి 2024 నుండి జనవరి 2025 వరకు జరుగుతున్న వారి శతాబ్ది వేడుకల సమయంలో శేషగిరిరావు గారి జీవితాన్నీ, వారు కొనసాగించిన చిత్రకళావారసత్వాన్నీ మరొకసారి స్మరించుకుందాం. పురాణగాథల సాంప్రదాయక చిత్రకారులుగా శేషగిరిరావు గారు ప్రసిద్ధులు. కానీ విభిన్న కళారూపాల గురించీ, చిత్రకళాశిక్షణ గురించీ,  సాంస్కృతిక పరిరక్షణ గురించీ, చిత్రకళాచరిత్ర గురించీ వారు చేసిన విశిష్టమైన కృషి మరింత ప్రాచుర్యం లోకి రావలసి ఉంది. తెలుగు తోపాటు ఆంగ్లం లోనూ వ్యాసరచన చేపట్టి ఉంటే శేషగిరిరావు గారి కీర్తి మరింత ఇనుమడించి ఉండేది. చిత్రమయి స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్‌ లో ప్రదర్శింపబడుతున్న వారి అరుదైన స్కెచ్‌లు, ఆయిల్ పెయింటింగ్స్, ఆక్వాటెక్స్చర్ పెయింటింగ్స్, చిత్రకళపై వారు రాసిన వ్యాసాలూ, పుస్తకాలూ ద్వారా శేషగిరిరావు గారి సమగ్రరూపం ఆవిష్కృతమవుతుందని ఆశించవచ్చు.
 
1924 జనవరి 27న తెలంగాణలోని మహబూబాబాదు జిల్లా పెనుగొండలో జన్మించిన కొండపల్లి శేషగిరి రావు గారు వరంగల్‌ లోని రామప్ప, వేయిస్తంభాల గుడి మొదలైన దేవాలయాల శిల్పకళా దర్శనం ద్వారా బాల్యదశ లోనే ప్రేరణ పొందారు. ఈ సంక్లిష్టమైన శిల్పాలు వారిలో కళాభిరుచిని మేల్కొలిపి, దక్షిణ భారత సాంస్కృతిక సంపదను పరిరక్షించటమే జీవితలక్ష్యమయ్యేలా పురిగొల్పాయి. అడవి బాపిరాజు, అంత్యాకుల పైడిరాజు, హెచ్.వి. రామగోపాల్ వంటి చిత్రకారులు లేపాక్షి మొదలైన శిల్పాల్లో దేశీయమూలాలను అన్వేషించుకుంటున్న సమయంలో శేషగిరిరావు గారు తెలంగాణ ప్రాచీన శిల్పకళాసంపదలోని కొత్త కోణాలను దర్శించటంలో నిమగ్నమయ్యారు.
 
కాకతీయ శిల్పకళాదృష్టినీ, తన సహజశైలినీ సమ్మిశ్రమం చేసుకుంటూ శేషగిరిరావు గారు ఒక విభిన్నమైన, ప్రాచీనతా సంకేతమైన, తనదైన చిత్రకళారీతిని ఏర్పరచుకున్నారు. మహాకవుల కలాల నుండి వారి కవితానుడికారం ప్రవహించినట్లే, శేషగిరిరావు గారి కుంచె నుండి ‘శేషగిరీయం’ వారి చిత్రరచనా నుడికారంగా జాలువారింది.  మరుగునపడ్డ స్థానిక సంస్కృతిని వెలికితీయటంలో వారికి ఉత్తేజం; ఆ సంసృతిలో  దృశ్యమానమయ్యే వైశిష్ట్యాన్ని కనుగొనటం వారికి ఆనందం. ఆయన చిత్రాలలోని భంగిమలు, హావభావాలు కాకతీయశిల్పం గురించి వారికి గల లోతైన అవగాహనను  ప్రతిఫలిస్తాయి.  శిల్పానుగుణమైన వారి చిత్రాల్లో ప్రాచ్యమైన తాత్వికతా, ఆధ్యాత్మికతా కలగలిసిన ఏవో అతీతభావనలు కనిపిస్తాయి.
 
ఆయన రచించిన “రూపరుచి” పుస్తకం భారతీయ కళా తత్త్వాలను వివరిస్తూ, ఉత్తర, దక్షిణ భిత్తి చిత్రాలను పోల్చి విశ్లేషిస్తుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర చారిత్రకస్థలాల్లోని  హంపీ, లేపాక్షి, కాకతీయ శిల్పకళావైభవం శేషగిరిరావు గారి సురేఖ – I, సురేఖ – II గ్రంథాల్లో ప్రతింబింబిస్తుంది. ఈ గ్రంథాలు చరిత్రను నిక్షిప్తం చేయటమే కాకుండా సంప్రదాయాన్ని ఆధునికకోణం నుండి చూపిస్తాయి కూడా.  
 
నకాషీ పటచిత్రకళను (Nakashi Scroll Painting) పునరావిష్కరించడంలో శేషగిరిరావు గారి కృషి చారిత్రాత్మకమైనది. తెలంగాణకు ప్రత్యేకమైన కుల పురాణ ప్రదర్శనా పరంపరతో ముడివడి ఉన్న కళ నకాషీ. ఆయన చేసిన పరిశోధన వలనా, ప్రచారం వలనా కనుమరుగవుతున్న ఈ కళారూపం పునరుజ్జీవితమైంది. తద్వారా ఆయనకు సాంస్కృతిక పరిరక్షకుడిగా గుర్తింపు వచ్చింది.
 
జానపదకళలను సంరక్షించడంలో శేషగిరిరావు గారు చేసిన ఇటువంటి తొలి ప్రయత్నాలే  తెలంగాణ కళా వారసత్వంపై వారి భవిష్యత్ అధ్యయనాలకు పునాదిరాళ్ళయ్యాయి. పరిశోధనపై లోతైన ఆసక్తితో వారు చేసిన అనేక రచనల ద్వారా ఆంధ్ర, తెలంగాణా చారిత్రక పరిణామాలెన్నో వెలుగులోకి వచ్చాయి. ఈ రచనలు కొన్ని మాత్రమే ఆంగ్లంలో లభ్యమవుతూ, ప్రధానంగా తెలుగు భాషలోనే ఉండటం వలన, ఇతర భాషల పాఠకులకూ పండితులకూ చేరువ కాలేకపోయాయి.
 
పాఠశాల స్థాయిలో దీన్‌దయాళ్ నాయుడు గారూ, తరువాత సెంట్రల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, హైదరాబాద్‌ లో సుకుమార్ దేవ్‌స్కర్ గారూ శేషగిరిరావు గారికి తొలిగురువులూ, మార్గదర్శకులూ.  తదుపరి మెహదీ నవాబ్ జంగ్ బహదూర్ గారి ఆశ్రయంలో, పర్యవేక్షణలో తన కళను తీర్చిదిద్దుకున్నారు. హైదరాబాద్‌లో మొహమ్మద్ జలాలుద్దీన్ గారి ఆధ్వర్యంలో వాష్ పెయింటింగ్ సాంకేతికతలు నేర్చుకున్న ఆయన, తరువాత శాంతినికేతన్‌లో నందలాల్ బోస్ వద్ద శిక్షణ పొందారు. ఇందరి శిష్యరికంలో ఆయన చిత్రకళలో పరిపూర్ణత సాధించారు. ప్రాచ్య తత్వశాస్త్రాలు పునాదులైన వారి బోధనలు శేషగిరిరావు గారి కళాప్రస్థానాన్ని అతిగాఢంగా ప్రభావితం చేశాయి. ప్రాదేశిక అస్తిత్వమూ, లోకప్రియత్వమూ ఒక ప్రత్యేకమైన మిశ్రణంగా రూపొంది వారి కళాత్మక హృదయంలో ఇంకిపోయింది. ఈ మిశ్రణ కారణంగానే శేషగిరిరావు గారి కొన్ని లాండ్‌స్కేప్స్ లో అతిప్రాచ్య  శైలి కనిపిస్తే. మరికొన్ని కాన్వాస్‌లపై జాతీయ, ప్రాంతీయ నిర్బంధనలేవీ లేని సహజత్వం ప్రతిబింబిస్తుంది. ఈ రెండవ శైలి దేవీప్రసాద్ రాయ్ చౌదరి గారి ప్రభావం కావచ్చు.
 
చిత్రకళా కౌశలాన్ని పెంపొందించటం పట్ల ఉన్న అభిరుచి వలన శేషగిరిరావు గారు సుదీర్ఘకాలంగా  జేఎన్‌టీయూ కళాశాలలో ఆర్ట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. వర్థమాన కళాకారులైన  విద్యార్థులకు సంప్రదాయాన్నీ, సృజనాత్మకతనూ బోధించి  రెండిటినీ స్వీకరించేలా  ప్రోత్సహించారు. శేషగిరిరావు గారి చిత్రకళా వైదుష్యం తరగతి గదులకే పరిమితం కాలేదు.  కళా, సౌందర్యశాస్త్రాల గురించి వారు చేసిన  రచనలు అనేక పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. ప్రాచ్యమైన శైలీ, ప్రాంతీయమైన ప్రజాజీవితమూ శేషగిరిరావు గారి కుంచె నుండి కలగలిసి ప్రవహించి ఆయిల్ పెయింటింగ్స్ గానూ,  వాల్ మూరల్స్ గానూ, ఆక్వా టెక్స్చర్ పెయింటింగ్స్ గానూ అందమైన చిత్రాలుగా ఘనీభవించాయి.
 
చిత్రకళా ప్రపంచంలో ప్రోగ్రెసివ్ వాదులు రివైవలిస్టు కళనూ, ఫార్మలిజం రూపంలో పాశ్చాత్య ఆధునిక చిత్రకళారూపాలు భారతీయ కళనూ కబళించటం గమనించారు శేషగిరిరావు గారు. అయితే నిజమైన ఆధునికతనూ, జాతీయతనూ ఈ నూతన కళారీతులు సమర్థవంతంగా ప్రతిబింబించలేకపోయాయని  అభిప్రాయపడుతూ అదే విషయాన్ని తన వ్యాసాల్లో ప్రకటించారు. బహుశా ఇటువంటి భావనల వల్లనేమో ఆయన ఆనాటి  నూతన విచారధారకూ, సౌందర్యదృక్పథానికీ  దూరంగా ఉండిపోయినట్లు కనిపిస్తారు. అయితే, ఆయన వ్యాసాలు ఆ కాలంలోని సామాజిక పరిస్థితులనూ, హైదరాబాద్ స్కూల్ చరిత్రనూ, కళాకారుల జీవితాలనూ, పూటగడవని వారి జీవన పోరాటాలనూ వివరిస్తాయి.
 
పరిశోధనాత్మకమైన శేషగిరిరావుగారికి నాటి ప్రసిద్ధ కవులైన వానమామలై వరదాచార్యులు, దాశరథి, డా. సి. నారాయణ రెడ్డి మొదలైనవారితోనూ, వట్టికోట ఆళ్వార్ స్వామి వంటి సామ్యవాదులతోనూ సాన్నిహిత్యం ఏర్పడింది. వారి భావజాలాలూ, ఆదర్శాలూ శేషగిరిరావు గారి చిత్రాల్లో, రచనల్లో, జీవనశైలిలో ప్రస్ఫుటంగానే ప్రతిబింబించాయి. శేషగిరిరావు గారి ‘హరిజనోద్యమం’ పెయింటింగ్ ఇటువంటి ఆదర్శాల ప్రభావంతో సృష్టించబడిందే. ఆనాటి అమానుషమైన సామాజిక కట్టుబాట్లకు వ్యతిరేకంగా సున్నితమనస్కుడైన ఒక కళాకారుడి బలమైన ప్రకటనగా ఈ చిత్రం నిలుస్తుంది.
 
తనదైన శైలిలో పరిశోధనలు చేస్తూ, కళాభ్యాసం కొనసాగిస్తూ ప్రాచీనతలో నూతనకోణాలు దర్శించిన శేషగిరిరావు రావు గారు తన సంక్లిష్ట దృశ్య నిఘంటువు ద్వారా సామాజిక ప్రయోజనాలను సంకేతిస్తూ ఉధృతమైన చిత్రరచనలు చేశారు. రాజకీయంగా తనకు ప్రీతిపాత్రమైన  జాతీయ కాంగ్రెస్‌ ద్వారా దేశస్వాతంత్య్రం కోసం కృషిచేశారు. ఎందరో ఆత్మీయ సహచరులు గల  కమ్యూనిస్టు పార్టీ ద్వారా రజాకార్ల క్రూరత్వాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణా విముక్తి లోనూ తన వంతు పాత్ర పోషించారు.
 
తాను రాసిన నోట్సూ వ్యాసాల ద్వారానూ, జాతీయ, ప్రాంతీయ సాంస్కృతికతను పాన్-ఏషియన్ విశాలతతో సమ్మిళితం చేస్తూ ఒక ప్రత్యేక దృశ్య భాషను అభివృద్ధి చేయడం ద్వారానూ స్వదేశీ చైతన్య స్ఫూర్తిని రగిలించే ప్రయత్నం చేశారు డాక్టర్ కొండపల్లి శేషగిరి రావు గారు.  ఈ విధంగా ప్రాంతీయకూ జాతీయతకూ పెద్దపీట వేస్తూ సాగించిన శేషగిరిరావు గారి కళాభివ్యక్తి వారినొక దార్శనికుడిగా, ఆలోచనాశీలిగా నిలబెట్టింది.
 
చిత్రకారుడిగా విశేష ఖ్యాతిని సంపాదించుకున్న శేషగిరిరావు గారు తన దీర్ఘకాలిక వృత్తిలో పౌరాణిక చారిత్రక సంఘటనలతో, దైనందిన జీవిత ఘట్టాలతో వెయ్యికి పైగా ‘మాస్టర్ పీసెస్’ సృష్టించారు. ఆయన చిత్రాలు ప్రపంచవ్యాప్తమైన, ప్రతిష్ఠాత్మక సంస్థల్లో, ప్రదేశాల్లో చోటు సంపాదించుకున్నాయి.  హైదరాబాద్‌లోని సాలార్ జంగ్ మ్యూజియం, మైత్రీ వనం, భారతీయ విద్యాభవన్, అలాగే వాషింగ్టన్ డీసీ లోని భారత రాయబార కార్యాలయం, పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్  శ్రీ వెంకటేశ్వర ఆలయం కొన్ని ఉదాహరణలు.
 
JNAFAU కాలేజ్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ వారూ, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ వారూ, శేషగిరిరావు గారి కుటుంబసభ్యులూ సంయుక్తంగా కొండపల్లి వారి చిత్రప్రదర్శన నిర్వహిస్తున్నారు.  కళావిమర్శకుల, చరిత్రకారుల ప్యానెల్ చర్చలు ఈ ప్రదర్శనలో భాగంగా ఉండబోతున్నాయి.  కాలేజ్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు వాష్ పెయింటింగ్ వర్క్ షాప్, చిత్రకళపై పత్రసమర్పణలూ నిర్వహిస్తారు. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ చిత్రకళారంగంలో శేషగిరిరావు గారి పాత్రనూ, స్వదేశీ ఆధునికతలో వారి ప్రాధాన్యతనూ స్మరించుకోవడానికి ఈ కార్యక్రమాలు వేదికగా నిలుస్తాయి.
 
ఈ శతజయంతి సందర్భంగా, డాక్టర్ కొండపల్లి శేషగిరి రావు గారి చిత్రకళా ప్రస్థానాన్నీ, సంస్కృతీపరిరక్షణనూ, సృజనాత్మకతనూ,  సామాజిక సంస్కరణల పట్ల వారి నిబద్ధతనూ అక్షరీకరించటంలో భాగస్వాములం కావడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాము. శేషగిరిరావు గారి చిత్రాల ప్రదర్శన ఒక అసాధారణ కళాకారుడికి నివాళి మాత్రమే కాదు. చిత్రకళా చరిత్రలో ఆయన ప్రాముఖ్యతను మరోసారి స్మరించుకునే అవకాశం కూడా

July 30, 2025 17 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • వేకువ పాట
  • చాణుక్యుడు ఆదిశంకరాచార్యుల ప్రభావం ఒక సింహావలోకనం
  • సనాతనమంటే?
  • సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి- డా. జి. చెన్నకేశవరెడ్డి
  • సాహిత్యాకాశంలో నక్షత్రాక్షర తోరణం- అక్షరగీతం

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us